-
హ్యాలో కాపాడింది...
సాఖిర్: బహ్రెయిన్ గ్రాండ్ప్రి ఫార్ములావన్ రేసులో ఆదివారం పెను ప్రమాదమే జరిగినా... హాస్ జట్టు డ్రైవర్ రొమైన్ గ్రోస్యెన్ స్వల్ప గాయాలతో బయటపడటం గొప్ప విశేషం. కారుపై నియంత్రణ కోల్పోయి బారికేడ్లను ఢీకొట్టడంతో కారు రెండు ముక్కలైంది. కాక్పిట్, చాసిస్ వేరుపడ్డాయి. దీంతో పెట్రోల్ లీకేజితో ఒక్కసారిగా సిలిండర్ పేలినట్లు మంటలు చెలరేగాయి. ఇంతటి ఘోరప్రమాదం జరిగినా గ్రోస్యెన్ ప్రాణం మీదికి రాకపోవడంతో ఫార్ములావన్ (ఎఫ్1), బహ్రెయిన్ వర్గాలకు పెద్ద ఊరటే లభించింది. 34 ఏళ్ల గ్రోస్యెన్ను హుటాహుటిన హెలికాప్టర్లో మిలిటరీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అతని చేతి వేళ్లకు కాలిన గాయాలయ్యాయి. ఇది మినహా ఎలాంటి ఫ్రాక్చర్, ప్రాణాపాయ సమస్యలు లేవు. ఇంకా చెప్పాలంటే అంతపెద్ద మంటల్లో... ఫైర్ మార్షల్స్ మంటల్ని అదుపు చేస్తుంటే అతనే ఎంచక్కా బారికేడ్ను దూకుతూ దాటాడు. ఇద్దరు సాయమందించినా... తనే నడుచుకుంటూ అంబులెన్స్ ఎక్కాడు. పెను ప్రమాదం నుంచి అతను చిన్న చిన్న గాయాలతో బయటపడటం నిజంగా అద్భుతమని 1996 ఎఫ్1 చాంపియన్ డామొన్ హిల్ అన్నారు. అదే రక్షించింది... ఫార్ములావన్ ఆధునికతే గ్రోస్యెన్కు ఊపిరి పోసింది. కొన్నేళ్లు పరీక్షించిన మీదట డ్రైవర్ల ప్రాణాలను నిలుపుతుందని భావించిన ఎఫ్1 సంస్థ 2018లో రేస్ కార్లలో హ్యాలో సిస్టమ్ను అమలు చేసింది. డ్రైవర్ తలకు ఏమాత్రం గాయమవ్వకుండా ఉండే రక్షణ కవచం ఇది. కారు కాక్పిట్లో ఓ ఫ్రేమ్గా తలపై భాగాన్ని కవర్ చేస్తుంది. 2016లో వచ్చిన హ్యాలో సిస్టమ్కు లేటెస్ట్ వర్షన్ (ఆధునిక) తోడవడంతో 2017లో ఎఫ్1 సంస్థ ప్రయోగాత్మకంగా పరిశీలించింది. 17 శాతం ప్రాణాపాయాన్ని తగ్గించగలదని ధ్రువీకరించుకున్న ఎఫ్1 ఆ మరుసటి ఏడాది అధికారికంగా అమల్లో పెట్టింది. కానీ ఆనాడు దీన్ని రొమైన్ గ్రోస్యెన్ తీవ్రంగా తప్పుబట్టాడు. ‘హ్యాలో అంటే నాకు అసహ్యం. ఇదేం బాగోలేదు. దీంతో నాకు అస్వస్థత అయిన అనుభవం కలిగింది’ అని స్పందించాడు. కానీ ఇప్పుడదే సంజీవనిగా అతనికి ఉపయోగపడింది. బరిలోకి పియెట్రో... హాస్ టీమ్ డ్రైవర్ గ్రోస్యెన్ తదుపరి రేసుకు దూరమవ్వడంతో హాస్ టీమ్ అతని స్థానాన్ని బ్రెజిల్ రిజర్వ్ డ్రైవర్ పియెట్రో ఫిటిపాల్డికి ఇచ్చింది. దీంతో సాఖిర్లోనే ఈ వారాంతంలో జరిగే రేసుతో పియెట్రో ఫార్ములావన్లో అరంగేట్రం చేయనున్నాడు. పియెట్రో కుటుంబానికి ఎఫ్1తో సుదీర్ఘ అనుబంధం ఉంది. పియెట్రో తాత ఎమర్సన్ 1972, 1974లో ఎఫ్1 వరల్డ్ చాంపియన్గా నిలిచారు. ఎమర్సన్ సోదరుడు విల్సన్... విల్సన్ తనయుడు క్రిస్టియన్ ఫిటిపాల్డి కూడా ఎఫ్1 రేసుల్లో పాల్గొన్నారు. కొన్నేళ్ల క్రితం నేను హ్యాలో సిస్టమ్ను వ్యతిరేకించాను. కానీ ఇప్పుడదే నన్ను కాపాడింది. ఇప్పుడు అది లేకుంటే నేనిలా మీ ముందు మాట్లాడేవాణ్నే కాదు. –గ్రోస్యెన్ -
ఫుట్ ఓవర్ బ్రిడ్జీల పనులు వేగిరం
* హైవేపై ఫుట్ ఓవర్ బ్రిడ్జీల నిర్మాణం * మరి.. సర్వీసు రోడ్లు ఎప్పటికి పూర్తయ్యేనో.. * నేటికీ పూర్తికాని భూసేకరణ చౌటుప్పల్ మండలం మల్కాపురం నుంచి కృష్ణాజిల్లా నందిగామ వరకు 181.5కి.మీ.ల మేర బీఓటీ పద్ధ్దతిన జీఎంఆర్ కాంట్రాక్ట్ సంస్థ నాలుగులేన్ల రహదారి విస్తరణను రూ.2200కోట్ల వ్యయంతో ఏడాదిన్నర క్రితం పూర్తి చేసింది. కానీ, నేటికీ సర్వీసు రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేయలేదు. పాదచారులు కూడా రోడ్డును దాటేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారు. డివైడర్పైనున్న బారీకేడ్లను దాటుతూ పడరానిపాట్లు పడుతున్నారు. దీంతో జాతీయ రహదారుల సంస్థ పాదచారుల కోసం ఫుట్ఓవర్ బ్రిడ్జీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. చౌటుప్పల్లో 2, చిట్యాలలో 1, కేతేపల్లిలో 1 చొప్పున, ఒక్కోదాన్ని రూ.1.05కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు. చౌటుప్పల్లోని బస్టాండ్ వద్ద, భాస్కర్ థియేటర్ వద్ద మరోటి నిర్మిస్తున్నారు. చిట్యాలలో కూడ ఒకదాని నిర్మాణం పూర్తికావొచ్చింది. మరోటి నిర్మాణంలో ఉంది. కేతేపల్లిలో కూడ పూర్తి కావొచ్చింది. కాగా, చౌటుప్పల్, చిట్యాలలో ఏర్పాటు చేయద ల్చిన ఎట్ గ్రేడ్ జంక్షన్ల నిర్మాణం నేటికీ ప్రారంభం కాలేదు. సర్వీసు రోడ్లు ఎప్పుడో... చౌటుప్పల్, చిట్యాల, మునగాల, నల్లబండగూడెం, పిల్లలమర్రి, రాయినిగూడెం, నకిరేకల్లలో రోడ్డును విస్తరించినా సర్వీసురోడ్ల నిర్మాణం చేపట్టడం లేదు. చౌటుప్పల్లో రెండు వైపులా నిర్మాణాలను పూర్తిగా కూల్చివేసినప్పటికీ, తంగడపల్లి క్రాస్రోడ్డు ఎదురుగా ఉన్న ఓ భవనం యజమాని కోర్టుకెళ్లడంతో, అధికారులు ఆ భవనం వైపు కన్నెత్తి చూడడం లేదు. బస్టాండ్ సమీపంలో సమాధులను కూడా తొలగించలేదు. సర్వీసు రోడ్డు వేసేందుకు ప్రస్తుతం మట్టిపనులు జరుగుతున్నా, ఇవి మాత్రం అడ్డంకిగా మారాయి. చిట్యాల మండల కేంద్రంలోనూ ఒక వైపు సర్వీసురోడ్డు నిర్మాణం పూర్తయింది. మరోవైపు కిలోమీటరున్నర మేర భూసేకరణ పూర్తికాక, భవన నిర్మాణాలే కూల్చివేయలేదు. నిర్వాసితులు కోర్టుకెళ్లడమే ఇందుకు కారణం. ఫలితంగా వర్షం కురిస్తే, వరద నీరు రోడ్లవెంటే నిల్వ ఉంటోంది. రోడ్డుకంటే తక్కువ ఎత్తులో భవన నిర్మాణాలుండడంతో, దుకాణాల్లోకి వర్షపు నీరు చేరుతోంది. చౌటుప్పల్లోనూ ఇదే పరిస్థితి. ప్రమాదాలు నిత్యకృత్యం గతంలో ఉన్న ఇరుకు రహదారిపై ప్రమాదకరమైన మూలమలుపులుండేవి. డేంజర్ జోన్లని బోర్డులుండేవి. హైవే విస్తరణ సమయంలో క్రాసింగ్లన్నింటినీ సరిచేస్తామని ఇరువైపులా భూసేకరణ కూడా అధికంగా చేశారు. కానీ కొన్నిచోట్ల డేంజర్ జోన్లు కాదు.. ఏకంగా డెత్ క్రాసింగ్లుగా మారాయి. చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం వద్ద అండర్పాస్ బ్రిడ్జి దిగగానే వాహనాలు తిరగలేని మూలమలుపు ఉంది. హైవే విస్తరణతో 120కిలోమీటర్లకు మించి వేగంతో వస్తున్న వాహనదారులు నేరుగా వచ్చి బోల్తా కొడుతున్నారు. చిట్యాల రైల్వే బ్రిడ్జి వద్ద ఉన్న మూలమలుపు పరిస్థితి అంతే. నార్కట్పల్లిలో బైపాస్ చివర, నార్కట్పల్లి నుంచి వచ్చే వాహనాలు కలిసే చోట జంక్షన్ను సరిగ్గా వేయలేదు. బ్రిడ్జి దిగే క్రమంలో వాహనాలు అతివేగంగా వస్తుంటాయి. ఇదే సమయంలో ఇక్కడ ఇరువైపులా నుంచి వచ్చే వాహనదారులు రోడ్డు దాటాలంటే ప్రమాదకరమైన పరిస్థితి నెలకొంది. సర్వీసురోడ్లు పూర్తికాకపోవడంతో ఇప్పటి వరకు చౌటుప్పల్లో 10మందికిపైగా, చిట్యాలలో 15 మందికిపైగా మంది మృత్యువాతపడ్డారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..
Beauty Tips: ఈ డివైస్ని వాడారో.. మీ ముఖం చక్కటి ఆకృతిలోకి..
హ్యాట్రిక్ కొట్టిన ఆర్సీబీ.. ఆ జట్లకు హెచ్చరిక
‘బినామీలు బయటపడతారు.. అదే చంద్రబాబు భయం’
దిగ్విజయ్ సింగ్ భావోద్వేగ లేఖలో ఏముంది?
KKR vs LSG: విజయం ఎవరిని వరిస్తుంది?
CSK vs PBKS: గెలుపు ఎవరిదో?
Children's Inspirational Story: 'యుద్ధకాంక్ష'! పూర్వం సింహపురిని..
సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..
ఇంకా తగ్గని లేఆప్స్ బెడద.. నాలుగు నెలల్లో 80 వేలమంది
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
- తోడేళ్ళను తరిమే రోజు!
Advertisement