-
స్వప్నం సాకారం దిశగా..
రైతుల చిరకాల స్వప్నం సాకారమయ్యే సమయం ఆసన్నమైంది. చాలాకాలంగా సాగునీరు వృథాగా పోతున్నా రైతులు చేసేది లేక మిన్నకుండిపోయారు. దీనిపై స్థానిక ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య గత ప్రభుత్వ హయాంలో అనేకసార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే అప్పటి టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. అనంతరం ఏర్పడిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం చెక్డ్యామ్ ఆవశ్యకతను గుర్తించింది. రూ.3.96 కోట్ల నిధులను మంజూరు చేసింది. తడ : మండలంలోని మాంబట్టు పంచాయతీ, ఎన్ఎంకండ్రిగ గ్రామానికి ఎగువన చిత్తూరు జిల్లా పరిధిలోని చెంచురామశెట్టి కండ్రిగ వద్ద పాములకాలువకు అడ్డుగా చెక్డ్యామ్ను పటిష్ట పరచడం ద్వారా పలు చెరువులకు నీరు పుష్కలంగా చేరుతుంది. కాళంగి గ్రాయిన్, నెర్రికాలువ కెనాల్ సిస్టం అభివృద్ధి, పాములకాలువ నెల్లూరు జిల్లా ప్రారంభ ప్రాంతంలో ఆనకట్ట కట్టడం వంటి పనుల ద్వారా తడ ఉత్తర ప్రాంతంలోని అనేక పంచాయతీలతోపాటు సూళ్లూరుపేట, దొరవారిసత్రం మండలాల పరిధిలోని రైతులకు లబ్ధి చేకూరనుంది. కాలువ పొడవునా కాంక్రీట్తో కట్ట బలోపేతంతో నీరు వృథా పోకుండా వేగంగా చెరువులకు చేరి నీటి ఇబ్బంది లేకుండా వేలాది ఎకరాల్లో పంటసాగు చేసుకోవచ్చు. చెరువులకు సాగునీరు ♦ చెక్డ్యామ్ వల్ల ఎన్ఎం కండ్రిగ, మాంబట్టు, వెండ్లూరుపాడు, కాదలూరు పెద్ద, చిన్న చెరువులకు పుష్కలంగా నీరు చేరుతుంది. ♦ కాదలూరు చెరువులో నీరు లేక వృథాగా ఉన్న సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ (ఎస్ఎస్ ట్యాంక్)కి నీరు చేరి తడ మండలంలోని అన్ని గ్రామాలకు శుద్ధి చేసిన తాగునీరు అందుతుంది. ♦ ఐదు చెరువుల కింద మొత్తం 3,235 ఎకరాలకు (ఆయకట్టు 1,649 ఎకరాలు, డైరెక్ట్గా మరో 1,586 ఎకరాలకు) సాగునీరు అందుతుంది. ఎమ్మెల్యే సంజీవయ్య చొరవతో.. ♦ ఎమ్మెల్యే సంజీవయ్య గత టీడీపీ పాలనలో చెక్డ్యామ్ ఆవశ్యకతపై అనేక పర్యాయాలు అధికారులను కలిశారు. అయితే అప్పటి అధికార టీడీపీ స్పందించలేదు. ♦ వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇరిగేషన్ శాఖ మంత్రి డాక్టర్ పి.అనిల్కుమార్యాదవ్కు చెక్డ్యామ్ ప్రయోజనాలను వివరించారు. ♦ మంత్రి అనిల్ వెంటనే రూ.3.96 కోట్ల నిధులను మంజూరు చేయించారు. ♦ మంజూరైన నిధుల్లో రూ.కోటితో చెక్డ్యామ్ నిర్మాణం, మిగిలిన నిధులతో 4.4 కిలోమీటర్ల పొడవున మెయిన్కెనాల్ సప్లై చానల్కి లైనింగ్ పనులు, బ్రిడ్జిలు నిర్మించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ♦ అవసరాన్ని బట్టి మరిన్ని నిధులు మంజూరయ్యేలా చూస్తానని ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య తెలిపారు. ♦ పనులు త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. అనుమతులు వచ్చాయి చెక్డ్యామ్ నిర్మాణానికి అనుమతులు వచ్చాయి. సర్వే పనులు పూర్తి చేసి టెండర్ల ప్రక్రియ పూర్తయిన వెంటనే పనులు ప్రారంభిస్తాం. సాగునీటి సమస్య పరిష్కారం కోసం ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య సూచనలు చేస్తున్నారు. ఆ మేరకు తడ ఉత్తర భాగంలో మిగిలిపోయిన కొండూరు, గ్రద్ధగుంట, చేనిగుంట, అండగుండాల పంచాయతీల్లోని చెరువులకు కూడా సాగునీరు చేరేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. తడ దక్షిణ భాగంలో సాగునీటి ఇబ్బందులు తొలగించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సి ఉంది. – సతీష్బాబు, ఇరిగేషన్ డీఈ, సూళ్లూరుపేట -
బాంబుల మోత : గ్రామస్తుల ఆందోళన
అవుకు (కర్నూలు) : కాల్వ నిర్మించేందుకు బాంబులు ఉపయోగించడంతో వాటి ధాటికి సమీపంలోని గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. కర్నూలు జిల్లాలో గాలేరు- నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు కాల్వ నిర్మాణంలో భాగంగా మంగళవారం బాంబులతో పనులు చేస్తున్నారు. కాగా బాంబుల మోతతోపాటు పేలుడు సంభవించినప్పుడు పెద్ద పెద్ద రాళ్లు గ్రామంలోకి ఎగిరిపడుతున్నాయి. దీంతో ఎప్పుడు ఏ రాయి తగులుతుందోనని గ్రామస్తులు ఆందోళన ఉన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బ్లూచిప్స్కు అమ్మకాల షాక్
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement