-
ఈ మహిళ రూటే సపరేటు.. ప్రేమ, పెళ్లిళ్లు, మూడు నెలలు కాపురం చేసి!
తిరువొత్తియూరు: సేలంలో ఓ ఫైనాన్షియర్ను మోసం చేసిన ఇన్స్ట్రాగామ్ బ్యూటీ కేరళ, కర్ణాటకలోనూ ప్రేమ వివాహాల మోసాలకు పాల్పడిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. సేలం జిల్లా ధర్మంగళం సమీపంలోని తోలసంబట్టి ప్రాంతానికి చెందిన మూర్తి ఫైనాన్షియర్ (30) కొద్ది రోజుల క్రితం తొలసంబట్టి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అందులో శ్ఙ్రీతాను ఇన్స్ట్రాగామ్ ద్వారా పరిచయమైన నీలగిరి జిల్లా కూడలూరుకు చెందిన రషీత అనే బ్యూటీతో ప్రేమలో పడ్డాను. గత మార్చిలో ఓమలూరు ఈశ్వవరన్ దేవాలయంలో పెళ్లి చేసుకున్నాం. 3 నెలల పాటు కాపురం చేసిన ఆమె గత నెల 4వ తేదీ ఉదయం కనిపించకుండా పోయింది. ఇంట్లో ఉన్న 4 తులాల నగలు, రూ.1.50 లక్షల డబ్బు తీసుకుని మాయమైంది. ఆమెను పట్టుకొని అరెస్ట్ చేయాలి అని తెలిపాడు. ఈ ఫిర్యాదుపై పోలీసులు సీరియస్గా విచారణ చేపట్టారు. ఈ సందర్భంలో రషీత ఇన్స్ట్రాగామ్లో మోడల్గా వివిధ రూపాల్లో ఉన్న చిత్రాలను పోస్ట్ చేయడం, డబ్బున్న పురుషులను ప్రలోభపెట్టడం ద్వారా వివాహ మోసానికి పాల్పడినట్లు వెల్లడైంది. ఫైనాన్షియర్ మూర్తిని వివాహం చేసుకునేందుకు ముందే గతంలో కోయంబత్తూరు, కేరళ, కర్ణాటకలో కొందరిని మోసం చేసి పెళ్లి చేసుకున్న విషయం వెల్లడైంది. ఈ కోణంలో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. అలాగే ప్రస్తుతం పరారీలో ఉన్న రషీత కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఆమె బంధువులు సేలం, నీలగిరిలో ఉన్నారని వారిని కూడా ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. -
ఇంతకీ.. ఆ డాక్టర్ సంగతేమిటో!?
చిత్తూరు రూరల్: చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోకి వచ్చే ఓ అధికారి ఓ విభాగ అధిపతిగా ఉన్నారు. గతంలో ఓ కాంట్రాక్టు మహిళా వైద్యురాలితో అనుచితంగా ప్రవర్తించి చెప్పుదెబ్బలు తిన్నాడు. తాజాగా ఓ యువతిని లైంగింక వేధింపులకు గురిచేసి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు ప్రచారంలోకి వచ్చింది. యువతి బంధువులు అతడిని చితకబాదడంతో ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆ అధికారి.. ఆపై, సెలవు పెట్టి జిల్లా నుంచి జంప్ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తన సొంతూరైన ఖమ్మంలో ఓ ప్రైవేటు క్లినిక్ పెట్టుకుని ప్రాక్టీస్ చేస్తున్నట్లు భోగట్టా! ప్రస్తుతం ఇది చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రితో పాటు వైద్య ఆరోగ్యశాఖలో హాట్ టాపిక్గా నానుతోంది. దీనికి సంబంధించి సేకరించిన వివరాల మేరకు.. ఓ యువతికి (వైద్య సిబ్బంది) పర్మినెంట్ ఉద్యోగం పేరిట వల వేసి, గర్భం చేసినట్లు తెలిసింది. ఇది యువతి కుటుంబీకులు తెలియడంతో తిరుపతిలోని ఆ అధికారి ఇంటికి వెళ్లి చితకబాధినట్లు సమాచారం. ఆ అధికారి బాగోతం కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో ఆయన సీరియస్ అయ్యారని తెలుస్తోంది. దీంతో ఆయన దీర్ఘకాలిక సెలవు పెట్టి తన స్వస్థలానికి వెళ్లినట్లు తెలియవచ్చింది. ఫిర్యాదు అందితే విచారణ చేస్తాం దీనిపై డీఎంఅండ్హెచ్ శ్రీహరిని వివరణ కోరగా..బాధితులు ఎవరైనా రాత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విచారణ చేసి, చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
ప్రేమా లేదు.. పెళ్లి లేదూ.. భర్త చనిపోతే ఆస్తి కోసం చేరదీశాడంతే!
ఆటోనగర్ (విజయవాడ తూర్పు): ఓ మహిళ భర్త కరోనాతో గత ఏడాది మృతి చెందారు. ఆమెకు పిల్లలు లేరు. ఆమె పేరిట రూ.1.20 కోట్ల ఆస్తి ఉంది. ఆ వితంతువును ఓ కానిస్టేబుల్ నమ్మించాడు. అతనికి అప్పటికే పెళ్లయింది. భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే వితంతు మహిళతో కానిస్టేబుల్ పరిచయం పెంచుకున్నాడు. అనధికారికంగా పెళ్లి చేసుకున్నాడు. ఆపై ఆమె ఆస్తిని కాజేసేందుకు యత్నించాడు. బాధితురాలి ఫిర్యాదుతో ఈ వ్యవహారం వెలుగుచూసింది. విజయవాడ పటమట పోలీసుల కథనం మేరకు.. విజయవాడ రామలింగేశ్వరనగర్కు చెందిన మహిళ భర్త గతేడాది కరోనాతో మృతి చెందాడు. వారికి పిల్లలు లేరు. కూచిపూడి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తున్న దేవేంద్రకు కొద్ది నెలల క్రితం ఆమెతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. వారిద్దరు ఓ గుడిలో దండలు మార్చుకొని అనధికారికంగా వివాహం చేసుకున్నారు. రామలింగేశ్వరనగర్లో ఆ మహిళకు రూ.1.20 కోట్ల విలువు చేసే ఇల్లు ఉంది. ఆమెకు తెలియకుండా ఆ ఇంటిని కానిస్టేబుల్ బేరానికి పెట్టాడు. కొనేందుకు వచ్చిన వారి నుంచి రూ.40 లక్షలు తీసుకున్నాడు. ఈ విషయం ఆ మహిళకు ఆలస్యంగా తెలిసింది. తీసుకున్న డబ్బులు ఇవ్వాలని దేవేంద్రపై వత్తిడి చేసింది. అయితే అతను పట్టించుకోకపోవడంతో పటమట పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్ఐ జాన్బాషా తెలిపారు. -
మహిళపై కన్నేసిన హెడ్ కానిస్టేబుల్.. కంప్లైట్ ఇచ్చేందుకు వస్తే లోబర్చుకొని
సాక్షి, మైసూరు(కర్ణాటక):నంజనగూడు తాలూకా హుల్లహళ్లి పోలీస్స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేసే సి.కృష్ణపై కేసు నమోదైంది. వివరాలు.. నిందితుడు టి.నరిసిపుర తాలూకా బన్నూరు పీఎస్లో పనిచేసే సమయంలో ఒక మహిళ భర్తతో గొడవలతో ఫిర్యాదు చేయడానికి వచ్చింది. కృష్ణ ఆమెను లోబర్చుకుని మైసూరు నగరంలో కాపురం పెట్టాడు. ఆమె పేరుతో రూ.5 లక్షల రుణం తీసుకున్నాడు. కొంతకాలం తరువాత తనని పెళ్లి చేసుకోవాలని ఆమె కృష్ణని కోరగా పెళ్లి చేసుకోనని, తాను చెప్పినట్లు వినకపోతే కష్టాలు తప్పవని బెదిరించాడు. ఇటీవల కృష్ణ, అతని కుమారుడు కిరణ్ కలిసి ఆమెను కొట్టారు. దీంతో బాధితురాలు హుల్లహళ్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు విచారణ చేపట్టారు. పెళ్లయి ఏడాది.. ఆత్మహత్య హోసూరు: డెంకణీకోట తాలూకా తళి జయంతి కాలనీకి చెందిన తిరుమలప్ప భార్య భూమిక (19). వీరికి గత ఏడాది క్రితం పెళ్లి జరిగింది. భూమిక గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందింది. ఆరోగ్యం బాగుపడక పోవడంతో విరక్తి చెందిన ఆమె గురువారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొంది. తళి పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు. చదవండి: భర్త కర్కశత్వం..భార్య విడాకుల నోటీసులో సంతకం చేయలేదని.. -
యువతులను వంచించి.. నగ్న ఫొటోలు, వీడియోలతో వికృతానందం
సాక్షి, బెంగళూరు: మోడలింగ్లో అవకాశాలు కల్పిస్తామంటూ యువతుల నగ్న ఫొటోలు, వీడియోలు తీసుకుని వికృతానందం పొందుతున్న యువకుడిని మంగళవారం కర్ణాటకలోని హలసూరు పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు ప్రపంచన్ ఓ ప్రైవేటు కళాశాలలో చదువుతున్నాడు. సామాజిక మాధ్యమాల్లో నకిలీ అకౌంట్లు ఓపెన్ చేశాడు. మోడలింగ్పై ఆసక్తి ఉన్నవారిని గుర్తించి మాయమాటలు చెప్పి వారి నగ్నఫొటోలు, వీడియోలు తీసుకొని వికృతానందం పొందేవాడు. అతని మొబైల్ను పరిశీలించగా వెయ్యికిపైగా యువతుల ప్రైవేటు ఫొటోలు, దాదాపు 400 వీడియోలు వెలుగు చూశాయని డీసీపీ శరణప్ప తెలిపారు. చదవండి: ప్రియుని మోజులో భర్త హత్య.. నిజం చెప్పిన కొడుకు
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య
స్కూల్లో బెత్తం దెబ్బలు తిన్నా: సూప్రీం చీఫ్ జస్టిస్
చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
IPL 2024 PBKS VS CSK: రుతురాజ్ను వెంటాడుతున్న దరిద్రం
ఉంగరంతో ఆరోగ్యం పదిలం!
Shobha Shetty Engagement: గ్రాండ్గా ప్రియుడితో సీరియల్ నటి శోభా శెట్టి ఎంగేజ్మెంట్ (ఫోటోలు)
గ్రాండ్గా నటుడి కుమార్తె రిపెప్షన్ వేడుక.. సందడి చేసిన ప్రముఖ తారలు!
సీఎం జగన్ రేపటి ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్ ఇదే
నాన్న చనిపోయినా వేళ్లలేదు.. బంధువులంతా తిట్టారు: కోవై సరళ ఎమోషనల్
IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
తప్పక చదవండి
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
- ఇదేం ఫ్యామిలీ రా సామీ! ఏకంగా కోబ్రాకే నేరుగా..!
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement