-
జూబ్లీహిల్స్ : అక్షర ఆనంద్ ఆధ్వర్యంలో వైట్ నైట్ థీమ్తో వేడుక (ఫొటోలు)
-
బెంగాల్ గవర్నర్గా మాజీ బ్యూరోక్రట్
న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్ గవర్నర్గా మాజీ బ్యూరోక్రట్ సీవీ ఆనంద బోస్(71)ను నియమించింది రాష్ట్రపతి భవన్. ఈ మేరకు గురువారం ఆనంద బోస్ నియామకాన్ని ధృవీకరించింది. ఆయన బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి నియామకం అమల్లోకి వస్తుందని రాష్ట్రపతి భవన్ ప్రెస్ సెక్రటరీ అజయ్ కుమార్ పేరిట విడుదలైన సర్క్యులర్ వెల్లడించింది. గతంలో బెంగాల్ గవర్నర్గా ఉన్న ధన్ఖడ్ ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి మణిపూర్ గవర్నర్ లా గణేశన్ అయ్యర్ ప్రస్తుం అదనపు బాధ్యతలు చేపట్టారు. అయితే.. గవర్నర్ గణేశన్, బెంగాల్ ప్రభుత్వంతో సన్నిహితంగా మెదలడంపై ప్రతిపక్ష బీజేపీ అసంతృప్తితో రగిలిపోతోంది. ఈ క్రమంలో బెంగాల్కు పూర్తి స్థాయి గవర్నర్ను నియమించాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు విజ్ఞప్తులు చేస్తూ వస్తోంది. రిటైర్డు ఐఏఎస్ అధికారి అయిన బోస్ కేరళలోని కొట్టాయంకు చెందినవారు. జవహార్లాల్ నెహ్రూ ఫెలోషిఫ్కు ఎంపికయ్యారు ఆయన. ముస్సోరీలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీతోనూ ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉంది. రచయితగా ఆంగ్లం, మలయాళం, హిందీ భాషల్లో 40 పుస్తకాలు రాశారు. ఎన్నో నవలలు, లఘు కథలు, పద్యాలు, ఉపన్యాసాలు రచించారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వంతోనూ ఆయన మంచి సంబంధాలు ఉన్నాయి. ప్రధాని మోదీ హయాంలో అభివృద్ధి కోసం ఏర్పాటైన ఓ సంస్థలో ఆయన చైర్మన్గా పని చేశారు. అంతేకాదు.. ఆయన రూపొందించిన ‘అందరికీ సరసమైన గృహాలు’ అనే భావన కేంద్ర ప్రభుత్వ ఆమోదం పొందింది కూడా. -
ఎల్ఐసీ ఆనంద మొబైల్ యాప్ ఆవిష్కరణ
ముంబై: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) తమ ఏంజెట్లు, మధ్యవర్తుల కోసం ఆత్మ నిర్భర్ ఏజెంట్ న్యూ బిజినెస్ డిజిటల్ అప్లికేషన్ (ఆనంద) పేరుతో మొబైల్ యాప్ను తీసుకొచ్చింది. కంపెనీ చైర్పర్సన్ ఎంఆర్ కుమార్ ఈ యాప్ను ఆవిష్కరించారు. అత్యాధునిక ఫీచర్లను కలిగి ఉన్న ఈ యాప్ ద్వారా ద్వారా డిజిటల్గా కేవైసీ పక్రియను పూర్తి చేయవచ్చు. కాగితం అవసరం లేకుండా పాలసీలను డిజిటల్ రూపంలో మంజూరు చేయవచ్చు. ఏజెంట్ ఇంటికి రావల్సిన పనిలేకుండానే కస్టమర్లు కొత్తగా ఎల్ఐసీ పాలసీ తీసుకోవచ్చని ఎంఆర్ కుమార్ తెలిపారు. -
’ఆనందో’ఖర్మ!
మృత్యుద్వారం పునఃప్రారంభం! మొగల్తూరు ఆనంద ఫ్యాక్టరీలో భద్రతా చర్యలకు అనుమతి ప్రారంభమైన పనులు ఇక కార్యకలాపాల మొదలే తరువాయి నిండా 30 ఏళ్లు నిండని యువకులను బలిగొన్న ఆ మృత్యుద్వారం తెరుచుకోబోతుందా..! దీనికి Ðసర్కారు గ్రీన్సిగ్నల్ ఇచ్చిందా..! అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తే అవుననే సమాధానం వస్తోంది. మొగల్తూరు ఆనంద ఫ్యాక్టరీలో దుర్ఘటన జరిగి ఐదునెలలు గడవకముందే అందులో భద్రతా చర్యలకు అధికారులు అనుమతులు ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. యాజమాన్యం చేపట్టే పనులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నరసాపురం, మొఘల్తూరు : అసలేం జరిగింది...! ఈ ఏడాది మార్చి 30న నరసాపురం తీరప్రాంతం గజగజ వణికిపోయింది. మొగల్తూరు మండలం నల్లవారితోటలోని ఆనంద రొయ్యల ఫ్యాక్టరీలో వ్యర్థాలను నిల్వ ఉంచే ట్యాంకును శుభ్రం చేస్తుండగా అందులో విడుదలైన విషవాయువుకు ఐదుగురు యువకులు బలయ్యారు. మృత్యుఒడికి చేరారు. ప్రమాదంలో నరసాపురం మండలం సీతారామపురం గ్రామానికి చెందిన ఈగ ఏడుకొండలు(22). మొగల్తూరు కట్టుకాలువకు చెందిన తోట శ్రీనివాస్(30), నల్లంవారితోటకు చెందిన నల్లం ఏడుకొండలు(22), మొగల్తూరు మండలం కాళీపట్నంకు చెందిన జక్కంశెటి ప్రవీణ్(23), మొగల్తూరు మండలం మెట్టిరేవుకు చెందిన బొడ్డు రాంబాబు(22) ప్రాణాలు విడిచారు. దీంతో గ్రామస్తుల ఆగ్రహం కట్టెలు తెంచుకుంది. ఫ్యాక్టరీ యజమానులపై చర్యలు తీసుకోవాలని, ఫ్యాక్టరీ కార్యకలాపాలు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. మృతదేహాలతో ఫ్యాక్టరీ వద్ద ఆందోళన చేపట్టారు. వైఎస్సార్ సీపీ, వామపక్షాలతోపాటుగా ప్రజలు, రైతులు, మత్స్యకారులు ఇలా.. అంతా ఏకమై నినదించారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైయ్యింది. అసెంబ్లీ సమావేశాల్లోనూ ప్రకంపనలు పుట్టించింది. ఫ్యాక్టరీ తెరిచేందుకు సన్నాహాలు ప్రమాదం జరిగి ఐదునెలలు కూడా ఇంకా పూర్తి కాకుండానే ఫ్యాక్టరీ తెరిచే సన్నాహాలు మొదలయ్యాయి. ఫ్యాక్టరీ యజమాన్యం భద్రతా చర్యలు చేపట్టని కారణంగానే ప్రమాదం జరిగిందని తేల్చి చేతులు దులుపుకున్న ప్రభుత్వం ఫ్యాక్టరీని తిరిగి తెరిపించేందుకు అనుమతులు ఇచ్చింది. ఫ్యాక్టరీలో భద్రతా చర్యలకు సంబంధించిన పనులు చేపట్టడానికి కలెక్టర్ కాటంనేని భాస్కర్ అనుమతి ఇచ్చారు. దీంతో శనివారం ఫ్యాక్టరీ యాజమాన్యం మొదటి దశగా మరమ్మతులు చేపట్టింది. ఇక రెండో దశలో ఫ్యాక్టరీ వ్యవహారాలు పునప్రారంభించడమే తరువాయి. ఇది లాంఛనమేనని వచ్చే నెలలో ఫ్యాక్టరీ ప్రారంభమవుతుందని చెబుతున్నారు. ఘోరం జరిగినప్పుడు హడావుడి తుందుర్రు ఆక్వా ఫుడ్పార్క్ను వ్యతిరేకిస్తూ.. ఆ ప్రాంతం ప్రజలు ఆందోళన చేస్తున్న క్రమంలో మొగల్తూరు రొయ్యల ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదం ప్రభుత్వ వెన్నులో చలిపుట్టించింది. ప్రభుత్వం తరపున మంత్రులు, జిల్లా ఉన్నతాధికారులు మొగల్తూరు వచ్చి బాధితులను, ఆందోళనకారులను చల్లబరిచే యత్నంచేశారు. మృతుల కుటుంబాలకు పరిహారం ఇస్తామని ప్రకటించారు. మంత్రులే దగ్గరుండి మృతదేహాలకు పోస్టుమార్టం చేయించారు. ఫ్యాక్టరీ యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. 304 ఏ సెక్షన్ ప్రకారం.. ఫ్యాక్టరీ యజమానులపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేస్తామని అప్పటి ఎస్పీ భాస్కర్భూషణ్ ప్రకటించారు. ఈ హడావుడి చూసి కాలుష్య ఫ్యాక్టరీ గ్రామం నుంచి వెళ్లిపోతుందని స్థానికులు సంబరపడ్డారు. సీన్ కట్ చేస్తే.. రోజులు గడిచాయి. దుర్ఘటన జరిగిన రోజు ఒక విధంగా మాట్లాడిన మంత్రులు, ఎమ్మెల్యేలు మాట మార్చారు. అసెంబ్లీలో ఈ అంశంపై అప్పటికి కార్మికశాఖ మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు నిబంధనల మేరకే మొగల్తూరు ఫ్యాక్టరీ పని చేస్తుందని ప్రకటించారు. తుందుర్రు ఫ్యాక్టరీతో సహా ఆనంద ఫ్యాక్టరీకూడా అసలు కాలుష్య కారకమైనది కాదని బుకాయించారు. ఫోరెన్సిక్ నివేదికలోనూ ఐదుగురుప్రాణాలు పోవడానికి అమ్మోనియా గ్యాస్ ప్రభావమే కారణమని తేలినా.. ప్రభుత్వ మొండి వైఖరి మారలేదు. కేవలం ఫ్యాక్టరీ యజమాన్యంలో ఒక్కరిని మాత్రమే అరెస్ట్ చూపించి చేతులు దులుపుకుంది. ఇప్పుడు మళ్లీ ఫ్యాక్టరీని తెరిచేందుకు అనుమతిస్తోంది. భద్రతపై అనుమానాలు ఇప్పుడు మళ్లీ ఫ్యాక్టరీ తెరిస్తే కార్మికుల ప్రాణాలు భద్రమేనా అనే అనుమానాలు స్థానికులను వెంటాడుతున్నాయి. భద్రతకు ఫ్యాక్టరీ యాజమాన్యం ఇస్తుందా? పటిష్ట చర్యలు తీసుకుంటుందా? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. గొంతేరుపై మళ్లీ కాలుష్యవల! ఆనంద ఫ్యాక్టరీలో ప్రమాదానికి కారణమైన ట్యాంకు గొట్టాలు నేరుగా గొంతేరు డ్రెయిన్లో కలిపి ఉన్నాయి. ఈ విషయాన్ని ప్రమాదం జరిగిన తరువాత వైఎస్సార్ సీపీ జిల్లా నాయకత్వం స్వయంగా ఇక్కడకు వచ్చి మీడియా ముందు బట్టబయలు చేసింది. ఫ్యాక్టరీ ప్రారంభం నుంచీ వ్యర్థాలను నేరుగా గొంతేరు డ్రెయిన్లో కలుపుతున్నారు. దీంతో డ్రెయిన్ కలుషితమవుతోంది. ఫ్యాక్టరీ మూతపడిన ఈ ఐదు నెలల్లో స్థానికంగా గొంతేరు డ్రెయిన్ నీరు స్వచ్ఛంగా మారడమే కాకుండా మత్స్యసంపద విపరీతంగా పెరిగింది. ఇప్పుడు మళ్లీ ఫ్యాక్టరీ ప్రారంభమైతే యాజమాన్యానికి మరో అవకాశం లేదు. కచ్చితంగా వ్యర్థాలను మళ్లీ గొంతేరు డ్రెయిన్లోనే కలిపాలి. లేదంటే తుందుర్రులో చెబుతన్నట్టు సముద్ర ప్రాంతానికి పైప్లైన్లు లాంటివి వేస్తారా? అసలు ఫ్యాక్టరీ లోపల ఎలాంటి భద్రతా చర్యలు చేపడతారనే దానిపై స్పష్టతలేదు. కమిటీ ఏదీ? మరోవైపు ప్రమాదం జరిగిన తరువాత కొత్తగా కార్మికశాఖను అలంకరించిన జిల్లా నేత పితాని సత్యనారాయణ ఈ ప్రమాదంపై కమిటీ వేస్తానని ప్రకటించారు. మళ్లీ అలాంటి ఊసేలేదు. స్థానికులతో ఇంత వరకూ మాట్లాడిన పాపాన పోలేదు. ఫ్యాక్టరీ చుట్టుప్రక్కల గ్రామాల వారు అంతా ఇక కంపెనీ తెరుచుకోదనే భ్రమలో ఉన్నారు. ఇంత ఘోరం జరిగిన తరువాత కుడా స్థానికులతోనూ, రాజకీయ పక్షాల నేతలు, రైతులతోనూ ఎలాంటి సంప్రదింపులు జరుపకుండా మొగల్తూరు ఫ్యాక్టరీని మొండిగా తెరిపింపించే ప్రయత్నం చేయడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. -
ఎన్నాళ్లు కాపాడతారు
నరసాపురం : మొగల్తూరులోని ఆనంద ఆక్వా ప్లాంట్లో ఐదుగురు కూలీల ఉసురు తీసింది విష వాయువులేనని తేలిపోయింది. ఆ ప్లాంట్లో మార్చి 30న చోటుచేసుకున్న ఈ ఘోరానికి విద్యుదాఘాతమే కారణమని.. అక్కడి ప్లాంట్ నుంచి ఎలాంటి విష వాయువులు వెలువడలేదని నమ్మించేందుకు ప్లాంట్ యాజమాన్యం, నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు సహా మరికొంతమంది ప్రజాప్రతినిధులు తీవ్రంగా ప్రయత్నిసూ్తనే ఉన్నారు. తద్వారా కేసును పక్కదారి పట్టించి.. యాజమాన్యాన్ని ఒడ్డున పడేయడంతోపాటు తుందుర్రులో నిర్మిస్తున్న ఆక్వా పార్క్ నిర్మాణానికి వ్యతిరేకంగా ఉధృతంగా సాగుతున్న ఉద్యమంపై నీళ్లు చల్లేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ప్రభుత్వం ఓ అడుగు ముందుకేసి ఆక్వా పార్క్ యాజమాన్యం తరఫున వకాల్తా పుచ్చుకుంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పారిశ్రామిక అభివృద్ధి ముసుగులో తరచూ ఆక్వా పార్క్కు అనుకూల ప్రకటనలు చేసూ్తనే ఉన్నారు. మొగల్తూరు ప్లాంట్లో కాలుష్యమే లేదని రాష్ట్ర మంత్రులు అసెంబ్లీ వేదికగా పచ్చి అబద్ధాలతో కూడిన ప్రకటనలు చేశారు. కాలుష్యం కళ్లముందే కనబడుతున్నా.. అలాంటిదేమీ లేదని ఇప్పటికీ బొంకుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఫోరెన్సిక్ విభాగం వాస్తవాలను నిగ్గుతేల్చింది. అమోనియా, హైడ్రోజన్ సల్ఫైడ్ వంటి విషవాయువులే మరణా లకు కారణమైనట్టు ఫోరెన్సిక్ నిపుణులు స్పష్టం చేశారు. అయినా.. మౌనముద్రలోనే మొగల్తూరు ఆనంద ఆక్వా ప్లాంట్లోని వ్యర్థాలను శుభ్రం చేసేందుకు మార్చి 30న ఉదయం నరసాపురం మండలం సీతారామపురం గ్రామానికి చెందిన ఈగ ఏడుకొండలు (22), మొగల్తూరు కట్టుకాలువకు చెందిన తోట శ్రీనివాస్ (30), నల్లంవారి తోటకు చెందిన నల్లం ఏడుకొండలు (22), మొగల్తూరు మండలం కాళీపట్నంకు చెందిన జక్కంశెట్టి ప్రవీణ్ (21), మొగల్తూరు మండలం మెట్టిరేవుకు చెందిన బొడ్డు రాంబాబు (22) ట్యాంకులోకి దిగారు. ఒకరి తరువాత ఒకరు క్షణాల్లోనే ప్రాణాలు వదిలారు. ఇందుకు కారణమైన ట్యాంక్ నుంచి సుమారు వారం రోజులపాటు విష వాయువుల ఆనవాళ్లు కనిపించాయి. అయినప్పటికీ.. ఐదుగురి మరణానికి విషవాయువులు కారణం కాదనే వాదనను తెరమీదకు తెచ్చారు. ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి అందిన నివేదిక వాస్తవాన్ని వెల్లడి చేయడంతో ఆక్వా ప్లాంట్ యాజమాన్యమే ఇందుకు కారణమని తేలిపోయింది. నరసాపురం ప్రభుత్వాసుపత్రికి మూడు రోజుల క్రితమే ఫోరెన్సిక్ నివేదిక అందగా.. ఆసుపత్రి సూపరింటెండెంట్ దానిని డీఎస్పీ జి.పూర్ణచంద్రరావుకు అందజేశారు. ప్రమాదం జరిగిన రోజున విషవాయువులే ప్రమాదానికి కారణమని.. ఇందులో ఆనంద యాజమాన్యం నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని జిల్లా కలెక్టర్, ఎస్పీతోపాటు రాష్ట్ర మంత్రులు సైతం ప్రకటించారు. యాజమాన్యంపై కేసు నమోదు చేశామని కూడా చెప్పారు. ఆ మరుసటి రోజునుంచి దర్యాప్తును గాలికొదిలేశారు. ఫోరెన్సిక్ నివేదిక వస్తే తప్ప తామేమీ చేయలేమని చేతులెత్తేశారు. ఆ నివేదిక అంది మూడురోజులు గడిచినా.. పోలీస్ యంత్రాంగం నేటికీ మీనమేషాలు లెక్కిస్తోంది. న్యాయ నిపుణులతో చర్చిస్తున్నామని, అనంతరమే ముందుకు వెళతామని పోలీస్ అధికారులు కొత్త పల్లవి అందుకున్నారు. ఉద్యోగుల్ని బలిపెడతారా! ఐదుగురి ప్రాణాలు హరించిన పాపం నుంచి యాజమాన్యాన్ని రక్షించే ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆ ప్లాంట్లో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులపై కేసులు నమోదుచేసి యాజమాన్యాన్ని తప్పించేందుకు కుట్ర పన్నుతున్నారనే ప్రచారం సాగుతోంది. ఘటన జరిగిన రోజున మంత్రులు దగ్గరుండి మరీ పోస్టుమార్టం ప్రక్రియను పర్యవేక్షించారు. అందువల్ల పోస్టుమార్టం నివేదిక తారుమారయ్యే అవకాశం ఉందనే విమర్శలు ఇంకా వినిపిస్తున్నాయి. పోస్టుమార్టం అనంతరం పోలీసులు కాపలా ఉండిమరీ ఆ రోజు అర్ధరాత్రి హడావుడిగా అంత్యక్రియలు జరిపించడం దీనికి బలం చేకూరుస్తోంది. ఇదిలావుంటే.. ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా ఆక్వా ప్లాంట్ యాజమాన్యంపై హత్యానేరం కింద కేసులు నమోదు చేయాలనే డిమాండ్తో ఆందోళనలు మొదలయ్యాయి. ప్రభుత్వం కళ్లు తెరవాలి విష వాయువుల కారణంగానే మొగల్తూరు ఆక్వాప్లాంట్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారనే విషయం వెల్లడైంది. ఫోరెన్సిక్ నివేదిక ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిది. ఇకనైనా పంతానికి పోకుండా ప్రభుత్వం కళ్లు తెరవాలి. 40 గ్రామాల ప్రజలు వ్యతిరేకిస్తున్న తుందుర్రు ఆక్వాపార్క్ను తీరానికి తరలించాలి. ఆక్వా ప్లాంట్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి. – ముదునూరి ప్రసాదరాజు, మాజీ ఎమ్మెల్యే మంత్రులూ.. ఇప్పుడేమంటారు ప్రమాదం సాధారణంగా జరిగిందని, అక్కడ ఎలాంటి కాలుష్యం లేదని అసెంబ్లీలో అప్పటి మంత్రులు బుకాయించారు. ఎంపీ గోకరాజు గంగరాజు అయితే ఇది కరెంట్ షాక్ వల్లే జరిగిందన్నారు. ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన నేపథ్యంలో మంత్రులు ఏం చెబుతారు. ప్రజల రక్షణపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఇప్పటికైనా మంత్రులు కళ్లు తెరిచి వారి ప్రకటనల్ని వెనక్కి తీసుకోవాలి. – శిరిగినీడి నాగభూషణం, నాయకుడు, సర్వోదయ రైతు సంఘం హత్యానేరం కింద కేసు నమోదు చేయాలి మొగల్తూరు ఆక్వా ప్లాంట్ యాజమాన్యంపై హత్యానేరం కింద కేసులు నమోదు చేయాలి. ఇది ప్రభుత్వ నిర్ల క్ష్యం, యాజమాన్యం అలసత్వం వల్లే జరిగిందనేది ఫోరెన్సిక్ నివేదిక ద్వారా తేలిపోయింది. అసలు ఇప్పటికే యాజమాన్యంపై కేసు నమోదు చేయాలి. ఇప్పుడు కూడా యాజమాన్యాన్ని రక్షించాలనుకుంటే అంతకంటే దారుణం ఉండదు. – బి.బలరామ్, సీపీఎం జిల్లా కార్యదర్శి న్యాయ సలహాతో ముందుకెళ్తాం మొగల్తూరు ఘటనకు సంబంధించి ఫోరెన్సిక్ నివేదిక అందింది. దానిని పరిశీలిస్తున్నాం. దీనిపై న్యాయ సలహా తీసుకుని కేసు విషయంలో ముందుకు వెళ్తాం. ఐదుగురు మృత్యువాత పడిన ఘటనకు సంబంధించి అప్పట్లోనే కేసు నమోదైంది. ప్రత్యేకంగా మళ్లీ కేసు నమోదు చేయాల్సిన అవసరం లేదు. కేసు దర్యాప్తులో ఉంది. ప్రస్తుతానికి ఇంతకుమించి వివరాలు చెప్పలేం. – జి.పూర్ణచంద్రరావు, డీఎస్పీ, నరసాపురం
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement