-
Bhuvaneshwari : కలలకు రెక్కల వెనక అసలు కథేంటీ.?
కుప్పంలో పోటీ చేయాలని భువనేశ్వరీ కలగన్నారు. నేరుగా కుప్పానికే వెళ్లి చంద్రబాబుకు విశ్రాంతి ఇవ్వాలని ప్రజలను కోరారు. ఇక్కడ నాకు పోటీ చేయాలని ఉందని, ఇది నా కల అని కూడా చెప్పుకొచ్చారు. ఆమె స్వప్నం ఎందుకు సాకారం కాలేదో.. అన్నది వేరే సంగతి కానీ.. ఇప్పుడు కలలకు రెక్కలంటూ మళ్లీ ప్రజల ముందుకొచ్చారు. చంద్రబాబు కోసం భువనేశ్వరి ప్రకటనలు చేశారా.? లేక చంద్రబాబే చేయించారా అన్నది పక్కనబెడితే.. భువనేశ్వరీకి తెలియాల్సిన కొన్ని విషయాలున్నాయి. అమ్మాయిల కలలకు రెక్కలు అన్న కాన్సెప్ట్ ఎలా ఉన్నా.. ఇప్పటివరకు మీరు చూపించిన భ్రమరావతి మహిళలందరికి పీడ కలలు మిగిల్చాయి. ఒక సారి 2014 లో చంద్రబాబు మహిళలకు చేసిన వాగ్దానాలు చూడండి. ఇందులో ఏ ఒకటి అయినా తీర్చాడా? అన్నది భువనేశ్వరీనే చెప్పాలి. చంద్రబాబు 2014-19లో మహిళలకు ఇచ్చిన హామీలు మహాలక్ష్మి పథకంలో భాగంగా పుట్టిన ప్రతి ఆడబిడ్డకు 25 వేలు డిపాజిట్ చేస్తా గర్భిణులకు రూ.10 వేలు ఇస్తాం ప్రతి పేద మహిళకు స్మార్ట్ఫోన్లు ఇస్తా ఏడాదికి ఒక కుటుంబానికి 12 గ్యాస్ సిలిండర్లు 100 సబ్సిడీతో ఇస్తా 14 వేళా కోట్ల డ్వాక్రా రుణాలు మాఫీ ఇవేవీ అమలు చేయలేక మ్యానిఫెస్టోను మాయం చేసిన ఘనత చంద్రబాబుది. దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబు భార్యగా మీది. ఇప్పుడు కొత్తగా మీరు వచ్చి మళ్లీ కాకమ్మ కథలు చెప్పడం బాగోలేదని ప్రజలంటున్నారు. ఏ పని చేయలేడనే చంద్రబాబును చిత్తుగా ఓడించిన ప్రజలు 23 సీట్లకు పరిమితం చేశారు. 2019లో అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ ప్రభుత్వం ఇప్పటివరకు ఈ 58 నెలల్లో వివిధ పథకాల ద్వారా (డీబీటీ, నాన్ డీబీటీ ) కింద కేవలం మహిళలకు అందించిన లబ్ధి అక్షరాల రూ.2 .78 లక్షల కోట్లు అందించారు. సంక్షేమ పథకాల ద్వారా జగన్ ప్రభుత్వం అందించిన తోడ్పాటుతో 18.38 లక్షల మంది మహిళలు కొత్తగా వ్యాపారాలు ప్రారంభించి స్థిరమైన ఆదాయం పొందుతున్నారు. అందుకే భువనేశ్వరీ గారు, మళ్లీ కలలకు రెక్కలంటూ కాకమ్మ కబుర్లు చెప్పొద్దని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుప్పంలో పోటీ చేయాలని కల గంటున్నారు కదా.. మీ కలలకు రెక్కలు తెచ్చుకోండి. ధైర్యంగా నామినేషన్ వేయండి, చంద్రబాబు తప్పుకుంటారు. కల సాకారం అవుతుందా లేదా పక్కనబెట్టి కనీసం ప్రయత్నం చేశారన్న గౌరవం ఉంటుంది. -
భువనేశ్వరి రెస్ట్ ఇస్తుందో లేదో కాని... చంద్రబాబుకి మేము ఎప్పుడో రెస్ట్ ఇచ్చేశాం ఎమ్మెల్సీ భరత్ కౌంటర్
-
ఓటమి భయం.. మరో మాస్టర్ ప్లాన్!
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకు నిజంగానే రెస్ట్ అవ్వాలని ఆయన భార్య భువనేశ్వరి భావిస్తున్నారా? ఆయనది పెద్ద వయసు కనుక, ముప్పై ఐదేళ్ల పాటు కుప్పం ఎమ్మెల్యేగా ఉన్నారు కనుక ఆమెకు ఆ ఆలోచన వచ్చింది. చంద్రబాబు ఆరోగ్య రీత్యానే ఆమె ఆ ప్రకటన చేసి ఉంటే అది అభినందించదగిందే. చంద్రబాబు కూడా నిజంగానే ఆమె కుప్పంలో పోటీచేయాలని అభిప్రాయపడుతుంటే కొంత అప్రతిష్ట వచ్చినా, కాస్త తెలివైన నిర్ణయమే అనిపించవచ్చు. ఎందుకంటే తాను ఓడిపోతానేమో అన్న అనుమానం ఉన్నప్పుడు రిస్క్ తీసుకోకుండా ఈ ప్లాన్ అమలు చేయవచ్చు. అదే తరుణంలో భువనేశ్వరి కూడా తన మనసులో మాట బయటపెట్టారు. తాను కుప్పం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేయాలని అనుకుంటున్నట్లు వెల్లడించారు. ఆమె ఏదో సరదాగా చెప్పినట్లు కనిపించాలని అనుకున్నా, అసలు ఉద్దేశం బయటపెట్టినట్లయింది. కుప్పంలో చంద్రబాబు విజయావకాశాల మీద సందేహాలు రావడం వల్లే ఈ ప్లాన్ వేసినట్లు అనిపిస్తుంది. చంద్రబాబు ఈ సారి ఇక్కడ నుంచి పోటీచేయరు అని నేరుగా చెబితే దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. అందుకోసం టీడీపీకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్యాడర్ను మానసికంగా సిద్దం చేయడానికి ఆమెతో ఈ మాటలు చెప్పించి ఉండాలి. లేదా కుప్పం టీడీపీ క్యాడర్ పల్స్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని అయినా అనుకోవచ్చు. లేదా ప్రత్యక్ష రాజకీయాలలోకి రావాలని భువనేశ్వరి ఆశిస్తుండవచ్చు! ఎందుకంటే ఆమె తండ్రి ఎన్.టీ రామారావు, ఇద్దరు సోదరులు హరికృష్ణ, బాలకృష్ణ, సోదరి పురందేశ్వరిలు రాజకీయాలలో చేరి ఎమ్మెల్యేలు, ఎంపీలు అయ్యారు. ఆ ప్రభావం కూడా పనిచేస్తుండవచ్చు. ఈ మధ్యకాలంలో భువనేశ్వరి కూడా న్యాయం గెలవాలి.. అంటూ ఒక కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. తన భర్త చంద్రబాబు నాయుడు స్కిల్ స్కామ్ కేసులో చిక్కి జైలుకు వెళ్లినప్పుడు భువనేశ్వరి ప్రజలలోకి వచ్చారు. దాంతో ఆమె రాజకీయాల మజా రుచి చూసి ఉంటారు. ఇలా ఆమెకు ఈ కోరిక వచ్చి ఉండవచ్చు. పైగా కుప్పం నియోజకవర్గంలో ఈ ఐదేళ్లలో జరిగిన అనేక పరిణామాలలో తెలుగుదేశం బాగా బలహీనపడింది. మున్సిపల్ ఎన్నికలలో ఎంత వ్యయం చేసినా, టీడీపీ గెలవలేకపోయింది. మండల, జడ్పీలలోను అదే పరిస్థితి. సర్పంచ్లు తొంభై శాతం మంది వైఎస్సార్సీపీవారే ఎన్నికయ్యారు. తత్ఫలితంగా టీడీపీ ఈసారి కుప్పంలో గెలుస్తుందా? లేదా? అనే చర్చ వచ్చింది. కుప్పం నియోజకవర్గంలో అనేక అభివృద్ది పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టడం, కుప్పంను మున్సిపాల్టీ చేయడం, ఆర్డిఓ కేంద్రంగా మార్చడం, కుప్పంకు కృష్ణా జలాలను తీసుకురావడం వంటివాటివల్ల వైఎస్ జగన్మోహన్రెడ్డి గ్రాఫ్ బాగా పెరిగింది. దాంతో చంద్రబాబు అక్కడ పోటీ చేయడానికి భయపడుతున్నారు. కాకపోతే ఆ విషయం చెప్పకుండా చంద్రబాబు దాటవేస్తున్నారు. ఎన్నికలు దగ్గరబడుతుండడంతో ఆయన తన భార్య ద్వారా ఈ విషయం చెప్పినట్లు అనుకోవాలి. కానీ ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్న చంద్రబాబు గురించి ఆయన భార్య భువనేశ్వరి స్వయంగా విశ్రాంతి అవసరం అని చెప్పారంటే అందులో ఏదో మతలబు ఉండి తీరాలి. మరో రెండు ఎన్నికలు జరగనున్న తరుణం, ముఖ్యమంత్రి అభ్యర్ధి అని ఒకవైపు ప్రచారం చేస్తూ, మరో వైపు ఆయన భార్యే రెస్ట్ ఇవ్వాలని అనడం అంటే కచ్చితంగా డౌట్లు వస్తాయి. ఒకటి.. రాష్ట్రంలో, కుప్పంలో టీడీపీ గెలవలేదన్న భావన రావడం, రెండు.. కుప్పంలో చంద్రబాబును పోటీనుంచి తప్పించడం, మూడు.. ఆయనతో పోటీచేయించినా మరో సురక్షిత సీటునుంచి పోటీచేయించాలని అలోచించడం, నాలుగు.. నిజంగానే చంద్రబాబుకు రెస్టు ఇచ్చి, కుమారుడు లోకేష్ను ఫోకస్ చేయడం. వీటిలో ఏదైనా కావచ్చు. గతంలో లోకేష్ ఎమ్మెల్యే కాకపోయినా, ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి ఇప్పించడం, భువనేశ్వరి, బ్రాహ్మణిల ఒత్తిడి ఉందని అప్పట్లో టీడీపీ వర్గాలలో ప్రచారం జరిగింది. అలాగే ఇప్పుడు ఏమైనా చంద్రబాబు సీరియస్ పోటీలో ఉంటే, లోకేష్కు అవకాశాలు తగ్గుతున్నాయన్న భావన ఏమైనా ఉందేమో తెలియదు. మరోవైపు చంద్రబాబు కుప్పం బదులు పెనమలూరు లేదా మరో సేఫ్ నియోజకవర్గం నుంచి పోటీచేయవచ్చన్న ప్రచారమూ ఉంది. ఇది కాకుండా బీజేపీ వారి పొత్తు కండిషన్లలో చంద్రబాబును ఏమైనా పార్లమెంటుకు పోటీచేయాలని కోరుతున్నారా? అనే ఊహాగానాలు ఉన్నాయి. పెనమలూరులో చంద్రబాబు పోటీచేసే అవకాశం ఉందని ఐదారు నెలల క్రితం నుంచే టీడీపీ వర్గాలు అంతర్గంగా చెప్పుకుంటున్నాయి. కుప్పంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బాగా ఫోకస్ పెట్టి అభివృద్ది పనులు చేయించడం, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గట్టిగా పనిచేసి చంద్రబాబును ఓడించాలని కంకణం కట్టుకున్న పరిస్థితిలో చంద్రబాబులో ఆందోళన ఉంటుంది. అంతేకాక ఆయన గతంలో ఎక్కువగా ఆధారపడ్డ దొంగ ఓట్లను చాలావరకు తొలగించారట. ఈ కారణాల రీత్యా తాను పోటీచేయకపోయినా, తన భార్యను పోటీలో దించితే ఏమైనా సానుభూతి వస్తుందా? లేక ఓడిపోయినా అంత నష్టం ఉండదులే అనుకునైనా ఉండాలి. ఏది ఏమైనా భువనేశ్వరి ప్రకటన టీడీపీ క్యాడర్ను ఆలోచించుకునేలా చేస్తుంది. టీడీపీ గ్రాఫ్ పడిపోయిందనుకుంటున్న తరుణంలో ఈమె ప్రకటన పెద్ద దెబ్బగా భావించాలి. గతంలో కొందరు నేతలు తమ బదులు తమ భార్యలను పోటీలో ఉంచిన సందర్భాలు లేకపోలేదు. ఉదాహరణకు మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధనరెడ్డి తాను ఎంపీగా పోటీచేసి, వెంకటగిరి సీటును తన భార్య రాజ్యలక్ష్మికి ఇచ్చారు. ఆమె రెండుసార్లు గెలిచి, కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పని చేశారు. మరో మాజీ సీఎం దామోదరం సంజీవయ్య భార్య ఎమ్మల్యే కాలేదు కానీ, ఎమ్మెల్సీ అయి కొద్దికాలం మంత్రిగా కూడా ఉన్నారు. ఇలా ఇంకో మాజీ ముఖ్యమంత్రి ఎన్.టీ రామారావు రెండో భార్య లక్ష్మీపార్వతి ఆయనతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఒక దశలో ఆమెను ఉప ముఖ్యమంత్రిని చేయాలని ఎన్.టీ రామారావు అనుకున్నారని ప్రచారం జరిగింది. అతని మరణం తర్వాత ఆమె పాతపట్పం నుంచి పోటీచేసి ఉప ఎన్నికలో గెలిచారు. మరో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అనూహ్య మరణం తర్వాత ఆయన భార్య విజయమ్మ పులివెందుల నుంచి ఒకసారి ఏకగ్రీవంగాను, మరోసారి పోటీలోను నిలబడి గెలిచారు. బీహారులో ముఖ్యమంత్రిగా పనిచేసిన లాలూ ప్రసాద్ యాదవ్ గడ్డి కుంభకోణంలో జైలుకు వెళ్లవలసి వచ్చినప్పుడు ఆయన తన పదవికి రాజీనామా చేసి బార్య రబ్రీదేవిని ముఖ్యమంత్రిని చేశారు. ఆ తర్వాత కాలంలో ఆమె ప్రతిపక్షనేతగా కూడా ఉన్నారు. ఇలా రకరకాల ఉదాహరణలు ఉన్నాయి. ఏది ఏమైనా భువనేశ్వరి ప్రకటన మొత్తం రాజకీయవర్గాలలో ఆశ్చర్యం కలిగిస్తే, తెలుగుదేశం వర్గాలలో తీవ్ర కలకలం రేపింది. అసలే పార్టీ గెలుస్తుందో, లేదో అని భయపడుతున్న తరుణంలో భువనేశ్వరి ఒక రకంగా రాజకీయ బాంబును పేల్చారని చెప్పవచ్చు. – కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
మేనిఫెస్టోలో చెప్పిన ప్రతీ హామీని నెరవేర్చిన నాయకుడు సీఎం జగన్
-
చంద్రబాబును ప్రజలు ఎందుకు పట్టించుకోవడం లేదు?
తిరుపతి సిటీ/సాక్షి, తిరుపతి: తిరుపతిలోనే పుట్టి తిరుపతిని అంతర్జాతీయ స్థాయిలో నిలిపిన వ్యక్తిని ప్రజలు ఎందుకు పట్టించుకోవడం లేదని చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి రేణిగుంట రోడ్డులో గురువారం ‘నిజం గెలవాలి’పేరుతో ఏర్పాటు చేసిన సభలో ఆమె ప్రసంగించారు. తిరుపతి నేడు అభివృద్ధిలో ముందుకు సాగుతోందంటే దానికి చంద్రబాబు కృషే కారణమన్నారు. ఏపీకి రావాల్సిన ఫ్యాక్టరీలు ఈ ప్రభుత్వం దుశ్చర్యల వల్ల ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయాయని ఆరోపించారు. అమర్రాజా, టీసీఎల్ వంటి అత్యున్నత సంస్థలు కూడా పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయాయని చెప్పారు. అవినీతి ఆరోపణలు లేకున్నా.. ఎఫ్ఐఆర్లో పేరు లేకున్నా.. చంద్రబాబును అరెస్ట్ చేయడం దారుణమన్నారు. చంద్రబాబు నిత్యం ప్రజల కోసమే పనిచేస్తున్నారంటూ పలువురు కేంద్ర నేతలు ఆయన అరెస్ట్ను వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. ప్రజాక్షేత్రంలో నిజమే గెలుస్తుందని ఆమె స్పష్టం చేశారు. కాగా, తిరుపతిలో జరిగిన నిజం గెలవాలి సభకు జనసేన ప్రధాన నేతలు ముఖం చాటేశారు. కనీసం ఆ పార్టీ జెండాలు కూడా సభలో కనిపించకపోవడంతో టీడీపీ శ్రేణులు ఆశ్చర్యపోయారు. ఇదిలా ఉండగా, ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా టీడీపీ నాయకులు మహిళలను సభకు తరలించే ప్రయత్నం చేశారు. ఒక్కొక్కరికి రూ.300 చెల్లించి ఆటోలు, వ్యాన్లతో తరలించారు. భువనేశ్వరి ప్రసంగిస్తుండగా సభ నుంచి వారు నిష్క్రమించడం కనిపించింది. టీడీపీ ముఖ్యనేతలకు ఘోర అవమానం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి చేపట్టిన ‘నిజం గెలవాలి’ యాత్ర రెండో రోజే టీడీపీలో అసంతృప్తులు బయటపడ్డాయి. చంద్రబాబు స్క్రిప్ట్ ప్రకారం నడచుకున్న ఇన్చార్జ్లు.. జిల్లా నేతలను పూర్తిగా పక్కనపెట్టారు. వారికి కనీస గౌరవం కూడా ఇవ్వకపోవడంతో అలిగి వెళ్లిపోయారు. తిరుపతి సభలో ముందు వరుసలో కూర్చున్న మాజీ మంత్రి అమర్నాథ్రెడ్డి, పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు పులివర్తి నాని, తుడా మాజీ చైర్మన్ నరసింహయాదవ్లను లేపి వెనక్కు పంపేశారు. తీవ్ర అవమాన భారాన్ని తట్టుకోలేక వారు అలిగి అక్కడ నుంచి వెళ్లిపోయారు. చంద్రబాబు, రాబిన్శర్మ టీం, ఇన్చార్జ్లుగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్సీలు రాంభూపాల్రెడ్డి, అనూరాధలపై వారు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొదటి రోజు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్న తపనతో స్థానికులు రాకున్నా.. టీడీపీ నేతలు తమ సామాజిక వర్గానికి చెందిన మహిళలను సభకు రప్పించుకున్నారు. అయినా సభ విజయవంతం కాకపోవడంతో నిరుత్సాహానికి గురయ్యారు. భువనేశ్వరి ప్రసంగించేటప్పుడు కన్నీరు పెట్టుకోవాలని చంద్రబాబు, రాబిన్ శర్మ టీం సూచించినట్టు తెలిసింది. అలాగే భువనేశ్వరి మాట్లాడేటప్పుడు సభలోని వారు సైతం కన్నీరు మున్నీరు కావాలని.. ఆ మేరకు పలువురుకి శిక్షణ కూడా ఇచ్చినట్టు విశ్వసనీయ సమాచారం. అయినా ఎవరూ కన్నీరు పెట్టకపోవడం విశేషం. రెండో రోజైనా జనాన్ని మభ్యపెట్టాలని తీవ్ర స్థాయిలో ప్రయత్నం చేశారు. ఎంపిక చేసిన వారితో మాట్లాడించారు. అయినా జనం వీరి ప్రసంగాలను నమ్మలేదు.
Pagination
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
Pak vs NZ: చావో రేవో.. గట్టెక్కిన పాకిస్తాన్! ఆఖరికి..
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- ప్రజా సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తా
- రెచ్చిపోయిన రౌడీ మూకలు
- కొత్త ఇంట్లోకి 'జబర్దస్త్' కమెడియన్.. వీడియో వైరల్
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
- స్టార్ హీరోయిన్ నుంచి కాంట్రవర్సీల వరకు.. సమంత గురించి ఇవి తెలుసా?
- అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
- Road Accident: నక్కపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
- Weekly Horoscope: ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే అన్న విధంగా ఉంటుంది
- Today Telugu Horoscope: ఈ రాశి వారు శుభకార్యాలలో పాల్గొంటారు
- శక్తులన్నీ ఏకమయ్యాయి
Advertisement