-
బాల్యవివాహాలకు అడ్డుకట్ట వేద్దాం
నారాయణపేట: బాల్యవివాహాలకు అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్హాల్లో బేటి పడావో – బేటీ బచావో, బచ్ పన్ బచావో ఆందోళన్, బాల్యవివాహాల నిర్మూలనపై ఏర్పాటుచేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో ప్రస్తుతానికి బాల్యవివాహాలు తగ్గినా.. ఇంకా కొన్ని మారుమూల ప్రాంతాలలో ఆడపిల్లల తల్లిదండ్రులు అవగాహనా రాహిత్యంతో తమ పిల్లలకు చిన్న వయసులోనే పెళ్లి చేసేందుకు యత్నిస్తున్నారని తెలిపారు. ఇకపై అలాంటి ప్రయత్నాలు కూడా జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. జిల్లాలో 12 నుంచి 18 ఏళ్ల వయసు కలిగిన బాలికల వివరాలను సేకరించడంతో పాటు బాల్యవివాహాలతో కలిగే అనర్థాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని బచ్ పన్ బచావో ఆందోళన్ ఏజెన్సీ నిర్వాహలను కోరారు. సమావేశంలో డీడబ్ల్యూఓ నరసింహారావు, డీఈఓ అబ్దుల్ ఘని, జీసీడీఓ పద్మనలిని, చైల్డ్ వెల్ఫేర్ లైన్ అధికారి తిరుపతయ్య తదితరులు ఉన్నారు. అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి ఊట్కూరు: మహిళా సంఘాల సభ్యులకు ప్రభుత్వం కల్పిస్తున్న ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. ఊట్కూరులో మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో కొనసాగుతున్న స్వశక్తి స్కూల్ యూనిఫాం కుట్టు కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈసందర్భంగా యూనిఫాం తయారీ వివరాలను తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళల ఉపాధి కోసం స్కూల్ యూనిఫాం స్టిచ్చింగ్ను అప్పగించినట్లు తెలిపారు. మండలంలోని వల్లంపల్లి, పెద్దజట్రం, బిజ్వార్ తదితర గ్రామాల్లో కుట్టు కేంద్రాలను ఏర్పాటుచేసి మహిళా సంఘాల సభ్యులకు ఉపాధి కల్పించాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట డీఆర్డీఓ రాజేశ్వరి, అడిషనల్ డీఆర్డీఓ అంజయ్య, ఏపీఎం నిర్మల, సుగుణ, రవి తదితరులు ఉన్నారు. -
ధాన్యం తరలింపులో జాప్యం చేయొద్దు
నారాయణపేట: రైతుల నుంచి కొనుగోలు చేసిన వరిధాన్యాన్ని మిల్లులకు తరలించడంలో జాప్యం చేయొద్దని జిల్లా ప్రత్యేకాధికారిణి శ్రుతి ఓజా అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్హాల్లో కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి జిల్లా వ్యవసాయశాఖ, సివిల్ సప్లయ్, పీఏసీఎస్, జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులతో ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా మొత్తం ధాన్యం సేకరణకు ఎన్ని రోజుల సమయం పడుతుంది.. రైతుల వద్ద నిల్వ ఉన్న ధాన్యం వివరాలను తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఏర్పాటుచేసిన 107 కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వ లక్ష్యం మేరకు ధాన్యం సేకరించాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలలో ఏమైనా సమస్యలు ఉంటే క్షేత్ర స్థాయిలోనే పరిష్కరించుకోవాలని సూచించారు. ఈనెలాఖరు వరకు కేంద్రాలను కొనసాగించి.. కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. కేంద్రాలలో అవసరమైన గన్నీ బ్యాగులు, టార్ఫాలిన్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. తేమ శాతం ఎక్కు వ ఉన్న ధాన్యం వస్తే , ఎండబెట్టిన తర్వాత కొనుగోలు చేయాలని సూచించారు. ధాన్యం బస్తాలను మిల్లులకు తరలించే క్రమంలో ఏమైనా ఇబ్బందు లు వస్తున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. కాగా, ఇప్పటి వరకు జిల్లాలో రైతుల నుంచి 32 వే ల మెట్రిక్ టన్నుల పైచిలుకు ధాన్యాన్ని కొనుగోలు చేశామని.. ఇంకా వెయ్యి మెట్రిక్ టన్నుల ధాన్యం విక్రయానికి వచ్చే అవకాశం ఉందని డీఏఓ జాన్ సుధాకర్ వివరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, సివిల్ సప్లయ్ డీఎం దేవదాస్, డీఎస్ఓ సుదర్శన్, డీఆర్డీఓ రాజేశ్వరి, వ్యవసాయ మార్కెట్యార్డు కార్యదర్శి భారతి ఉన్నారు. ● మరికల్, ధన్వాడ మండల కేంద్రాల్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా ప్రత్యేకాధికారిణి శ్రుతి ఓజా తనిఖీ చేశారు. ఈసందర్భంగా రైతులకు కల్పిస్తున్న వసతులను పరిశీలించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం సేకరించాలని నిర్వాహకులకు సూచించారు. కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలి జిల్లా ప్రత్యేకాధికారిణి శ్రుతి ఓజా -
పాత బకాయిలు చెల్లించాలి..
మా సంఘం తరఫున బ్యాంకులో రూ. 5లక్షల అప్పు తీసుకున్నాం. క్రమం తప్పకుండా అసలు, వడ్డీ కలి పి చెల్లిస్తున్నాం. కొత్త ప్రభుత్వం వచ్చా క 4 నెలల సున్నా వడ్డీ డబ్బులు విడుదల చేయడం సంతోషంగా ఉంది. అలాగే పాత బకాయిలను కూడా చెల్లిస్తే బాగుంటుంది. మా సంఘానికి రూ.లక్ష వరకు వడ్డీ జమ అవుతుంది. – భాగ్యమ్మ, గ్రామ సంఘం అధ్యక్షురాలు, కొమ్మూరు మహిళలకు మరింత మేలు.. మహిళా సంఘాలకు సున్నా వడ్డీ నిధులు విడుదల చేయడం సంతోషంగా ఉంది. కొన్నేళ్లుగా వడ్డీ డబ్బులు రాకపోవడంతో అసలు, వడ్డీ కలిపి బ్యాంకులకు చెల్లించడం భారంగా మారింది. ప్రభుత్వం సున్నా వడ్డీ పథకాన్ని పునరుద్ధరించడంతో మహిళలకు ఎంతో మేలు చేకూరుతుంది. – మమత, మండల మహిళా సమాఖ్య కోశాధికారి, మద్దూరు బ్యాంకు ఖాతాల్లో జమ.. జిల్లాలో రుణాలు తీసుకున్న మహిళా సంఘాలకు గత డిసెంబర్ నుంచి మార్చి వరకు నాలుగు నెలల వడ్డీ డబ్బులను బ్యాంకు ఖాతాల్లో జమచేయడం జరిగింది. గతంలో ఉన్న బకాయిల చెల్లింపులపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. – రామునాయక్, డీపీఎం, నారాయణపేట ● -
సంగంబండ లెఫ్టు కెనాల్ పనులు ప్రారంభం
మక్తల్: మండలంలోని సంగంబండ లో లెవల్ లెఫ్టు కెనాల్ పనులు వడ్వాట్ వరకు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కాల్వ పనులను మక్తల్ మాజీ జెడ్పీటీసీ లక్ష్మారెడ్డి మంగళవారం అక్కడికి వెళ్లి పరిశీలించారు. మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి కృషితోనే కాల్వ పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. 15 ఏళ్ల నుంచి 9 గ్రామాలకు సంగంబండ రిజర్వాయర్ నుంచి సాగునీరు అందకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సంగంబండ వద్ద బండ తొలగించేందుకు రాష్ట్ర మంత్రులు భారీ నీటి పారుదల శాఖ ఉత్తమ్కుమార్, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క రెండు నెలల కిందట గ్రామాన్ని సందర్శించారు. ఆ సమయంలో గ్రామస్తులు సమస్యలు వివరించారు. దీంతో సంగంబండ బాధితులకు దాదాపు రూ.12 కోట్ల పరిహారం ప్రభుత్వం నుంచి మంజూరు చేయించి వారికి అందజేశారు. అనంతరం కాల్వ పనులు ప్రారంభించారు. దీంతో 9 గ్రామాలకు చెందిన రైతులు ఆనందం వ్యక్తం చేశారు. దాదాపు 25 వేల ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. వానాకాలం సాగునీటి కోసం ముందు జాగ్రత్త పనులు చేసి రైతులకు సాగునీరు అందించేందుకు ముందస్తు చర్యలు చేపట్టారు. వడ్వాట వరకు కాల్వ పనులు కొనసాగింపు 9 గ్రామాలకు 25 వేల ఎకరాలకు సాగునీరు వానాకాలం రైతులకు సాగునీరు అందించేందుకు చర్యలు -
24న పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ఈ నెల 24న పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తునట్లు పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ నాగరాజు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షకు మొత్తం 5 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని, 11 గంటలకు పరీక్ష జరుగుతుందని విద్యార్థులను 9.30 గంటలకు పరీక్ష కేంద్రంలోనికి వదులుతామన్నారు. విద్యార్థులు హాల్టికెట్ బ్లాక్పెన్సిల్, ఎరేజర్, బ్లాక్పెన్నును వెంట తీసుకురావాలనాన్నారు. హాల్టికెట్లు ఆన్ఆలైన్లో అందుబాటులో ఉన్నాయని చెప్పారు. సోనామసూరి ధర రూ.2,419 దేవరకద్ర: పట్టణంలోని మార్కెట్ యార్డులో మంగళవారం జరిగిన ఈనామ్ టెండర్లలో సోనామసూరి ధాన్యం గరిష్టంగా రూ.2,419, కనిష్టంగా రూ.2,143 ధరలు నమోదయ్యాయి. ఆముదాలు క్వింటాల్కు సరాసరిగా రూ.5,479 ధర పలికింది. మార్కెట్కు 300 బస్తాల ధాన్యం అమ్మకానికి వచ్చింది. -
రాజీవ్గాంధీ సేవలు మరువలేనివి
మక్తల్: దివంగత మాజీ ప్రధాని రాజీవ్గాంధీ దేశానికి అందించిన సేవలు మరువలేనివని మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. మంగళవారం పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజీవ్గాంధీ వర్ధంతి నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు ఎంతో నమ్మకం ఉందన్నారు. కేంద్రంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం రావడం ఖాయమని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గణేష్కుమార్, శ్రీనివాసులు, తాయప్ప, రవికుమార్, నరేందర్, ఆనంద్గౌడ్, నర్సింహులు, గణేష్ తదితరులు పాల్గొన్నారు. -
భక్తిశ్రద్ధలతో బీరప్ప ఉత్సవాలు
మక్తల్: కుర్వ కులస్తుల ఆరాధ్య దైవమైన బీరప్ప ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సోమవారం మక్తల్ మండలంలోని సోమేశ్వర్బండ, లింగంపల్లి గ్రామాల్లోని బీరప్పస్వామి ఆలయం వద్ద బండార కార్యక్రమం నిర్వహించారు. కర్ణాటక, మహారాష్ట్ట్ర, హైద్రాబాద్, తదితర ప్రాంతాల నుంచి భక్తులు తరలిరాగా.. ఒకరిపై ఒకరు పసుపు చల్లుకుంటూ ఆనందోత్సాహాలతో ఉత్సవాలు జరుపుకొన్నారు. ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నాలుగు రోజులపాటు నిర్వహించుకునే ఈ ఉత్సవాల్లో దాదాపు 60వేల మంది పాల్గొన్నారు. ఎటు చూసిన టెంట్లు.. జనంతో ఆ ప్రాంతం కిటకిటలాడింది. ప్రధానంగా పెళ్లీడుకు వచ్చిన వారు పసుపు వస్త్రాలు ధరించగా.. వారిపై పసుపు (బండారు) చల్లేందుకు పోటీపడ్డారు. మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, రాష్ట్ర ట్రెడ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవరి మల్లప్ప ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బండార కార్యక్రమం ప్రారంభించి పసుపు చల్లి ఆశీర్వదించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచు వెంకట్రాములుగౌడ్, ఎంపీటీసీ లత సీతరామరావు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గణేష్కుమార్తోపాటు కుర్వాశప్ప, లింగప్ప, రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
23న అథ్లెటిక్స్ జిల్లా జట్టు ఎంపిక
నారాయణపేట రూరల్: అంతర్ జిల్లాల అథ్లెటిక్స్ పోటీల్లో భాగంగా జూన్ 2, 3వ తేదీల్లో హన్మకొండలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు ఈ నెల 23న జిల్లా జట్టు ఎంపిక ప్రక్రియ జరుగుతుందని ఆ సంఘం జిల్లా సెక్రెటరీ రమణ ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం ఉదయం 7గంటలకు మినీ స్టేడియం గ్రౌండ్కు పాల్గొనే క్రీడాకారులు హాజరు కావాలని తెలిపారు. 8 నుంచి 20 సంవత్సరాల మధ్య గల బాల, బాలికలు వారికి తగిన విభాగాల్లో పోటీలకు హాజరు కావచ్చని, తమ వెంట బోనోఫైడ్, ఆధార్కార్డు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలను తీసుకున రావాలని, మరిన్ని వివరాలకు సెల్ నం.9100753683ను సంప్రదించాలని తెలిపారు. -
టీఎస్ స్థానంలో టీజీగా మార్చాలి
నారాయణపేట: టీఎస్ స్థానంలో టీజీగా మార్చాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్ని శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సోమవారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన అధికారుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ప్రభుత్వ వివిధ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు ఏజెన్సీ పేర్లలో టీఎస్ బదులుగా టీజీగా మార్చాలని ఆయన తెలిపారు. జీఓలు, నోటిఫికేషన్లు, నివేదికలు, లెటర్ హెడ్లలో టీజీగా ఉండాలని, ప్రభుత్వ శాఖలు, సంస్థలు, ఆటనామస్ విభాగాలన్నీ దీనిని అధికారులు పాటించాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు వాహనాల రిజిస్ట్రేషనన్కు మాత్రమే పరిమితమైన టీజీ నిబంధన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని అధికారిక వ్యవహారాలకు వర్తింపజేసేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని తక్షణమే ఇది అమల్లోకి వచ్చిందని కలెక్టర్ తెలిపారు. ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశాల మేరకు ఇకపైన ‘టీఎస్’ అబ్రివేషన్ స్థానంలో అధికారికంగా ‘టీజీ’ అని మార్చుకునేలా మే 30 వ తేదీన డెడ్ లైన్న్గా ఉందని, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలన్నింటికి ఇది వర్తిస్తుందన్నారు. వెబ్సైట్ల తో పాటు అన్ని రకాల ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్లు, రిపోర్టుల్లో ఇకపైన ‘టీజీ’ పదాన్నే (అబ్రివేషన్) వినియోగించాలని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ‘టీజీ’ అనే అబ్రివేషన్న్ను అధికారికంగా గుర్తించడంతో ఈ మార్పును అన్ని విభాగాలూ అమల్లోకి తెచ్చేలా ఆయా డిపార్ట్మెంట్ల కార్యదర్శులు, హెచ్ఓడీలు పర్యవేక్షించాలని సీఎస్ శుక్రవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారని తెలిపారు. దీంతో ఇప్పటివరకు టీఎస్పీఎస్సీ (తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్), టీఎస్ఆర్టీసీ (తెలంగాణ స్టేట్ ఆర్టీసీ) తదితర పేర్లతో కొనసాగుతున్న సంస్థలు ఇకపైన టీజీపీఎస్సీ, టీజీఆర్టీసీ అని మార్చుకోవాలని ఆన్నారు. అన్ని శాఖలు, విభాగాలు ఈ మార్పులు చేపట్టిన అంశంపై ఆయా శాఖల కార్యదర్శులు ఈ నెల 30 వ తేదీ లోగా సాధారణ పరిపాలన శాఖ జాయింట్ సెక్రటరీ (కోఆర్డినేషన్)కు రాతపూర్వకంగా (యాక్షన్ టేకెన్ రిపోర్టు) తెలియజేయాలని సీఎస్ తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారని, ఈ సందర్భంగా ఆన్ని కార్యాలయాల్లో టీఎస్కు బదులు టీజీగా మార్చి 26వ తేదీలోగా నివేదికలు సమర్పించాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. సఖీ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ జిల్లా కేంద్రంలోని ఎర్రగుట్ట వద్ద గల సఖీ కేంద్రాన్ని కలెక్టర్ కోయ శ్రీ హర్ష సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్రానికి రెగ్యులర్గా వచ్చే ఫిర్యాదులు– కేంద్రం ద్వారా చూపిన పరిష్కారాలపై అక్కడి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా బాల్య వివాహాల నివారణకు చేపడుతున్న చర్యలపై ఆరా తీశారు. బాల్య వివాహాలను అరికట్టడంతోపాటు వాటిని ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గత రెండు నెలలుగా ఎన్ని పోక్సో, లైంగిక వేధింపుల కేసులు నమోదయ్యాయని, బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని కేంద్ర నిర్వాహకులను ఆదేశించారు. డీడబ్ల్యూఓ నరసింహారావు, నిర్వాహకురాలు క్రాంతి రేఖ, లీగల్ కౌన్సిలర్ రమాదేవి, తిరుపతయ్య పాల్గొన్నారు. ‘ప్రజావాణి’ దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి ప్రజావాణి ద్వారా వచ్చిన దరఖాస్తులను ఎప్పటికీ అప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. సోమ వారం ప్రజావాణి సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ సీఎం ఆఫీస్ నుండి వచ్చిన ప్రజాపాలన దరఖాస్తులు అప్లోడ్ చేయాలని 300 దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయని తెలిపారు. వచ్చిన అప్లికేషన్లను అభ్యర్థులకు సమస్య పరిష్కారం అయ్యింది, కానిది మెసేజ్ ద్వారా తెలపాలన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నింటికీ వర్తింపు కలెక్టర్ కోయ శ్రీహర్ష -
కాపరులకు వడ్డీతో సహా డబ్బులు చెల్లించాలి
మద్దూరు: గొల్ల కురుమ, యాదవులకు సబ్సిడీ గొర్రెల పంపిణి కోసం గతంలో డీడీలు కట్టించుకున్నారని, మూడేళ్ల తర్వాత లబ్ధిదారులకు డీడీ డబ్బులు మాత్రమే ప్రభుత్వం చెల్లించడం ఏమిటని అఖిలభారత యాదవ మహాసభ రాష్ట్ర నాయకుడు రఘువీర్యాదవ్ ప్రశ్నించారు. సోమవారం మద్దూరులో యాదవ నా యకులతో కలిసి విలేకర్ల సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అమలు చేసి వారికి లబ్ధి చేకూర్చిందని, కానీ గొల్ల, కురుమ, యాదవకులకు మాత్రం ముందుగానే సబ్సిడీ గొర్రెల కోసం డీడీలు కట్టించుకొని మూడేళ్ల తర్వాత గొర్రెల పంపిణీ లేకపోగా డీడీలు కట్టిన డబ్బు లు చెల్లించిందన్నారు. వెంటనే డీడీ డబ్బులు వడ్డీతో సహా, రెట్టింపు డబ్బులు అందజేయాలని డిమాండ్ చేశారు. ప్రయోజనం పొందని లబ్ధిదారులకు గొర్రెల పంపిణీ చేపట్టాలి, లేదా డబ్బు రూపేణ పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. రాములు, లాలప్ప, మల్లేశం, వెంకటయ్య, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. -
సౌర వెలుగులేవీ..?
మరికల్: గ్రామాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడినా వెలుగులు అందించేందుకు ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసిన సౌర దీపాలు నిరుపయోగంగా మారాయి. వాటర్షెడ్ పథకం కింద మంజూరైన సోలార్ లైట్లను గ్రామాల్లో ఏర్పాటు చేశారు. 2016 సంవత్సరంలో జిల్లాలోని 37 గ్రామాల్లో 554 సోలార్ లైట్లను ఏర్పాటు చేయగా వాటి నిర్వహణ పట్టించుకోకపోవడంతో గ్రామాల్లో ఒక్కటి కూడా వెలగడం లేదు. ఆయా గ్రామాల్లోని ప్రధాన కూడళ్లు, ఆలయాల వద్ద వెళ్లే ప్రధాన రహదారుల పక్కన వీటిని ఏర్పాటు చేశారు. అప్పట్లో వీటిన్ని ఏర్పాటు చేసిన కంపెనీల నిర్లక్ష్యం కారణంగా లైట్లు వెలగడం లేదు. ప్రతి సోలార్ దీపం బ్యాటరీ పెట్టె వద్ద కంపెనీ పేరు, వారి ఫోన్ నంబర్లు పొందుపరిచారు. వాటిని సంప్రదిస్తే ఎలాంటి స్పందన లేదు. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందని పలు గ్రామాల ప్రజలు వాపోతున్నారు. ఈ మధ్య కాలంలో తరుచుగా గంటల తరబడి విద్యుత్ సరఫరాల్లో అంతరాయం ఏర్పడటం వల్ల రాత్రివేళ్లలో చీకట్లో మగ్గుతున్న సోలార్ లైట్లను మరమ్మతులు చేయడంలో అధికారులు విఫలమవుతున్నారు. ప్రభుత్వం సైతం లైట్లను మరమ్మతుకు చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. రూ.83 లక్షల నిధులు వృథా జిల్లాలో 37 గ్రామాల్లో 554 సోలార్ లైట్లను వాటర్షెడ్ పథకం కింద ఏర్పాటు చేశారు. ఒక్కో లైటుకు రూ.15 వేల చొప్పున మొత్తంగా రూ. 83,10,000 నిధులు ఖర్చు చేశారు. వీటిని ఏర్పాటు చేసి 8 ఏళ్లు గడుస్తున్నా ఎక్కడ కూడా ఒక్కటి కూడా వెలగడం లేదు. కనీ సం మరమ్మతు చేయడానికి కూడా ప్రజాప్రతినిధు లు, అధికారులు ముందుకు రాకపొవడంతో రూ. 83 లక్షల ప్రభుత్వ ధనం వృథా కావడం జరిగింది. అధికారులు దృష్టి సారించాలి విద్యుత్ అంతరాయం సమయంలో ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసిన సోలార్ లైట్లపై పంచాయతీరాజ్ శాఖ అధికారులు దృష్టి సారించాలి. లైట్లకు మరమ్మతు చేయిస్తే అవి వెలిగే అవకాశం ఉంది. కానీ క్షేత్రస్థాయిలో అధికారులు పట్టించుకోకపోవడంతో అవి దిష్టిబొమ్మల్లా దర్శనమిస్తున్నాయి. – మోహన్, ఎలిగండ్ల మరమ్మతు చేయిస్తాం జిల్లాలో వాటర్షెడ్ పథకం కింద ఏర్పాటు చేసిన సోలార్ లైట్లు వెలగడం లేదనే విషయం తమ దృష్టికి రాలేదు. లైట్లను ఒకసారి పరిశీలించిన తర్వాత వెలగని సోలార్ లైట్లను ఏ నిధుల కింద మరమ్మతులు చేయాలో పరిశీలించి చర్యలు తీసుకుంటాం. – అనిత, డీపీఓ, నారాయణపేట ఎలిగండ్లలో వెలగని సోలార్ లైటు వాటర్షెడ్ పథకం కింద 37 గ్రామాల్లో 554 సోలార్ లైట్ల ఏర్పాటు మరమ్మతు చేయించడంలో అధికారులు విఫలం నిరుపయోగంగా మారిన తీరు చీకట్లోనే ప్రధాన కూడళ్లు.. రహదారులు -
అన్ని రంగాల్లో రాణించేందుకు కృషి
నారాయణపేట రూరల్: సోమవంశీయ క్షత్రియ సమాజ్ సభ్యులు అన్ని రంగాల్లో రాణించేందుకు కృషి చేద్దామని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, రిటైర్డ్ ఐజీపీ ఐపీఎస్, ఆర్టీసీ చీఫ్ ఆపరేటింగ్ అధికారి విశ్వనాథ్ రవిందర్ అన్నారు. పట్టణంలోని శ్రీఅంబాభవాని ఆలయంలో ఆదివారం ఆయన ప్రత్యేక పూజలు చేసి సమీపంలోని ఫంక్షన్హాల్లో మడి, ధూల్పేట సమాజం ఆధ్వర్యంలో నిర్వహించిన మిషన్ ఉద్దాన్ సదస్సులో పాల్గొన్నారు. పేదరికం, నిరక్షరాస్యత కారణంగా అన్ని రంగాల్లో వెనకబడిపోతున్నామని, ప్రతీ కుటుంబంలో ప్రతి ఒక్కరు చదువుకోవాలన్నారు. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదగడానికి ఒకరికొకరు తోడ్పాటును అందించుకోవాలని సూచించారు. చిన్నతనం నుంచే పిల్లలకు చదువుతో పాటు సంస్కారం,బాధ్యతలను తెలియచేయాలన్నారు. దేశభక్తి, దైవభక్తి పెంపొందించాలన్నారు. సాంస్కృతిక అంశాలు, క్రీడలపై ఉత్సాహాన్ని కల్పించాలన్నారు. అన్ని రకాలుగా అభివృద్ధి చెందడానికి తల్లిదండ్రులు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఆ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు నాగురావునామాజి, స్థానిక నాయకులు నారాయణరావు, విఠల్రావు, విజయ్ పాల్గొన్నారు. -
అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలి
నారాయణపేట రూరల్: విధి నిర్వహణలో ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్లు అప్రమత్తంగా వ్యవహరించాలని డీఎం లక్ష్మిసుధ అన్నారు. స్థానిక బస్టాండ్లో ఆదివారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో కార్మికులతో మాట్లాడారు. మహాలక్ష్మి పథకం ప్రారంభమైన తర్వాత ఆర్టీసీ బస్సులు ప్రయాణికులతో కిక్కిరిసి పోతున్నాయని, బస్సు బయలుదేరుతున్నుడు తప్పకుండా డ్రైవర్లు, కండక్టర్లు ఫుట్బోర్డును పరిశీలించాలన్నారు. ప్రతీ ప్రయాణికుడిని లోపలికి తీసుకున్న తర్వాతనే బస్సు కదిలించాలన్నారు. ప్రమాదాలు జరిగితే ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. సమావేశంలో సీఐ అలివేలమ్మ, బస్స్టేషన్ కంట్రోలర్ భీమమ్మ పాల్గొన్నారు. ఇదిలాఉండగా, హైదరాబాద్ నుంచి నారాయణపేటకు వచ్చే బస్సులో జడ్చర్లకు చెందిన ఎండీ రియాజుద్దిన్ బ్యాగు మరిచిపోయాడు. ఇది గమనించిన కండక్టర్ శ్రీనివాసులు డీఎం లక్ష్మిసుధ సమక్షంలో పోగొట్టుకున్న వస్తువులును అందించారు. ఈ మేరకు ఆర్ఎం శ్రీదేవి ఫోన్ ద్వారా నిజాయితీగా విధులు నిర్వహించిన కండక్టర్ను అభినందించారు. అమ్మవారి చెంత భక్తుల రద్దీ నవాబుపేట: మండలంలోని మైసమ్మ అమ్మవారి చెంత భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం భక్తులు అడవిలో వెలసిన అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. వేసవి సెలవులు కావడంతో ఆలయం చెంత బంధుగణంతో జనజాతర సాగింది. పలువురు కొత్త వాహనాలకు పూజలు చేశారు. -
నిరంతరం అప్రమత్తంగా ఉండాలి
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ఈవీఎంలు, వీవీప్యాట్లను భద్రపరిచిన స్ట్రాంగ్రూంల వద్ద భద్రతా సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జి.రవినాయక్ ఆదేశించారు. పాలమూరు యూనివర్సిటీ (పీయూ) లోని వివిధ విభాగాల భవనాల్లో మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన ఈవీఎంలు, వీవీప్యాట్లను ఆయా స్ట్రాంగ్రూంలలో భద్రపరిచిన విషయం విదితమే. ఆదివారం వాటి వద్ద పోలీసుల భద్రత, సీసీ కెమెరాల పనితీరు, సిబ్బంది విధుల నిర్వహణను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్ట్రాంగ్రూంల వద్ద భద్రత కట్టుదిట్టంగా ఉండాలన్నారు. అనంతరం ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బ్యాలెట్ బాక్స్లను భద్రపరిచిన స్ట్రాంగ్రూంలు, సీసీ కెమెరాల పనితీరు, భద్రతా ఏర్పాట్లను తనిఖీ చేశారు. జిల్లా ఎన్నికల అధికారి రవినాయక్ పీయూ, ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో స్ట్రాంగ్రూంల పరిశీలన -
కొనుగోళ్లు అంతంతే..
నారాయణపేట: యాసంగి సీజన్కు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాలకు ఆశించిన స్థాయిలో ధాన్యం రాలేదు. మార్కెట్లో సన్న రకాలకు డిమాండ్ ఉండడం.. క్వింటాకు రూ.2300 నుంచి రూ. 2,700 పలకడంతో రైతులు బయటి మార్కెట్లో.. వ్యాపారస్తులకు అధికంగా విక్రయించారు. ఇదిలాఉండగా, జిల్లాలోని 253 రెవెన్యూ గ్రామాల్లో ఈ ఏడాది యాసంగిలో 70,209 మంది రైతులు 1,15,401 ఎకరాల్లో వరి సాగుచేశారు. యాసంగిలో పండిస్తున్న వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టర్ కోయశ్రీహర్ష దిశానిర్ధేశంతో సివిల్ సప్లయ్ డిఎం దేవదాసు సూచనలతో సివిల్ సప్లయ్అధికార యంత్రాంగం పర్యవేక్షణలో జిల్లాలో 107 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి 1.35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించడమే లక్ష్యం పెట్టుకుంది. కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు 31,225 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని క్వింటాకు రూ. 2203 మద్దతు ధరకు కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన వరిధాన్యానికి రూ.68,79,00,078 చెల్లించాల్సి ఉండగా అందులో 21,473.920 ఎంటీఎస్ ధాన్యానికి రూ.47.30కోట్ల నగదును రైతుల ఖాతాలో జమ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. 31,225 మెట్రిక్ టన్నుల ధాన్యం జిల్లా వ్యాప్తంగా 107 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని మూడు క్లష్టర్లలో( కోస్గి,నారాయణపేట, మక్తల్)లో లారీలను ఏర్పాటు చేసి ఇప్పటి వరకు 30,940 మె.ట. ధాన్యాన్ని కేటాయించిన రైసు మిల్లులకు తరలించారు. జిల్లాలో ఐకేపీ ఆధ్వర్యంలో 42 కేంద్రాల ద్వారా 1,569 మంది రైతులతో 8,048 మె.ట., పీఎసీఎస్ 58 సెంటర్లలో 3,191 మంది రైతులతో 22,131, మెప్మా 04 కేంద్రాల ద్వారా 208 మంది రైతులతో 889, 3 ఇతర కేంద్రాల ద్వారా 55 మంది రైతులతో 156 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఆశించిన స్థాయిలో రాలే.. జిల్లాలో 107 కొనుగోలు కేంద్రాల ద్వారా 1.35,610 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు సివిల్ సప్లయ్ అధికార యంత్రాంగం ప్రణాళికలు చేసిన విషయం విధితమే. ఏప్రిల్ మొదటి వారంలో కోతలు ప్రారంభమైతే కొ నుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించి 62,190 మెట్రిక్ టన్నులు, మేలో 57,417, జూన్లో 16,003 ఎంటీఎస్ ధాన్యం కొనుగోలు చేయాలని ఆశించింది. కానీ ఏప్రిల్ నెలలో అనుకున్న లక్ష్యం 31,225 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. చివరి గింజవరకు కొనుగోలు చేస్తాం.. రైతులు పండించిన వరి ధాన్యం చివరి గింజ వరకు కోనుగోలు చేస్తాం. రైతులు పండించిన ధాన్యాన్ని అరబెట్టుకోవాలి. అకాల వర్షాలకు ధాన్యం తడవకుండ జాగ్రత్త పడాలి. ఇప్పటి వరకు 31,225 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 21,473 మె ట్రిక్ టన్నుల ధాన్యానికి డబ్బులు చెల్లించాం. – దేవదాసు, సివిల్ సప్లయ్, డీఎం, నారాయణపేట వరిధాన్యం కొనుగోలు లక్ష్యం 1.35 లక్షల మెట్రిక్ టన్నులు ఇప్పటి వరకు కొనుగోలు చేసింది 31,225 మె.ట. జిల్లాలో 107 కేంద్రాల ఏర్పాటు మొత్తం 1,15,401 ఎకరాల్లో వరి సాగు గతేడాది కంటే తక్కువే గతేడాది యాసంగిలో వరి ధాన్యం 2,42,498 మెట్రిక్ టన్నులు లక్ష్యంగా కాగా 1,15,727 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. 76 కొనుగోలు కేంద్రాల ద్వారా (ఐకేపీ 47, ఎంఎంసీ 02, మెప్మా 4, పీఏసీఎస్ 23) ధాన్యం సేకరించి 53 మిల్లులకు తరలించారు. ఈ ఏడాది లక్ష్యం 1.35 లక్షల మెట్రిక్ టన్నులు కాగా ఇప్పటి వరకు 31,225 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడంతో గతేడాది కంటే తక్కువ కొనుగోలు చేశారని చెప్పవచ్చు. అసలు విషయానికి వస్తే మార్కెట్లో సన్న రకాలకు డిమాండ్ ఉండడంతో క్వింటాకు రూ.2300 నుంచి రూ. 2,700 పలకడంతో వ్యాపారస్థులు కొనుగోలు చేశారు. మరో పక్షం రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు జరగవచ్చని భావిస్తున్నారు. ప్రారంభించిన కొనుగోలు కేంద్రాలకు ఈ ఏడాది సైతం సన్నరకాల కంటే దొడ్డు రకాలైన హంస, 1010 ధాన్యం విక్రయించారని చెప్పవచ్చు. -
No Headline
మరికల్: ఆంధ్రా ప్రాంతానికి చెందిన కొందరు వ్యాపారులు రెండు నెలల క్రితమే కర్ణాటక నుంచి రహస్యంగా నకిలీ పత్తి విత్తనాలు తీసుకొచ్చి గుట్టుగా రైతులకు విక్రయించినట్లు సమాచారం. ప్రతి ఏటా అధికారుల కళ్లుగప్పి రహస్యంగా నకిలీ పత్తి విత్తనాలతో పాటు ప్రమాదకరమైన గ్లైకోసిన్ (కలుపు నివారణ) మందును జిల్లాలో స్థిరపడ్డ ఆంధ్రా వ్యాపారులకు చేరవేస్తున్నారు. వీటిని అదునుచూసి తెలిసిన రైతులకు కిలో లెక్కన అంటగడుతూ దర్జాగా తమ వ్యాపారం సాగిస్తున్నారు. ఇప్పటికే ఈ విత్తనాలు రైతులు కొనుగోలు చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. రాయచూర్ నుంచి.. కర్ణాటకలోని రాయచూర్లో పత్తికి అధిక డిమాండ్ ఉండటంతో అక్కడి వ్యాపారులు నకిలీ పత్తి విత్తనాలు తయారు చేయడంలో ప్రావీణ్యం సాధించారు. ఈ విత్తనాలతో పాటు గ్లైకోసిన్ అనే కలుపు నివారణ మందు కూడా జిల్లాకు దిగుమతి అవుతోంది. ఈ వ్యవహారమంతా మార్చి, ఏప్రిల్ నెలలోనే పూర్తిచేసి ఇక్కడి వ్యాపారులకు అప్పగిస్తారు. రాష్ట్ర సరిహద్దు చెక్పోస్టులో తనిఖీలు సక్రమంగా చేపట్టకపోవడంతోనే జిల్లాకు వస్తున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నారు. విత్తనాలు, కలుపు నివారణ మందులు వచ్చిన వెంటనే ఇక్కడి వ్యాపారులు బైక్లపై తీసుకెళ్లి ఇంతకుముందు విత్తనాలు నాటిన రైతులకు మాత్రమే రహస్యంగా విక్రయిస్తున్నారు. పెట్టుబడి తక్కువ అవుతుందనే ఆశతో ఎక్కువ మంది రైతులు విత్తనాలు నాటి కలుపు నివారణ మందులు పిచికారీ చేసి ప్రమాదకర వ్యాధుల బారిన పడుతున్నారు. -
లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోవాలి
నారాయణపేట: జాతీయ లోక్ అదాలత్ను జూన్ 8న నిర్వహించనున్నామని.. కక్షిదారులు సద్వినియోగం చేసుకుంటే కేసులు త్వరగా పరిష్కారమై సత్వర న్యాయం అందుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహ్మద్ అబ్దుల్ రఫీ సూచించారు. శనివారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టులో జరిగిన కో–ఆర్డినేషన్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని జిల్లాలోని పోలీస్ స్టేషన్ల పరిధిలో పెండింగ్లో ఉన్న సివిల్, క్రిమినల్, సైబర్ క్రైమ్, హిట్ అండ్ రన్ కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. రాజీమార్గంలో అధిక కేసులను పరిష్కరించాలని, కోర్టులో పెండింగ్లో ఉన్న కేసులను కూడా త్వరితగతిన పరిష్కరించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. సుమారు 6,500 కేసుల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా డీఎస్పీ లింగయ్య మాట్లాడుతూ.. 90 శాతం కేసులను రాజీమార్గంలో పరిష్కరించాలని అధికారులకు సూచించారు. సమావేశంలో సీనియర్ సివిల్ న్యాయమూర్తి జి.శ్రీనివాస్, జూనియర్ సివిల్ న్యాయమూర్తి మహ్మద్ ఉమర్, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్స్ లక్ష్మీపతిగౌడ్, నాగేశ్వరి, జిల్లాకు చెందిన సీఐలు, అన్ని ఠాణాల పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహ్మద్ అబ్ధుల్ రఫీ -
ఉత్తమ సేవలతోనే గుర్తింపు
నారాయణపేట: పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం నిర్విరామంగా కృషి చేసిందని.. అంకితభావంతో విధులు నిర్తరిస్తే గుర్తింపు లభిస్తుందని ఎస్పీ యోగేష్ గౌతమ్ తెలిపారు. శనివారం జిల్లా పోలీసు అధికారులు, స్పెషల్ పార్టీ, ఎస్బీ, టాస్క్ఫోర్స్ పోలీసులను ఎస్పీ అభినందించి రివార్డులు అందజేసి మాట్లాడారు. సిబ్బంది శాంతిభద్రతలను పరిరక్షిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని సూచించారు. ఇదే ఉత్సాహంతో బాగా పనిచేసి జిల్లాకు, పోలీసుశాఖకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ నాగేంద్రుడు, ఎస్బీ సీఐ రాంలాల్, సీఐ నర్సింహ, ఎస్ఐలు సునీత, శివశంకర్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఎస్పీ యోగేష్ గౌతమ్ -
నిర్మాణాల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలి
నారాయణపేట: ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా చేపడుతున్న నిర్మాణాలు నాణ్యతగా చేపట్టాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మయాంక్ మిత్తల్ ఆదేశించారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో సంబంధిత అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మండలాల వారీగా పనుల వివరాలను ఆయా మండలాల ఏఈలను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనులను నిర్లక్ష్యం చేయొద్దని.. పాఠశాలలు తెరిచే నాటికి పూర్తి చేయాలన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న పనుల ఫొటోలను ఎంపీడీఓ గ్రూప్లో నమోదు చేయాలని సూచించారు. గ్రామాల్లో పారిశుద్ధ్య సేవలు మందగించాయని.. దృష్టి సారించాలని కోరారు. రహదారులకు ఇరువైపులా ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలు తొలగించడంతో పాటు నెలలో మూడుసార్లు ప్రధాన రహదారులను శుభ్రం చేయాలన్నారు. ముఖ్యంగా ఊట్కూర్ నుంచి మక్తల్, నారాయణపేట నుంచి మరికల్ వెళ్లే ప్రధాన రహదారులకు ఇరువైపులా పరిశుభ్రత చర్యలు చేపట్టాలన్నారు. ధన్వాడలో ప్రధాన రహదారి పక్కనున్న పెద్ద డ్రెయినేజీలోని మురుగును పొక్లెయిన్తో తొలగించాలని సూచించారు. దుకాణదారులు వ్యర్థాలను కాల్వలో పడేస్తున్నారని.. వారికి నోటీసులు ఇవ్వాలని, ప్లాస్టిక్ కవర్లను విక్రయించే వ్యాపారులకు జరిమానాలు విధించాలని ఆదేశించారు. ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో ఏమేమి పనులు చేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. వారం రోజుల్లో గ్రామాలన్నీ స్వచ్ఛంగా మారాలని.. ఎంపీడీఓలు గ్రామాల్లో పర్యటించి పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించాలన్నారు. డ్రెయినేజీల నిర్మాణాలు అత్యవసరమైతే వాటికి సంబంధించిన అంచనాలు రూపొందించి పంపించాలని కోరారు. సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి అనిత, డీఆర్డిఓ రాజేశ్వరి, డీఈఓ అబ్దుల్ ఘనీ, పీఆర్ ఈఈ హీర్యానాయక్, విద్యాశాఖ ఎస్ఎంఓ శ్రీనివాస్, అన్ని మండలాల ఎంపీడీవోలు, ఎంపీఓలు, ఏఈలు పాల్గొన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మయాంక్ మిత్తల్ -
నకిలీ ముఠా!
నారాయణపేటఆదివారం శ్రీ 19 శ్రీ మే శ్రీ 2024●ఎక్లాస్పూర్లో ఓ ఇంట్లో పట్టుబడిన గ్లైకోసిన్ మందులు, నకిలీ విత్తనాలు (ఫైల్) ● అదునుచూసి నాటేందుకు సిద్ధమవుతున్న రైతులు ● రాష్ట్ర సరిహద్దులో నిఘా వైఫల్యమే కారణం ● అదే తరహాలో గ్లైకోసిన్ మందు.. ● చక్రం తిప్పుతున్న ఆంధ్రా వ్యాపారులు -
రహస్య ప్రాంతాల్లో నిల్వచేసి..
ఇక్కడి రైతులకు నకిలీ పత్తి విత్తనాలను మొదట పరిచయం చేసింది ఆంధ్రా వ్యాపారులే. పలు మండల్లాలో స్థిరపడి మూడో కంటికి కనిపించకుండా వ్యాపారం నడిపిస్తున్నారు. వీరు విత్తనాలు, మందులను రహస్య ప్రాంతాల్లో నిల్వచేసి విక్రయాలు చేపడతారు. గతేడాది జిల్లాలోని మరికల్ మండలం ఎక్లాస్పూర్, ధన్వాడ, మక్తల్, ఊట్కూర్, కోస్గి, మద్దూరు తదితర మండలాల్లో టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించగా నకిలీ విత్తనాలతో పాటు నిషేధిత గ్లైకోసిన్ మందు డబ్బాలు భారీగా పట్టుబడ్డాయి. ఇదే సమయంలో కొందరు వ్యాపారులు అనుమానం రాకుండా వీటిని ప్యాకెట్ల రూపంలో కూడా రైతులకు విక్రయించారు. పోలీసులు మరింత లోతుగా విచారణ చేపడితే ఒక్కో గ్రామంలో ఇద్దరు, ముగ్గురు నకిలీ వ్యాపారులు పట్టుబడుతారు. -
ఆన్లైన్లో దరఖాస్తుల ఆహ్వానం
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: కాన్పూర్, బెంగళూరులలోని భారత వాయుసేన విభాగంలో సంగీతకారుడి నియామకానికి అర్హులైన అభ్యర్థులు ఈనెల 22 నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా ఉపాధి కల్పన అధికారి మహ్మద్ జానీపాషా ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు http://agnipathvayu.cdac.in ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. 2004 జనవరి 2 నుంచి 2007 జూలై 2 మధ్య జన్మించిన అవివాహిత పురుషులు, మహిళలు అర్హులని పేర్కొన్నారు. తాత్కాలికంగా అడ్మిట్ కార్డు జారీ చేసిన నమోదిత అభ్యర్థులు మాత్రమే రిక్రూట్మెంట్ ర్యాలీలో పాల్గొనేందుకు అనుమతి ఇస్తారని, ముఖ్యంగా రిక్రూట్మెంట్ ర్యాలీ తేదీ, సమయం తాత్కాలిక అడ్మిట్ కార్డులో ఉంటుందని తెలిపారు. -
రోజు రూ.2 కోట్లకుపైగానే..
ఈ నెల 10 నుంచి 15వ తేదీ వరకు బస్టాండ్లలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా కనిపించింది. ఈ నెల 12 మినహాయించి మిగతా రోజుల్లో మహబూబ్నగర్ ఆర్టీసీ రీజియన్ నిత్యం రూ.2 కోట్లపైగా ఆదాయం వచ్చింది. ఆర్టీసీ రీజియన్ అధికారులు ప్రజలకు ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకోవడంతో బస్సులన్నీ ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. ముఖ్యంగా అన్ని డిపోల నుంచి హైదరాబాద్ రూట్లో అధిక ఆదాయం సమకూరింది. ఈ మార్గంలోని బస్సులు ప్రయాణికులతో కనిపించాయి. మహాలక్ష్మి పథకం ప్రయాణికులతోపాటు ఇతరులు అధిక సంఖ్యలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేశారు. ఈ రోజుల్లో ఆర్టీసీ రీజియన్ మెరుగైన ఆక్యుపెన్షి రేషియోను పొందింది. ఈ ఐదు రోజుల్లో రీజియన్లోని పది డిపోలు 100కుపైగా ఓఆర్ను సాధించింది. -
చదువుతోపాటు క్రీడలు అవసరం
నారాయణపేట రూరల్: జిల్లా యువజన సర్వీసుల శాఖ ఆద్వర్యంలో జిల్లాలో ఏర్పాటు చేసిన వేసవి క్రీడా శిక్షణ శిభిరాలను సద్వినియోగం చేసుకోవాలని డీఈఓ కార్యాలయ సెక్టోరియల్ అధికారి శ్రీనివాసులు అన్నారు. మండలంలోని జాజాపూర్ జడ్పీస్కూల్ గ్రౌండ్లో నిర్వహిస్తున్న వాలీబాల్ శిబిరాన్ని శుక్రవారం సాయంత్రం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను పరిచయం చేసుకుని వారితో కలిసి కొంత సమయం ఆటలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి చదువుతో పాటు ఆటలకు సమయం కేటాయించాలన్నారు. క్రీడల వల్ల శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. ఉన్నత విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో క్రీడా కోటలో సీటు సంపాదించవచ్చన్నారు. మరో 15 రోజుల శిక్షణను సద్వినియోగం చేసుకోవాలన్నారు. శిక్షకులు సైతం నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా తగు విధంగా తర్ఫీదు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో ఎస్జీఎఫ్ సెక్రెటరీ నర్సింహులు, కోచ్ రమేష్, పీఈటీ సాయినాథ్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. -
పాఠశాల మరమ్మతులు త్వరగా పూర్తి చేయాలి
ఊట్కూరు: పాఠశాల భవన మరమ్మతు పనులు వెంటనే పూర్తి చెయ్యాలని అడిషనల్ కలెక్టర్ మయాంక్ మిట్టల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మండలంలోని చిన్నపొర్లలో ఉర్దూ మీడియం, ఉన్నతపాఠశాల, ప్రాథమిక పాఠశాలలను సందర్శించారు. పాఠశాలలో కొనసాగుతున్న మరమ్మతు పనులను పరిశీలించారు. మరుగుదొడ్లు, స్లాబ్, తాగునీటి వసతి, ఫ్లోరింగ్ తదితర పనులను పరిశీలించి పక్షం రోజుల్లో పనులను పూర్తి చెయ్యాలన్నారు. ఈ పనులకు రూ.7 లక్షలు నిధులు మంజూరయ్యాయని, నాణ్యతతో పనులు చెయ్యాలని ఆదేశించారు. అనంతరం గ్రామశివారులోని నర్సరీని పరిశీలించి వివరాలు ఆరా తీశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ధనుంజయగౌడ్, జగత్చంద్ర, ఎంపీఓ నర్సింహరాజు తదితరులు పాల్గొన్నారు. 21 నుంచి సదరం క్యాంపులు : డీఆర్డీఓజెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): వికలత్వ పరీక్షల కోసం ఈ నెల 21 నుంచి 29 వరకు సదరం క్యాంపులు నిర్వహించనున్నట్లు డీఆర్డీఓ నర్సింహులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు గాను శనివారం మధ్యాహ్నం ఒంటిగంట నుంచి మీ సేవలో స్లాట్లు బుక్ చేసుకోవాలని సూచించారు. అందులో వచ్చే తేదీ ఆధారంగా జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో నిర్వహించే సదరం శిబిరానికి హాజరుకావాలని సూచించారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
చరిత్ర సృష్టించిన శ్రేయస్ అయ్యర్.. 17 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలోనే
అధిక స్థాయిలోనే పెట్రోలు, డీజిల్ రేట్లు..
ఎలిమినేటర్ మ్యాచ్
పోలింగ్ శాతాల డేటా వివాదం..జవాబుల్లేని ప్రశ్నలనేకం..!
టాలీవుడ్ స్నిప్పెట్లు: జూనియర్ ఎన్టీఆర్ దేవర తాజా అప్డేట్
RR vs RCB: ఎలిమినేట్ అయ్యేది ఎవరు?
టీమిండియా హెడ్కోచ్గా అతడే సరైనోడు!
Qualifier 1: సన్రైజర్స్ విఫలం.. ఫైనల్ చేరిన కేకేఆర్
అదరగొట్టిన అయ్యర్ బ్రదర్స్.. ఫైనల్లో KKR
ఎలిమినేట్ అయ్యేదెవరో?
తప్పక చదవండి
- T20: బంగ్లాకు షాకిచ్చిన పసికూన.. మినీ టీమిండియా అంటూ..
- చనుగొండ్లలో చిరుత పిల్లల సంచారం.. భయాందోళనలో గ్రామస్తులు
- ఇజ్రాయెల్ హెచ్చరిక.. రాయబారులు వెనక్కి రండి
- మూడేళ్ల చిన్నారిపై విద్యుత్ చౌర్యం కేసు
- నిర్మాత మోసం.. నిజాలు బయటపెట్టిన హీరోయిన్ నమిత
- వరంగల్లో అర్ధరాత్రి బాంబుల మోత, కారణం ఏంటంటే..
- నేమ్ప్లేట్ మార్చేసిన సూపర్ మామ్ సానియా మీర్జా ఫోటోలు వైరల్
- స్టార్లైనర్ క్యాప్సుల్ ప్రయోగం మళ్లీ వాయిదా..కారణం..
- RR vs RCB: వార్ వన్సైడ్.. గెలిచేది ఆ జట్టే: టీమిండియా దిగ్గజం
- Kalki 2898: 12 సెకన్లు.. రూ.3 కోట్లు, రాజమౌళిని ఫాలో అవుతున్న ‘కల్కి’టీమ్!
Advertisement