-
గెలిచింది 5 కోట్లు.. పోగొట్టుకుంది 58 కోట్లు..
ముంబై: మహారాష్ట్రలోని నాగ్పూర్కు చెందిన ఓ వ్యాపారవేత్త ఆన్లైన్లో జూదమాడి 5 కోట్లు సంపాదించాడు. తక్కువ సమయంలో కూర్చున్న చోట కూర్చుని ఉండగానే కోట్లు కొల్లగొట్టడంతో ఇదేదో బాగుందనిపించి అదేపనిగా గ్యాంబ్లింగ్ ఆడాడు. ఇంకేముంది చూస్తుండగానే 58 కోట్లు పోగొట్టుకుని లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నాగ్పూర్కు సమీపంలోని గొండా సిటీకి చెందిన అనంత్ అలియాస్ శొంటు నవరతన్ జైన్ బాధితుడైన వ్యాపారస్తుడికి గ్యాంబ్లింగ్ లో ఆనతి కాలంలోనే కోట్లు గడించవచ్చని ఆశ చూపించాడు. మొదట్లో వెనకడుగు వేసిన వ్యాపారి తరవాత ఎందుకో నవరతన్ జైన్ ప్రలోభానికి లొంగిపోయాడు. వెంటనే జైన్ కు హవాలా ద్వారా రూ.8 లక్షలు ట్రాన్స్ఫర్ చేశాడు. జైన్ వ్యాపారికి వాట్సాప్లో ఒక లింకు పెట్టగా దాని ద్వారా తన అకౌంట్లో రూ. 8 లక్షలు డిపాజిట్ అయినట్టు చూపించింది. దీంతో వ్యాపారికి ఆశతో పాటు నమ్మకం కూడా కలిగింది. ఆలస్యం చేయకుండా వెంటనే గ్యాంబ్లింగ్ ఆడటం ప్రారంభించాడు. మొదట్లో హస్తవాసి కలిసొచ్చి 5 కోట్లు లాభం సంపాదించాడు. అక్కడ వరకు అంతా బాగానే సాగింది. సరిగ్గా అప్పుడే మొదలైంది అసలు జూదం. ఒక్కొక్కటిగా సంపాదించిన ప్రతి రూపాయి వెనక్కి పోవడం మొదలైంది. పోయిన రూపాయిని తిరిగి రాబట్టుకోవాలన్న అతడి తాపత్రయం ఏకంగా 58 కోట్లు నష్టపోయేలా చేసింది. ఎంత ఆడినా జూదం కలిసిరాకపోవడంతో విసుగు చెందిన వ్యాపారి నవరతన్ జైన్ ను కలిసి తన డబ్బు తనకు తిరిగివ్వాలని కోరాడు. అతడు నిరాకరించడంతో చేసేదేమీ లేక తమకు కంప్లైంట్ ఇచ్చినట్లు తెలిపారు. వెంటనే గొండా సిటీలోని నిందితుడి ఇంటికి వెళ్ళేసరికే జైన్ పారిపోయాడని.. ఇల్లంతా సోదా చేయగా 14 కోట్లు నగదు నాలుగు కేజీల బంగారు బిస్కెట్లు దొరికినట్లు తెలిపారు పోలీసులు. వారంతా దుబాయ్ పారిపోయి ఉండవచ్చని చెబుతున్నారు పోలీసులు. గ్యాంబ్లింగ్ కారణంగా ఎందరో జీవితాలు అతలాకుతలమవుతున్నాయి. అయినా కూడా ఏదో ఒక మూల అదృష్టదేవత కనికరించక పోతుందా అన్న చిన్న నమ్మకంతో అనేకులు ఈ మహమ్మారి బారిన పతున్నారు. అదృష్టం సంగతి అటుంచితే ఉన్నదంతా ఊడ్చిపెట్టుకుపోయిన సందర్భాలే ఎక్కువ. ఇది కూడా చదవండి: మణిపూర్ అరాచకపర్వంలో మరో ఘోరం.. -
అనిల్ను పట్టుకునేందుకు అమృత సాయం!
క్రైమ్: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి అమృతను డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేసిన కేసులో.. ముంబై పోలీసులు ఎట్టకేలకు కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. అయితే.. ఇందులో చాలా ఆసక్తికర విషయాల్నే పోలీసులు పొందుపరిచారు. ప్రధాన నిందితుడైన క్రికెట్ బుకీ అనిల్ జైసింఘానీని పోలీసులు.. అమృత సాయంతోనే ట్రేస్ చేసి పట్టుకున్నట్లు తెలిసింది. ఇందుకుగానూ .. అనిల్ కూతురు అనిక్షను నేరుగా కలవడంతో పాటుగా.. అమృత-అనిల్ మధ్య ఛాటింగ్ను సైతం పోలీసులు ఆ ఛార్జ్షీట్తో జత చేశారు. అమృతా ఫడ్నవిస్ను బెదిరించి.. బ్లాక్మెయిల్ చేసి డబ్బులు డిమాండ్ చేసిన కేసులో అనిల్ జైసింఘానీ, అతని కుమార్తె అనిక్షపై పోలీసులు ఈ ఫిబ్రవరిలో కేసు నమోదు చేశారు. ఈలోపు అతని నేర చరిత్ర మొత్తం బయటపడింది. దాదాపుగా 15 కేసుల్లో నిందితుడిగా ఉన్న అనిల్.. ఎనిమిదేళ్ల నుంచి పోలీసుల కళ్లు గప్పి తిరుగుతున్నాడట. దీంతో స్పెషల్ ఆపరేషన్ ద్వారా అతన్ని పట్టుకోవాలని ముంబై పోలీసులు డిసైడ్ అయ్యారు. అందుకు ఫడ్నవిస్ సతీమణి సాయం తీసుకున్నారు. ఫిబ్రవరి 24న ఛాటింగ్ అమృత: ‘‘మిమ్మల్ని అక్రమంగా కేసులో ఇరికిస్తే దాని గురించి.. నేను నా భర్త దేవేంద్ర ఫడ్నవిస్తో మాట్లాడతా. ఆయన మీకు న్యాయం చేస్తారు. కానీ, అక్రమంగా డబ్బు సంపాదించొచ్చన్న అనిక్ష డిమాండ్లను నేను అంగీకరించలేను. మీరు ముందు నుంచీ నన్ను బ్లాక్మెయిల్ చేస్తూనే ఉన్నారు. నేను ఏ తప్పూ చేయలేదు. ఇప్పుడు మీరు నా వీడియోలను బయటపెట్టి నన్ను ఇరికించొచ్చు. కానీ, నిజాలు ఏదో ఒక రోజు బయటకు వస్తాయి. మీరు నిజంగా న్యాయం కోరుకుంటే దేవ్జీతో నేను మాట్లాడుతాను అవతలి నుంచి: కొన్ని డాక్యుమెంట్లు, ఆడియో మెసేజ్లు రిప్లైగా వచ్చాయి. ఆ తర్వాత అనిల్తో ఫోన్లో అమృత: ‘‘దేవేజీతో(భర్త దేవేంద్ర ఫడ్నవిస్ను ఉద్దేశించి) నా బంధం సరిగా లేదు. 2019 నుంచి మా మధ్య మనస్పర్థలు ఉన్నాయి. ఇప్పుడు ఈ కేసు కారణంగా ఆయన నాకు విడాకులిస్తారేమో!. కానీ, ఆయన గురించి నాకు తెలుసు. మీరు బాధితులని తెలిస్తే.. ఆయన 100శాతం న్యాయం జరిగేలా చూస్తారు. మరోసారి కాల్లోనే: ‘‘ఫోన్లో కాదు.. నేరుగా మీ అమ్మాయి అనిక్షను కలిసి మాట్లాడతా’’ అలా అనిక్ష, ఆమె తండ్రి లొకేషన్ను పోలీసులు గుర్తించారు. ఈ కేసులో తొలుత మార్చి 16న అనిక్షను అరెస్టు చేయగా.. ఆ తర్వాత మార్చి 19న అనిల్ జైసింఘానీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇదంతా ఆమె తనంతట తానుగా చేయలేదు. ఇది కూడా పోలీసులే చెప్పమన్నారట. వాళ్ల డైరెక్షన్లోనే ఆమె ఇదంతా నడిపించారట. ఆ విషయాన్ని కూడా పోలీసులు ఛార్జిషీట్లో పేర్కొన్నారు. దీనిపై ఓ దర్యాప్తు అధికారి మాట్లాడుతూ.. ‘‘మా సూచనలతోనే అమృతాజీ నిందితులతో టచ్లో ఉన్నారు. నిందితులను పట్టుకునేవరకు వారితో సంభాషణలు పొడగించాలని మేమే ఆమెకు చెప్పాం’’ అని తెలిపారు. కేసు వివరాలివే.. అనిక్ష తనను తాను ఫ్యాషన్డిజైనర్గా అమృతా ఫడ్నవిస్తో పరిచయం పెంచుకుంది. ఆ వంకతో తరచూ వాళ్ల ఇంటికి వెళ్లేది. ఈ క్రమంలో ఆమె తండ్రి ఓ బుకీ అని తెలియడంతో.. అమృతా ఆ యువతిని దూరం పెట్టింది. అదిగో అప్పటి నుంచి అమృతను డబ్బు కోసం బెదిరించడం మొదలుపెట్టింది అనిక్ష. తన తండ్రిని కేసుల నుంచి బయటపడేందుకు సాయం చేయాలని, లేదంటే పరువు తీస్తానని బెదిరించింది. అమృతకు డబ్బు ఉన్న బ్యాగును ఇస్తున్నట్లుగా ఓ నకిలీ ఆడియో, వీడియో క్లిప్పులు సృష్టించి గుర్తుతెలియని ఫోన్ నంబర్ల ద్వారా బ్లాక్మెయిల్ చేసింది. దీంతో అమృత పోలీసులను ఆశ్రయించారు. ఆపై పోలీసులు అమృత సాయంతోనే వాళ్లను పట్టుకున్నారు. -
ఐపీఎల్లో బుకీ... సమాచారమిచ్చిన క్రికెటర్
దుబాయ్: ‘బయో బబుల్’లో ఐపీఎల్ జరుగుతున్నా బుకీలు మాత్రం ఫిక్సింగ్ ప్రయత్నాలు ఆపడం లేదు. ప్రస్తుతం ఐపీఎల్లో ఆడుతున్న ఒక క్రికెటర్ను ఫిక్సింగ్ కోసం బుకీ సంప్రదించినట్లు తెలిసింది. అయితే సదరు ఆటగాడు వెంటనే ఈ విషయాన్ని బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం (ఏసీయూ)కు సమాచారం అందించాడు. కఠిన ఆంక్షల కారణంగా ఆటగాళ్లను నేరుగా కలిసే అవకాశం లేకపోవడంతో ఆన్లైన్ ద్వారా ఈ ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. ఏసీయూ చీఫ్ అజిత్ సింగ్ దీనిని నిర్ధారించారు. ‘ఒక ప్లేయర్తో బుకీ మాట్లాడాడు. అతడిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నాం. అందుకు కొంత సమయం పడుతుంది. అవినీతి నిరోధక నిబంధనల ప్రకారం ఆటగాడు పేరు బయటకు చెప్పరాదు’ అని ఆయన వెల్లడించారు. (ఫామ్లో లేని అతడినే ఆడిస్తామంటే కుదరదు) -
టాప్ ప్లేయర్కు బుకీలతో లింక్స్!
న్యూఢిల్లీ : ఐపీఎల్- 2013 సీజన్లో చోటుచేసుకున్న స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణం భారత క్రికెట్ను కుదిపేసిన సంగతి తెలిసిందే. ఈ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొన్న శ్రీశాంత్, అంకిత్ చవాన్, అజిత్ చండీలాపై బీసీసీఐ జీవితకాలం నిషేధించింది కూడా. అదే విధంగా చెన్నై సూపర్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్ జట్లపై రెండేళ్ల పాటు వేటు పడింది. అయితే స్పాట్ ఫిక్సింగ్ విచారణలో భాగమైన సీనియర్ పోలీస్ ఆఫీసర్ బీబీ మిశ్రా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు సంచలన విషయాలు వెల్లడించారు. ప్రపంచ కప్- 2011 విజేతగా నిలిచిన భారత జట్టులో భాగమైన ఓ సీనియర్ ఆటగాడికి పలువురు బుకీలతో సంబంధాలు ఉన్నాయంటూ ఆయన పేర్కొన్నారు. ఐపీఎల్ 2013 స్పాట్ ఫిక్సింగ్ విచారణలో భాగంగా ఓ బుకీతో మాట్లాడిన సమయంలో తనకు ఈ విషయం తెలిసిందన్నారు. అయితే ఆ ఆటగాడి పేరు బయటపెట్టేందుకు మాత్రం ఆయన నిరాకరించారు. నాకంత సమయం లేదు అందుకే... ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్లో భాగంగా తొమ్మిది మంది ఆటగాళ్లను విచారించానన్న మిశ్రా... ఇందులో భాగంగా పలువురు బుకీలతో మాట్లాడానన్నారు. ‘2008- 09 నుంచే సదరు సీనియర్ ఆటగాడు బుకీలతో కాంటాక్ట్లో ఉన్నాడు. భారత్లో జరిగిన వివిధ అంతర్జాతీయ మ్యాచులకు సంబంధించి అతడు బుకీలతో మాట్లాడాడు. ఇందుకు సాక్ష్యంగా ఆ ఆటగాడు తనతో జరిపిన వాయిస్ రికార్డును నాకు ఇస్తానని ఆ బుకీ చెప్పాడు. కానీ చివరి నిమిషంలో అతడు వెనక్కి తగ్గాడు. అయితే కేవలం తొమ్మిది మంది ఆటగాళ్లు, శ్రీనివాసన్, గురునాథ్ మయప్పన్(చెన్నై సూపర్ కింగ్స్), రాజ్కుంద్రా (రాజస్తాన్ రాయల్స్), సుందర్ రామన్(ఐపీఎల్ మాజీ సీఓఓ)లకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడమే నా ముఖ్య విధి. అందుకే ఆ సీనియర్ ఆటగాడి గురించి తెలుసుకునేందుకు తగినంత సమయం కేటాయించలేకపోయానంటూ’ మిశ్రా వ్యాఖ్యానించారు. -
ప్రముఖ బుకీ అరెస్టు
ముంబై : ముంబై కేంద్రంగా పలు రాష్ట్రాల్లో కోట్ల రూపాయల ఆన్లైన్ బెట్టింగ్ రాకెట్ను నిర్వహిస్తున్న ప్రముఖ బుకీని మంగళవారం నాడు థానే పోలీసులు అరెస్టు చేశారు. ఐపీఎల్ ఫైనల్ సందర్భంగా ముంబైలోని దొంబివాలా ప్రాంతంలో పెద్ద ఎత్తున బెట్టింగ్ జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న థానే దోపిడీ వ్యతిరేక విభాగానికి చెందిన పోలీసులు ఆ ప్రాంతంలో దాడి చేసి బుకీని అరెస్టు చేశారు. అతడి నుంచి ల్యాప్టాప్లను, పదుల సంఖ్యలో మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు. నిందితుడు దేశంలోనే టాప్మోస్ట్ బుకీ సోను జలాన్ అలియాస్ సోను మలాద్గా పోలీసులు ప్రకటించారు. పోలీసుల వివరాల ప్రకారం.. జలాన్ ఈ ఐపీఎల్ సీజన్లో బెట్టింగ్లు నిర్వహించడానికి సోషల్ మీడియా ద్వారా కొన్ని లింకులను పంపించేవాడు. ఇతర ఏజెన్సీలకు, పోలీసులకు దొరకకుండా ఉండేందుకు ఈ ప్రయత్నం. బెట్టింగ్లో పాల్గొనాలనుకునే వారు ఆ లింకుల ద్వారా బెట్టింగ్ పెడతారు. ఇలా పెట్టినవారికి జలాన్కు సంబంధించిన వ్యక్తుల ద్వారా కన్ఫర్మేషన్ కాల్ వస్తుంది. జలాన్ దొంబివాలా పరిసరాలలోని పలు ప్రాంతాలతో పాటు విదేశాలను కూడా బెట్టింగ్కు అడ్డగా మార్చుకున్నాడని తెలిపారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
అమలు సాధ్యమేనా..?
అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
కలెక్టర్ ఆదేశాలు కూడా పనిచేయలేదు
మాజీ సైనికులు ఓటు హక్కు వినియోగించుకోవాలి
ఓటర్ స్లిప్పు లేదా.. టెన్షన్ వద్దు
ప్రభుత్వరంగ బ్యాంకులను కాపాడుకుందాం
ల్యాండ్ టైటిలింగ్ యాక్టుపై దుష్ప్రచారం
టీడీపీలో చేరిన నేతను నిలదీసిన గ్రామస్తులు
No Headline
మేమంతా జగనన్న బాటలోనే..
తప్పక చదవండి
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement