-
పవన్ ఫ్యాన్స్ కూడా అమర్ నాథ్ వైపు..
-
హత్య చేసింది ‘తమ్ముడే’
సాక్షి, పుట్టపర్తి: ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీ నేతలు శవ రాజకీయాలు చేయాలని చూస్తున్నారు. వ్యక్తిగత కక్షలతో హత్య జరిగినా.. రాజకీయ రంగు పూసి సానుభూతి కోసం వెంపర్లాడుతున్నారు. టీడీపీ కార్యకర్తలే హత్య చేసినా.. బురద మాత్రం అధికారపార్టీపై వేసి లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారు. చివరకు అసలు విషయం తెలియడంతో ప్రజల్లో అభాసుపాలు అవుతున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం నల్లమాడ మండలం కుటాలపల్లిలో జరిగిన హత్య విషయంలోనూ టీడీపీ నేతల దుష్ప్రచారం బట్టబయలైంది. కుటాలపల్లిలో ఈ నెల 24వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో దుద్దుకుంట అమరనాథ్రెడ్డి (40) అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. వ్యక్తిగత కక్షలతోనే హత్య జరిగినట్లు అదే రోజున పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అదేమీ పట్టించుకోకుండా మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి శవ రాజకీయానికి తెర లేపారు. దానిని రాజకీయ హత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. పల్లె రఘునాథరెడ్డితో పాటు చంద్రబాబు, అచ్చెన్నాయుడు సైతం అసత్య ప్రచారం చేశారు. ఈ హత్య ఘటనపై శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ మాధవరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగి.. నిందితులను అరెస్టు చేశాయి. వివాహేతర సంబంధం కారణంగానే దుద్దుకుంట అమరనాథ్రెడ్డి హత్య జరిగిందని, ఇందులో ఎలాంటి రాజకీయమూ లేదని ఎస్పీ మాధవరెడ్డి బుధవారం మీడియాకు వెల్లడించారు. అమరనాథ్రెడ్డి సమీప బంధువైన దుద్దుకుంట శ్రీనివాసరెడ్డి ఈ హత్య చేశారని వెల్లడించారు. అతనితో పాటు నిందితులుగా ఉన్న గుండ్రా వీరారెడ్డి, మల్లెల వినోద్కుమార్, రమావత్ తిప్పేబాయిలను అరెస్టు చేసి రిమాండ్కు పంపించామని తెలిపారు. నిందితుడు టీడీపీ కార్యకర్త దుద్దుకుంట అమరనాథ్రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు అయిన దుద్దుకుంట శ్రీనివాసరెడ్డి కొన్నేళ్లుగా టీడీపీలో కొనసాగుతున్నాడు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడు. గతంలో కూడా కుటాలపల్లిలో చిన్న చిన్న ఘర్షణల్లో అతడు నిందితుడిగా ఉన్నాడు. ఇవన్నీ తెలిసినా కూడా పల్లె రఘునాథరెడ్డి అధికార పార్టీ వైపు కేసును తోసే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు రంగంలోకి దిగడంతో వాస్తవాలు వెలుగు చూశాయి. ఎన్నికల సమయంలో రాజకీయ లబ్ధి పొందాలని టీడీపీ పెద్దలు చేసిన కుట్రలను చూసి స్థానికులు మండిపడుతున్నారు. హత్యకు కారణాలివీ.. కుటాలపల్లికి చెందిన తిప్పేబాయితో కొన్నేళ్లుగా దుద్దుకుంట శ్రీనివాసరెడ్డి వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. అయితే ఇటీవలి కాలంలో అమరనాథ్రెడ్డితో ఆమె సన్నిహితంగా ఉండటాన్ని జీర్ణించుకోలేని శ్రీనివాసరెడ్డి ఆమెను ప్రశ్నించాడు. తనకు ఆర్థిక సాయం చేశాడు కాబట్టి అతన్ని వదలలేనని తేల్చి చెప్పింది. దీంతో అమరనాథ్రెడ్డిని చంపేయడానికి శ్రీనివాసరెడ్డి పథకం రచించాడు. తనకు సన్నిహితంగా ఉండే వీరారెడ్డితో పాటు చైన్ స్నాచింగ్ కేసుల్లో జైలు జీవితం అనుభవించి బయటకు వచ్చిన మల్లెల వినోద్కుమార్ సాయం కోరాడు. గత ఆదివారం రాత్రి అమరనాథ్రెడ్డి పొలం వద్దకు వెళ్లగా.. మల్బరీ ఆకులు కోసే కత్తితో మెడ, ముఖం, తలపై నరికి చంపేశారు. మరుసటి రోజు ఉదయమే పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా.. వివాహేతర సంబంధం కారణంగానే హత్య చేసినట్లు ప్రాథమికంగా తేలింది. -
పచ్చ కుట్ర భగ్నం.. టీడీపీ నేతలే చంపారు
-
‘శవా’లెత్తిపోతున్న టీడీపీ
సాక్షి, పుట్టపర్తి: వైఎస్సార్సీపీని నేరుగా ఎదుర్కొనే సత్తా లేక టీడీపీ నేతలు శవాలను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారు. వ్యక్తిగత కక్షలతో హత్యలు జరిగినా రాజకీయ రంగు పులుముతున్నారు. టీడీపీలో ఏనాడూ తిరగని వ్యక్తిని కూడా తమ కార్యకర్తగా చెప్పుకుంటూ శవ రాజకీయాలకు తెరతీశారు. వివరాల్లోకి వెళితే.. శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గ పరిధిలోని నల్లమాడ మండలం కుటాలపల్లిలో అమరనాథ్రెడ్డి అనే వ్యక్తి సోమవారం వేకువజామున హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు మారణాయుధాలతో దాడిచేసి అతడిని చంపారు. ఎస్పీ ఎస్వీ మాధవరెడ్డి ఆదేశాల మేరకు హత్య కేసును ఛేదించేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఎవరిపైనా అనుమానం లేదని అమర్నాథ్రెడ్డి భార్య సుధమ్మ చెబుతోంది. ఎవరితోనూ భూ సమస్యలు, ఆర్థిక లావాదేవీల్లో విభేదాలు లేవని, ఎందుకు చంపారో పోలీసులే తేల్చి చర్యలు తీసుకోవాలని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఆదివారం రాత్రి పొలానికి వెళ్లిన తన భర్త ఉదయం ఇంటికి రాలేదని, ఆరా తీయగా హత్యకు గురైనట్టు తేలిందని ఆమె చెప్పారు. ‘పల్లె’ రాద్ధాంతం హతుడు అమరనాథ్రెడ్డి ఏనాడూ టీడీపీ కార్యక్రమాల్లో కనిపించలేదు. అయినప్పటికీ ఈ హత్యకు రాజకీయ రంగు పులిమి లబ్ధి పొందాలని టీడీపీ నేత, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ప్రయత్నించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు టీడీపీ అధిష్టానానికి సమాచారం ఇచ్చారు. పల్లె చెప్పిన వెంటనే నిజానిజాలు కూడా తెలుసుకోకుండా చంద్రబాబు, లోకేశ్, అచ్చెన్నాయుడు సామాజిక మాధ్యమాల వేదికగా రాజకీయ హత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఇందులో ఎలాంటి రాజకీయమూ లేదని పోలీసులు చెబుతున్నా.. వినకుండా అవాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. డీఎస్పీ ఏమంటున్నారంటే.. అమరనాథ్రెడ్డి కేవలం వ్యక్తిగత కారణాలతోనే హత్యకు గురైనట్టు ప్రాథమిక విచారణలో తేలిందని పుట్టపర్తి డీఎస్పీ వాసుదేవన్ తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులు ఈ హత్య చేసినట్టు తెలుస్తోందన్నారు. నిందితుల కోసం గాలిస్తున్నామని చెప్పారు. హత్య కేసును వీలైనంత త్వరగా ఛేదిస్తామన్నారు. హత్య వెనుక ఎవరు ఉన్నా.. చట్టం ముందు నిలబెడతామని తెలిపారు. అమరనాథ్రెడ్డి హత్య వెనుక ఎలాంటి రాజకీయ కోణమూ లేదని ఆయన స్పష్టం చేశారు. -
రణన్నినాదం
సాక్షి, రాయచోటి: ఇన్నాళ్లూ సామాజిక సాధికారత అంటే ఒక నినాదంగానే వింటూ వచ్చామని, కానీ వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కాగానే దాన్ని ఒక విధానంలా అమలు చేశారని బడుగు, బలహీనవర్గాలు, మైనార్టీ నేతలు కొనియాడారు. సామాజిక విప్లవమే జగనన్న విధానం అని స్పష్టం చేశారు. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో గురువారం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో సామాజిక సాధికార బస్సు యాత్ర నిర్వహించారు. సభకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. రింగ్రోడ్డు సర్కిల్ నుంచి శివాలయం వరకు మెయిన్రోడ్డు మీదుగా వేలాది మందితో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. జెడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథరెడ్డి, ఎమ్మెల్సీలు రమేష్ యాదవ్, రామసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మైనార్టీలకు ఎంతో మేలు మైనార్టీలకు సీఎం జగన్ చేసిన మేలు అంతా ఇంతా కాదని డిప్యూటీ సీఎం అంజాద్బాషా, శాసనమండలి డిప్యూటీ చైర్పర్సన్ జకియాఖాన్ చెప్పారు. ఆయన చేసిన మేలును ముస్లిం మైనార్టీ వర్గాలు ఎప్పటికీ మరిచిపోవన్నారు. దేశ చరిత్రలో ముస్లింలకు న్యాయం చేస్తున్న ఏకైక సీఎం జగనేనని వారు కొనియాడారు. పేదల బతుకుల్లో వెలుగులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు అగ్రవర్ణాల్లోని పేదల బతుకుల్లో జగనన్న వెలుగులు నింపారని ఎంపీ నందిగం సురేష్ తెలిపారు. ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు కోసం ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నారని, ఇలాంటి ముఖ్యమంత్రి రాష్ట్రానికి దొరకడం మన అదృష్టమన్నారు. జగనన్నలా ఏ ఒక్కరూ చేయలేదు..: రాజ్యాంగ పదవుల్లో బడుగు, బలహీన వర్గాలకు పెద్దపీట వేసిన ఘనత సీఎం జగన్దేనని మాజీ మంత్రి అనిల్కుమార్యాదవ్, ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు తెలిపారు. ఎవరూ ఊహించని రీతిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేబినెట్లో పెద్దపీట వేశారని కొనియాడారు. ఎంతోమందిని ఎమ్మెల్యేలుగా, మేయర్లుగా, మునిసిపల్ చైర్మన్లుగా చేశారన్నారు. డీబీటీ రూపంలో దాదాపు రూ.2.4 లక్షల కోట్లు వారి ఖాతాల్లో వేశారని చెప్పారు. సంక్షేమ సారథి.. జగనన్న రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అందిస్తూ సీఎం జగన్ పేదల గుండెల్లో సంక్షేమ సారథిగా నిలిచిపోయారని రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి చెప్పారు. అభివృద్ధి పనులతో రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారని తెలిపారు. అన్నమయ్య జిల్లా అంటే రాయచోటి అని గుర్తు వచ్చేలా చేసిన ముఖ్యమంత్రి జగన్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాయచోటి నియోజకవర్గానికే ఈ నాలుగున్నరేళ్లలో రూ.1,289 కోట్ల ప్రయోజనం కల్పించారని వెల్లడించారు.
Pagination
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
నేనే కోచ్ అయివుంటే.. అతడికి జట్టులో నో ఛాన్స్: సెహ్వాగ్
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
- కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
- ప్రజా సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తా
- రెచ్చిపోయిన రౌడీ మూకలు
Advertisement