-
ఖురానా మృతికి మోదీ, అమిత్ షా సంతాపం
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ మాజీ సీఎం మదన్ లాల్ ఖురానా మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సుదీర్ఘ అస్వస్థత అనంతరం శనివారం రాత్రి ఖురానా మరణించారని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఢిల్లీలో మెరుగైన మౌలిక వసతుల కల్పనకు మదన్ లాల్ ఖురానా తీవ్రంగా కృషిచేశారని, ప్రజల సంక్షేమం కోసం నిత్యం పరితపించేవారని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఢిల్లీలో పార్టీ బలోపేతానికి ఆయన చేసిన సేవలు మరువలేనివని, ఈ విషాద వేళ ఆయన కుటుంబ సభ్యులను వెన్నంటి ఉంటామన్నారు. మదన్ లాల్ ఖురానా ఆదర్శ స్వయంసేవకుడిగా గుర్తింపు పొందారని, జన్సంఘ్, బీజేపీ వ్యవస్ధాపక సభ్యుల్లో ముఖ్యులని బీజేపీ చీఫ్ అమిత్ షా ట్వీట్ చేశారు. ఖురానా మృతికి కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, హర్షవర్ధన్, స్మృతీ ఇరానీ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. -
మదన్లాల్ ఖురానా కన్నుమూత
న్యూఢిల్లీ: ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత మదన్లాల్ ఖురానా (82) అనారోగ్య కారణాలతో శనివారం రాత్రి 11 గంటలకు ఢిల్లీలోని తమ ఇంట్లో మరణించారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. 1993–96 మధ్య కాలంలో ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఖురానా, 2004లో రాజస్తాన్ గవర్నర్గా నియమితులయ్యారు. ఆయనకు ఛాతీలో ఇన్ఫెక్షన్ ఉందనీ, శనివారం ఉదయం నుంచీ ఆరోగ్యం మరింత విషమించిందని ఖురానా కొడుకు హరీశ్ చెప్పారు. అంత్యక్రియలను ఆదివారం నిర్వహిస్తామన్నారు. ఖురానాకు భార్య, ఒక కొడుకు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. మరో కుమారుడు నెల క్రితమే మరణించారు. -
ఆ ఇంట్లో 31 ఏసీలు.. 12 గీజర్లు!!
ఒక ఇంట్లో ఎన్ని ఏసీలు అవసరం అవుతాయి.. మహా అయితే మూడు లేదా నాలుగు అంతే కదా. కానీ, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ అధికారిక నివాసంలో ఎన్ని ఏసీలుండేవో తెలుసా? ఏకంగా 31 ఏసీలు!! వాటితో పాటు 25 రూం హీటర్లు కూడా ప్రత్యేకంగా ఉండేవట. ఈ విషయం అంతా సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఈ వివరాలన్నీ వచ్చాయి. నెం.౩ మోతీలాల్ నెహ్రూ మార్గ్లో ఉన్న షీలా దీక్షిత్ అధికారిక నివాసంలో 31 ఏసీలు, 15 డిజర్ట్ కూలర్లు, 25 హీటర్లు, 16 ఎయిర్ ప్యూరిఫయర్లు, 12 గీజర్లు.. ఇవన్నీ ఉన్నాయి. నాటి ముఖ్యమంత్రి అవసరాలకు అనుగుణంగా బంగ్లాకు మార్పుచేర్పులు చేయడానికి రూ. 16.81 లక్షలు ఖర్చుచేసినట్లు సీపీడబ్ల్యుడీ తెలిపింది. కేరళ రాష్ట్రానికి గవర్నర్గా ఆమె వెళ్లిపోయేటప్పుడు ఆ ఇంటినుంచి వాటన్నింటినీ తీసేశారు. వాటిలో కొన్నింటిని ప్రస్తుతం వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో అవసరాల మేరకు ఉపయోగిస్తున్నారు. మిగలిన వాటిని అవసరం వచ్చినప్పుడు ఉపయోగిస్తామన్నారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన షీలా దీక్షిత్ నివసించిన ఈ బంగ్లాను 1920లో కట్టారు. ఇది దాదాపు మూడున్నర ఎకరాల్లోవిస్తరించింది. ఇప్పుడీ బంగ్లాను మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్కు కేటాయించారు. ఆ సమయంలో దానికి రూ. 35 లక్షలతో మరమ్మతులు చేశారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఇదేం ఫ్యామిలీ రా సామీ! ఏకంగా కోబ్రాకే నేరుగా..!
వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
ఎప్పుడూ పనీపనీ.. మాతో ఉండవా? అని నా కుమారుడు నిలదీశాడు
గ్రీన్ డ్రెస్లో కరిష్మా కపూర్.. జ్యువెలరీ షోరూంలో సందడి చేసిన భామ (ఫోటోలు)
రిజర్వేషన్లను తొలగించే కుట్ర జరుగుతోంది: నిర్మల్ సభలో రాహుల్
చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు
తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..
Beauty Tips: ఈ డివైస్ని వాడారో.. మీ ముఖం చక్కటి ఆకృతిలోకి..
హ్యాట్రిక్ కొట్టిన ఆర్సీబీ.. ఆ జట్లకు హెచ్చరిక
‘బినామీలు బయటపడతారు.. అదే చంద్రబాబు భయం’
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
- తోడేళ్ళను తరిమే రోజు!
Advertisement