-
ఉద్యోగుల కేటాయింపు పూర్తికి షెడ్యూల్
సాక్షి, అమరావతి: కొత్త జిల్లాలకు ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియను మార్చి మొదటి వారంలోపు పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖల విభాగాధిపతులను ఆదేశించింది. ఇప్పటికే కేటాయింపు ఎలా జరపాలనే దానిపై మార్గదర్శకాలు ఇచ్చి అందుకనుగుణంగా కేటాయింపుల జాబితాలు పంపాలని సూచించింది. ఇందుకు టైమ్ షెడ్యూల్ను కూడా నిర్దేశించింది. దీంతో.. ► ఫిబ్రవరి 28లోపు జిల్లా, డివిజనల్ కార్యాలయాలు, పీఏఆర్ (ప్రొవిజినల్ అలొకేషన్ రేషియో–తాత్కాలిక కేటాయింపు నిష్పత్తి), పూర్తి జాబితాలను ఆయా శాఖలు పునర్వ్యవస్థీకరణ వెబ్సైట్లో పొందుపరచడంతోపాటు సంబంధిత శాఖల కార్యదర్శుల ద్వారా ఆర్థిక శాఖ అనుమతి కోసం పంపాల్సి వుంటుంది. ► ఆర్థికశాఖ మార్చి 3లోపు ఆ జాబితాలను పరిశీలించి తుది కేటాయింపు జాబితాలను సిద్ధంచేయాలి. అలాగే, మార్చి 7లోపు ఈ జాబితాలను ఖరారు చేసి తిరిగి ఆయా శాఖల కార్యదర్శులకు ఆర్థిక శాఖ పంపుతుంది. ► వీటిలో కార్యదర్శులు ఏమైనా మార్పులు సూచిస్తే వాటిని బట్టి చివరిగా మార్చి 11కల్లా ఆర్థిక శాఖ తుది కేటాయింపు జాబితాను ఆమోదిస్తుంది. ► ఆ తర్వాత కొత్త జిల్లాల తుది నోటిఫికేషన్ వెలువడే రోజునే ఉద్యోగుల కేటాయింపుపైనా ఆర్డర్ టు సెర్వ్ ఆదేశాలు జారీచేసేలా ప్రభుత్వం ఏర్పాట్లుచేస్తోంది. సర్వీస్ డెలివరీ యూనిట్ల కేటాయింపు ఇలా.. ఇక కొత్త జిల్లాల వారీగా ఏ జిల్లాలకు ఏ నిష్పత్తి ప్రకారం సర్వీస్ డెలివరీ యూనిట్లు (అంగన్వాడీ కేంద్రాలు, రేషన్ షాపులు వంటివి) కేటాయించాలనే దానిపై ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది. జిల్లా కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగుల కేటాయింపు రేషియో, డివిజన్ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగుల కేటాయింపు రేషియోను ఏవిధంగా చేయాలో ఉదాహరణలతో సూచించింది. జిల్లా కార్యాలయాలను ఎలా చేయాలో వివరిస్తూ.. ఉదా : స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో ప్రస్తుతం ఉన్న జిల్లాల పరిధిలోని మండలాలు, డివిజన్లు, జిల్లా మ్యాప్లను పరిశీలించి కొత్త జిల్లాల ప్రకారం ఏ మండలాలు, ఏ డివిజన్లు ఏ జిల్లా పరిధిలోకి వెళ్లాయో నిర్థారించి విభజించాలని సూచించింది. ప్రస్తుతం కర్నూలు జిల్లాలో 3,130 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ఆ జిల్లా కొత్తగా కర్నూలు, నంద్యాల జిల్లాలుగా ఏర్పడుతుండడంతో వాటి పరిధిలోకి వచ్చే మండలాలు, డివిజన్ల ప్రకారం వాటిని విభజించినప్పుడు కర్నూలు జిల్లాకు 1,806, నంద్యాల జిల్లాకు 1,324 అంగన్వాడీ కేంద్రాలు వచ్చాయి. నిష్పత్తి ప్రకారం 57.70 శాతం కేంద్రాలు కర్నూలుకు, 42.30 శాతం నంద్యాల జిల్లాకు వెళ్తాయి. అలాగే.. గ్రామ, వార్డు సచివాలయాలు, రేషన్ షాపుల వంటి సర్వీసెస్ డెలివరీ యూనిట్లన్నింటినీ విభజించాలని ప్రభుత్వం నిర్దేశించింది. -
ఉద్యోగుల బదిలీల్లో బీసీలకు అన్యాయం: కృష్ణయ్య
సాక్షి, హైదరాబాద్: నూతన జోనల్ విధానంప్రకారం ప్రభుత్వం చేపట్టిన ఉద్యోగులు, ఉపాధ్యాయుల కేటాయింపుల్లో బీసీలు తీవ్రంగా నష్టపోయారని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆగ్రహం వ్యక్తంచేశారు. సోమవారం జరిగిన బీసీ ఉద్యోగ సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ ఉద్యోగ, ఉపాధ్యాయులకు 25 శాతం రిజర్వేషన్లు కొనసాగించాల్సి ఉండగా ప్రభుత్వం ఈ నిబంధనను ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. ఆప్షన్ ఫారంలో ఎస్సీ, ఎస్టీల మాదిరిగా బీసీ ఉద్యోగుల కోసం ప్రత్యేక కాలమ్ పెట్టలేదని తెలిపారు. మెరిట్ కమ్ రోస్టర్ పద్ధతిలో జిల్లా కేటాయింపులు చేయాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా జరిగిందని విమర్శించారు. కేవలం సీనియార్టీని ప్రామాణికంగా తీసుకోవడంతో మెరిట్ ఉన్న ఉద్యోగులు, జూనియర్లు తీవ్రం గా నష్టపోయారని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే ఈ తప్పిదాలను సవరించి బీసీలకు రిజర్వేషన్లు అమలు చేస్తూ మెరిట్, రోస్టర్ పద్ధతిని, స్థానికతను పాటించాలని డిమాండ్చేశారు. సమావేశంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ గుజ్జ కృష్ణ పాల్గొన్నారు. -
ఉద్యోగుల కేటాయింపులో ఆప్షన్లు
సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లా, జోనల్, మల్టీ జోనల్ కేడర్లకు ఉద్యోగుల కేటాయింపులపై వారి నుంచి ఆప్షన్లు స్వీకరించాలని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వ ఆహ్వానం మేరకు ట్రెసా రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె.గౌతమ్కుమార్తో కూడిన ప్రతినిధి బృందం మంగళవారం బీఆర్కేఆర్ భవన్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్తో సమావేశమైంది. కొత్త లోకల్ కేడర్లకు ఉద్యోగుల కేటాయింపులపై చర్చించింది. మార్గదర్శకాలు విడుదల చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నం.317లో ఈ కింది అంశాలను చేర్చాలని బృందం సూచించింది. ►ఉద్యోగులు/కుటుంబ సభ్యులు బైపాస్ సర్జరీ చేయించుకోవడం, ఇతర తీవ్ర అనారోగ్య సమస్యలు కలిగి ఉంటే ప్రత్యేక కేటగిరీ కింద ప్రాధాన్యత ఇవ్వాలి. ►45 శాతం వరకు అంగవైకల్యం కలిగిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలి. ►కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో ఆర్డర్ టు సర్వ్ కింద బదిలీకి గురైన ఉద్యోగులకు కూడా ప్రాధాన్యత కల్పించాలి. n సొంత జిల్లా, ప్రస్తుతం పని చేస్తున్న జిల్లాతో పాటు మొదటి నియామక జిల్లాను దరఖాస్తు నమూనాలో చేర్చాలి. ►రెవెన్యూ శాఖను బలోపేతం చేసేందుకు గరిష్ట కేడర్ స్ట్రెంగ్త్ నిర్ధారించాలి. ట్రెసా చేసిన ఇతర విజ్ఞప్తులు.. ♦పెండింగ్లో ఉన్న డిప్యూటీ కలెక్టర్, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లకు పదోన్నతులు కల్పించాలి. ♦డీపీసీ ఆమోదం పొంది తహశీల్దార్లుగా పోస్టింగ్ కోసం నిరీక్షణలో ఉన్న డిప్యూటీ తహశీల్దార్లకు పోస్టింగులు ఇవ్వాలి. 2017–18 నుండి డిప్యూటీ తహసీల్దార్ల కొత్త ప్యానెల్స్ తయారు చేయాలి. ♦సుదూర ప్రాంతాలోని ప్రొబేషనరీ నాయబ్ తహసీల్దార్లకు జిల్లా బదిలీల్లో అవకాశం కల్పించాలి. ∙వీఆర్వోలకు కూడా బదిలీ ఆప్షన్లు ఇవ్వాలి. ∙వీఆర్ఏలకు స్కేల్ వర్తింప చేయాలి. -
ఉద్యోగుల కేటాయింపుపై మార్గదర్శకాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతి కొత్త ఉత్తర్వుల ప్రకారం జిల్లా, జోనల్, మల్టీ జోనల్ క్యాడర్లకు ప్రభుత్వ ఉద్యోగుల కేటాయింపుపై రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. రాష్ట్రపతి ఉత్తర్వులు–2018 మేరకు పోస్టుల పునర్విభజన ప్రక్రియ ఇప్పటికే ప్రభుత్వం పూర్తిచేసింది. ఆయా పోస్టుల్లో పనిచేస్తున్న ఉద్యోగులను సంబంధిత క్యాడర్లకు కేటాయించాల్సి ఉంది. పోస్టులను జిల్లా, జోనల్, మల్టీ జోనల్ వారీగా విభజించిన నిష్పత్తిలోనే ఆయా పోస్టుల్లో పనిచేసే ఉద్యోగులను జిల్లా, జోనల్, మల్టీ జోనల్ పోస్టులకు కేటాయించాలని ప్రభుత్వం ఆదేశించింది. మంజూరైన పోస్టులను జిల్లా, జోనల్, మల్టీ జోనల్ పోస్టులుగా విభజించిన నిష్పత్తిలోనే ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులను సైతం జిల్లా, జోనల్, మల్టీ జోనల్ క్యాడర్లకు కేటాయించాలని సూచించింది. లోకల్ క్యాడర్లకు కేటాయింపు కోసం ఉద్యోగుల నుంచి ప్రాధాన్యతలను స్వీకరించాలని ఆదేశించింది. అయితే, సీనియారిటీతో సంబంధం లేకుండా శారీరక వైకల్యం, వితంతువులు, కేన్సర్/కిడ్నీ రోగులు, మానసిక సమస్యలున్న పిల్లలు గల ఉద్యోగులు, జీవిత భాగస్వామి కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి/ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగి అయితే ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వనున్నారు. జీవిత భాగస్వామి ప్రాధాన్యత ప్రయోజనం జీహెచ్ఎంసీ పరిధిలో(హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల పరిధి)లో వర్తించదు. కేటాయింపులు చేసేదెవరంటే.. ►జిల్లాస్థాయి ఉద్యోగుల కేటాయింపులను ఉమ్మడి జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని కొత్త జిల్లాల కలెక్టర్లు, సంబంధిత శాఖ జిల్లా అధికారి సభ్యులుగా ఉండే కమిటీ జరపనుంది. ►జోనల్ పోస్టులకు ఉద్యోగుల కేటాయింపులను సంబంధిత విభాగం అధిపతి జరుపనున్నారు. ►మల్టీ జోనల్ పోస్టులకు ఉద్యోగుల కేటాయింపులను సంబంధిత శాఖ కార్యదర్శి చేస్తారు. ప్రక్రియకు గడువు ►వివిధ లోకల్ క్యాడర్లకు ఉన్న క్యాడర్ స్ట్రెంత్ను సంబంధిత హెచ్వోడీ/కార్యదర్శి 3 రోజుల్లో పూర్తిచేయాలి. ►క్యాడర్లవారీగా ఆయా పోస్టుల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్యను కలెక్టర్లు/హెచ్వోడీలు/కార్యదర్శులు 2 రోజుల్లో పూర్తిచేయాలి. ఉద్యోగులు ఆప్షన్లను ఇచ్చేందుకు 3 రోజుల గడువు ఉంటుంది. జిల్లా కమిటీ/ హెచ్వోడీ/కార్యదర్శి ద్వారా ఉద్యోగుల కేటాయింపులను 10 రోజుల్లో పూర్తి చేయాలి. -
9న కమల్నాథన్ కమిటీ భేటీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీ ఉద్యోగుల విభజనకు కేంద్రం నియమించిన కమల్నాథన్ కమిటీ ఈ నెల 9న సచివాలయంలో భేటీ కానుంది. రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఈ సమావేశంలో పాల్గొంటారు. కమిటీ ఏర్పడ్డప్పటి నుంచి వరుసగా ఇది 16వ సమావేశం. ఈ నెలాఖరుతో కమిటీ కాల పరిమితి ముగియనుండటంతో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. మొత్తం 153 విభాగాలకుగాను 111 విభాగాల్లో విభజన పూర్తయింది. 6 విభాగాల ఉద్యోగుల కేటాయింపు కేంద్రం వద్ద పెండింగ్లో ఉంది. మరో 32 విభాగాల్లో తాత్కాలిక కేటాయింపులు పూర్తయినప్పటికీ తుది కేటాయింపులకు మరో నెల సమయం పట్టే అవకాశముంది. ప్రధానంగా కమిటీ భేటీలో ఉద్యోగుల విభజన పూర్తి కాని శాఖలపైనే చర్చ జరిగే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
Pagination
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
రజినీకాంత్ టీజర్పై అలాంటి పోస్ట్.. వివాదంలో డైరెక్టర్!
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్షోలో సునీతా కేజ్రీవాల్
- ‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్దే అధికారం
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
Advertisement