-
యూఎస్- ఆరో రోజూ అదే జోరు
వారాంతాన యూఎస్ స్టాక్ మార్కెట్లు సరికొత్త రికార్డులను నెలకొల్పాయి. ఎస్అండ్పీ 23 పాయింట్లు(0.7 శాతం) ఎగసి 3,508 వద్ద నిలవడం ద్వారా వరుసగా ఆరో రోజు చరిత్రాత్మక గరిష్టాన్ని సాధించింది. ఈ బాటలో నాస్డాక్ 70 పాయింట్లు(0.6 శాతం) బలపడి 11,696 వద్ద ముగిసింది. వెరసి 2020లో 40వ సారి సరికొత్త గరిష్ట రికార్డును అందుకుంది. ఇక వీటితో పోలిస్తే కొంత వెనకడుగులో ఉన్న డోజోన్స్ శుక్రవారం 162 పాయింట్లు(0.6 శాతం) పుంజుకుని 28,654 వద్ద స్థిరపడింది. తద్వారా 2020లో ఏర్పడిన నష్టాల నుంచి బయటపడింది. అంటే మార్చిలో నమోదైన కనిష్టం నుంచి 57 శాతం ర్యాలీ చేసింది. వెరసి ఫిబ్రవరిలో సాధించిన రికార్డ్ గరిష్టాన్ని బ్రేక్ చేసేందుకు కేవలం 1,000 పాయింట్ల దూరంలోనిలిచింది. కాగా.. వరుసగా ఐదు వారాలపాటు లాభాల్లో నిలవడం ద్వారా ఎస్అండ్పీ మరో రికార్డును సాధించడం విశేషం! 1984 తదుపరి ఆగస్ట్లో ఎస్అండ్పీ, డోజోన్స్ 8 శాత స్థాయిలో లాభపడ్డాయి. కారణాలున్నాయ్ కోవిడ్-19 విసురుతున్న సవాళ్లను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు ప్రెసిడెంట్ ట్రంప్ 1.3 ట్రిలియన్ డాలర్ల భారీ సహాయక ప్యాకేజీకి సిద్ధపడుతుండటం సెంటిమెంటుకు బలాన్నిచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఇక ఆర్థిక రికవరీని సూచిస్తూ జులైలో వ్యక్తిగత వినియోగ సూచీ దాదాపు 2 శాతం జంప్చేయడం కూడా ఇందుకు దోహదపడినట్లు తెలియజేశారు. మరోపక్క జాక్సన్హోల్ వద్ద ప్రసంగంలో ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ ద్రవ్యోల్బణానికంటే ఆర్థిక రికవరీకే అధిక ప్రాధాన్యమివ్వనున్నట్లు స్పష్టం చేయడం ఇన్వెస్టర్లకు జోష్నిచ్చినట్లు విశ్లేషకులు వివరించారు. కోక కోలా అప్ వ్యయ నియంత్రణ చర్యలు చేపట్టనున్నట్లు ప్రకటించడంతో పానీయాల దిగ్గజం కోక కోలా, విమానయాన బ్లూచిప్ యునైటెడ్ ఎయిర్లైన్స్ 3 శాతం చొప్పున ఎగశాయి. క్యూ2లో నికర లాభం అంచనాలు మించడంతో డెల్ టెక్నాలజీస్ 6 శాతం జంప్చేసింది. క్యూ3పై అంచనాలతో హెచ్పీ 6 శాతం పురోగమించింది. వార్షిక సబ్స్క్రిప్షన్లు జోరందుకోనున్నట్లు అంచనాలు ప్రకటించిన వర్క్డే ఇంక్ 13 శాతం దూసుకెళ్లింది. టిక్టాక్ యూఎస్ యూనిట్ కొనుగోలుకి చేతులు కలిపిన వాల్మార్ట్ 2.7 శాతం, మైక్రోసాఫ్ట్ 1 శాతం చొప్పున లాభపడ్డాయి. బెయిన్ క్యాపిటల్ ఇన్వెస్ట్ చేయనున్న వార్తలతో న్యుటానిక్స్ ఇంక్ 29 శాతం ర్యాలీ చేసింది. నార్వేజియన్ క్రూయిజ్, రాయల్ కరిబియన్, డెల్టా, అమెరికన్ ఎయిర్లైన్స్ 6-2.5 శాతం మధ్య జంప్చేశాయి. -
రాబోయే ఏళ్లలో దేశంలోకి 900 విమానాలు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచంలోని వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏవియేషన్ మార్కెట్లలో ఒకటైన భారతదేశంలో విమాన యాన సంస్థలు చాలా దూకుడును ప్రదర్శిస్తున్నాయి. ముఖ్యంగా ప్రాంతీయ మార్గాల్లో భారీ ప్రతిష్టాత్మక విస్తరణ ప్రణాళికలతో ముందుకు వస్తున్నాయి. ఇందులో భాగంగానే 900 విమానాలను అదనంగా ప్రారంభించనున్నాయి. ఇతర రవాణా సంస్థలతో పాటు, దేశీయ ఎయిర్లైన్స మొత్తం 900 కన్నా ఎక్కువ విమానాలను ప్రారంభించనున్నాయని అధికారిక సమాచారం తెలిపింది. అధికారుల డేటా ప్రకారం.. బడ్జెట్ విమానయాన సంస్థలు ఇండిగో, స్పైస్జెట్, గోఎయిర్, ఎయిర్ఏషియా తమ విమానాల సంఖ్యను పెంచుకునేందుకు సిద్ధమయ్యాయి. ఇటీవల లోక్సభలో లిఖితపూర్వక సమాధానంలో భాగంగా పార్లమెంటుకు సమర్పించిన సమాచారం ప్రకారం, రానున్న సంవత్సరాల్లో దేశీయ విమాన సంస్థలు మరో 900 విమానాలను ప్రారంభించనున్నాయి. ఇందులో ఒక్క ఇండిగోనే ఏకంగా 448 కొత్త విమానాలను తీసుకురానుంది. ఇండిగో వద్ద 150 విమానాలున్నాయి. వచ్చే ఏడు నుంచి ఎనిమిది సంవత్సరాల్లో మరో 448 విమానాలను కొనుగోలు చేయనుంది. వీటిలో 399 ఏ320 విమానాలు కాగా.. 49 ఏటీఆర్లు. మరో ప్రధాన పోటీదారు ఎయిర్లైన్ స్పైస్జెట్ కూడా ఇదే ప్రణాళికలతో ఉంది. 2018-23 మధ్య 157 కొత్త విమానాలను తీసుకురానుంది. ప్రస్తుతం ఈ సంస్థ వద్ద 57 విమానాలున్నాయి. మరో బడ్జెట్ క్యారియర్ గోఎయిర్ మరో నాలుగేళ్లలో 119 ఏ320 విమానాలను కొనుగోలు చేసి అంతర్జాతీయ సేవలను మొదలుపెట్టనుంది. గో ఎయిర్ వద్ద ప్రస్తుతం 34 విమానాలున్నాయి. ఎయిర్ఏషియా కూడా మరో ఐదేళ్లలో 60 విమానాలను తీసుకురానుంది. జెట్ ఎయిర్వేస్ ప్రస్తుతం ఉన్న 107 విమానాలకు మరో 86 విమానాలను చేర్చనుంది. ఇక ప్రభుత్వ రంగ ఎయిరిండియా 2019 మార్చి కల్లా మూడు బోయింగ్ విమానాలు, 16 ఏ320 విమానాలను తీసుకురానుంది. ప్రస్తుతం ఈ సంస్థ వద్ద 155 విమానాలున్నాయి. పౌరవిమానయాన మంత్రిత్వశాఖ సమాచారంప్రకారం విస్తారా, ట్రూజెట్, జూమ్ ఎయిర్ లాంటి సంస్థలు కూడా మరో ఐదేళ్లలో కొత్త విమానాలను కొనుగోలు చేయనున్నాయి. ఎయిర్ ఫ్రాన్స్ ఐదేళ్ల కాలంలో 60 విమానాలను ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం ఈ బడ్జెట్ క్యారియర్ 14 విమానాలను కలిగి ఉంది. -
ఆకాశ మార్గంలో ప్రయాణానికి.. పైలట్
ఈ రోజు ఒక దేశంలో, రేపు మరో దేశంలో, ఎల్లుండి ఇంకో దేశంలో.. ఇలా రోజుల వ్యవధిలోనే దేశ విదేశాలను శరవేగంగా చుట్టొచ్చే అరుదైన అవకాశం అందరికీ దక్కదు. లోహ విహంగాల చోదకులకు మాత్రమే ఆ అదృష్టం సొంతం. ఐదంకెల జీతం, విలాసవంతమైన జీవితం, గ్లామరస్ జాబ్ కావాలంటే.. పైలట్గా అవతారం ఎత్తాల్సిందే. హుందాతనం ఉట్టిపడే పైలట్ కొలువుపై యువత మక్కువ పెంచుకుంటోంది. విమాన చోదకులకు ప్రస్తుతం దేశ విదేశాల్లో ఉద్యోగావకాశాలు ఎన్నో ఉన్నాయి. విమాన సర్వీసుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ వీరికి డిమాండ్ అధికమవుతుంది. ప్రభుత్వ, ప్రైవేట్ ఎయిర్లైన్స్ సంస్థల్లో.. డైరక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నుంచి కమర్షియల్ పైలట్ లెసైన్స్(సీపీఎల్) పొందిన తర్వాత పైలట్గా కెరీర్ ప్రారంభించొచ్చు. పైలట్లకు ప్రభుత్వ, ప్రైవేట్ ఎయిర్లైన్స్ సంస్థల్లో కొలువులు అందుబాటులో ఉన్నాయి. ప్రారంభం నుంచే ఆకర్షణీయమైన వేతనం చేతికందుతుంది. సీనియారిటీని బట్టి వేతనం భారీగా పెరుగుతుంది. జనరల్ ఏవియేషన్లో తక్కువ పని గంటలు ఉంటాయి. అంటే.. చార్టర్ ఎయిర్వేస్(వ్యక్తిగత విమానాలు), కార్గో ఎయిర్లైన్స్(సరకు రవాణా విమానాలు)లో చేరితే ఏడాదిలో 100 నుంచి 150 గంటలపాటు విధులు నిర్వర్తించాలి. ప్రైవేట్ ఎయిర్లైన్స్(ప్రయాణికుల విమానాలు)లో ఏడాదికి 1000 గంటలకుపైగానే పనిచేయాలి. పైలట్లకు ఫ్లైయింగ్ క్లబ్బుల్లోనూ ఉద్యోగాలు ఉన్నాయి. వీటిలో ఇన్స్ట్రక్టర్గా పనిచేస్తూ మంచి ఆదాయం పొందొచ్చు. పైలట్ శిక్షణకు మన దేశంలో రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఖర్చవుతుంది. తర్వాత మల్టీ ఇంజిన్ ఎండార్స్మెంట్కు రూ.3 లక్షలు -4 లక్షలు వెచ్చించాలి. కావాల్సిన స్కిల్స్: శారీరకంగా దృఢంగా ఉండాలి. అత్యవసర పరిస్థితుల్లో సెకండ్ల వ్యవధిలోనే నిర్ణయాలు తీసుకొని అమలు చేయగల సామర్థ్యం అవసరం. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, హైజాక్లు.. వృత్తిలో ఇలాంటి ఊహించని సవాళ్లు ఎదురవుతుంటాయి. వీటిని చాకచక్యంగా ఎదుర్కొనే నేర్పు చాలా ముఖ్యం. ఒత్తిళ్లను అధిగమించి ఎక్కువ గంటలు పనిచేసే ఓపిక ఉండాలి. అర్హతలు: మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఇంగ్లిష్ సబ్జెక్టులతో ఇంటర్మీడియెట్ పూర్తిచేసిన తర్వాత డీజీసీఏ గుర్తింపు పొందిన సంస్థలో పైలట్ ట్రైనింగ్ కోర్సులో చేరొచ్చు. ఇందులో చేరాలంటే డీజీసీఏ నిర్దేశించిన ప్రమాణాల మేరకు పూర్తి ఆరోగ్యంగా ఉండాలి. కమర్షియల్ పైలట్ లెసైన్స్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి 200 గంటల ఫ్లైయింగ్ శిక్షణ పూర్తిచేయాలి. ఏవియేషన్ స్టడీస్పై డీజీసీఏ నిర్వహించే థియరీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. ఇందులో ఐదు పేపర్లు ఉంటాయి. విదేశాల్లో పైలట్ శిక్షణ పొందినప్పటికీ భారత్లో పనిచేయాలంటే డీజీసీఏ పరీక్షలో ఉత్తీర్ణులవ్వడం తప్పనిసరి. కమర్షియల్ పైలట్ లెసైన్స్ పొందిన తర్వాత ఎయిర్లైన్స్ సంస్థలో ఆరు నెలల నుంచి ఏడాదిపాటు మల్టీ ఇంజిన్ ఎండార్స్మెంట్ శిక్షణ పొంది కో-పైలట్గా విధుల్లో చేరొచ్చు. అనుభవం పెంచుకొని పైలట్గా ఉద్యోగోన్నతి పొందొచ్చు. వేతనాలు: కో-పైలట్కు ప్రారంభంలో నెలకు రూ.60 వేల నుంచి రూ.70 వేల వేతనం అందుతుంది. సీనియర్ పైలట్ నెలకు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలు పొందొచ్చు. సీనియారిటీని బట్టి ఈ వేతన ప్యాకేజీ నెలకు రూ.5 లక్షల వరకు పెరుగుతుంది. కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు: రాజీవ్గాంధీ ఏవియేషన్ అకాడమీ-హైదరాబాద్ వెబ్సైట్: http://rgaviation.com/ ఫ్లై ఎయిర్ ఏవియేషన్ అకాడమీ వెబ్సైట్: www.flyairaviationacademy.in ఆంధ్రప్రదేశ్ ఏవియేషన్ అకాడమీ వెబ్సైట్: http://apaviationacademy.in/ ఆసియా పసిఫిక్ ఫ్లైట్ ట్రైనింగ్ వెబ్సైట్: www.apft.edu.in ఇందిరాగాంధీ రాష్ట్రీయ ఉడాన్ అకాడమీ వెబ్సైట్: www.igrua.gov.in అహ్మదాబాద్ ఏవియేషన్ అండ్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వెబ్సైట్: www.aaa.co.in గుజరాత్ ఫ్లైయింగ్ క్లబ్ వెబ్సైట్: www.gujaratflyingclub.org సవాళ్లతో కూడిన కెరీర్! ‘‘దేశంలో విమానయాన రంగం ఏటా గణనీయమైన వృద్ధిని సొంతం చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో లెసైన్స్డ్ పైలట్లకు విస్తృత అవకాశాలు అందుబాటులో ఉంటున్నాయి. ఏవియేషన్లో అత్యంత డిమాండ్ ఉన్న విభాగం కూడా పెలైటే. వీరికి వేతనాలు ఆకర్షణీయంగా ఉంటాయి. ఆకాశవీధిలో విహరించే అవకాశంతోపాటు సవాళ్లతో కూడిన కెరీర్ కోరుకునేవారు పైలట్గా కెరీర్ను ప్రారంభించొచ్చు. సిటీలో పలు సంస్థలు పెలైట్ శిక్షణను అందిస్తున్నాయి. ఇంటర్మీడియెట్ మ్యాథ్స్, ఫిజిక్స్ అర్హతతో పైలట్ ట్రైనింగ్ కోర్సుల్లో చేరొచ్చు. థియరీ, ప్రాక్టికల్స్తో సాగే శిక్షణలో విద్యార్థులు ఎయిర్ నేవిగేషన్, మెటీరియాలజీ, ఎయిర్ రెగ్యులేషన్ తదితర సబ్జెక్టులను అధ్యయనం చేస్తారు. ఫ్లైయింగ్ శిక్షణలో అనుభవం పొందుతారు. శిక్షణ పూర్తయిన తర్వాత లెసైన్స్ లభిస్తుంది. పైలట్ కెరీర్లో ప్రవేశించాలంటే శారీరక దృఢత్వం తప్పనిసరి. పైలట్లకు దేశ, విదేశీ ఎయిర్లైన్స్ సంస్థల్లో ఎన్నో ఉద్యోగావకాశాలు లభిస్తాయి’’ - ఎం.అభిలాష్, పీఆర్ఓ రాజీవ్గాంధీ ఏవియేషన్ అకాడెమీ.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాయ్బరేలీలో రాహుల్కు దినేష్ పోటీనివ్వగలరా?
తెలివైన కోతి : శాస్త్రవేత్తలు సైతం ఫిదా
రాజకీయ ఎంట్రీ? జ్యోతిక సమాధానమిదే!
వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి
అనకాపల్లిలో కలకలం.. బూడి ముత్యాలనాయుడు హత్యకు కుట్ర!
కాంగ్రెస్కు షాక్.. ‘ప్లీజ్ పోటీ చేయలేను’
ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్
రోహిత్ శర్మకు వెన్నునొప్పి.. ఆందోళనలో ఫ్యాన్స్!
ఢిల్లీలో కుమారి ఆంటీ తరహా ఎపిసోడ్
సరైన సమయంలో సరైన పుస్తకం 'మూడు దారులు’!
తప్పక చదవండి
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- ఆ రాష్ట్రంలో రెండు రోజులు డ్రై డే!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
- భారీ ఆఫర్ను రిజెక్ట్ చేసిన శ్రీలీల.. కారణం ఇదేనట
- Happy Birthday Trisha : 25 ఏళ్ల కెరియర్లో వివాదాలతో పాటు కోట్లలో ఆస్తులు
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- మీసాలున్నాయని 80 మందిని తొలగించిన కంపెనీ!
- అగ్ని ప్రమాదం.. చిన్నపాటి ఖర్చుతో మరింత భద్రం!
- స్టార్క్ దెబ్బకు ఇషాన్ బౌల్డ్.. రితిక రియాక్షన్ వైరల్
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
Advertisement