-
లక్షమంది సామూహిక గీతా పఠనం..ప్రధాని అభినందనలు!
కోల్కతాలోని పరేడ్ గ్రౌండ్లో ఈరోజు(ఆదివారం, డిసెంబరు 24) లక్ష మంది సామూహిక గీతా పఠనం చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని అఖిల భారతీయ సంస్కృత పరిషత్, మతిలాల్ భారత్ తీర్థ సేవా మిషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా పాల్గొంటారని తొలుత ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ప్రధాని ఈ కార్యక్రమంలో పాల్గొనడం లేదని సమాచారం. ఈ కార్యక్రమం నిర్వహించడంపై ప్రధాని ప్రత్యేక సందేశం ద్వారా ప్రశంసించారు. కోల్కతాలోని పరేడ్ గ్రౌండ్లో నిర్వహిస్తున్న ‘లోఖో కాంఠే గీతార్ పాఠ్’ కార్యక్రమం అభినందనీయమని ప్రధాని మోదీ తన సందేశంలో పేర్కొన్నారు. మన సాంస్కృతిక వారసత్వం సంప్రదాయాలు, జ్ఞానం, తత్వశాస్త్రం, ఆధ్యాత్మిక మేధస్సు, సాంస్కృతిక వైవిధ్యం, సామరస్య సమ్మేళనాల మేళవింపు ఈ కార్యక్రమం అని ప్రధాని మోదీ కొనియాడారు. శ్రీమద్ భగవత్ గీత మహాభారత కాలం మొదలుకొని నేటి కాలం వరకూ మనందరికీ స్ఫూర్తినిస్తోంది. అర్థవంతమైన జీవితాన్ని గడపడానికి గీత మనకు దిశానిర్దేశం చేస్తుందని, జీవితంలోని సవాళ్లను ఎదుర్కోవడాన్ని నేర్పుతుందని ప్రధాని మోదీ తన సందేశంలో పేర్కొన్నారు. కాగా కోల్కతాలో జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రపంచం నలుమూలల నుంచి 300 మందికి పైగా సాధువులు కోల్కతా చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారంతా ముందుగా ఆన్లైన్, ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. కార్యక్రమ నిర్వహణకు 20 బ్లాకులను రూపొందించినట్లు నిర్వాహకుల్లో ఒకరైన స్వామి నిర్గుణానంద్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని గిన్నిస్ రికార్డు అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, గవర్నర్ సీవీ ఆనంద్ బోస్, కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఎంపీలు, ఎమ్మెల్యేలకు నిర్వాహకులు ఆహ్వానాలు పంపారు. -
'జై బజరంగబలి' మా వెంటే ఉన్నాడు!: కాంగ్రెస్
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో సంబరాలు ప్రారంభమయ్యాయి. అనేకమంది కాంగ్రెస్ కార్యకర్తలు జై బజరంగబలి అంటూ హనుమంతుని వేషధారణలో కనిపించారు. బజరంగబలి బీజేపీ వెంట లేడని కాంగ్రెస్ వెంటే ఉన్నాడని సెటైర్లు వేశారు కాంగ్రెస్ కార్యకర్తలు. అంతేగాదు జై బజరంగబలి(హనుమంతుడు) బీజేపికి గట్టి జరిమానా విధించాడు అని హనుమంతుని వేషధారణలో ఉన్న కార్యకర్త అన్నారు. కులం లేదా మతం ఆధారంగా వర్గాల మధ్య ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్న బజరంగ దళ్ వంటి మితవాద సముహాలను నిషేధిస్తామని కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆసమయంలో అంశం పెను రాజకీయ వివాదాస్పద దుమారానికి దారితీసింది కూడా. దీంతో కాంగ్రెస్ ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ..తాము తమ వాగ్దానాన్ని నిలబెట్టుకునే తరుణం ఆసన్నమైందంటూ పార్టీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. రాజ్యంగం, చట్టం చాలా పవిత్రమైనవని, బజరంగ్దళ్, పీఎప్ఐ వంటి సంస్థలు మైనారిటీ వర్గాల మధ్య శత్రుత్వం, లేదా ద్వేషాన్ని ప్రోత్సహించే చర్యలకు పాల్పడుతున్నాయని ఆరోపణలు చేశారు. ఇదిలా ఉండగా, తన కర్ణాటకలోని ఎన్నికల మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ..బజరంగ్ దళ్ పేరుతో తరుచుగా హింస, అప్రమత్తత, నైతిక పోలీసింగ్ వంటి వాటితో ముడిపడి ఉందని, ఇది నిషేధిత ఇస్లామిక గ్రూప్ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ)తో సమానం అని కాంగ్రెస్ తన మ్యానిపెస్టోలో పేర్కొంది. ఐతే ఆ సమయంలో బీజేపీ నుంచి పెద్ద ఎత్తున నిరసనలు ప్రారంభమవ్వడంతో కాంగ్రెస్ వెనక్కి తగ్గింది. పైగా బీజేపీ కూడా దీన్నే ఎన్నికల్లో కీలక అంశంగా కాంగ్రెస్పై విమర్శులు ఎక్కుపెట్టింది. ప్రచార ర్యాలీల్లో సైతం కాంగ్రెస్ హనుమంతుణ్ణి అవమానించిందని అందువల్ల మీరంతా ఓటేసేటప్పుడూ జై బజరంబలీ అని ఓటు వేయాలని ప్రధానితో సహా బీజేపీ నేతలు ప్రజలకు పిలుపు నిచ్చారు కూడా. మన సంస్కృతిని దుర్వినియోగం చేసేవారిని మీ ఓట్లతో తగిన విధంగా బుద్ధి చెప్పి శిక్షించాలని కోరారు. కానీ నేడు కాంగ్రెస్ అదే బజరబలీ వేషదారణలో తమ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడమే గాక హనుమంతుడు మావైపే ఉన్నాడని కాంగ్రెస్ గట్టిగా నినదించి చెప్పడం గమనార్హం. (చదవండి: బలవంతులపై పేదల శక్తి గెలిచింది.. ఇకపై అన్ని రాష్ట్రాల్లో ఇవే ఫలితాలు రిపీట్ అవుతాయ్) -
ధారణ
అష్టాదశ పురాణాల పేర్లను చక్కగా గుర్తు పెట్టుకునేందుకు ఒక శ్లోకం ఉంది. ఆ శ్లోకం గుర్తుపెట్టుకుంటే చాలు, అన్ని పేర్లూ గుర్తొచ్చేస్తాయి. ‘మ’ద్వయం ‘భ’ద్వయం చైవ ‘బ్ర’ త్రయం ‘వ’ చతుష్టయం! ‘అ’‘నా’‘ప’‘లిం’‘గ‘‘కూ’‘స్కా’ని పురాణాని పృథక్ పృథక్ మ ద్వయం– మకారంతో వచ్చే రెండు పురాణాలు. మార్కండేయ పురాణం, మత్స్య పురాణం భద్వయం– భతో మొదలయే రెండు పురాణాలు– భాగవత, భవిష్యపురాణాలు. బ్రత్రయం– బ్రతో మూడు పురాణాలు... బ్రహ్మపురాణం, బ్రహ్మాండ పురాణం, బ్రహ్మవైవర్త పురాణాలు. వ చతుష్టయం– వ కారంతో వచ్చే నాలుగు పురాణాలు...వరాహ, విష్ణు, వామన, వాయు పురాణాలు అనాపలింగకూస్కాని అంటే ఒక్కొక్క అక్షరానికి ఒక్కో పురాణం. అ– అగ్నిపురాణం; నా– నారద పురాణం, ప– పద్మపురాణం, లిం– లింగపురాణం, గ– గరుడ పురాణం, కూ– కూర్మపురాణం, స్కా– స్కాంద పురాణం. -
ఒక నిమిషం – ఒక విశేషం
శ్లోకం... భావం ఉపకారిషుయస్సాధుః సాధుత్వే తన్యకోగుణః అపకారిషు యస్సాధుః సాధుః సద్భి రుచ్యతే తాత్పర్యం: ఉపకారం చేసిన వారిపట్ల మంచితనం చూపిస్తే ఆ మంచితనంలో గొప్పదనమేముంది? ఎవరైతే అపకారుల విషయంలో మంచితనం చూపిస్తారో, వారే అసలైన సాధువులుగా కీర్తిపొందుతారు. ఉదాహరణ: దుర్యోధనుడు మాయాజూదంలో ధర్మరాజును ఓడించి, ద్రౌపదిని అవమానించి, చివరికి వారిని అరణ్యాల పాలు చేశాడు. అక్కడ కూడా వారు సుఖంగా ఉంటారేమోనని, వివిధ రీతులలో అష్టకష్టాలకు గురి చేశాడు. చివరకు వారికి తన భోగభాగ్యాలు చూపించి, వారు కుళ్లుకునేలా చేయాలని ఘోషయాత్ర పేరుతో వారున్న చోటికి వచ్చి గంధర్వులు చేతిలో చిక్కాడు. ధర్మరాజు దుర్యోధనుడికి తగిన శాస్తి జరిగింది అని సంతోషించలేదు. తన తమ్ముళ్లైన భీముణ్ణీ, అర్జునుణ్ణీ పంపి, వారిని విడిపించాడు. క్షమాగుణానికి, ధర్మనిరతికి మారుపేరుగా నిలిచాడు. పూజామందిరం ఇలా... ఇంటిలో ఈశాన్యదిక్కుగా పూజామందిరం ఉండాలన్నది శాస్త్రోక్తి. అద్దె ఇంటిలో అలా కుదరకపోవచ్చు. అయితే వసతి ఉన్నంతలో కనీసం మన ఇష్టదైవపటం ఒక్కటైనా సరే, ఇంటిలో ఒక మూలన పరిశుభ్రమైన ప్రదేశంలో ఉంచాలి. దేవుణ్ణి మనకంటే తక్కువ ఎత్తులో ఉంచరాదు. అంటూ కిందికి చూస్తూ పూజ చేయరాదు. అలాగని మరీ పైన అంటే అందనంత ఎత్తులో కూడా ఉంచరాదు. పూజామందిరం లేదా పూజకు వాడే బల్ల మనకు అభిముఖంగా అంటే ఎదురుగా ఉండాలి. మన చూపు సరిగ్గా దేవుడి మీద ప్రసరించేలా దేవుడి ప్రతిమలు లేదా పటాలను అమర్చుకోవాలి. దేవుడి గూడు మీద అధిక బరువులు ఉంచరాదు. పడక గది గోడకు దేవుడి క్యాలెండర్ ఉంటే తప్పు లేదు కానీ, పడకగదిలోనే పూజ చేయడం, అక్కడే దీపారాధన చేయడం మంచిది కాదు. వసతి లేనప్పుడు అంటే ఒకే గదిలోనే నివసించవలసి వచ్చినప్పుడు ఒక చిన్న మందిరాన్ని ఏర్పాటు చేసుకుని, అందులోనే దేవుడిని ఉంచాలి. ధర్మసందేహం ద్రౌపది మహాపతివ్రత కదా, ఐదుగురు పుత్రులను కోల్పోయి, కడుపుకోత అనుభవించవలసి వచ్చిన దుస్థితి ఆమెకు ఎందుకు వచ్చింది? ద్రౌపది సాక్షాత్తూ పరమేశ్వరీ అంశలో అగ్నిగుండం నుంచి పుట్టిన అయోనిజ. అర్జునుణ్ణి పెళ్లాడటం కోసమే పుట్టి, మిగిలిన నలుగురినీ కుంతికోరిక మీద భర్తలుగా స్వీకరించిన ఉత్తమురాలు. అలాగే పాండవులైదుగురూ యమ– వాయ– ఇంద్ర– అశ్వినీ దేవతల అంశలలో పుట్టిన వారు. అమ్మవారి నామాలలో చిదగ్నికుండ సంభూతా... భవబంధ విమోచనీ అనే నామాలున్నాయి. అంటే ఈ లోకపు బంధాలనుంచి మనందరినీ విడిపించడం కోసం అగ్నికుండం నుంచి పుట్టినది అని అర్థం. మన బంధాలనే విడిపించే ఆమె తనకంటూ ఐదుగురు భర్తలనీ, ఐదుగురు పుత్రులనీ అనుబంధంగా ఉంచుకుంటుందా? అందుకే ఐదుగురు భర్తలకంటే ముందుగా తానే పడిపోయే వంక వెతుక్కుంది. అంతకుముందే ఐదుగురు పుత్రులని కోల్పోయే స్థితిని కలిగించుకుంది. ఇదంతా జగన్నాటకం కోసమే తప్ప యథార్థం కాదు. కొలనుభారతి ఆలయం సరస్వతీదేవికి ఆలయాలు ఎక్కడున్నాయని అడిగితే భాసర, వర్గల్... ఇంకా ఎక్కువ పేర్లు చెప్పాలంటే ఎంతటివారైనా కాస్తంత తడబడతారు. అయితే, కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలంలోని దట్టమైన అడవీ ప్రాంతంలో ఎల్తైన కొండల నడుమ, చారుఘోషిణీ నది ఒడ్డున అమ్మవారికి ఆలయం ఉంది. కొలనుభారతి అనే పేరుతో వెలసిన ఈ అమ్మవారికి 11వ శతాబ్దికి చెందిన మల్లభూపతి అనే చాళుక్యరాజు నిర్మించినట్లు శిలాశాసనాలను బట్టి తెలుస్తోంది. భారతీదేవి సన్నిధిలో విద్యాభ్యాసం ప్రారంభిస్తే, అత్యున్నత స్థాయికి చేరుకుంటారని భక్తుల విశ్వాసం. ఎలా వెళ్లాలంటే.. కొలనుభారతి క్షేత్రానికి వెళ్లాలంటే ముందు శ్రీశైలం లేదా కర్నూలుకు చేరుకోవాలి. ఆత్మకూరుకు చేరినా దగ్గరే. అక్కడినుంచి మండల కేంద్రమైన కొత్తపల్లివ మీదుగా సుమారు 15 కిలోమీటర్లు వెళ్తే శివపురం గ్రామం వస్తుంది. అక్కడినుంచి మరో 5 కిలోమీటర్లు మెటల్ రోడ్డుగుండా ప్రయాణించి కొలనుభారతి ఆలయాన్ని చేరుకోవచ్చు. వివాహ సంప్రదాయంలో... హిందూ వివాహ సంప్రదాయంలో ముఖ్యమైన ఘట్టాలు 35 ఉన్నాయి. అవి పెళ్లిచూపులు, నిశ్చితార్థం, స్నాతకం, కాశీయాత్ర, వరపూజ– ఎదురుకోలు, గౌరీపూజ, మంగళస్నానాలు, కన్యావరణం, మధుపర్కాలు, యజ్ఞోపవీతధారణ, మహాసంకల్పం, కాళ్లుకడగటం, సుముహూర్తం (జీలకర్ర, బెల్లాన్ని వధూవరులు ఒకరి శిరస్సు మీద మరొకరు ఉంచటం, కాళ్లు తొక్కించటం, కన్యాదానం, సువర్ణజలాభిమంత్రం, యోక్త్రబంధనం, మంగళసూత్రధారణం, తలంబ్రాలు, బ్రహ్మముడి, గౌరీశంకర సంవాదం (అంగుళీయకాలు తీయడం), సప్తపది పాణిగ్రహణం, హోమం, సన్నికల్లు తొక్కడం, లాజహోమం, స్థాళీపాకం, నాగవల్లి, సదస్యం, నల్లపూసలు కట్టడం, అరుంధతీ దర్శనం, ఉయ్యాలలోని బొమ్మను ఆడపడచుకు అప్పజెప్పడం, అంపకాలు, గృహప్రవేశం, సత్యనారాయణ స్వామి వ్రతం, కంకణ విమోచనం, గర్భాదానం... ఈ ముప్ఫై ఐదూ వివాహ సంప్రదాయంలో జరిగే తంతులు. ఏ దేవుడికి ఏ పూలంటే..? జాజి, జమ్మి, దర్భ, కొండమల్లెలు, మల్లెలు, గన్నేరు, నాగపుష్పాలు, పున్నాగ, అశోక, సంపెంగ, పొగడ, తామర, మారేడు అన్ని దేవుళ్ల పూజకూ ఉపయోగించవచ్చు. ∙స్త్రీ దేవతల పూజలో తులసి పత్రిని ఉపయోగించరాదు ∙ఎర్రమందారాలు మినహా మరే ఇతర ఎర్రనిపూలను పురుష దేవతల పూజకు వాడరాదు ∙విష్ణుమూర్తిని అక్షతలతోనూ, దుర్గను గరికతోనూ, గణపతిని తులసితోనూ, శివుణ్ణి మొగలిపూవులతోనూ పూజించరాదు ∙దేవతార్చనకు వాడే పూలను కడగటం, వాసన చూడటం అపరాధం. చిరగనివి, పురుగులు లేనివి, తాజాగా ఉన్నవి, తన తోటలో లేదా పెరటిలో పూసినవి, ద్రవ్యం ఇచ్చి కొనుగోలు చేసినవి, ఇంటి యజమాని అనుమతితో కోసిన చెట్టు పూలను మాత్రమే పూజకు ఉపయోగించడం శ్రేష్ఠం. విష్ణువును మాలతి, జాజి, మొగలి, మల్లె, అశోకం, సంపెంగ, పున్నాగ, పొగడ, కలువ, మల్లె, గన్నేరు, ఉత్తరేణి, గుంటగలగర, చండ్ర, జమ్మి, గరిక, దర్భ పూలతో పూజిస్తే మిక్కిలి ప్రసన్నుడవుతాడు. అదేవిధంగా మరువం, దమనం, తులసి పత్రాలతో పూజించడం ప్రశస్తం. మామిడిపూల గుత్తులతో పూజించడం మహా ప్రీతికరం. సుభాషితం ∙ప్రజలందరూ ఇష్టపడే చక్కని శీలం కలవారికి నిప్పు నీరులాగా, సముద్రం పిల్లకాలువలాగా, మేరు పర్వతం చిన్న గులకరాయిలాగా, సింహం జింకపిల్లలాగా, విషసర్పం పూలమాల మాదిరిగా, విషం అమృతం లాగా అవుతాయి. ∙శ్వర్యానికి సౌజన్యమే అలంకారం. శౌర్యానికి మితభాషిత్వమూ, జ్ఞానానికి శాంతి, శాస్త్రజ్ఞతకు వినయమూ, ధనానికి పాత్రదానమూ, తపస్సుకు శాంతం, ప్రభువుకు సహనం, ధర్మానికి అపకీర్తి, ఆశ్రిత పక్షపాతం లేకుండటం అలంకారాలు. మీకు తెలుసా? పరుగెత్తే వారికి, ఆవులించేవారికి, తలస్నానం చేస్తున్న వారికి, భగవంతుని సన్నిధిలో ఉన్నవారికి నమస్కరించకూడదు. ఉదయించే, అస్తమించే సూర్యుడిని నీళ్లలోనూ, అద్దంలోనూ చూడరాదు. పుస్తకం: కుండలినీ వికాసం... వివరణ మనం తరచు కుండలినీ శక్తి, కుండలినీ సాధన అని వింటూ ఉంటాం. చాలా పుస్తకాలలో, నవలలలో కుండలిని గురించి ప్రస్తావిస్తారు కానీ, అదేమిటో, ఆ శక్తిని ఎలా జాగృతం చేయాలో ఒక్కరూ స్పష్టంగా వివరించరు! ఆ లోటును తీర్చడానికా అన్నట్లు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త స్వామి మైత్రేయ ‘కుండలినీ వికాసం’ పేరుతో పుస్తకాన్ని అందించారు. ఇందులో కుండలిని అంటే ఏమిటి, ఆ శక్తి ప్రాశస్త్యం, శక్తి కేంద్రకాలు, ఏం చేస్తే ఆ కేంద్రకాలు చైతన్యవంతమవుతాయో కూడా చెప్పారు. అలాగే శ్రీ చక్రం గురించి కూడా సాకల్యంగా వివరించారు. మనిషి ద్వైతభావాన్ని విడనాడి, అద్వైతభావాన్ని చేరుకోవడానికి ఏం చేయాలో తంత్ర, యంత్ర, ముద్ర, క్రియాయోగ ప్రక్రియలతో సహా సులభశైలిలో సచిత్రంగా వివరించారు. కుండలినీ వికాసం వెల: రూ.300; ప్రతులకు: 040 2315 6070; 99635 21696 www.swamimaitreya.org మంత్రం అర్థం..? ‘మననాత్ త్రాయతే ఇతి మంత్రః’ అని.. దేనిని మననం చేస్తే రక్షణ చేయగలదో దానిని మంత్రం అంటారు. మననం చేస్తే రక్షించగలిగే శక్తి దేనికి ఉంటుందో, దానికే మంత్రం అని పేరు. బీజాక్షరాలతో కూడుకుని ఉండటం వల్ల మంత్రానికి ఆ శక్తి ఉంటుంది. అయితే ఆ రక్షణశక్తి అంతర్లీనంగా ఉంటుంది. ఒక్కొక్క మంత్రంలో ఒక్కో బీజాక్షరం ఉండచ్చు. ఒక్కొక్క బీజాక్షరానికి ఒక్కొక్క రుషి ఉంటారు. ఆ బీజాక్షరానికి ఒక దైవం ఉంటాడు. ఆ బీజాక్షరాన్ని మననం చేసినప్పుడు అది లో లోపలే విస్ఫోటనం అయి, రుషి అనుగ్రహం చేత, దేవత అనుగ్రహం చేత, దానిని ఎవరు మననం చేశారో వారిని రక్షించేటటువంటి శక్తిని లోపల ప్రసారం చేస్తుంది. అటువంటి మంత్రాన్ని ఎవరైనా ఒక గురువు వద్ద ఉపదేశం తీసుకోవాలి. -
''భారత్ మాతాకీ జై' బలవంతంగా అనిపించొద్దు'
న్యూఢిల్లీ: 'భారత మాతా కి జై' అనే నినాద వివాదంలో కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ న్యాయశాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ కూడా తలదూర్చారు. ఆ నినాదం ఇవ్వడమనేది వారి వ్యక్తిగత విషయం అని, ఏ ఒక్కరూ ఆ నినాదం చేయాలని బలవంతపెట్టకూడదని అన్నారు. 'మన జాతీయ జెండా ఎగురుతున్నప్పుడు దాన్ని చూస్తూ జాతీయ గీతం ఆలపిస్తుంటే.. వందేమాతరం పాడుతుంటే గర్వంగా అనిపిస్తుంటుంది. కానీ కొంతమంది అలా చేయబోమని అంటారు. అది వారి ఇష్టం' అని విశ్వవిద్యాలయాల్లో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అనే అంశంపై ప్రసంగిస్తూ అన్నారు. తన మెడపై కత్తి పెట్టి బెదిరించినా సరే తాను మాత్రం భారత్ మాతాకి జై అనే మాటలు అనబోనని ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ అన్న విషయం తెలిసిందే. ఆ తర్వాతే ఖుర్షీద్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
కాంగ్రెస్ మేనిఫెస్టో వెనుక విదేశీ హస్తం: కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- కొత్త ఇంట్లోకి 'జబర్దస్త్' కమెడియన్.. వీడియో వైరల్
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
- స్టార్ హీరోయిన్ నుంచి కాంట్రవర్సీల వరకు.. సమంత గురించి ఇవి తెలుసా?
- అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
- Road Accident: నక్కపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
- Weekly Horoscope: ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే అన్న విధంగా ఉంటుంది
- Today Telugu Horoscope: ఈ రాశి వారు శుభకార్యాలలో పాల్గొంటారు
- శక్తులన్నీ ఏకమయ్యాయి
- ఆ పేరే... ఒక నమ్మకం!
Advertisement