-
గిరిజనులను మనుషులుగా గుర్తించని ప్రభుత్వం
గుర్తేడు మండల కేంద్రం ఏర్పాటు కృషి పీహెచ్సీల్లో వైద్య సదుపాయాలు మెరుగుపరచాలి అన్న వస్తున్నాడు.. చీకట్లు తొలగిపోతాయి.. చాపరాయి మృతుల కుటుంబాలకు జగన్ ఆర్థిక సహాయం బాధిత కుటుంబాలకు అందజేసిన కన్నబాబు, రాజేశ్వరి, అనంతబాబు రంపచోడవరం/మారేడుమిల్లి : కనీస వైద్య సదుపాయాలు లేక గిరిజనులు అల్లాడుతున్నారని, ప్రభుత్వం వారిని మనుషులుగా గుర్తించడం లేదని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు అన్నారు. వరుసగా మరణాలు సంభవిస్తున్నా పీహెచ్సీల్లో వైద్య సదుపాయాలను మెరుగుపరచడంలో అదే నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. చాపరాయి గ్రామాన్ని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సందర్శించినప్పుడు బాధిత కుటుంబాలకు ప్రకటించిన ఆర్థిక సాయాన్ని పార్టీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు, ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, పార్టీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్ శుక్రవారం అందజేశారు. కన్నబాబు మాట్లాడుతూ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ సాయం అందజేసినట్టు తెలిపారు. ఎప్పటి నుంచో గుర్తేడు మండల కేంద్రం ఏర్పాటుకు గిరిజనులు ఎదురుచూస్తున్నారని తెలిపారు. ఈ ప్రభుత్వం మండల కేంద్రం ఏర్పాటు చేయకపోతే వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత చేస్తామన్నారు. గుర్తేడు పీహెచ్సీల్లో అంబులెన్స్ను అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. రెండు రోజులు క్రితం అంబులెన్స్ లేకపోవడంతో ఒకరు మృతి చెందారని ఆరోపించారు. పాతకోట గ్రామంలో అనారోగ్యంతో గిరిజనులు మృతి చెందుతున్నారని ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రూ. 2వేలు పింఛన్, పిల్లలను బడికి పంపితే రూ.1000 వంటి తొమ్మిది పథకాల అమలుతో పేదలకు మేలు జరుగుతుందన్నారు. గిరిజనులకు పక్కా ఇళ్లు, రోడ్డు నిర్మాణాలు చేస్తామన్నారు. చాపరాయి బాధిత కుటుంబాలకు మంత్రి పంపిణీ చేసిన చెక్కులు వారి అకౌంట్లో వచ్చే నెల వరకు పడనప్పుడు ఎందుకు హడవిడిగా ఇచ్చారని ఆరోపించారు. చాపరాయి బాధిత కుటుంబాలకు రూ. 10 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. వై.రామవరానికి చెందిన కర్రా వెంకటలక్ష్మి మాట్లాడుతూ ఐటీడీఏలో చెక్కుల పంపిణీకి పిలిచి మంత్రి నక్కా ఆనందబాబు దారుణంగా మాట్లాడారన్నారు. మీరు మాట్లాడకండి అంటూ బయటకు వెళ్లండి అంటూ బెదిరింపు దోరణిలో మాట్లాడరని ఇదేనా గిరిజనులకు ఇచ్చే మర్యాద అని విమర్శించారు. సర్పంచ్ మరిగెల నర్సమ్మ మాట్లాడుతూ బాధిత కుటుంబాలకు రూ.10లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తే చెక్పవర్ రద్దు చేస్తామని, 16 కేసులు పెడతామని బెదిరిస్తున్నారని తెలిపారు. ఇలాంటి వాటిని లెక్కచేసే పరిస్థితి లేదన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొమ్మిశెట్టి బాలకృష్ణ, జెడ్పీటీసీలు సత్తి సత్యనారాయణరెడ్డి, పల్లాల రమణమ్మ, మండల కన్వీనర్లు జల్లేపల్లి రామన్నదొర, నండూరి గంగాధరరావు, పార్టీ నాయకులు చంటి, గంగరాజు, బాలాజీబాబు, రామాంజనేయులు, సర్పంచ్ బాబురావు తదితరులు పాల్గొన్నారు. -
సరిగా స్పందించలేదు: సీఎం ఆగ్రహం
గరగపర్రు, చాపరాయి ఘటనలపై సాక్షి, అమరావతి : గరగపర్రు, చాపరాయి గ్రామాల్లో చోటుచేసుకున్న ఘటనలపై అధికారులు, పార్టీ ఎమ్మెల్యేలు సరిగా స్పందించలేదని ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇబ్బందికర పరిస్థితులు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కోలేకపోతే ఎలాగని ప్రశ్నించారు. ఉండవల్లిలోని తన నివాసంలో సోమవారం తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన పలు అంశాలపై మాట్లాడారు. చాపరాయిలో సరైన వైద్య సౌకర్యాలు లేకపోవడం వల్ల గిరిజనులు మృత్యువాతపడ్డారని, కొంచెం అప్రమత్తంగా ఉంటే ఇబ్బంది కాదన్నారు. తాను జోక్యం చేసుకున్న తర్వాత గానీ రెండు గ్రామాల్లో సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. నంద్యాల ఉప ఎన్నికలో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలని, ఇందుకు అందరూ పనిచేయాలని సూచించారు. అన్ని జిల్లాల్లోనూ పత్రికల్లో వ్యతిరేక వార్తలు వస్తున్నాయని, వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. విశాఖ భూముల కుంభకోణంపై అయ్యన్నపాత్రుడు, ఎంపీలు జేసీ దివాకర్రెడ్డి, కేశినేని నానిలు చేసిన కామెంట్లను పరోక్షంగా ప్రస్తావించారు. నేతలందరూ ఇష్టానుసారం చేసిన కామెంట్ల జాబితాను బయటకు తీయిస్తానని చెప్పి ఇకపై ఇలాంటి కామెంట్లు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. -
దట్టమైన అడవిలో...
- మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో విపక్ష నేత జగన్ పర్యటన - చాపరాయి జ్వరాల బాధితులకు ఓదార్పు సాక్షి ప్రతినిధి, కాకినాడ: మావోయిస్టులకు పెట్టని కోట.. దట్టమైన అడవులు.. దుర్భేద్యమై న కొండలు.. ప్రమాదకరమైన లోయలు.. రాళ్లతో కూడిన ఎగుడు దిగుడు దారి.. ఏకధాటిగా కురుస్తున్న వర్షం.. ఇదంతా చూస్తే వెన్నులో వణుకు పుట్టక మానదు. అటువంటి తూర్పు కనుమల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటించారు. తూర్పు గోదావరి జిల్లా వై.రామవరం మండలం చాపరాయిలో విషజ్వరాల బారిన పడ్డ గిరిజనులను స్వయంగా పరామర్శించి, వారి కష్టాలను తెలుసుకునేందుకు వచ్చారు. గిరిపుత్రుల వెతలు విని జగన్ చలించిపోయారు. వారిని ఓదార్చి ధైర్యం చెప్పారు. రంపచోడవరం నుంచి చాపరాయి చాపరాయిని సందర్శించేందుకు జగన్ శుక్రవారం రాత్రే రంపచోడవరం చేరుకున్నారు. శనివారం ఉదయమే ఆ గ్రామానికి బయలుదేరారు. తొలుత రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చాపరాయి గిరిజనులను పరామర్శించారు. అనంతరం మారేడుమిల్లి మీదుగా అడవిబాట పట్టారు. దట్టమైన అడవిలో ఆయన పర్యటన సాగింది. దారి పొడవునా గిరిజనులను కలుసుకుని మాట్లాడారు. ఎక్కడికక్కడ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కడారికోటలో పెద్ద ఎత్తున తరలివచ్చిన గిరిజనులనుద్దేశించి ప్రసంగించారు. తరువాత ఘాట్రోడ్డులో వర్షంలోనే గంటపాటు ప్రయాణించి చాపరాయికి చేరుకున్నారు. బురదమయమైన రహదారిలో వాహనం ఎక్కడ జారిపోతుందో తెలియని ప్రమాదకర పరిస్థితుల్లో ఆయన ప్రయాణం సాగించారు. -
వినపడలేదా... గిరిజన వేదన
సీఎం చంద్రబాబుపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం - ముఖ్యమంత్రికి పేదవాడంటే కోపం - విష జ్వరాలతో 17 మంది చనిపోవడం బాధాకరం - అధైర్యపడొద్దు.. అన్నివిధాలా తోడుగా ఉంటా.. - చాపరాయి గ్రామస్తులకు జగన్ భరోసా... ఏజెన్సీలో పర్యటన సాక్షి ప్రతినిధి, కాకినాడ: ‘‘చంద్రబాబుకు పేదవాడంటే కోపం. మానవత్వం లేని ఆయన పాలనలో పేదలకు ఒరిగింది శూన్యం. మన బాధలను వినిపిస్తే చంద్రబాబుకు కొద్దోగొప్పో బుద్ధి జ్ఞానం వస్తాయేమో చూద్దాం. గడ్డి పెడితే ఆయనలో మానవత్వం వస్తుందేమో ఆశిద్దాం. చాపరాయి గ్రామంలో 17 మంది విష జ్వరాల బారిన పడి చనిపోవడం బాధాకరం. మళ్లీ ఇలాంటి మరణాలు సంభవించకుండా, సమస్యలు పరిష్కారమయ్యేలా మనమంతా కలిసి పోరాటం చేద్దాం. ఎవరూ అధైర్యపడొద్దు. మీకు అన్ని విధాలా అండగా ఉంటా’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గిరిజనులకు భరోసా కల్పించారు. ఆయన శనివారం తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీలో పర్యటించారు. విష జ్వరాలతో గిరిజనులు మృత్యువాత పడ్డ చాపరాయి గ్రామాన్ని సందర్శించారు. అంతకుముందు కడారికోటలో గిరిజనులతో మాట్లాడారు. బాధిత కుటుంబాలను పరామర్శించారు. వారికి పార్టీ తరపున ఆర్థిక సాయం అందజేస్తామన్నారు. గిరిపుత్రుల సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తామని చెప్పారు. తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి ఫొటోతోపాటు తన ఫొటో కూడా పెట్టుకునేలా అందరికీ మంచి చేస్తానని జగన్ హామీ ఇచ్చారు. ఆయన ఇంకా ఏం చెప్పారంటే... ‘‘మన నియోజకవర్గంలో దాదాపు సంవత్సరం కాలంలోనే ఎంతోమంది చనిపోయారు. కాళ్ల వాపు వ్యాధితోపాటు మలేరియా జ్వరాలు, విష జ్వరాల బారిన పడి 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదేసమయంలో మరో 57 మంది తల్లీబిడ్డలు చనిపోయారు. రక్త హీనత(ఎనీమియా)తో అడవి బిడ్డలు పిట్టల్లా రాలిపోతున్నారు. నేను సంవత్సర కాలంలోనే మూడోసారి ఈ ప్రాంతానికి వచ్చాను. ప్రతిపక్ష నేత ఏజెన్సీ కి వస్తున్నాడని తెలియగానే ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, అధికారులు గిరిజనుల సమస్యలపై మాట్లాడుతుంటారు. జగన్ తిరిగి వెళ్లిపోయిన తర్వాత ఇక్కడ ఏమైనా జరిగిందా? అని చూస్తే ఏమీ జరగదు. మళ్లీ ఏదైనా ఘటన జరిగితే జగన్ వస్తాడేమో అన్న భయంతో ఏదేదో మాట్లాడుతారు. ఏదేదో చేస్తామని చెబుతారు. బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు చాపరాయిలో మే 29 నుంచి జూన్ 25వ తేదీ వరకు 17 మంది చనిపోయారు. దాదాపు 35 మంది అనారోగ్యం పాలై చికిత్స కోసం ఆసుపత్రుల్లో చేరారు. ఇంత ఘోరం జరుగుతుంటే ప్రభుత్వ పెద్దలు, మంత్రులు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు. అనారోగ్యం పాలైన గిరిజనులు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే చికిత్స పొందుతున్నా మంత్రులకు తెలియకపోవడం విడ్డూరంగా ఉంది. బాధిత గిరిజనులకు వైద్య సేవలందించాల్సిన ఏఎన్ఎంలను ఇష్టానుసారంగా బదిలీ చేస్తున్నారు. గ్రామాల్లో 108, 104 అంబులెన్స్లు ఎక్కడా కనిపించడం లేదు. ఏజెన్సీలో 11 మండలాలు ఉండే కేవలం 7 అంబులెన్స్లు మాత్రమే ఉండడం దారుణం. అవైనా సక్రమంగా పనిచేస్తున్నాయా? అంటే అదీ లేదు. రోడ్డు లేదు.. నీరు లేదు చాపరాయి గ్రామానికి రోడ్డు లేదు. తాగడానికి మంచినీరు లేదు. ఒక్కటి కూడా పక్కా ఇల్లు లేదు. చేయడానికి కూలీ పని లేదు. ఉపాధి హామీ పని లేదు. రేషన్ సరుకుల కోసం 14 కిలోమీటర్లు నడవాలి. తెచ్చుకోవడానికి డబ్బు లేదు. విద్యుత్ సౌకర్యం లేదు. అంబులెన్స్ రాదు. ఆస్పత్రికి వెళ్లాలంటే 34 కిలోమీటర్లు నడవాలి. కొత్త పింఛన్లు, రేషన్ కార్డులు వచ్చాయని గ్రామసభలో ప్రకటించి ఇవ్వడం లేదు. ఐటీడీఏ చేయాల్సిన పనులను కూడా ఓ పద్ధతి ప్రకారం నీరుగార్చేస్తున్నారు. చనిపోయినవారికి రూ.5 లక్షలు ఇస్తామని చెప్పారు. మంత్రులు వచ్చినప్పుడు అడుగుతారని నోర్లు మూయిస్తున్నారు. గ్రామంలో ఆర్వో ప్లాంట్ పెడితే ఈ మరణాలు సంభవించవు. ఇలా చేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి రాదు. గిరిజనులకు మంచి చేయాలన్న తపన కూడా లేదు. ఈ గ్రామంలో 350 మంది ఉంటే పాఠశాలను ఎత్తివేశారు. పౌష్టికాహారం లేక చిన్నపిల్లల్లో రక్తహీనత ఏజెన్సీలో రోడ్లు లేక, బస్సులు రాక గిరిజనులు కిలోమీటర్ల కొద్దీ నడిచి వెళ్లి బియ్యం తెచ్చుకోవాల్సి వస్తోంది. రేషన్ దుకాణాల్లో ఇచ్చేదే చాలీచాలని బియ్యం. ఆ దుకాణాల్లో సబ్బులు కొనుక్కుంటేనే బియ్యం ఇస్తారట! ఇదెక్కడి న్యాయం? గిరిజన సహకార సంఘాల్లో పనిచేసే వారికి కూడా జీతాలు ఇవ్వడం లేదు. పౌష్టికాహారం లేక చిన్నపిల్లల్లో రక్తహీనత పెరిగిపోతోంది. రంపచోడవరం ఆసుపత్రిలో పిల్లలకు రక్తాన్ని ఎక్కిస్తున్నారు. వారి శరీరంలో ఉంటున్న రక్తం కేవలం 4 శాతమే. జీతాలు ఇవ్వకపోతే ఎవరు పనిచేస్తారు? రోగులు ఆసుపత్రులకు వెళితే అక్కడ వైద్యులు ఉండడం లేదు. ఆసుపత్రుల్లో వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ వాటిని భర్తీ చేసేందుకు ప్రభుత్వం మూడేళ్లుగా ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. ఏజెన్సీ ప్రాంతంలో పని చేయడానికి డాక్టర్లు ఇష్టపడడం లేదని మంత్రులు చెబుతున్నారు. డాక్టర్లు ఇక్కడికి రావడానికి సిద్ధంగానే ఉన్నారు. ప్రభుత్వమే నోటిఫికేషన్లు ఇచ్చి, పరీక్షలు పెట్టి, వైద్యులను ఎంపిక చేయడానికి సిద్ధంగా లేదు. కాంట్రాక్టు పద్ధతిలో డాక్టర్లను తీసుకొస్తున్నారు. వారికి మూడు నెలలకోసారి, నాలుగు నెలలకోసారి ఒక నెల జీతం ఇస్తున్నారు. కాంట్రాక్ట్ నర్సులకు కూడా సక్రమంగా జీతాలు ఇవ్వడం లేదు. జీతాలు ఇవ్వకపోతే ఎవరు పనిచేస్తారు? బాధితులకు తోడుగా ఎవరు నిలుస్తారు? ఇలాంటి విషమ పరిస్థితుల్లో రోగులు ఎలా బతుకుతారో ప్రభుత్వమే చెప్పాలి. గిరిజన సలహా మండలిని పక్కనపెట్టారు గిరిజన ప్రాంతాల్లో నీళ్లుండవు, రోడ్లు ఉండవు, పట్టించుకునే నాథుడే ఉండడు. ఐటీడీఏ నిధుల వినియోగాన్ని గిరిజన సలహా మండలి పర్యవేక్షించాల్సింది ఉంటుంది. గిరిజన సలహా మండలి అనేది చట్టప్రకారం వచ్చిన హక్కు. గిరిజన ప్రాంతాల నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలు ఈ మండలిలో సభ్యులుగా ఉంటారు. రాష్ట్రంలో గిరిజన ప్రాంతాల నుంచి గెలిచినవారంతా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అనే కారణంతో ముఖ్యమంత్రి చంద్రబాబు మూడేళ్లుగా గిరిజన సలహా మండలిని నియమించడం లేదు. ఫలితంగా ఐటీడీఎ నిధులను ఎలా ఖర్చు చేస్తున్నారు అని అడిగే నాథుడు లేకుండా పోయాడు. ప్రభుత్వం గిరిజన సలహా మండలిని నియమించి ఉంటే గిరిపత్రులకు ఎంతో మేలు జరిగేది. గిరిజనులకు ప్రయోజనం చేకూర్చాలన్న ఆలోచన ముఖ్యమంత్రి చంద్రబాబులో ఏ కోశానా లేదు. చంద్రబాబుకు పేదవాడు అంటే కోపం. ఆయన హయాంలో ఏ ఒక్క పేదవాడీకి మేలు జరగలేదు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే పేదలు బాగుపడ్డారు. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ కింద కేవలం రూ.35 వేలు మాత్రమే ఇస్తోంది. మిగిలిన రూ.65 వేల పరిస్థితి ఏమిటి? అని అడిగితే.. ఇళ్లు, ఆస్తులు అమ్ముకోండి అని చెబుతోంది. ప్రభుత్వ నిర్వాకం వల్ల పేద విద్యార్థులు అర్ధాంతరంగా చదువులు మానేయాల్సిన దుస్థితి దాపురించింది’’ అని జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. -
తాగునీటి కాలుష్యం వల్లే చాపరాయి మరణాలు
జేసీ ఎ.మల్లికార్జున రంపచోడవరం: తాగునీరు కలుషితం కావడం వల్లే చాపరాయి గ్రామంలో 16 మంది మృతి చెందినట్టు పరిశోధనలో తేలినట్టు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎ.మల్లికార్జున తెలిపారు. రంపచోడవరం ఐటీడీఏ సమావేశ మందిరంలో పీఓ దినేష్కుమార్తో కలిసి గురువారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాపరాయి గ్రామంలోని వాగులో ఆవు చనిపోయిందని, దాంతో ఆనీరు కలుషితం అయ్యిందన్నారు. ఆనీటిని తాగడం వల్లే 16 మంది అనారోగ్యం పాలై మరణించారని తెలిపారు. గిరిజన కుటుంబాల్లో ఆహారపు అలవాట్లు, తాగునీటి వినియోగంపై చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇప్పటి వరకు ఆ గ్రామంలో 275 వాటర్ ఫిల్టర్లను అందజేశామన్నారు. మరో 275 ఫిల్టర్లను త్వరలో అందిచేందుకు చర్యలు చేపట్టామన్నారు. రెండు ఐటీడీఏల పరిధిలో ‘చంద్రన్న సంచార వైద్యసేవ’లను మరింత పటిష్టం చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఏజెన్సీలో సమాచార వ్యవస్థ అందుబాటులో లేని మారుమూల గ్రామాల్లో ఈశాట్, శాటిలైట్ వ్యవస్థలను అందుబాటులోకి తీసుకువచ్చి స్థానిక గిరిజన యువకుల ద్వారా సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకునేలా కలెక్టర్ కార్యాచరణ రూపొందిస్తున్నారని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఏజెన్సీలో నెలకొన్న పరిస్థితుల దృష్టా ్య అధికారులెవరూ సెలవులు పెట్టవద్దన్నారు. డివిజనల్ పంచాయతీ అధికారులు, స్పెషల్ టాస్క్ఫోర్స్ టీములను నియమించి పారిశుద్ధ ్య కార్యక్రమాలు క్రమం తప్పకుండా జరిగేలా చూస్తామన్నారు. అన్ని ఆశ్రమ పాఠశాలల్లో దోమల నిర్మూలకు కిటికీలకు దోమల మెష్లు ఏర్పాటు చేస్తామన్నారు. డీసీహెచ్ఎస్ జి.రమేష్కిషోర్, డీఎంహెచ్ఓ కె.చంద్రయ్య, ఈఈ పీకే నాగేశ్వరరావు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ రాజేశ్వరరావు, డీఎల్పీఓ రాజ్యలక్ష్మి,డీఎంఓ జోగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కలెక్టర్ ఆదేశాలు కూడా పనిచేయలేదు
మాజీ సైనికులు ఓటు హక్కు వినియోగించుకోవాలి
ఓటర్ స్లిప్పు లేదా.. టెన్షన్ వద్దు
ప్రభుత్వరంగ బ్యాంకులను కాపాడుకుందాం
ల్యాండ్ టైటిలింగ్ యాక్టుపై దుష్ప్రచారం
టీడీపీలో చేరిన నేతను నిలదీసిన గ్రామస్తులు
No Headline
మేమంతా జగనన్న బాటలోనే..
గుట్టుచప్పడు కాకుండా ‘గోకులం’ డ్రామా
గోదావరి వరదల సమయంలోను..
తప్పక చదవండి
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement