-
'ఇంటర్మీడియట్' పాసైన టీమిండియా స్టార్ ఓపెనర్
భారత మహిళల జట్టు స్టార్ ఓపెనర్ షఫాలీ వర్మ ఇంటర్మీడియట్లో ఉత్తీర్ణత సాధించింది. సీబీఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్ను క్లియర్ చేసిన షఫాలీ వర్మ.. తన మార్క్ షీట్ను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. "ఈ ఏడాది మరోసారి 80 ప్లస్ స్కోర్ సాధించాను. కానీ ఈ సారి మ్యాచ్లో కాదు, 12వ తరగతి బోర్డ్ ఎగ్జామ్స్లో. మంచి మార్కులతో పాసైనందుకు చాలా సంతోషంగా ఉంది" అని షఫాలీ తన పోస్ట్కు క్యాప్షన్గా ఇచ్చింది. కాగా కేవలం 15ఏళ్ల వయస్సులోనే షఫాలీ వర్మ భారత తరుపున అంతర్జాతీయ అరంగేట్రం చేసింది. 2019లో దక్షిణాఫ్రికాపై ఆమె తన తొలి మ్యాచ్ ఆడింది. ఇప్పటివరకు టీమిండియా తరపున 79 మ్యాచ్లు ఆడిన 2106 పరుగులు చేసింది. అదే విధంగా తొట్టతొలి మహిళల అండర్-19 ప్రపంచకప్ను సొంతం చేసుకున్న మొదటి కెప్టెన్గా షఫాలీ చరిత్ర సృష్టించింది. ఈ ఏడాది ఆరంభంలో దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన అండర్-19 ప్రపంచకప్ను షఫాలీ నేతృత్వంలో భారత జట్టు కైవసం చేసుకుంది. మరోవైపు మహిళల ప్రీమియర్ లీగ్లో ఢిల్లీ క్యాపిటల్స్కు ప్రాతినిధ్యం వహించిన షఫాలీ వర్మ.. తన జట్టు ఫైనల్కు చేరడంలో కీలక పాత్ర పోషించింది. చదవండి: IPL 2023: నికోలస్ పూరన్ అరుదైన ఘనత.. ఐపీఎల్ చరిత్రలోనే రెండో ఆటగాడిగా View this post on Instagram A post shared by Shafali Verma (@shafalisverma17) -
మన పిల్లలు గ్లోబల్ స్టూడెంట్స్
సాక్షి, అమరావతి: విద్యా పరంగా ప్రపంచంతో పోటీ పడేలా మన పిల్లలను తీర్చిదిద్దాలనే సీఎం వైఎస్ జగన్ లక్ష్యం, చిత్తశుద్ధి, ఆశయంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ప్రభుత్వ స్కూళ్లలో 8వ తరగతి చదివే పిల్లలు సీబీఎస్ఈ బోర్డు (పదో తరగతి) పరీక్షలు సమర్థవంతంగా రాసేలా ఇప్పటి నుంచే తీర్చిదిద్దుతోంది. టెక్నాలజీ ఆధారిత నాణ్యమైన విద్య అందించేంబదుకు అవసరమైన చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా ప్రభుత్వ స్కూళ్లలో 8వ తరగతి చదివే 4.72 లక్షల మంది పిల్లలకు రూ.606.18 కోట్ల వ్యయంతో, 8వ తరగతి పాఠాలు చెప్పే 50,194 మంది టీచర్లకు రూ.64.46 కోట్లతో ప్రముఖ కంపెనీ శ్యామ్సంగ్ ట్యాబ్లను ఉచితంగా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రధానంగా అతి పెద్ద ఎడ్యుకేషనల్ టెక్ కంపెనీ బైజూస్తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కంపెనీ ఉచితంగా కంటెంట్ను ఇవ్వనుంది. రివర్స్ టెండరింగ్తో మార్కెట్ ధర కంటే తక్కువ ► జగనన్న విద్యా కానుకలో భాగంగా ఈ ఏడాది నవంబర్ 15 తర్వాత 8వ తరగతి విద్యార్థులు, టీచర్లకు ట్యాబ్లు పంపిణీ చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. శ్యామ్సంగ్ ట్యాబ్లను అత్యంత పారదర్శకంగా, రివర్స్ టెండరింగ్ ద్వారా బయట మార్కెట్ కన్నా తక్కువ ధరకు కొనుగోలు చేస్తోంది. ► మెమొరీ కార్డుతో సహా మూడేళ్ల వారంటీ వంటి ఫీచర్స్ అన్నీ కలిపితే బయట మార్కెట్లో శ్యామ్సంగ్ ఒక్కో ట్యాబ్ ఖరీదు రూ.16,446 చొప్పున.. 5.22 లక్షల ట్యాబ్లకు రూ.858.48 కోట్ల వ్యయం అవుతుంది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ ద్వారా పారదర్శకంగా వ్యవహరించడంతో ఒక్కో ట్యాబ్ను రూ.12,843 చొప్పున 5.22 లక్షల ట్యాబ్లను రూ.670.64 కోట్లతో కొనుగోలు చేస్తోంది. ఈ లెక్కన రూ.187.84 కోట్లు ఆదా చేసింది. ► 5.22 లక్షల మంది 8వ తరగతి పిల్లలు, టీచర్లకు రూ.1,923.20 కోట్ల విలువైన బైజూస్ కంటెంట్ను, శ్యామ్సంగ్ ట్యాబ్లను ప్రభుత్వం ఉచితంగా ఇస్తోంది. ఒక్కో విద్యార్థికి, టీచర్కు రూ.24 వేల విలువైన బైజూస్ కంటెంట్, రూ.12,843 ట్యాబ్ కలిపి మొత్తం రూ.36,843 విలువైన మెటీరియల్ను ఉచితంగా అందిస్తోంది. ట్యాబ్ల ప్రత్యేకతలు ఇవీ.. ► ట్యాబ్లు, బ్యాటరీకి మూడేళ్ల వారంటీ (సాధారణంగా ఏడాది మాత్రమే) ఉంటుంది. ► మొబైల్ డివైజ్ మేనేజ్మెంట్ (ఎండీఎం), ఓటీజీ కేబుల్, ఫ్లిప్ కవర్తో 8.7 అంగుళాలు ఉంటుంది. ► పిల్లలు చూడకూడని సైట్లు బ్లాక్ చేసే సాఫ్ట్వేర్ను ట్యాబ్లలో లోడ్ చేసి ఇస్తారు. తద్వారా పిల్లలు అవాంఛనీయ సైట్ల జోలికి వెళ్లే అవకాశం ఏ కోశానా ఉండదు. ► కంటెంట్ డేటా కార్డుతో పాటు 64 జీబీ మెమొరీ కార్డు. ► ఏటా పదవ తరగతి వరకు విద్యార్థులకు ఇదే ట్యాబ్లో బైజూస్ కంటెంట్ అప్లోడ్ చేసి ఇస్తారు. ► ప్రతి ఏటా ప్రభుత్వ స్కూళ్లలో 8వ తరగతి చదివే విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్, బైజూస్ కంటెంట్ ఇస్తారు. ► ఏదైనా రిపేరు వస్తే గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇస్తే.. వారంలోగా సరిచేసి లేదా రీప్లేస్ చేసి ఇచ్చేలా ఒప్పందం చేసుకుంది. ఇందుకోసం ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నారు. బ్యాటరీ పాడైపోయినా రీప్లేస్ చేయనున్నారు. ► విజువల్ గ్రాఫిక్స్తో కూడిన కంటెంట్ను ట్యాబ్లో అప్లోడ్ చేయడంతో పిల్లలు సులభంగా అర్థం చేసుకోనున్నారు. బైజూస్తో ఒప్పందంలో ముఖ్యాంశాలు ► ప్రభుత్వ స్కూళ్లలో 4 నుంచి 10వ తరగతి వరకు దాదాపు 32 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. బైజూస్తో ఒప్పందంతో వీరందరికీ లెర్నింగ్ యాప్ ద్వారా నాణ్యమైన విద్య అందుతుంది. ► 2025 నాటికి పదో తరగతి విద్యార్థులు, అంటే ఇప్పటి 8వ తరగతి విద్యార్థులు సీబీఎస్ఈ నమూనాలో పరీక్షలు రాసేందుకు వీలుగా వారిని సన్నద్ధం చేసేందుకు ఈ యాప్తోపాటు అదనంగా ఇంగ్లిష్ లెర్నింగ్ యాప్ కూడా ఉచితంగా అందుబాటులోకి వస్తోంది. ► బైజూస్ లెర్నింగ్ యాప్లో బోధన అత్యంత నాణ్యతగా ఉంటుంది. యానిమేషన్, బొమ్మలు, గ్రాఫ్స్ ద్వారా విద్యార్థులు మరింత సులభంగా, క్షుణ్ణంగా, సమగ్రంగా అర్థం చేసుకోవడానికి వీలుంటుంది. ► మ్యాథ్స్, సైన్స్, సోషల్ స్టడీస్ ఈ సబ్జెక్టులన్నీ ఇటు ఇంగ్లిష్, అటు తెలుగు మాధ్యమంలోనూ అందుబాటులో ఉంటాయి. తద్వారా భాషా పరమైన ఆటంకాలు లేకుండా పిల్లలు సులభంగా నేర్చుకునేందుకు ఉపయోగ పడుతుంది. ► వినూత్న, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించడంతో వీడియో పాఠ్యాంశాలు అత్యంత స్పష్టత, నాణ్యతతో ఉంటాయి. ► విద్యార్థులు ఎంత వరకు నేర్చకున్నారన్న దానిపై ప్రతి ఒక్కరికీ ఫీడ్ బ్యాక్ పంపుతారు. ► సీబీఎస్ఈ సిలబస్ ఆధారంగా మ్యాపింగ్ చేస్తూ యాప్లో పాఠ్యాంశాలకు రూపకల్పన చేశారు. సీబీఎస్ఈ పాఠ్య ప్రణాళికను అనుసరించి ప్రతి సబ్జెక్టులో.. ప్రతి అధ్యాయంలోనూ వివిధ అంశాలపై ప్రశ్నావళి ఉంటుంది. ► 4 నుంచి 10వ తరగతి విద్యార్థులకు గణితం, సామాన్య శాస్త్రం సులభంగా అర్థం చేసుకునేందుకు వీలుగా ఇంటరాక్టివ్ గేమ్స్ కూడా యాప్లో ఉంటాయి. ► పునశ్చరణ చేసుకునేలా, నేర్చుకున్న విషయ పరిజ్ఞానాన్ని అంచనా వేసేందుకు, అభ్యసనం కోసం వెనువెంటనే ప్రశ్నలు, వీడియోలు, గేమ్స్, అనుకరణ.. అన్నీ యాప్లో పొందుపరిచారు. ► 6 నుంచి 8వ తరగతి వరకు మ్యాథ్స్లో ఆటో సాల్వర్ స్కాన్ క్వశ్చన్స్ (లైవ్ చాట్ పద్ధతిలో నేరుగా), స్టెప్ బై స్టెప్ సొల్యూషన్స్ ఈ యాప్ ద్వారా లభిస్తాయి. ► తరచూ సాధన చేయడానికి వీలుగా మాదిరి ప్రశ్నపత్రాలు అందుబాటులోకి వస్తాయి. ► విద్యార్థి నేర్చుకున్న అంశాలపై నెలవారీగా ప్రోగ్రెస్ రిపోర్టులు ఇస్తారు. ఆన్లైన్లో ఉపాధ్యాయుడితో మీటింగ్ కూడా ఉంటుంది. -
సర్కారు బడుల్లో.. సీబీఎస్ఈ పాఠాలు
కడప ఎడ్యుకేషన్: సర్కారు బడుల్లో చదివే విద్యార్థులు జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో రాణించాలన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. ఇందుకోసం ప్రభుత్వం విద్యా సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. నాడు– నేడు పనులతో ఇప్పటికే ఊరి బడిని ఆధునిక హంగులతో ఆహ్లాదకరంగా తీర్చిదిద్దింది. తాజాగా రానున్న విద్యా సంవత్సరం నుంచి సీబీఎస్ఈ (సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) సిలబస్ బోధించేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తోంది. అందుకు అనుగుణంగా వైఎస్సార్ జిల్లాలో సౌకర్యాలు ఉన్న 35 పాఠశాలల జాబితాను ఉన్నతాధికారులకు పంపారు. అక్కడి నుంచి అనుమతులు రాగానే బోధన ప్రారంభించనున్నారు. అందుబాటులోకి ఖరీదైన విద్య ప్రభుత్వ నిర్ణయంతో పేద విద్యార్థులకు ఖరీదైన విద్య అందుబాటులోకి రానుంది. సీబీఎస్ఈ సిలబస్తో పదో తరగతి, ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులు జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచే అవకాశాలు మెండుగా ఉంటాయి. మెడిసిన్, ఇంజినీరింగ్, మేనేజ్మెంట్ వంటి కోర్సుల్లో మెరుగైన ర్యాంకులు సాధించేందుకు అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను దక్కించుకోవడం సులభం అవుతుంది. 35 పాఠశాలల్లో అమలు సీపీఎస్ఈ విధానం ఇప్పటి వరకు జిల్లా కేంద్రంలోని కొన్ని ప్రైవేటు విద్యా సంస్థల్లో మాత్రమే అందుబాటులో ఉంది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో 2022–23 విద్యా సంవత్సరం నుంచి జిల్లాలో 35 ప్రభుత్వ పాఠశాలలు సీబీఎస్ఈ సిలబస్కు మారనున్నాయి. ఇందులో కడప డివిజన్లో 17, ప్రొద్దుటూరు డివిజన్లో 8, రాయచోటి డివిజన్లో 10 హైస్కూళ్లలో సీబీఎస్ఈ సిలబస్ బోధించనున్నారు. ఇందులో ఆరో తరగతిలో చేరితే ఇంటర్ విద్య వరకు ఇక్కడే పూర్తి చేసే వెసులుబాటు ఉంటుంది. అత్యాధునిక పద్ధతిలో బోధన సీబీఎస్ఈ సిలబస్ అమలులో ఉన్న పాఠశాలల్లో బోధన అత్యాధునికంగా ఉంటుంది. విద్యాలయాల పర్యవేక్షణ సీబీఎస్ఈ బోర్డు పరిధిలో ఉంటుంది. ఆధునిక ల్యాబ్లు, లైబ్రరీ అందుబాటులోకి రానున్నాయి. డిజిటల్ బోధన కొనసాగుతుంది. ఆరో తరగతి నుంచే విద్యార్థులకు జేఈఈ, నీట్ లాంటి జాతీయస్థాయి పోటీ పరీక్షలకు సిద్ధం చేస్తారు. విద్యార్థి అభ్యసనా సామర్థ్యాలు పెంచేలా సిలబస్ ఉంటుంది. ప్రతి తరగతికి నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉండటం ప్రత్యేకత. మంచి నిర్ణయం ప్రస్తుత పోటీ ప్రపంచంలో రాణించాలంటే విద్యార్థులకు సీబీఎస్ఈ సిలబస్ అవసరం. ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. పేద కుటుంబాలకు చెందిన పిల్లలకు ఉన్నతస్థాయి విద్య అందే అవకాశం ఉంటుంది. – మడితాటి నరసింహారెడ్డి, ప్రధానోపాధ్యాయుడు, సంబేపల్లి హైస్కూల్ పేద విద్యార్థులకు వరం సీబీఎస్ఈ సిలబస్తో బోధన పేద విద్యార్థులకు వరం. ఇప్పటి వరకు ప్రైవేటు విద్యాసంస్థల్లో మాత్రమే ఉన్న సీబీఎస్ఈ సిలబస్ రాష్ట్ర ప్రభుత్వం చొరవతో మారుమూల పల్లెకు కూడా చేరనుంది. – నారాయణ, ఎంఈవో, కడప ఉన్నతాధికారులకు నివేదిక పంపాం సీబీఎస్ఈ సిలబస్ బోధనకు అనుగుణంగా ఉన్న 35 స్కూళ్ల వివరాలను విద్యాశాఖ అధికారులకు పంపాం. అక్కడి నుంచి అనుమతులు వస్తే వచ్చే ఏడాది నుంచి ఆ పాఠశాలల్లో సీబీఎస్ఈ సిలబస్ను బోధిస్తాం. – శైలజ, డీఈవో, కడప -
ఎన్నారైలకు సీబీఎస్ఈ శుభవార్త! స్కూల్ అడ్మిషన్లపై కీలక ప్రకటన
విదేశాల్లో ఉన్న నాన్ రెసిడెంట్ ఇండియన్లకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) శుభవార్త తెలిపింది. ఎన్నారై పిల్లల చదువుకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. ఇక్కడ చదివించాలంటే గత కొన్నేళ్లుగా విదేశాలకు వెళ్తున్న ఇండియన్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. విదేశాల్లో విద్యా చాలా ఖర్చుతో కూడుకున్నది కావడంతో కొందరు తమ పిల్లలను ఇండియాలో చదివించేందుకు మొగ్గు చూపుతుంటారు. మరికొందరు ఇక్కడి సంస్కృతి సంప్రదాయాలు మిస్ అవకూడదని తమ సంతానానికి ఇండియాలో ఎడ్యుకేషన్ అందించాలని నిర్ణయించుకుంటారు. ఇలాంటి వారంతా తమ పిల్లలను ఇండియాలో సీబీఎస్ఈ బోర్డుకు అనుబంధంగా ఉన్న స్కూళ్లలో చేర్పిస్తుంటారు. ఇలాంటి ఎన్నారై విద్యార్థుల అడ్మిషన్లకు సంబంధించి సీబీఎస్ఈ కొన్ని మార్గదర్శకాలు అమలు చేస్తోంది. గతంలో సీబీఎస్ఈ నిబంధనల ప్రకారం ఇక్కడి స్కూళ్లలో అడ్మిషన్ పొందాలంటే విదేశాల్లో సీబీఎస్సీకి సరిసమానమైన సిలబస్ అందిస్తున్న ఎడ్యుకేషన్ బోర్డులకు అనుబంధంగా ఉన్న స్కూల్లో విద్యార్థులు చదువుతూ ఉండాలి. ఇందుకు సంబంధించిన పత్రాలను సీబీఎస్ఈకి సమర్పించాలి. వాటిని పరిశీలించి సీబీఎస్ఈ అప్రూవల్ ఇస్తుంది. ఆ తర్వాతే స్థానికంగా అడ్మిషన్లు ఖరారు అవుతాయి. 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చేపట్టే అడ్మిషన్లలో ఈ రూల్ ఇప్పటి వరకు ఫాలో అవుతూ వస్తున్నారు. కోవిడ్ కారణంగా కోవిడ్ సంక్షోభం తలెత్తిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితులు మారిపోయాయి. విదేశాల్లో నిబంధనలు కఠినతరమయ్యాయి. చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. లేదంటే జీతాల్లో కోత పడింది. దీంతో తమ పిల్లలను ఇండియాలో చదివించాలని భావించే పేరెంట్స్ సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. అయితే సీబీఎస్ఈ ప్రస్తుతం అమలు చేస్తున్న నిబంధనలు వారికి అడ్డంకిగా మారాయి. చేర్చుకోండి ఎన్నారైలు పడుతున్న ఇబ్బందుల నేపథ్యంలో రూల్స్ని సీబీఎస్ఈ సడలించింది. సీబీఎస్ఈకి సరి సమానమైన సిలబస్ అందించని విదేశీ బోర్డులకి అనుబంధంగా ఉన్న స్కూళ్లలో చదివిన విద్యార్థులకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ముందస్తుగా బోర్డు నుంచి ఎటువంటి అప్రూవల్ లేకుండానే అడ్మిషన్ ఇవ్వవచ్చని తెలిపింది. ఈ సందర్భంగా ఆయా స్కూళ్లలో విద్యార్థిని పరీక్షించి నిర్ణయం తీసుకోవచ్చంది. చివరగా అడ్మిషన్లు ఖరారు చేసేందుకు బోర్డుకు రిక్వెస్ట్ చేయాలని సూచించింది. సీబీఎస్ఈ తాజాగా తీసుకున్న నిర్ణయంతో విద్యార్థుల అడ్మిషన్ల కోసం ఇబ్బందులు పడుతున్న ఎన్నారైలకు ఊరట లభించనుంది. చదవండి: ఎన్నారైలు.. తరాలు మారినా.. మూలాలు మరవడం లేదు -
సీబీఎస్ఈ 12వ తరగతి మార్కుల ప్రణాళిక
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య
స్కూల్లో బెత్తం దెబ్బలు తిన్నా: సుప్రీం చీఫ్ జస్టిస్
చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
IPL 2024 PBKS VS CSK: రుతురాజ్ను వెంటాడుతున్న దరిద్రం
ఉంగరంతో ఆరోగ్యం పదిలం!
Shobha Shetty Engagement: గ్రాండ్గా ప్రియుడితో సీరియల్ నటి శోభా శెట్టి ఎంగేజ్మెంట్ (ఫోటోలు)
గ్రాండ్గా నటుడి కుమార్తె రిపెప్షన్ వేడుక.. సందడి చేసిన ప్రముఖ తారలు!
సీఎం జగన్ రేపటి ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్ ఇదే
నాన్న చనిపోయినా వేళ్లలేదు.. బంధువులంతా తిట్టారు: కోవై సరళ ఎమోషనల్
IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
తప్పక చదవండి
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
- ఇదేం ఫ్యామిలీ రా సామీ! ఏకంగా కోబ్రాకే నేరుగా..!
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement