-
దామరచర్ల పవర్ప్లాంటు ఆపుతాం
సాక్షి, హైదరాబాద్: నల్లగొండ జిల్లా దామరచర్లలో నిర్మించ తలపెట్టిన 4 వేల మెగావాట్ల అల్ట్రా పవర్ ప్లాంటును ఆపి తీరుతామని టీపీసీసీ పబ్లిసిటీ కమిటీ చైర్మన్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు వల్ల రాష్ట్ర ఖజానాపై రూ.80 వేల కోట్ల భారం పడుతోందని, కమీషన్ల కోసమే ఈ ప్రాజెక్టును చేపట్టి నల్లగొండ జిల్లా ప్రాణాల మీదకు తీసుకువస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం గాంధీభవన్లో ఆయ న విలేకరులతో మాట్లాడుతూ ప్రజల ప్రాణా లను పణంగా పెట్టి ప్రాజెక్టులు కట్టి కోట్లాది రూపాయలను దోచుకుంటున్నారన్నారు. సిమెం టు, ఫార్మా పరిశ్రమలతో ఇప్పటికే నల్లగొండలో కాలుష్యం పెరిగిపోయిందని, తాగు, సాగునీటి లో ఫ్లోరైడ్ ఉందని, పంటల దిగుబడి కూడా తగ్గి పోతోందన్నారు. మళ్లీ ఇప్పుడు సల్ఫేట్లు, నైట్రేట్లు, మెర్క్యురీ, కోల్, ఫ్లైయాష్ కలిసే ప్లాంటు నిర్మించి నల్లగొండ జిల్లా ప్రజల ప్రాణా లకు ముప్పు తెస్తారా.. అని ప్రశ్నించారు. థర్మల్ప్లాంట్లు ఏర్పాటు చేయడం మంచిది కాదని, పర్యావరణానికి చేటు తెస్తుందని ప్యారిస్ సమ్మిట్, జాతీయ మీడియాలో చర్చ జరిగిందని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ ప్లాంటు విషయంలో గుడ్డిగా ముందుకు పోతోందని విమర్శించారు. ప్లాంటు ఆపాలన్నది తన వ్యక్తిగత అభిప్రాయమని, ఇదే విషయాన్ని పార్టీలో చర్చించి ఒప్పిస్తానన్నారు. -
శిథిలావస్థలో వారధి
దామరచర్ల(మిర్యాలగూడ) : అధికారుల నిర్లక్ష్యం, ప్రజా ప్రతినిధుల అలసత్వం ప్రయాణికుల పాలిట శాపంగా మారుతోంది. నల్లగొండ– సూర్యాపేట జిల్లాల మధ్య గల మూసీ నదిపై ఉన్న వంతెన శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారింది. దామరచర్ల మండల కేంద్రం సమీపంలో మూసీ నదిపై 2001లో రూ.2కోట్లతో నిర్మించిన వంతెన కూలే దశకు చేరింది. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల కలుపుతూ ఉన్న ఈ వంతెన ప్రయాణికులకు ఎంతో ఉపయోగపడింది. దామరచర్ల నుంచి పారిశ్రామిక ప్రాంతాలైన మేళ్లచెర్వు, దక్కన్ సిమెంట్స్ కర్మాగారం,హుజూర్నగర్, ప్రముఖ పుణ్యక్షేత్రాలు మట్టపల్లి, జాన్పహాడ్ తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రజలు ఈ వంతెన గుండానే రాకపోకలు సాగిస్తున్నారు.పారిశ్రామికీకరణ ప్రాంతం కావడంతో ఈ వంతెనపై నిత్యం వందలాది వాహనాలు సిమెంట్, ఇతర లోడ్లతో వెళ్తుంటాయి. పిల్లర్లు కూలి..చువ్వలు తేలి.. మూసీ నదిపై ఉన్న వంతెనపై పలుచోట్ల సైడ్ పిల్లర్లు కూలిపోవడంతో వాహనాలు నదిలో పడే ప్రమాదం నెలకొంది. దీంతో పాటు వంతెనపై పలు చోట్ల పగుళ్లు ఏర్పడి చువ్వలు తేలాయి. దీంతో ఎప్పుడు ఏప్రమాదం జరుగుతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఏళ్ల తరబడి ఈ పరిస్థితి ఉన్నా అధికారులు ఎవరూ పట్టించు కోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. -
జిల్లాలో వైఎస్సార్సీపీకి ప్రజల మద్దతు
దామరచర్ల (మిర్యాలగూడ) : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలనుంచి మద్దతు పెరుగుతోందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఇంజం నర్సిరెడ్డి పేర్కొన్నారు. దామరచర్ల మండలం తాళ్లవీరప్పగూడెంలో వివిధ పార్టీలకు చెందిన 100 మంది కార్యకర్తలు గురువారం వైఎస్సార్సీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల సమస్యలు విస్మరించి ప్రచారాలకే పరిమితమవుతున్నాయన్నారు. ప్రజలకు అవసరమైన ఒక్క పనీ చేయడం లేదని విమర్శించారు. డబుల్బెడ్ రూమ్ ఇళ్లు, దళితులకు భూ పంపిణీ వాగ్దానాలకే పరిమితమయ్యాయన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలు కాంట్రాక్టర్లకు కాసుల వర్షాన్ని కురిపించాయన్నారు. ఈ ప్రభుత్వాలకు ప్రత్యామ్నయంగా వైఎస్సార్ పార్టీని జిల్లాలో బలోపేతం చేస్తామన్నారు. రాబోయే అన్ని ఎన్నికల్లో పార్టీకి అధిక సీట్లు వచ్చేలా కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎండీ సలీం, జిల్లా నాయకులు అన్నెం కరుణాకర్రెడ్డి, కందుల బాల కృష్ణారెడ్డి ,బాజాన్, ఆర్,శ్రీనివాస్, ఎస్.సతీష్, ఆర్.మాణికంఠ, ఎన్.సురేష్, ఎన్. శ్రీను, ఆర్.కోటయ్య, కె.గోపయ్య, టి.దేవిరెడ్డి, ఎస్.నాగరాజు, రామకృష్ణ, వెంకటే, శ్వర్లు, సైదయ్య తదితరులు పాల్గొన్నారు. -
పంచలోహ విగ్రహాలు చోరీ
దామరచర్ల: నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం కొండ్రపోల్ గ్రామంలోని పురాతన శివాలయంలో చోరీ జరిగింది. ఆలయంలోని పంచలోహ నిర్మిత శివపార్వతుల విగ్రహాలను బుధవారం రాత్రి గుర్తుతెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
అడవిదేవులపల్లి మండలం కోసం యువకుడి ఆత్మహత్యాయత్నం
అడవిదేవులపల్లి (దామరచర్ల) : మండలంలోని అడవిదేవులపల్లిని మండల కేంద్రం చేయకపోవడాన్ని నిరసిస్తూ గ్రామానికి చెందిన యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గురువారం గ్రామంలో అఖిలపక్షాలు చేపట్టిన దీక్షలు 15వ రోజుకు చేరుకున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం మండల కేంద్రం చేయక పోవడంతో మనస్తాపానికి గురైన దేవతల సైదయ్య(25) అనే యువకుడు దీక్షవద్ద పురుగుల మందు తాగాడు. దీనిని గమనించిన గ్రామస్తులు వెంటనే చికిత్స కోసం గ్రామంలో ఉన్న ఓప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆ యువకుడిని సీపీఎం జిల్లా కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి పరామర్శించారు. అనంతరం దీక్ష సభా స్థలం వద్ద జూలకంటి మాట్లాడారు. అన్ని అర్హతలున్న అడవిదేవులపల్లిని మండల కేంద్రం చేయక పోవడం అన్యాయమన్నారు. మండల కేంద్రం కోసం చేస్తున్న ఉద్యమాలకు తమ పార్టీ మద్దతు ఉంటుందన్నారు. ఆత్మహత్యలకు పాల్పడవద్దని, పోరాటాల ద్వారానే మండల కేంద్రం సాధించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా నాయకులు మల్లేశ్, జగదీశ్వర్రెడ్డి,చంద్రశేఖర్యాదవ్,పాపానాయక్,వినోద్,సైదులు, మద్దెలశ్రవన్,బండి నాగేశ్వరావు,మున్నా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement