-
ఢిల్లీలో దోస్తీ.. గల్లీలో కుస్తీ
కరీంనగర్టౌన్: కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ.. రెండూ ఒక్కటేనని, ఢిల్లీలో దోస్తీ చేస్తూ గల్లీలో కుస్తీ పడుతున్నట్లు నటిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ విమర్శించారు. ఆదివారం ఆయన కరీంనగర్లోని డీసీసీ కార్యాలయంలో పార్లమెంట్ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని దోచేస్తోందని, ఆ కుటుంబ పాలనకు తెర దించాల్సిన అవసరం ఉందని అన్నారు. రాత్రి 8 గంటల తర్వాత రాష్ట్రంలో ఎలాంటి విపత్కర సంఘటనలు జరిగినా ప్రజలకు అందుబాటులో ఉండని మోడ్రన్ ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ అవినీతి, అక్రమాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు చర్యలెందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. తెలంగాణలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పూర్తిస్థాయిలో అవినీతిలో కూరుకుపోయారని ఆరోపించారు. మంత్రి గంగుల కమలాకర్ అక్రమంగా గ్రానైట్ తవ్వకాలు చేస్తూ, కోట్లాది రూపాయల పన్నులు ఎగ్గొట్టినా ఈడీ చర్యలు తీసుకోకపోవడంలో ఆంతర్యం ఏమిటన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి చిత్తశుద్ధి ఉంటే గంగుల కమలాకర్ గ్రానైట్స్కాంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేయాలని సూచించారు. సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి బోస్ రాజు, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్వర్రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
రాజీవ్తోనే సాంకేతిక విప్లవం
డీసీసీ అధ్యక్షుడు మృత్యుంజయం కరీంనగర్ సిటీ : దేశంలో సాంకేతిక విప్లవానికి నాంది పలికింది రాజీవ్గాంధీ అని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కటకం మృత్యుంజయం అన్నారు. రాజీవ్గాంధీ జయంతి సందర్భంగా శనివారం డీసీసీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మృత్యుంజయం మాట్లాడుతూ 18 ఏళ్లు నిండిన యువతకు ఓటుహక్కు కల్పించి రాజకీయాల్లోకి తెచ్చిన ఘనత రాజీవ్దేనన్నారు. నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కర్ర రాజశేఖర్ ఆధ్వర్యంలో రాజీవ్చౌక్లోని విగ్రహానికి పూలమాలలు వేశారు. యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో వికలాంగుల ఆశ్రమంలో పండ్లు పంపిణీ చేవారు. ఆకుల ప్రకాశ్, కోమటిరెడ్డి నరేందర్రెడ్డి, వొంటెల రత్నాకర్, దిండిగాల మధు, నాగి శేఖర్, గౌతమ్ అర్జున్రెడ్డి, గందె మాధవి, మాదాసు శ్రీనివాస్, చెర్ల పద్మ, మూల జైపాల్, వీరారెడ్డి, మగ్దుం అలీ, పడాల శంకరయ్య, చంద్రశేఖర్, వేల్పుల వెంకటేశ్, చెన్నాడి అజిత్రావు, బాసెట్టి కిషన్, కల్వల రామచందర్, అక్బర్ అలీ, చిలుక ప్రవీణ్, పటేల్ సుధీర్రెడ్డి, ముద్దసాని క్రాంతి, అబ్దుల్ రహమాన్, ములుగు ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. -
రాజీవ్ గాంధీ ఆశయసాధనకు కృషి
కడపౖవెఎస్సార్ సర్కిల్: రాజీవ్గాంధీ ఆశయసాధనకు కృషి చేద్దామంటూ డీసీసీ అధ్యక్షుడు నజీర్ అహ్మద్ పిలుపునిచ్చారు. రాజీవ్గాంధీ జయంతి సందర్భంగా శనివారం జిల్లా కాంగ్రెస్ సేవాదళ్ ఆధ్వర్యంలో నివాళి అర్పించారు. రాజీవ్పార్కు, రిమ్స్ వద్దనున్న రాజీవ్ గాంధీ విగ్రహానికి, డీసీసీ కార్యాలయంలో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈరోజు దేశం శ్రాస్త, సాంకేతిక రంగాలల్లో అభివృద్ధి చెందడానికి కారణం రాజీవ్గాంధీ కృషియే కారణమన్నారు. యువతకు 21సంవత్సరాలు కాకుండా 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించిన ఘనత రాజీవ్ గాంధీకి దక్కిందన్నారు.అనంతరం అల్షిఫా మానసిక వికలాంగుల పునరావాస కేంద్రంలో పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పీసీసీ జనరల్ సెక్రటరీ సత్తార్, పీసీసీ అధికార ప్రతినిధి నీలి శ్రీనివాసరావు, జిల్లా సేవాదళ్ చెర్మెన్ చీకటి చార్లెస్, జిల్లా సేవాదళ్ మహిళా చెర్మెన్ గౌసియా, జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సుజాతరెడ్డి, జిల్లా వైస్ ప్రెసిడెంట్ రమణారెడ్డి, క్రిష్టియన్ మైనార్టీ చైర్మన్ విజయ్భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ సమావేశం రసాభాస
► రచ్చకెక్కిన విభేదాలు ► పరిశీలకుల ముందే తోపులాట, వాగ్వివాదాలు, నినాదాల హోరు ► కటుకం వర్సెస్ ఆరెపల్లి జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి రసాభాసగా మారింది. డీసీసీ అధ్యక్షుడు కటుకం మృత్యుంజయం గ్రూపులను ప్రోత్సహిస్తున్నారంటూ ఎస్సీ సెల్ రాష్ర్ట అధ్యక్షుడు ఆరెపల్లి మోహన్ పలు విమర్శలు చేస్తూ వేదిక మీద బైఠాయించారు. వాగ్వివాదం, తోపులాట, నిరసనలతో సమావేశంలో గందరగోళం నెలకొంది. - కరీంనగర్ కరీంనగర్ : జిల్లా కాంగ్రెస్లో గ్రూపు విభేదాలు భగ్గుమన్నాయి. పరిశీలకుల ముందే తోపులాటలు, వాగ్వివాదాలు, నినాదాల హోరుతో పార్టీ జిల్లా విస్తృతస్థాయి సమావేశం గందరగోళంగా మారింది. కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం నింపడం, 2019 ఎన్నికలకు పార్టీని సిద్ధం చేయడం లక్ష్యంగా సోమవారం డీసీసీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. రాష్ట్రం నుంచి వచ్చిన ముగ్గురు పరిశీలకుల సమక్షంలో కాంగ్రెస్ నాయకుల కీచులాట కారణంగా కార్యకర్తలు ముక్కున వేలేసుకున్నారు. మధ్యాహ్నం 3గంటలకు డీసీసీ అధ్యక్షుడు కటుకం మృత్యుంజయం అధ్యక్షతన జరిగిన సమావేశానికి టీపీసీసీ సమన్వయ కమిటీ సభ్యులు టి.జీవన్రెడ్డి, మాజీ ఎంపీ జి.వివేకానంద, టీపీసీసీ ఉపాధ్యక్షుడు పొన్నం ప్రభాకర్, పార్టీ జిల్లా ఇన్చార్జి పి.నర్సింహారెడ్డి, రాష్ట్ర ప్రధానకార్యదర్శులు మహేశ్కుమార్గౌడ్, ఉజ్మషాకీర్, చల్మెడ లక్ష్మీనర్సింహారావు, హర్కార్ వేణుగోపాల్తోపాటు మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జీలు, అనుబంధ సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు, జిల్లా నలుమూలల నుంచి వచ్చిన కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సమావేశంలో ముందుగా పలువురు కార్యకర్తలు మాట్లాడారు. కాంగ్రెస్లో గ్రూపు విభేదాలు వద్దని, నాయకులు తమ గోడును పట్టించుకోవడం లే దని, టీఆర్ఎస్ను ఎదుర్కోవడంలో పూర్తిగా విఫలమవుతున్నామని వాపోయూరు. టీఆర్ఎస్ ఇచ్చిన హమీల అమలుపై పోరాటంలో విఫలమవుతున్నామని నాయకుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. అధికారం అనుభవించిన మీరే ఇలా ఉంటే కార్యకర్తల పరిస్థితి ఏమిటని, విభేదాలు మానుకొని పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని, తాము అండగా ఉంటామని వివిధ నియోజకవర్గాల బ్లాక్ అధ్యక్షులు నాయకులకు చురకలంటించారు. ఆరెపల్లి వర్సెస్ కటుకం... ముందుగా కాంగ్రెస్ ఎస్సీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఆరెపల్లి మోహన్ మాట్లాడుతూ కార్యకర్తలను పట్టించుకోకపోతే పార్టీకి పుట్టగతులుండవన్నారు. స్వయాన తనకే అవమానాలు ఎదురవుతున్నాయని వాపోయూరు. తీరు మార్చుకోకపోతే సోనియాగాంధీకి ఫిర్యాదు చేస్తానంటూ ఆగ్రహంతో డీసీసీ అధ్యక్షుడు కటుకం మృత్యుంజయం వైపు చూస్తు మాట్లాడారు. ‘దళితులంటే ఇంత అలుసా. ఎస్సీసెల్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న నేనంటే గౌరవం లేదా? గాంధీభవన్లో నా పేరిట స్వాగతం బ్యానర్లు కట్టిన వాళ్లను బెదిరిస్తారా? కార్యకర్తలను చిన్నచూపు చూడటం, గ్రూపులను ప్రోత్సహించడం మానుకోవాలి. ఈ రోజు జరిగే సమావేశానికి పత్రికల్లో నేను కూడా వస్తున్నట్లు తెలియపరిచే బాధ్యత లేదా? ఇంత అవమానాల మధ్య ఉండలేం. మరోసారి ఇలా అయితే చూస్తూ ఊరుకోం’ అంటూ హెచ్చరించారు. ‘డీసీసీ కార్యాలయంలో శిలాఫలకం చెడిపోతే శుభ్రం చేసుకునే తీరిక లేదా? మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్రావు పేరును చెరిపి వేసిన వారిని వదిలేశారు? డి.శ్రీనివాస్ టీఆర్ఎస్లో చేరినా ఆయన పేరును శిలాఫలకంపై ఎందుకు చేరిపి వేయలేదు’ అంటూ ప్రశ్నించారు. ఇదే సమయంలో రాష్ట్ర పరిశీలకులు జోక్యం చేసుకొని ఇరువురిని శాంతింపజేసి కూర్చోబెట్టారు. దీంతో అసహనానికి గురైన కటుకం మృత్యుంజయం తాను అన్నింటికి సమాధానం చెబుతానని మైకు తీసుకోని లేవగానే... ఆరెపల్లి జోక్యం చేసుకోని ‘చేసిదంతా చేసి తమాషా చూస్తున్నావా? సమాధానం చెబితే ముక్కు నేలకు రాస్తా’ అనడంతో సమావేశంలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. ఓ కార్యకర్త వేదికపైకి ఎక్కి మృత్యుంజ యంతో వాగ్వివాదానికి దిగడంతో వేదికపై ఉన్నవారు వారించారు. దీంతో ఒక్కసారిగా తోపులాటలు, వాగ్వివాదాలతో గందరగోళం నెలకొంది. ఆరెపల్లి, ఆయన అనుచరులు వేదిక పైనుంచి కిందికి వచ్చి బైఠాయించారు. గొడవ సద్దుమణగకపోవడంతో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జిల్లా పరిశీలకులు మహేశ్కుమార్గౌడ్ వేదికపై ఉన్నవారందరిని కిందికి దింపి సమావేశాన్ని కొనసాగించారు. సమావేశంలో బాబర్ సలీంపాషా, అడ్లూరి లక్ష్మణ్కుమార్, పాట రమేశ్, చేతి ధర్మయ్య, రేగులపాటి రమ్య, బోమ్మ శ్రీరాంచక్రవర్తి, కర్ర రాజశేఖర్, ఉప్పరి రవి, దిండిగాల మధు, చెర్ల పద్మ, నాగి శేఖర్, వాసు, సురేందర్, ఉప్పుల అంజనీప్రసాద్, గందె మాధవి మహేశ్, అంజన్కుమార్, ఆకుల ప్రకాశ్, కెడం లింగమూర్తి, బోలిశెట్టి శివయ్య, బండ శంకర్, విజయరామారావు, ఏనుగు మనోహర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
మహిళలతో కన్నీరు పెట్టిస్తే అరిష్టమే
ఒంగోలు సబర్బన్ : అధికారం కోసం లేనిపోని హామీలిచ్చి అవి నెరవేర్చకుండా ఆడపడుచుల చేత కన్నీరు పెట్టించిన ప్రభుత్వాలకు అరిష్టమేనని..మహిళల ఉసురు ఊరికే పోదని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ ధ్వజమెత్తారు. జిల్లా పర్యటనలో భాగంగా గురువారం ఒంగోలు వచ్చిన ఆమె స్థానిక డీసీసీ కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పద్మశ్రీ మాట్లాడుతూ మహిళా సాధికారత పేరుతో అందరినీ నమ్మించి ఓట్లేయించుకుని చంద్రబాబు అందలమెక్కారన్నారు. మ్యానిఫెస్టో అమలు చేయకుండా ఏడాదిపాటు సాగించిన చంద్రబాబు పాలనంతా డొల్లేనని విమర్శించారు. డ్వాక్రా రుణాల మాఫీ అని చెప్పి నిలువునా ముంచిన చరిత్ర హీనుడు చంద్రబాబు అని ధ్వజమెత్తారు. ప్రజల పక్షాన పోరాడేందుకు సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. రాష్ట్రాన్ని విడ గొట్టాలని అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి లేఖలిచ్చిన చంద్రబాబు ఆ బురదను కాంగ్రెస్ పార్టీపైకి నెట్టి పచ్చి అబద్ధాలు ఆడుతున్నాడని విమర్శించారు. నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీపతి ప్రకాశం అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో జిల్లా కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలు నాగలక్ష్మి, నెల్లూరుకు చెందిన నాయకురాలు చేను సుజాత, కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ జి.రాజ్ విమల్, వేము శ్రీనివాసరావు, పర్రె నవీన్ రాయ్, గాదె లక్ష్మా రెడ్డి, ఎస్.కె.రసూల్, బొడ్డు సతీష్ పాల్గొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
జగనన్న ప్రభుత్వంలోనే బకాయిలు జమ
తొలి ఓటు పడింది
ప్రశాంతంగా ముగిసిన నీట్
పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
విజయీభవ!
చెరకు రైతుల నోట్లో... చంద్రన్న విషం
లైవ్ ద్వారా మోకాలి సర్జరీపై అవగాహన
గజపతనగరం నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులు ఇలా...
జగనన్నను గెలిపిస్తాం..
అరసవల్లిలో భక్తుల రద్దీ
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement