-
మళ్లీ ‘రాజద్రోహం’!
నిండా ఆర్నెల్లు పూర్తి కాకుండానే మరోసారి ‘రాజద్రోహం’ తెరపైకి వచ్చింది. ఈసారి అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్పై ఆ నింద పడింది. స్వాతంత్య్ర దినోత్సవానికి రెండురోజుల ముందు ఆ సంస్థ ఆధ్వర్యాన బెంగళూరులో నిర్వహించిన సదస్సులో దేశ వ్యతిరేక, పాక్ అనుకూల నినాదాలు హోరెత్తాయన్నది ఆ నింద సారాంశం. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బెంగళూరు పోలీసులు కేసు పెట్టారు. ఇది జరిగిన రెండురోజులకే ఆమ్నెస్టీకి వస్తున్న నిధులపై దర్యాప్తు జరుపుతామని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మొన్న ఫిబ్రవరిలో ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్యకుమార్పైనా, మరికొందరు ఇతర విద్యార్థి నాయకులపైనా రాజద్రోహం కేసులు పెట్టి అరెస్టుచేశారు. ఆ తర్వాత రాజద్రోహానికి సంబంధించిన భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 124-ఏ పై సమగ్ర సమీక్ష జరపమని లా కమిషన్ను కోరామని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిరణ్ రిజూ ప్రకటించారు. రాజద్రోహానికి చట్టం చెబుతున్న నిర్వచనం విస్తృతమైనది కావడంవల్ల ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వారందరిపైనా దాన్ని ప్రయో గించే వీలున్నదని ఆ సందర్భంగా ఆయన అంగీకరించారు. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ యాభైయ్యేళ్లుగా ప్రపంచ దేశాలన్నిటా చురుగ్గా పని చేస్తున్న సంస్థ. అందువల్లే అఫ్ఘాన్లో తాలిబన్ ఆగడాలైనా, ఇరాక్, సిరియాల్లో ఐఎస్ ఘాతుకాలైనా ప్రపంచానికి వెల్లడయ్యాయి. బలూచిస్తాన్లో, ఆక్రమిత కశ్మీర్లో పాకిస్తాన్ సైన్యం సాగిస్తున్న మానవ హక్కుల ఉల్లంఘనల్ని సవివరంగా బయటపెట్టింది కూడా ఆమ్నెస్టీయే. అమెరికాలో నల్ల జాతీయుల హక్కుల అణిచి వేతనూ, పాలస్తీనాలో ఇజ్రాయెల్ సాగిస్తున్న అమానుషాలనూ ఈ సంస్థ నివేదికలు ప్రశ్నించాయి. ప్రపంచ భద్రతకు ముప్పు తెస్తున్న అగ్రరాజ్యాల ఆయుధ వ్యాపా రాన్నీ, మహిళలపై వివిధ దేశాల్లో అనేక రూపాల్లో సాగుతున్న హింసనూ ఆమ్నెస్టీ ప్రపంచం దృష్టికి తెచ్చింది. బెంగళూరు సదస్సు కూడా మానవ హక్కుల ఉల్లం ఘనలకు, బాధిత కుటుంబాలకు న్యాయం లభించకపోవడంవంటి అంశాలకు సంబంధించిందే. సైన్యం చేతుల్లో మాయమైన, కాల్పుల్లో మరణించిన కశ్మీర్ యువకులకు చెందిన కుటుంబాలవారు ఈ సదస్సులో తమ అనుభవాలనూ, తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులనూ వివరించారు. వారితోపాటు కశ్మీరీ పండిట్ల ప్రతినిధి ఆర్.కె. మట్టూ కూడా పాల్గొని కశ్మీర్ లోయలో తమ మానవ హక్కులకు భంగం కలుగుతున్న వైనాన్ని చెప్పారు. కేవలం ఒకవైపు వారి వాదననే వినిపిస్తే, వారికి మద్దతుగా మాత్రమే సదస్సు నిర్వహిస్తే ఆమ్నెస్టీకి ఉద్దేశాలను ఆపాదించడాన్ని అర్ధం చేసుకోవచ్చు. సదస్సులో మాట్లాడిన ఒక వక్త 2010నాటి మాఛిల్ ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయిన ముగ్గురిలో ఒక యువకుడి తండ్రి. ఆ కేసులో నిరుడు మన సైనిక న్యాయస్థానం కల్నల్, కెప్టెన్లతోసహా అయిదు గురు సైనిక సిబ్బందికి యావజ్జీవ శిక్ష విధించింది. బాధిత కుటుంబాలు చెప్పినవి తమ అనుభవాలు, అక్కడ నెలకొన్న పరిస్థితులే తప్ప వేర్పాటువాదానికి లేదా మిలిటెంట్ చర్యలకు అనుకూలంగా కాదు. సదస్సులో జాతి వ్యతిరేక ప్రసంగాలు చేశారని, నినాదాలిచ్చారని ఆరోపణలొచ్చిన ఆమ్నెస్టీ ప్రతినిధి, అధ్యాపకురాలు సింధుజా అయ్యంగార్ ఆ సదస్సులోనే పాల్గొనలేదు. సీనియర్ జర్నలిస్టు సీమా ముస్తఫా బాధిత కుటుంబాలు చెబుతున్నదేమిటో సదస్సుకు వివరించారు తప్ప ఆమె విడిగా ప్రసంగించలేదు. మరొకరు తారా రావు కశ్మీర్పై 2015నాటి ఆమ్నెస్టీ నివేదికలో పొందుపరిచిన అంశాలను ప్రస్తావించారు. ఆ కార్యక్రమం ఆద్యం తమూ వీడియో, సీసీ టీవీ ఫుటేజ్లలో రికార్డయింది. సదస్సు ముగిసిన సమ యంలో ప్రేక్షకులుగా వచ్చినవారు ఆజాదీ నినాదాలిచ్చారని సంస్థ కూడా అంగీ కరిస్తోంది. అయితే ఒక మాటో, నినాదమో, ప్రసంగమో హింసకు కారణమ య్యాయని రుజువైన పక్షంలో తప్ప వాటిని రాజద్రోహ నేరాలుగా పరిగణించడా నికి వీల్లేదని ఈమధ్యే సుప్రీంకోర్టు తీర్పు స్పష్టం చేసింది. బెంగళూరు సదస్సు తర్వాత అలాంటి హింసాత్మక ఘటనలు జరిగిన దాఖలాలు లేవు. ఆమ్నెస్టీ నిర్వాహకులపై దాఖలైన కేసులో ఎటూ దర్యాప్తు జరుగుతుంది. కానీ యావజ్జీవ శిక్షకు ఆస్కారమిచ్చే స్థాయి తీవ్రమైన చట్టాన్ని సరైన ఆధారాలు లేకుండా ఇష్టానుసారం ప్రయోగించడం సరైందేనా? ఈ కేసులో దర్యాప్తు పూర్తయితే తప్ప ముందస్తు అరెస్టులుండవని కాంగ్రెస్ నేత దిగ్విజయ్సింగ్ ప్రకటిస్తున్నారు. ఆ రకంగా కర్ణాటక ప్రభుత్వం చాలా ప్రజాస్వామ్యయుతంగా పనిచేస్తుందన్నట్టు చెబుతున్నారు. కానీ ఈ చట్టాన్ని విచక్షణారహితంగా ప్రయోగించడంలో కాంగ్రెస్ చరిత్ర తక్కువేమీ కాదు. ఎక్కువ కాలం దేశాన్ని పాలించడంవల్ల కావొచ్చు... ఎక్కువసార్లు దాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఆ పార్టీకే దక్కింది! ముంబైలో నాలుగేళ్ల క్రితం కార్టూనిస్టు ఆసీమ్ త్రివేది ఉదంతానికి ముందూ, వెనకా ఎన్నిసార్లు ఆ చట్టాన్ని ఎవరెవరిపై అక్రమంగా, అన్యాయంగా బనాయించారో అందరికీ గుర్తుంది. బ్రిటిష్ వలసపాలకులు 1870లో రాజద్రోహ నేరాన్ని శిక్షాస్మృతిలో చేర్చారు. దేశంలో స్వాతంత్య్ర భావనలను, ఆకాంక్షలను చిదిమేయడం కోసమే ఈ దుర్మా ర్గమైన చట్టాన్ని తీసుకొచ్చారు. లోకమాన్య బాలగంగాధర తిలక్ను 1908లో ఈ చట్టంకిందే శిక్షించారు. మహాత్మాగాంధీ 1922లో ఈ చట్టానికి బాధితుడు. స్వతంత్ర భారతంలో వాస్తవానికి ఇలాంటి చట్టానికి చోటుండకూడదు. కానీ మన పాలకులు దాన్ని యధావిధిగా కొనసాగించారు. దుర్వినియోగం చేయడానికి అనువుగా ఎంతో అస్పష్టమైన నిబంధనలతో రూపొందిన ఈ చట్టాన్ని కనీసం మారిన పరిస్థితులకు అనుగుణంగా సవరిద్దామన్న ఆలోచన కూడా వారికి లేక పోయింది. ఆమ్నెస్టీ చరిత్ర, దాని కృషి తెలిసినవారు ఈ మాదిరి కేసులు పెట్టడాన్ని హర్షించలేరు. రాజద్రోహం సెక్షన్పై లా కమిషన్ వీలైనంత త్వరలో సముచిత నిర్ణయం తీసుకుంటుందని, భావ ప్రకటనాస్వేచ్ఛకు హారతులు పడుతుందని ఆశించాలి. -
దేశభక్తి ఏ ఒక్కరి సొత్తూ కాదు
రోహిత్ ఘటనపై విచారణ తేదీలను మార్చాలి {పముఖ విద్యావేత్త చుక్కా రామయ్య హైదరాబాద్: ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో దేశభక్తి పేరుతో జరుగుతున్నదంతా కేంద్రం సృష్టేనని, దేశభక్తి ఏ ఒక్కరి సొత్తూ కాదని ప్రముఖ విద్యావేత్త చుక్కారామయ్య అన్నారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో గురువారం సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సెంట్రల్ వర్సిటీలో రోహిత్ ఘటనపై విచారణకు నియమించిన ఏకసభ్య కమిషన్ పర్యటన అనుమానాలకు తావిస్తోందన్నారు. విద్యార్థులు వర్సిటీలో లేని సమయంలో కమిషన్ పర్యటించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. నిజానిజాలను తెలుసుకోవడమే న్యాయవిచారణ లక్ష్యం అయితే అందులో విద్యార్థులదే కీలక పాత్ర అని, అలాంటప్పుడు విద్యార్థులు లేని సమయంలో కమిషన్ వచ్చి ఏం చేస్తుందని చుక్కా రామయ్య నిలదీశారు. మాజీ ఐఏఎస్ అధికారి కాకి మాధవరావు మాట్లాడుతూ విద్యార్థులు నగరంలో ఉండరని తెలిసే ఏకసభ్య విచారణ కమిషన్ ఈ నెల 23,24,25 తేదీల్లో పర్యటిస్తుందా? అని అనుమానం వ్యక్తం చేశారు. చలో ఢిల్లీ అన ంతరం 26వ తేదీ తరువాత విద్యార్థులు అందుబాటులో ఉంటారని, దీనికనుగుణంగా కమిషన్ తేదీల్లో మార్పు చేసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశానికి అధ్యక్షత వహించిన సీడీఎస్ వ్యవస్థాపకులు మల్లెపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ విద్యార్థులు చలో ఢిల్లీకి పిలుపునిచ్చిన వారం రోజుల తర్వాత ఢిల్లీనుంచి ఏకసభ్య కమిషన్ అదే తేదీల్లో వస్తున్నట్టు ప్రకటించిడం కేంద్రం కుట్రలో భాగమని అన్నారు. పార్లమెంటులో రోహిత్ అంశాన్ని మరుగుపర్చేందుకు జేఎన్యూలో జరిగిన చిన్న సంఘటనను తెరపైకి తెచ్చారని ఆరోపించారు. ప్రతిపక్షాలు ఆ ఉచ్చులో పడకూడదని హెచ్చరించారు. మీడియాపైన ఢిల్లీలోనూ, మేడారం జాతరలో సీనియర్ పాత్రికేయులు పాశం యాదగిరిపైనా జరిగిన దాడిని లక్ష్మయ్య తీవ్రంగా ఖండించారు. తెలంగాణ విద్యావంతుల వేదిక నాయకులు యాదయ్య, సీడీఎస్ డెరైక్టర్ వైబి సత్యనారాయణ, భరత్ భూషణ్, సిద్ధోజి తదితరులు పాల్గొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- మళ్లీ దోపిడీకి తెరపైకి..
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- నేడు నీట్ యూజీ
- విష్ణుకుమారుడి బెదిరింపులు!
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
Advertisement