రాహుల్‌గాంధీ సభను విజయవంతం చేయండి | Sakshi
Sakshi News home page

రాహుల్‌గాంధీ సభను విజయవంతం చేయండి

Published Sat, May 4 2024 12:25 AM

రాహుల్‌గాంధీ సభను విజయవంతం చేయండి

ఎర్రవల్లిచౌరస్తా: పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 5న జోగుళాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండల కేంద్రంలో చేపట్టే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని రాష్ట్ర ఎకై ్సజ్‌శాఖ మంతి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం ఎర్రవల్లి మండల కేంద్రంలోని రాజీవ్‌గాంధీ సభా ప్రాంగణంలో ఏర్పాట్లను జెడ్పీచైర్‌పర్సన్‌ సరితతో కలిసి ఆయన సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ బహిరంగ సభకు కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌గాంధీతోపాటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరవుతారని అన్నారు. కేంద్రంలో అధికారం చేపట్టాక దేశంలో చేసే అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పాటు ఐదు గ్యారంటీలను గురించి రాహుల్‌ గాంధీ ప్రకటిస్తారన్నారు. అదేవిధంగా ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కాంగెరస్‌ ప్రభుత్వం చేపట్టే వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలను గురించి సీఎం ప్రజలకు సభ ద్వారా వివరిస్తారని అన్నారు. నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ పరిదిలోని గద్వాల, అలంపూర్‌, వనపర్తి, కొల్లాపూర్‌ నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్‌ పార్టీ ప్రజా ప్రతినిదులు, నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో జనసమీకరణ చేసి బహిరంగ సభను జయప్రదం చేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా, అలంపూర్‌ యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు దీపక్‌ ప్రజ్ఞా, జోగుల రవి, మండల అధ్యక్షుడు వెంకటేష్‌ యాదవ్‌, నాయకులు తిరుపతయ్య, ఎల్కూరు శ్రీను, జయచంద్రారెడ్డి, మానిక్యారెడ్డి, మద్దిలేటి, ఇలియాస్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement