-
ట్యాంక్ బండ్పై కారు బీభత్సం.. హుస్సేన్ సాగర్లోకి దూసుకెళ్లి..
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ట్యాంక్ బండ్ వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. ఎన్టీఆర్ మార్గ్లో ట్యాంక్ బండ్పై కారు అదుపు తప్పి హుస్సేన్ సాగర్ డివైడర్ మీదకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఎయిర్ బ్యాగ్ ఓపెన్ కావడంతో పెను ప్రమాదం తప్పింది. వివరాల ప్రకారం.. ట్యాంక్ బండ్పై ఉన్న ఎన్టీఆర్ మార్గ్లో ఆదివారం తెల్లవారుజామున కారు బీభత్సం సృష్టించింది. అతి వేగంలో ఉన్న కారు అదుపుతప్పి హుస్సేన్ సాగర్ డివైడర్ మీదకి దూసుకెళ్లి రెయిలింగ్ను ఢీకొట్టింది. ఈ క్రమంలో కొద్దిలో కారు హుస్సేన్ సాగర్లో పడిపోయే ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఇక, ప్రమాదం జరిగిన వెంటనే కారులో ఉన్న ఎయిర్ బ్యాగ్ తెరుచుకోవడంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. కాగా, ప్రమాదం తర్వాత వారిద్దరూ కారును అక్కడే వదిలేసి పరారయ్యారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ క్రమంలో కారులో ఉన్న మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఇక, మద్యం మత్తులో కారు నడిపినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు స్పష్టం చేశారు. మరోవైపు.. రాజేంద్రనగర్లోని అరాంఘర్ చౌరస్తాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు, బైక్ అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో బైక్పై ఉన్న వ్యక్తి మృతిచెందగా.. కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డారు. కారులో ఎయిర్ బెలూన్ తెరుచుకోవడంతో అతడికి ప్రమాదం తప్పింది. ఇది కూడా చదవండి: నా కొడుకు, భర్తను చంపేశారు..కనీసం వారి శవాలనైనా ఇప్పించండి.. -
HYD: గూగుల్ మ్యాప్తో రాంగ్ టర్న్.. చరణ్ ప్రాణం పోయింది
క్రైమ్: ఆ యువకుడు నగరానికి కొత్త. రూల్స్కు విరుద్ధమైనప్పటికీ.. ఇద్దరు స్నేహితురాళ్లను బైక్పై ఎక్కించుకుని నగరం చూద్దామని బయల్దేరాడు. దారి కోసం గూగుల్ మ్యాప్ను ఆశ్రయించాడు. కానీ, అది అతన్ని తప్పుదారి పట్టించింది. తప్పు దోవలో వెళ్తున్నామని గుర్తించి.. మలుపు తీసుకునేలోపే ఊహించని పరిణామం జరిగింది. ఆ యువ ఇంజనీర్ జీవితాన్ని రోడ్డు ప్రమాదం అర్థాంతరంగా ముగించేసింది. ఎంహెచ్ఎన్వీఎస్ చరణ్(22) స్వస్థలం కృష్ణాజిల్లా చిన్నగొల్లపాలెం గ్రామం. బీటెక్ పూర్తి చేసి పోచారం వద్ద ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. అక్కడ సమీపంలోని టౌన్షిప్లో స్నేహితులతో కలిసి ఉంటున్నాడు. వీకెండ్ కావడంతో నగరం చూద్దామని శనివారం స్నేహితులతో కలిసి బైక్లపై బయల్దేరారు. ఈ క్రమంలో ఇద్దరు స్నేహితురాళ్లను తన బైక్పై ఎక్కించుకున్నాడు చరణ్. ట్యాంక్ బండ్ మీద ఉన్నవి చూసుకుని.. దుర్గం చెరువు తీగల వంతెన చూద్దామని బయల్దేరారు. దారి తెలియక గూగుల్ మ్యాప్ను ఆశ్రయించారు. ముందు రెండు బైక్లు వెళ్లిపోగా.. గూగుల్ మ్యాప్ను అనుసరించి ఆరాంఘర్ వద్ద బైక్ను పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ మార్గం వైపు మళ్లించాడు. అయితే రెండు కిలోమీటర్లు ముందుకు వెళ్లాక తప్పు దారిలో వెళ్తున్నట్లు గుర్తించారు. బండిని యూటర్న్ తీసుకున్నాడు. గచ్చిబౌలి వెళ్లేందుకు పిల్లర్ నంబరు 82 వద్ద ఎక్స్ప్రెస్ వే నుంచి ర్యాంపు ద్వారా కిందకు వెళ్లేందుకు మలుపు తిరిగాడు. అదే సమయంలో ఆరాంఘర్ వైపు నుంచి వస్తున్న ఓ కారు చరణ్ నడుపుతున్న బండిని ఢీకొంది. తీవ్రంగా గాయపడిన చరణ్ రోడ్డుమీద కొద్దిసేపు కొట్టుమిట్టాడాడు. నిస్సహాయ స్థితిలో రక్తపు చేతులతో అక్కడికి వచ్చిన వారి పాదాలు పట్టుకొని కాపాడమంటూ సైగలు చేశాడు. ఆ సమయంలో రక్షించకపోగా.. కొందరు వీడియోలు, ఫొటోలు తీసి వైరల్ చేశారు. ఈలోపు ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు వచ్చి తీవ్రంగా గాయపడిన చరణ్ను, స్వల్పంగా గాయపడిన అతని స్నేహితురాళ్లను స్థానికంగా ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ చరణ్.. ఆదివారం ఉదయం కన్నుమూశాడు. స్వల్పగాయాలతో బయటపడిన యువతులు ప్రాథమిక చికిత్స అనంతరం ఇళ్లకు వెళ్లిపోయారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. మెహిదీపట్నం-శంషాబాద్ వరకు 11.6 కిలోమీటర్ల మేర పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే నిర్మించారు. ఈ మార్గంలో కార్లు, ఎయిర్పోర్ట్ వైపు వెళ్లే బస్సులు ప్రయాణించేందుకు మాత్రమే అనుమతి ఉంది. అయితే.. పర్యవేక్షణ లోపంతో కొందరు ద్వి, త్రి చక్ర వాహనదారులు ఆ రూట్లో ప్రయాణిస్తున్నారు. -
బాలరాజుకు సీపీఆర్ చేసిన ట్రాఫిక్ కానిస్టేబుల్
-
సుందరం.. సౌకర్యవంతం ! ఇక ఆరాం... ఘర్!
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలోని ఆరాంఘర్ జంక్షన్ను సకల హంగులతో, సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడానికి సిద్ధమైన జీహెచ్ఎంసీ త్వరలో పనులు ప్రారంభించనుంది. దేశంలోని ఏ ఇతర నగరానికీ తీసిపోని విధంగా నగరంలోని జంక్షన్లను అభివృద్ధి పరచాలన్న మునిసిపల్ మంత్రి కేటీఆర్ ఆదేశాలతో పట్టణ, నగర ప్రాంతాల్ని అందంగా తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేస్తున్న బెంగళూరుకు చెందిన ‘జన అర్బన్ స్పేస్’ రూపొందించిన డిజైన్తో ఆరాంఘర్ జంక్షన్ను తీర్చిదిద్దే చర్యలకు జీహెచ్ఎంసీ అధికారులు సిద్ధమయ్యారు. ఆరాంఘర్ జంక్షన్ విశాలంగా ఉన్నప్పటికీ ప్రస్తుతం పాదచారులు రోడ్డు ఒకవైపు నుంచి మరో వైపు వెళ్లాలంటే ముప్పుతిప్పలు పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రమాదాల బారిన పడుతున్నారు. ఆర్టీసీ బస్సులు సైతం ఎక్కడ పడితే అక్కడ ఆగుతుండటంతో ఉరుకులు పరుగులు పెడుతున్నారు. అండర్పాస్ సైతం ఉన్నప్పటికీ రోడ్డుపై వాహనాల రాకపోకలతో గందరగోళ పరిస్థితులేర్పడుతున్నాయి. కొత్త డిజైన్తో జంక్షన్ను అభివృద్ధి చేయడం వల్ల ఈ పరిస్థితులు మారనున్నాయి. పాదచారులు సులభంగా రోడ్లు దాటేలా జీబ్రాక్రాసింగ్స్ ఉంటాయి. ఆర్టీసీ బస్సులు నిర్ణీత ప్రదేశాల్లో నిలిచే ఏర్పాట్లుంటాయి. వీటితోపాటు జంక్షన్లోని నాలుగువైపులా రోడ్లకు అందమైన ఫుట్పాత్లు, జంక్షన్ మధ్యలో పచ్చదనంతో పరిసరాలు ఆహ్లాదంగా ఉంటాయి. ప్రయాణికులు సేద దీరేందుకు బెంచీల ఏర్పాట్లు తదితర సదుపాయాలుంటాయి.ఈ పనుల అంచనా వ్యయం రూ.2.63 కోట్లు. జంక్షన్ అభివృద్ధి ఇలా.. ►జంక్షన్ నలువైపులా పాదచారులు సులభంగా రోడ్డు దాటేలా జీబ్రాక్రాసింగ్స్ వంటివి ఏర్పాటు చేస్తారు. ►జంక్షన్ మధ్య వలయాకార ప్రదేశంలో పచ్చదనం పెంపుతోపాటు ఫౌంటెన్లు తదితరమైనవి ఏర్పాటు చేసి అందంగా కనిపించేలా చేస్తారు. ►వాహనాలు సాఫీగా మలుపు తిరిగేలా రోడ్డును విశాలం చేస్తారు. ►జంక్షన్కు నలువైపులా బస్టాప్లు. ఎటు వైపు వెళ్లే బస్సును ఎక్కాలనుకుంటే పాదచారులు అటువైపు వెళ్లేందుకు వీలుగా అన్ని వైపుల నుంచీ తగిన సదుపాయం. ►ఫ్రీ లెఫ్ట్ కోసం ప్రత్యేక మార్కింగ్స్, తదితర ఏర్పాట్లు. ►రాత్రివేళ సైతం జంక్షన్ అందంగా కనిపించేందుకు ప్రత్యేక లైటింగ్ ఏర్పాట్లు. ►త్వరలోనే పనులు చేపట్టి, ఆర్నెళ్లలో పూర్తిచేస్తామని జీహెచ్ఎంసీ అధికారులు పేర్కొన్నారు. 12 జంక్షన్ల గుర్తింపు... నగర ఖ్యాతిని ఇనుమడింపచేసేలా జోన్కు రెండు చొప్పున జంక్షన్లను ఇలా అభివృద్ధి చేయాలని తొలుత భావించారు. ఆమేరకు 12 జంక్షన్లను గుర్తించారు. వాటిల్లో ఆరాంఘర్తోపాటు ఐఎస్ సదన్, హబ్సిగూడ, కొత్తపేట, సోమాజిగూడ, పంజగుట్ట, మియాపూర్, గుల్ మొహర్కాలనీ, నారాయణగూడ, సంగీత్ తదితర జంక్షన్లున్నాయి. వీటిని జన అర్బన్స్పేస్ డిజైన్లతో తీర్చిదిద్దనున్నారు. మంత్రి ఆదేశాల నేపథ్యంలో వీటితోపాటు మరో 48 జంక్షన్లను కూడా తీర్చిదిద్దేందుకు జీహెచ్ఎంసీ అధికారులు సిద్ధమయ్యారు. -
అరంఘర్ చౌరస్తా వద్ద అగ్నిప్రమాదం
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement