-
నాసా రోవర్.. సాఫ్ట్ వేర్ రాసింది మన మహిళే!
మొన్నటి ‘పెర్సీ’ రోవర్తో కలిపి నాసా ఇంతవరకు ఐదు రోవర్లను అంగారకుడి మీదకు పంపింది. వాటిల్లో స్పిరిట్, ఆపర్చునిటీ, క్యూరియాసిటీ అనే రోవర్లకు, తాజా పెర్సీ రోవర్కు లాండింగ్ సాఫ్ట్ వేర్ రాసింది మన భారతీయ మహిళే! పేరు వందన. పెర్సీ ప్రాజెక్టును విజయవంతం చేసిన స్వాతి టీమ్లోని సభ్యురాలు. 2007 నుంచి నాసాలో రోబోటిసిస్ట్గా పని చేస్తున్న వందన పంజాబీ మహిళ. నాసా ఆఫీస్లో అంతా వందనను ‘వండీ’ అని పిలుస్తారు. అందరితో ఆమె కలుపుగోలుగా ఉండటమే ఆ ఆప్యాయతకు కారణం. అంగారకుడి పైకి పంపే రోవర్ల నియంత్రణకు స్క్రీన్ప్లే వంటి సాఫ్ట్వేర్ను రూపొందించడంలో ఆమె నిపుణురాలు. ఇప్పటి వరకు నాసా పంపిన ఐదు రోవర్లలో ఒక్క సోజర్న్ రోవర్కు తప్ప మిగతా వాటన్నిటికీ ఆమే సాఫ్ట్వేర్ రాశారు. వ్యోమగామి కల్పనాచావ్లా జన్మస్థలమైన హర్యానా పక్క రాష్ట్రం పంజాబ్ నుంచే వందన కూడా నాసా వరకు వెళ్లారు. పంజాబ్లోని హల్వారా వందన జన్మస్థలం. ఆమె తండ్రి ఇండియన్ ఎయిర్ఫోర్స్ లో పైలట్. ఉద్యోగ రీత్యా వందన చిన్నప్పుడే ఆయన భారతదేశంలోని ముఖ్య నగరాలన్నీ చుట్టేశారు. వాటిని చుట్టినట్లే ఆమెకు అంతరిక్షాన్నీ చుట్టి రావాలని ఉండేది. హల్వారాలోనే కేంద్రీయ విద్యాలయలో పాఠశాల చదువు పూర్తయింది. చండీగఢ్ పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్లో డిగ్రీ అయింది. తర్వాత యూఎస్లోని కార్నెగీ మెలాన్ యూనివర్శిటీ (సి.ఎం.యు.) లో రోబోటిక్స్ తీసుకుని మాస్టర్స్ డిగ్రీ చేశారు. ఆ తర్వాత పీహెచ్డి. చదువుకుంటూనే ఆమె చేసిన పని విమానం నడపడంలో శిక్షణ తీసుకుని పైలట్ లైసెన్స్ సంపాదించడం. చదువుతున్నప్పుడే పార్ట్ టైమ్గా దక్షిణమెరికా అటకామా ఎడారిలో ఆస్ట్రోబయాలజీ ప్రయోగాల్లో పాల్పంచుకున్నారు. అటాకామాలో అంగారకుడి పోలిన స్నేహపూర్వకం కాని వాతావరణం ఉంటుంది. అక్కడ పరిశోధనలు చేశారు. ఇక సి.ఎం.యు.లోనైతే నిర్దేశించిన అవసరాలకు తగినవిధంగా రోబోను తయారు చేసి దానిని నియంత్రించే ప్రోగ్రామ్ను రాయడంలో వందనకే ఎప్పుడూ ఫస్ట్. అలా ఆమెకు అంగారకుడి మీద, అంగారకుడిపైకి పంపే రోవర్ల మీద పట్టు లభించింది. 2006లో నాసాలో అవకాశం వచ్చింది. అక్కడ ఆమె తొలి ప్రాజెక్టే ‘ప్లెక్సిల్’కు సాఫ్ట్వేర్ రాయడం. ఫ్లెక్సిల్ అంటే ప్లాన్ ఎగ్జిక్యూషన్ ఇంటర్ఛేంజ్ లాంగ్వేజ్. అదొక ఆటోమేషన్ టెక్నాలజీ భాష. ఆ ప్రాజెక్ట్ను విజయవంతంగా నిర్వహించారు. ఇప్పుడు పెర్సీని అంగారకుడి పైకి దింపింది కూడా నాటి ఫ్లెక్సిల్ సాఫ్ట్వేర్కు అభివృద్ధి రూపమే. వందన 2007లో నాసా వారి జెట్ ప్రొపల్షన్ లేబరీటరీలో జాయిన్ అయ్యారు. అక్కడ మరింత అధునాతనమైన, మెరుగైన రోబో టెక్నాలజీని కనిపెట్టవలసి ఉంటుంది. అక్కడ ఆమె ప్రతిభ ఆమెను ఆటానమస్ సిస్టమ్స్ ప్రాజెక్టుకు గ్రూప్ లీడర్ను చేసింది. ఆ ప్రతిభా నైపుణ్యాలే వందనకు నాసాలో విశిష్టమైన రోబోటిసిస్టుగా గుర్తింపు తెచ్చిపెట్టాయి. నాసా లేబరేటరీలో రోవర్ల మధ్య వందన -
కృష్ణా బేసిన్ చీఫ్ ఇంజనీర్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్ చీఫ్ ఇంజనీర్ సురేష్ కుమార్ ఇళ్లపై శుక్రవారం ఏసీబీ ఏకకాలంలో దాడులు చేసింది. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని కేసు నమోదు చేసింది. హైదరాబాద్, ప్రొద్దుటూరు, కరీంనగర్ సహా ఏడుచోట్ల సోదాలు నిర్వహించామని అధికారులు తెలిపారు. హైదరాబాద్లో సురేష్ కుమార్ను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటివరకు 10 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులను గుర్తించామని అన్నారు. కరీంనగర్లో విలాసవంతమైన నాలుగు అంతస్తుల భవనం, హైదరాబాద్లో మూడు అసార్ట్మెంట్లు, 10 ఇళ్ల స్థలాలు గుర్తించినట్లు వెల్లడించారు. -
తెలుగు గంగ సీఈగా బి. సుధాకర్బాబు
హంద్రీ-నీవా సుజల స్రవంతి పథకం సూపరిండెంట్ ఇంజనీర్ బి.సుధాకర్బాబుకు ప్రభుత్వం తెలుగు గంగ ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఇటీవల తెలుగు గంగ సీఈ సుధాకర్ పదవీ విరమణ చేశారు. అనంతపురం జిల్లా సీఈ జలంధర్ ఇప్పటివరకూ తెలుగుగంగ సీఈగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తెలుగుగంగకు పూర్తిస్థాయి సీఈ నియమించాలని భావించిన ప్రభుత్వం.. ఆ బాధ్యతలను బి.సుధాకర్బాబుకు అప్పగించింది. కమిషనరేట్ ఆఫ్ టెండర్స్ విభాగంలో సీఈగా పనిచేస్తోన్న నారాయణరెడ్డిని కర్నూల్ సీఈగా నియమించింది. క్వాలిటీ కంట్రోల్(రాయలసీమ) విభాగం సీఈగా కె.వరదరాజుకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. జలవనరుల విభాగం సంయుక్త కార్యదర్శి బి.వేదవ్యాసకు కమిషనరేట్ ఆఫ్ టెండర్స్ విభాగం సీఈగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. -
పుష్కర పనులపై చీఫ్ ఇంజనీర్ ఆగ్రహం
దామరచర్ల(నల్లగొండ): కృష్ణాపుష్కరాలు సమీపిస్తున్నా ఇప్పటి వరకు ఏర్పాట్లు పూర్తికాకపోవడంపై ఎన్ఎస్పీ చీఫ్ ఇంజనీర్ సునిల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లా దామరచర్ల కృష్ణానది పుష్కర స్నానఘట్ట పనులను పరిశీలించిన ఆయన పనుల జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగస్ట్ 12 నుంచి 23 వరకు కృష్ణ పుష్కరాలు జరగనుండటంతో.. జూలై నెలాఖరులోగా పనులు పూర్తిచేయాలని ఆయన అధికారులకు సూచించారు. -
పనులు పూర్తి చేయకుంటే చర్యలు
కర్నూలు సిటీ: శ్రీశైలం కుడి గట్టు కాల్వ పెండింగ్ ప్యాకేజీల పనులు సకాలంలో పూర్తి చేయకుంటే సంబంధిత ఏజెన్సీలపై చర్యలు తీసుకుంటామని జల వనరుల శాఖ చీఫ్ ఇంజనీర్ చిట్టిబాబు కాంట్రాక్టర్లను హెచ్చరించారు. శుక్రవారం సీఈ కార్యాలయంలో పెండింగ్లో ఉన్న ప్యాకేజీల పురోగతి, ఈ ఏడాది ఎంత మేరకు నీరు ఇస్తారు అనే అంశాలపై ఈఈలు, ఏజెన్సీలతో సమీక్షించారు. ఈ సందర్భంగా సీఈ మాట్లాడుతూ ఈ ఏడాది గాలేరు నగరి సుజల స్రవంతి పథకం ద్వారా గండికోటకు నీరు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. 24వ ప్యాకేజీ పనులు పూర్తి చేసి ఈ ఏడాది పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 44 వేల క్యుసెక్కుల నీరును తరలించేలా ఉండే అడ్డంకులను తొలగించాలన్నారు. పనులు పూర్తవుతున్నాయని, 44 వేల క్యూసెక్కుల నీరు తీసుకునేలా హెడ్ రెగ్యులేటర్ గేట్లు, వాటి నియంత్రణ పనులు పూర్తికావోచ్చాయని అధికారులు సీఈకి తెలిపారు. 25వ ప్యాకేజీలో 60 కి.మీ దగ్గర నిర్మించాల్సి బ్రిడ్జి పనులు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. 26 ప్యాకేజీలో సైడ్ వాల్స్కు పడ్డ రంధ్రాలను పూడ్చి వేసేందుకు కాంట్రాక్టర్లు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని, పనికి తగ్గ యంత్రాలను ఏర్పాటు చేసుకోని పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. 27 ప్యాకేజీలో కాంక్రిట్ పనులు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. ఒక్కొ సబ్ డివిజన్లో 16 మంది జేఈలకుగానీ ఇద్దరు, ముగ్గురుకి మించి లేరని, ఏఈలు, డీఏఓలు, సూపరింటెండెంట్ల కొరత తీవ్రంగా ఉందని, సిబ్బందిని నియమిస్తేనే పనుల్లో పురోగతి వేగవంతం అవుతుందని అధికారులు వివరించారు. సమావేశంలో ఎస్ఆర్బీసీ ఎస్ఈ శ్రీనివాసరావు, తెలుగుగంగా ఎస్ఈ రామచంద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రూపురేఖలు మారాయి
అగ్రి ల్యాబ్ ఎంతో ప్రయోజనం
● ప్రగతి పథంలో దూసుకుపోతున్న గ్రామాలు ● పరుగులు పెడుతున్న అభివృద్ధి పనులు ● వెల్లివిరుస్తున్న ప్రభుత్వ భవనాలు ● నాడు–నేడుతో సమూలంగా మారిన సర్కారు బడులు ● ఇళ్లు కాదు.. ఊళ్లుగా వెలిసిన జగనన్న కాలనీలు ● అబ్బో..! ఎటు చూసినా నయా మెరుగులే!
మతిస్థిమితం లేని వ్యక్తి అదృశ్యం
రేపు, ఎల్లుండి కూడా పోస్టల్ బ్యాలెట్
రోబోటిక్ టెక్నాలజీతో మోకాలి మార్పిడి శస్త్రచికిత్స
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన మరో లారీ
అబ్బో.. ఆ యువ నాయకుడితో ఎట్టా ఏగేది?
బూటకాల ‘బాబు’
వైఎస్సార్సీపీ జోష్
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement