-
మొన్న పూజిత.. నేడు అమీక్ష
సాక్షి, హైదరాబాద్: అన్నంలో పురుగులు వస్తున్నాయని ఇటీవల 4వ తరగతి విద్యార్థిని పూజిత నేరుగా పోలీస్స్టేషన్కు వెళ్లి ఇన్స్పెక్టర్కు ఫిర్యాదు చేయగా.. తాజాగా 2వ తరగతి చదువుతున్న మరో చిన్నారి ఇంటి పక్కన గొడవ జరుగుతుంది, వచ్చి ఆపాలని రాత్రి 11 గంటలకు డయల్ 100కు కాల్ చేసిన సంఘటన మీర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. సీఐ మహేందర్రెడ్డి తెలిపిన వివరాలు.. ప్రశాంతిహిల్స్ రోడ్ నం–6కు చెందిన అమీక్ష (7) టీచర్స్కాలనీలోని భారతి స్కూల్లో 2వ తరగతి చదువుతోంది. ఆదివారం రాత్రి ఇంటి పక్కనే నిర్మాణంలో ఉన్న ఓ భవనం వద్ద ఇద్దరి కూలీలు గొడవ పడుతున్నారు. గొడవ జరుగుతున్నట్లు గ్రహించిన చిన్నారి అమీక్ష రాత్రి 11 గంటలకు తండ్రి సెల్ఫోన్ తీసుకొని డయల్ 100కు కాల్ చేసి ఇక్కడ గొడవ జరుగుతుంది.. వెంటనే వచ్చి గొడవను ఆపాల్సిందిగా కోరింది. బాలిక ఫిర్యాదు చేయడంతో మీర్పేట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గొడవ పడుతున్న ఇద్దరు కూలీలకు సర్ది చెప్పి అక్కడి నుంచి పంపించారు. తొందరగా స్పందించినందుకు థ్యాంక్యూ అంకుల్ అని చిన్నారి చెప్పినట్లు సీఐ మహేందర్రెడ్డి తెలిపారు. అమీక్షను స్ఫూర్తిగా తీసుకొని ఎక్కడ ఏ గొడవ జరిగినా, ఆపద వచ్చినా డయల్ 100కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని సీఐ సూచించారు. -
భద్రతకు గట్టి భరోసా
సాక్షి, అమరావతి: ఆపదలో ఆపన్న హస్తం అందించే ‘డయల్ 100’ వ్యవస్థను పోలీసు శాఖ మరింత బలోపేతం చేసి ప్రజల భద్రతకు గట్టి భరోసానిస్తోంది. అత్యవసర సేవలు అందించే ఈ వ్యవస్థను సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానించి మెరుగ్గా తీర్చిదిద్దింది. అందుకోసం డయల్ 100, డయల్ 112 వ్యవస్థను సమ్మిళితం చేస్తోంది. రాష్ట్రస్థాయిలో పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసి మరిన్ని అత్యవసర సేవలను డయల్ 100 పరిధిలోకి తెచ్చేలా కసరత్తు చేస్తోంది. 20 జిల్లాల్లో ఇప్పటికే ఏకీకృత వ్యవస్థ అత్యవసర సర్వీసుల కోసం కేంద్ర ప్రభుత్వం డయల్ 112 వ్యవస్థను తెచ్చింది. చాలా రాష్ట్రాలు చాలా ఏళ్లుగా సొంతంగా నిర్వహిస్తున్న అత్యవసర సేవల వ్యవస్థలను దాదాపుగా తొలగించాయి. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అత్యవసర సేవలు మరింత సమర్థంగా అందించేందుకు ఈ రెండు వ్యవస్థలను అందుబాటులో ఉంచింది. అయితే డయల్ 100, డయల్ 112 కోసం రెండు వేర్వేరు కమాండ్ కంట్రోల్ వ్యవస్థలు కాకుండా ఏకీకృత వ్యవస్థను ప్రవేశపెడుతోంది. ఇప్పటికే రాష్ట్రంలోని 20 జిల్లాల్లో ఈ రెండు వ్యవస్థలను సమ్మిళితం చేశారు. వైఎస్సార్, అన్నమయ్య, పల్నాడు, బాపట్ల, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో వీటిని ఇంకా అనుసంధానించాల్సి ఉంది. సత్ఫలితాలనిస్తున్న సమ్మిళితం డయల్ 100, డయల్ 112ను అనుసంధానించడం సత్ఫలితాలనిస్తోంది. డయల్ 112 కాల్ సెంటర్కు 2020లో 7.55 లక్షల కాల్స్ రాగా వాటిలో చర్యలు తీసుకోదగ్గవి 6,162 ఉన్నాయి. వీటిపై పోలీసులు దర్యాప్తు జరిపి 196 కేసుల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇక 2021లో 9.67 లక్షల కాల్స్ రాగా చర్యలు తీసుకోదగ్గవి 10,292 ఉన్నాయి. వాటి ఆధారంగా 242 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. డయల్ 100కి సగటున రోజుకు ఐదు వేల కాల్స్ వచ్చాయి. 2022లో డయల్ 100, డయల్ 112 సమ్మిళిత ప్రక్రియ ప్రారంభమయ్యాక అత్యవసర సేవలు గణనీయంగా మెరుగయ్యాయి. ఈ ఏడాది ఇప్పటివరకు ఏకంగా 17.82 లక్షల కాల్స్ రాగా వాటిలో చర్యలు తీసుకోదగ్గ కాల్స్ 85,143 ఉన్నాయి. వీటిని బట్టి ఇప్పటివరకు 2,518 ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం విశేషం. ప్రజల అత్యవసర కాల్స్పై పోలీసు శాఖ సత్వరం స్పందిస్తూ వేగంగా చర్యలు తీసుకుంటోందనడానికి ఈ గణాంకాలే తార్కాణం. రాష్ట్ర కమాండ్ కంట్రోల్ నుంచే పర్యవేక్షణ తాజాగా డయల్ 100ను రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్తో అనుసంధానించారు. దీనికి వచ్చే కాల్ నేరుగా జిల్లా కేంద్రంలోని కార్యాలయంతోపాటు రాష్ట్ర కమాండ్ కంట్రోల్కు చేరుతుంది. కాల్స్పై సంబంధిత పోలీస్ స్టేషన్ పరిధిలోని సిబ్బంది ఎంత త్వరగా స్పందించారో రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయం నుంచి పర్యవేక్షిస్తారు. దీంతో పోలీసు వ్యవస్థలో మరింత జవాబుదారీతనం పెరిగి ప్రజలకు మెరుగైన సేవలు అందనున్నాయి. లొకేషన్ ట్రాకింగ్ వ్యవస్థ.. డయల్ 100లో కొత్తగా లొకేషన్ ట్రాకింగ్ ఫీచర్ను పోలీసు శాఖ ప్రవేశపెట్టింది. ఇప్పటివరకు ఎవరైనా అత్యవసర సర్వీసుకు కాల్ చేస్తే తాము ఎక్కడ ఉన్నారో చెప్పాల్సి వస్తోంది. గుర్తు తెలియని ప్రదేశాల్లో ఆపదలో చిక్కుకున్న వారికి ఇది సమస్యాత్మకంగా మారింది. పూర్తి వివరాలు వెల్లడించేందకు తగినంత సమయం లేని సందర్భాల్లో పోలీసులు అక్కడకు చేరుకోవడం సవాల్గా పరిణమించింది. దీనికి పరిష్కారంగా కాలర్ లొకేషన్ ఆటోమేటిక్గా డయల్ 100 కమాండ్ కంట్రోల్ సెంటర్కు తెలిసేలా సమాచార వ్యవస్థను ఆధునీకరించారు. దీంతో డయల్ 100కు కాల్ వచ్చిన కచ్చితమైన ప్రదేశానికి పోలీసులు సత్వరం చేరుకుని తగిన చర్యలు చేపట్టేందుకు అవకాశం ఏర్పడింది. డయల్ 100 పరిధిలోకి మరిన్ని సేవలు డయల్ 100 వ్యవస్థను దశలవారీగా విస్తరించాలని పోలీసు శాఖ నిర్ణయించింది. కేవలం పోలీసు సేవలే కాకుండా మరిన్ని సేవలను ఈ పరిధిలోకి తెస్తున్నారు. డయల్ 100కు కాల్ చేసి అగ్నిమాపక సేవలు, అంబులెన్స్ లాంటి వైద్య సేవలు, రాష్ట్ర విపత్తు స్పందన బలగాలు (ఎస్డీఆర్ఎఫ్) మొదలైన సేవలను కూడా పొందే సౌలభ్యాన్ని త్వరలో కల్పించనున్నారు. దశలవారీగా దాదాపు 20 సేవలను డయల్ 100 పరిధిలోకి తెచ్చేందుకు పోలీసుశాఖ సన్నద్ధమవుతోంది. -
జీ5లో అలరించే ఈ పోలీస్ సినిమాలు, సిరీస్లు చూశారా !
Top 6 Police Oriented Movies And Web Series In Zee5: తాము ఆరాధించే హీరోలను వివిధ గెటప్పుల్లో, విభిన్నమైన పాత్రల్లో చూడాలనుకుంటారు అభిమానులు. ఫ్యాన్స్కు కోరికలకు అనుగుణంగానే డిఫరెంట్ పాత్రల్లో నటించి మెప్పిస్తారు కథానాయకులు. ఫ్యాక్షనిస్టులుగా, ముఖ్యమంత్రులుగా, ప్రభుత్వ అధికారులుగా, పోలీసులుగా నటించి మంచి ఆదరణ పొందారు. కథానాయకులు పోలీసులుగా నటించిన అనేక సినిమాలు, వెబ్ సిరీస్లు ప్రస్తుతం ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం సరికొత్త కాన్సెప్ట్స్, జోనర్స్తో ఎంటర్టైన్ చేసేందుకు రెడీగా ఉంటున్నాయి ఓటీటీలు. వాటిలో జీ5 ఒకటి. ఇటీవలే 80+ సినిమాలు, వెబ్ సిరీస్లు అందిస్తున్నట్లుగా ప్రకటించింది. తాజాగా జీ5 ఓటీటీలో అందుబాటులో ఉన్న పోలీస్ ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన సూపర్ హిట్ సినిమాలు, సిరీస్లను ప్రేక్షకుల కోసం ప్రకటించింది. మరీ ఆ కాప్ సిరీస్లు, సినిమాలు ఏంటో చూద్దామా ! which cop makes your heart pop? 😍 pic.twitter.com/XE2OKhUvHJ — ZEE5 (@ZEE5India) May 24, 2022 చదవండి: సూపర్ థ్రిల్ ఇచ్చే 'జీ5' థ్రిల్లర్ మూవీస్ ఇవే.. -
సార్.. రెండు బీర్లు కావాలి
దౌల్తాబాద్: అర్ధరాత్రి ఓ ఆకతాయి చేసిన పనికి పోలీసులు అవాక్కయ్యారు. గురువారం రాత్రి 2 గంటల సమయంలో ఓ యువకుడు ‘డయల్ 100’కు కాల్ చేసి ‘సార్.. నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, మీరు రావాలి’అని కోరాడు. దీంతో డ్యూటీలో ఉన్న బ్లూకోల్ట్స్ కానిస్టేబుళ్లు, ఏఎస్ఐలు వెంటనే అతని వద్దకు బయలుదేరారు. తీరా అక్కడికి వెళితే ‘సార్.. నాకు రెండు బీర్లు కావాలి’అని ఆ యువకుడు అనడంతో పోలీసులు విస్తుపోయారు. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలం గోకఫసల్వాద్ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు ఆ గ్రామానికి వెళ్లేసరికి ‘డయల్ 100’కు ఫోన్ చేసిన జనిగెల మధు అనే యువకుడు మద్యం మత్తులో తూగుతున్నాడు. పైగా బీర్లు కావాలంటూ పోలీసులను ఆటపట్టించడానికి యత్నించాడు. దీంతో మధును పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్కు తరలించారు. 100కు ఫోన్ చేసి తమ సమయం వృథా చేసిన మధుపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రమేశ్ తెలిపారు. -
హోలీ పండుగకు భార్య మటన్ వండలేదని 100కు కాల్..
నల్గొండ (కనగల్) : భార్య మటన్ వండలేదని ఓ వ్యక్తి 100కు కాల్ చేసి కేసుల పాలయ్యాడు. ఎస్ఐ యు. నగేష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి .. నల్లగొండ జిల్లా కనగల్ మండలం చర్ల గౌరారం గ్రామానికి చెందిన ఓర్సు నవీన్ తన భార్య మటన్ వండలేదని డయల్ 100కు ఆరు సార్లు కాల్ చేశాడు. మద్యం మత్తులో ఉన్న అతడు అనవసరంగా కాల్ చేసి ఇలా పోలీసుల సమయాన్ని వృథా చేయడంతో కేసు నమోదు చేశారు. ఆపద, అత్యవసర సేవలకోసం మాత్రమే డయల్ 100కు పోన్ చేయాలని ఎస్ఐ సూచించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య
స్కూల్లో బెత్తం దెబ్బలు తిన్నా: సూప్రీం చీఫ్ జస్టిస్
చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
IPL 2024 PBKS VS CSK: రుతురాజ్ను వెంటాడుతున్న దరిద్రం
ఉంగరంతో ఆరోగ్యం పదిలం!
Shobha Shetty Engagement: గ్రాండ్గా ప్రియుడితో సీరియల్ నటి శోభా శెట్టి ఎంగేజ్మెంట్ (ఫోటోలు)
గ్రాండ్గా నటుడి కుమార్తె రిపెప్షన్ వేడుక.. సందడి చేసిన ప్రముఖ తారలు!
సీఎం జగన్ రేపటి ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్ ఇదే
నాన్న చనిపోయినా వేళ్లలేదు.. బంధువులంతా తిట్టారు: కోవై సరళ ఎమోషనల్
IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
తప్పక చదవండి
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
- ఇదేం ఫ్యామిలీ రా సామీ! ఏకంగా కోబ్రాకే నేరుగా..!
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement