-
అమాత్య ఆశల పల్లకీల్లో..
సార్వత్రిక ఎన్నికల సమరం ముగిసింది. ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ కూటమి అభ్యర్థులే గెలిచారు. ఇక ఇప్పుడు అందరి కన్నూ చంద్రబాబు మంత్రి వర్గ కూర్పుపై పడింది. అమాత్య పదవి కోసం ఉమ్మడి జిల్లాలోని పలువురు నేతలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. తమ కంటే తమకంటూ అప్పుడే ఆశల పల్లకీలో ఊరేగుతున్నట్లు సమాచారం.సాక్షి ప్రతినిధి, అనంతపురం: రాష్ట్రంలో త్వరలో ‘కూటమి’ ప్రభుత్వం ఏర్పాటు కానుంది. సీఎంగా చంద్రబాబు ఈనెల 12న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు కొందరు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ క్రమంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో మంత్రి పదవులు ఎవరిని వరిస్తాయోననే అంశం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. సీనియర్లయిన తమకే మంత్రి పదవి వరిస్తుందని కొందరు తమ కార్యకర్తలతో చెబుతుండగా, సామాజిక సమీకరణల్లో భాగంగా తమకూ వచ్చే అవకాశం ఉందని రిజర్వుడు నియోజకవర్గ అభ్యర్థులు ఆశాభావంతో ఉన్నారు. ముగ్గురి పేర్లు బలంగా.. ఈ నెల 4న వెలువడిన ఎన్నికల ఫలితాలు కూటమికి అనుకూలంగా వచ్చాయి. ఉమ్మడి జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాల్లోనూ కూటమి అభ్యర్థులు జయకేతనం ఎగరేశారు. రెండు జిల్లాల్లోనూ టీడీపీ సంపూర్ణ మెజారిటీ సాధించింది. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలో మంత్రి పదవుల కోసం ఆశావహుల జాబితా పెరిగిపో తోంది. మంత్రి పదవి కోసం ఎవరికి వారు తీవ్రంగా ప్రయత్నాలు సాగిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, రేసులో ముగ్గురు ముందంజలో ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మంత్రి పదవి రేసులో ముందు వరుసలో ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే నాలుగు దఫాలు ఆయన ఎమ్మెల్యే అయ్యారు. గతంలో ఆయన గెలిచినా రాష్ట్రంలో ఆ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. దీంతో ఎప్పుడూ కేశవ్కు మంత్రి పదవి రాలేదు. అయితే, ఈ దఫా ఎమ్మెల్యేగా గెలవడం, టీడీపీనే ప్రభుత్వం ఏర్పాటు చేయనుండడంతో ఆయనకు కలిసిరానున్నట్లు తెలిసింది. 2014లో మంత్రిగా పనిచేసిన పరిటాల సునీత కూడా గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో గెలిచిన నలుగురు మహిళల్లో సునీతనే సీనియర్ ఎమ్మెల్యే. కాబట్టి మహిళా కోటాలో తనకే దక్కుతుందన్న ఆశతో ఆమె ఉన్నారు. వీరిద్దరితో పాటు రాయదుర్గం నుంచి గెలిచిన కాలవ శ్రీనివాసులు మంత్రి పదవి వస్తుందని గట్టి నమ్మకంతో ఉన్నారు. గతంలో కాలవ మంత్రిగా పనిచేశారు. బీసీ సామాజిక వర్గ కోటాలో కచ్చితంగా కాలవకే మంత్రి పదవి వస్తుందని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఇక.. తొలిసారిగా కళ్యాణదుర్గం నుంచి టీడీపీ తరఫున బరిలో నిలిచి ఎమ్మెల్యేగా గెలుపొందిన బడా కాంట్రాక్టర్ అమిలినేని సురేంద్రబాబు కూడా మంత్రి వర్గంలో చోటు దక్కించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మూడు రోజుల క్రితం ఢిల్లీ వెళ్లి టీడీపీ అధినేత నారా చంద్రబాబు ఆశీస్సులు తీసుకున్నారు. హస్తినలో పలువురు టీడీపీ పెద్దలతో పాటు బీజేపీ పెద్దల ఆశీర్వాదం కోసం మకాం వేసినట్లు జోరుగా చర్చ సాగుతోంది. సత్యకుమార్కు పక్కా!ఉమ్మడి అనంతపురం జిల్లాలో బీజేపీ నుంచి ఒక్కరే గెలుపొందారు. ధర్మవరం నుంచి సత్యకుమార్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈయనకు బీజేపీ కేంద్ర పెద్దల్లో మంచి పలుకుబడి ఉందని, దీంతో సత్యకుమార్ కచ్చితంగా మంత్రి అయ్యే అవకాశముందని అనుచరులు చెబుతున్నారు. ఒక వేళ సత్యకుమార్కు మంత్రి పదవి ఇస్తే గనుక టీడీపీ నుంచి ఒక్కరికే అవకాశం ఉంటుంది. సత్యకుమార్కు ఇవ్వకపోతే ఇద్దరికి అవకాశం ఉంది. ఆ ఇద్దరూ ఎవరో త్వరలో తేలిపోనుంది. ఈ నేపథ్యంలో ఎవరికి వారు మంత్రి పదవి కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. -
ఎంతో కష్టపడ్డాం.. మంత్రి పదవి ఇవ్వండి
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీలో మంత్రి పదవులపై ఉత్కంఠ నెలకొంది. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు నేపథ్యంలో చంద్రబాబు ఢిల్లీ రాజకీయాలపైనే ఎక్కువగా దృష్టి కేంద్రీకరించడంతో రాష్ట్ర మంత్రివర్గంపై ఇంకా పూర్తిస్థాయి కసరత్తు జరపలేదని చెబుతున్నారు. మంత్రులుగా ఎవరిని తీసుకోవాలనే దానిపై ప్రాథమికంగా ఒక అవగాహనకు వచ్చినా ఇంకా కచ్చితమైన నిర్ణయం తీసుకోలేదని సమాచారం. అయితే, మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్న చాలామంది తమకు అవకాశం ఇవ్వాలని చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా కష్టపడ్డామని, ఎంతో చేశామని తమకు అవకాశం ఇవ్వాల్సిందేనని పలు జిల్లాలకు చెందిన సీనియర్లు ఆయన్ను కోరుతున్నారు. నేరుగా ఆయన్ను కలిసి తమకు అవకాశం కల్పించాలని కోరడంతోపాటు వివిధ మార్గాల ద్వారా ఆయనపై ఒత్తిడి పెంచుతున్నారు. లోకేశ్ చుట్టూ చక్కర్లు..చంద్రబాబుతోపాటు ఆయన తనయుడు లోకేశ్ పార్టీలో కీలకంగా ఉండడంతో అనేకమంది ముందు ఆయన్ను కలుస్తున్నారు. ఎన్నికలకు ముందు లోకేశ్ పలువురికి మంత్రి పదవులు ఇస్తానని హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. ఇప్పుడు వారంతా తమకిచ్చిన హామీని నెరవేర్చాలని కోరుతున్నారు. నిత్యం ఆయన్ను కలుస్తూ తమ గురించి ఆలోచించాలని విన్నవించుకుంటున్నారు. అయితే, ఫలితాల తర్వాత ఇప్పటివరకు ఎవరికీ చంద్రబాబు ఆయన తనయుడు లోకేశ్ మంత్రి పదవి హామీ ఇవ్వలేదని తెలుస్తోంది. జనసేన, బీజేపీకి మంత్రి పదవులు ఇవ్వాల్సి వుండడం, టీడీపీలోనే ఆశావహులు ఎక్కువగా ఉండడంతో ఎవరికీ ఏ విషయం చెప్పకుండా ఇంకా ఏమీ ఆలోచించలేదని సర్దిచెబుతున్నారు. తమ సంగతి చూడాలంటున్న సీనియర్లు..ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాత చంద్రబాబు మంత్రివర్గ కూర్పుపై దృష్టిపెడతారని చెబుతున్నారు. భవిష్యత్తులో తాము పోటీచేసే అవకాశం ఉండకపోవచ్చని, ఈసారి ఎలాగైనా మంత్రిగా అవకాశం ఇవ్వాలని పలువురు సీనియర్లు ఆయన్ను కోరుతున్నారు. గోరంట్ల బుచ్చయ్యచౌదరి, కళా వెంకట్రావు, అయ్యన్నపాత్రుడు, సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి వంటి నేతలు ఈ కోవలో ఉన్నారు. సామాజికవర్గ నేపథ్యంలో తమకు అవకాశం ఇవ్వాలని బొండా ఉమామహేశ్వరరావు వంటి నేతలు గట్టిగా అడుగుతున్నట్లు సమాచారం. క్లిష్ట సమయంలో పార్టీ కోసం పనిచేసిన తమకు ఎలాగైనా మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని పయ్యావుల కేశవ్, ధూళిపాళ్ల నరేంద్ర, నిమ్మల రామానాయుడు వంటి నేతలు ఒత్తిడి తెస్తున్నారు.లోకేశ్పై ఆశలు పెట్టుకున్న జూనియర్లు..మరోవైపు.. లోకేశ్ అండతో పార్టీలో ఎదిగిన నేతలు, ఆయన ద్వారా సీటు దక్కించుకుని గెలిచిన జూనియర్లు తమకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని అడుగుతుండడం చర్చనీయాంశమైంది. పెదకూరపాడు నుంచి గెలిచిన భాష్యం ప్రవీణ్ వంటి నేతల ఇలాంటి వారిలో ఉన్నారు. అయితే, అందరికీ మంత్రి పదవులు ఇవ్వలేమని చూస్తామని మాత్రమే లోకేశ్ చెబుతున్నట్లు తెలిసింది. సీనియర్ నాయకులకు సైతం ఇప్పటివరకు మంత్రి పదవుల హామీ లభించలేదు. సాధారణంగా అయితే చంద్రబాబు ఈపాటికి మంత్రి పదవుల కోసం అభిప్రాయ సేకరణ, సామాజిక సమీకరణలు, సీనియారిటీ వంటి అంశాల ప్రాతిపదికగా కసరత్తు చేయాల్సి వుంది. కానీ, ఇప్పుడు అదేమీ లేకపోవడంతో ఎవరికి మంత్రి పదవులు దక్కుతాయో, ఆయన మనసులో ఏముందోనని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. సీనియర్లు తమకు అవకాశం వస్తుందా? లేదా? అని చంద్రబాబుకి సన్నిహితంగా ఉండే వారి నుంచి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, మంత్రివర్గం, కీలక పదవుల గురించి ఎలాంటి విషయాలు బయటకు చెప్పకపోవడంతో పార్టీ నేతలు ఉత్కంఠకు లోనవుతున్నారు. -
జనసేనకు నాలుగు మంత్రి పదవులు!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జనసేన పార్టీకి నాలుగుకు తక్కువకాకుండా మంత్రి పదవుల కేటాయింపు ఉంటుందని ఆ పార్టీకి చంద్రబాబు నుంచి స్పష్టమైన సంకేతాలు వచ్చాయి. కేంద్ర కేబినెట్లో రాష్ట్రానికి దక్కే పదవులతో పాటు రాష్ట్ర మంత్రివర్గంలో బీజేపీకి కేటాయించే పదవులను బట్టి జనసేనకు ఐదో మంత్రి పదవి ఆధారపడి ఉన్నట్లు తెలుస్తోంది.నిజానికి.. కేంద్రమంత్రి పదవులతో పాటు రాష్ట్ర మంత్రివర్గంలోనూ ఏ పార్టీకి ఎన్ని పదవులన్న దానిపై శనివారమే కొంత స్పష్టత వస్తుందని భావించినప్పటికీ.. చంద్రబాబు, పవన్కళ్యాణ్ ఇద్దరూ రాజకీయేతర కార్యక్రమాలతో బిజీగా ఉండడంతో ఇరువురి మధ్య ఈ అంశం చర్చకు రాలేదని జనసేన వర్గాలు తెలిపాయి. మరోవైపు.. రాష్ట్ర కేబినెట్లో జనసేన నుంచి అధినేత పవన్కళ్యాణ్తో పాటు పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తప్పక ఉంటారని పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. అలాగే, జనసేనలో మిగిలిన పదవులు ఎవరికన్నది టీడీపీలో మంత్రి పదవుల కేటాయింపుపై ఆధారపడి ఉంది. అయితే, పవన్ ఇప్పటివరకు ఎవరికీ మంత్రి పదవులపై హామీ ఇవ్వలేదని.. చంద్రబాబుతో భేటీ అనంతరమే ఆయన ఆ వివరాలు వెల్లడిస్తారని పార్టీలో చర్చ జరుగుతోంది.వీరే ఆశావహులు.. ఈ ఎన్నికల్లో జనసేన పోటీచేసిన మొత్తం 21 స్థానాల్లో 15 ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పరిధిలోనే పోటీచేసింది. దీంతో.. పవన్, నాదెండ్లకు కాకుండా జనసేనకు ఇంకెన్ని మంత్రి పదవులు దక్కినా అవి ఆ మూడు జిల్లాలోని వారికే ఇచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ జనసేనకు ఐదో మంత్రి పదవి దక్కిన పక్షంలో విజయనగరం జిల్లా నెలిమర్ల నుంచి గెలిచిన లోకం నాగమాధవి లేదా తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులలో ఒకరికి అవకాశం కల్పించే అవకాశం ఉంది. ఇక జనసేనలో కొణతాల రామకృష్ణ, సుందరపు విజయకుమార్, దేవవరప్రసాద్, కందుల దుర్గేష్, బొమ్మిడి నారాయణ నాయకర్ మంత్రి పదవుల రేసులో ఉన్నారు. -
‘బలి’ కోరుతున్న సాంకేతిక విజయం!
‘ది హ్యాండ్ ఆఫ్ గాడ్’ గోల్ గురించి క్రీడా ప్రియులందరూ వినే ఉంటారు. 1986 ఫుట్బాల్ వరల్డ్ కప్ సందర్భంగా అర్జెంటీనా – ఇంగ్లండ్ మ్యాచ్లో డీగో మారడోనా చేసిన తొలి గోల్ వివాదాస్పదమైంది. డీగో చేసిన హెడర్ గోల్ను వాస్తవానికి చేత్తో నెట్టాడని ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో రికార్డింగ్ సౌకర్యం లేకపోవడం వల్ల రెఫరీ దాన్ని గోల్గానే ప్రకటించాడు. తర్వాత నాలుగు నిమిషాలకే ‘గోల్ ఆఫ్ ది సెంచరీ’ని కొట్టిన మారడోనా, అదే ఊపులో వరల్డ్ కప్ను గెలుచుకోవడమే గాక ఫుట్బాల్ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించారు. వివాదాస్పద గోల్పై ఆ తర్వాత స్పందించిన మారడోనా అది ‘సగం మారడోనా హెడ్, సగం హ్యాండ్ ఆఫ్ గాడ్’ ఫలితమని ప్రకటించాడు.దుబాయ్లో ఇటీవల కురిపించిన కృత్రిమ వర్షం ఎంత బీభత్సాన్ని సృష్టించిందో ప్రపంచమంతా చూసింది. క్లౌడ్ సీడింగ్ ఓవర్డోస్కు వాతావరణ మార్పులు కూడా తోడైన ఫలితంగా రెండేళ్లలో కురవాల్సిన వర్షమంతా ఒకేరోజు కురిసి ఎమిరేట్ను అతలాకుతలం చేసింది.ఆంధ్రప్రదేశ్లో ఈసారి జరిగిన ఎన్నికల ఫలితాలను చూస్తుంటే ఏదో ‘అదృశ్య హస్తం’ (హ్యాండ్ ఆఫ్ గాడ్) పనిచేసినట్టుగా, కృత్రిమ ఓట్ల వర్షం కురిపించినట్టుగా అనిపించక మానదు. లేదంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఇటువంటి ఫలితాలు రావాలంటే రష్యా నాయకుడు పుతిన్ లేదా తుర్కియే పాలకుడు ఎర్డోగాన్ లేదా మయన్మార్ మిలిటరీ జుంటా ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగి ఉండాలి. అలా జరగలేదు కాబట్టి ‘హ్యాండ్ ఆఫ్ గాడ్’ ప్రమేయం ఉండాలి. ఎవరా గాడ్? కేంద్ర ప్రభుత్వమా? ఎన్నికల సంఘమా... ఎవరు? కృత్రిమ ఓట్ల వర్షానికి క్లౌడ్ సీడింగ్ ఎవరు చేశారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ జనసామాన్యం మెదళ్లను తొలుస్తున్న ప్రశ్నలివి.ఎలక్ట్రానిక్ వోటింగ్ మెషిన్లను ట్యాంపరింగ్ చేయడం ద్వారా ఫలితాలను తారుమారు చేయడం సాధ్యమేనని స్వయంగా చంద్రబాబే పలుమార్లు ప్రకటించారు. ఆయన అభిమాని వేమూరి రవి ఇంకొంచెం ముందుకెళ్లి ఈవీఎమ్లను ఎలా హ్యాక్ చేయవచ్చో మీడియా సమక్షంలోనే ప్రదర్శించి చూపెట్టారు. అందువల్ల ఈవీఎమ్ల ట్యాంపరింగ్ అనే ఆర్ట్పై కూటమికి స్పష్టమైన అవగాహన ఉన్నది.రాష్ట్రవ్యాప్తంగా సాయంత్రం 5 గంటలకు 68 శాతం ఓట్లు పోలయ్యాయని ఎన్నికల సంఘం ప్రకటించింది. కానీ తుది వివరాలను ప్రకటించడానికి దాదాపు మూడు రోజుల సమయాన్ని తీసుకున్నది. ఈ అసాధారణ జాప్యంపై సందేహాలను లేవనెత్తుతూ ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ పత్రిక సైతం కథనాన్ని ప్రచురించింది. ఆ గడువు ముగిసిన తర్వాత పోలయిన ఓట్ల సంఖ్య కూడా అనుమానాలను రేకెత్తించే విధంగానే ఉన్నది.తుది పోలింగ్ శాతాన్ని సుమారు 81గా నిర్ధారిస్తూ మూడు రోజుల తర్వాత ఈసీ తాపీగా ప్రకటన విడుదల చేసింది. మామూలుగా పోలింగ్ సమయం ముగిసిన తర్వాత పోలింగ్ కేంద్రం ఆవరణలో నిలబడి ఉన్నవారికి స్లిప్స్ పంపిణీ చేస్తారు. వారికి మాత్రమే ఓటువేసే అవకాశం కల్పిస్తారు. అలా నిలబడిన వారికి ఈసారి ఎందుకనో స్లిప్స్ లేదా టోకెన్లు పంపిణీ చేయలేదనే వార్తలు వినవస్తున్నాయి. ఇది అనుమానించదగ్గ అంశం.పోలింగ్ గడువు ముగిసిన తర్వాత ప్రాంగణంలో నిలబడి ఉన్నవారి సంఖ్య మనకున్న సమాచారం మేరకు ఎక్కడా యాభై నుంచి వంద దాటలేదు. వీరు ఓట్లు వేయడానికి ఇంకో రెండు, మూడు గంటలు చాలు. అంటే తొమ్మిది గంటలకల్లా పోలింగ్ పూర్తి కావాలి. కానీ అర్ధరాత్రి దాటిందాకా పోలింగ్ జరుగుతూనే ఉందట! అంటే ఆ యాభైమందే అంతసేపూ సైక్లింగ్ చేస్తున్నారా? వేలాది పోలింగ్ బూత్లలో గడువు ముగిసే సమయానికి 65 నుంచి 70 శాతం మధ్యనున్న పోలింగ్ శాతం తుది ప్రకటన వచ్చేసరికి 85 నుంచి 95 శాతం దాకా ఎగబాకింది.పోలింగ్కు ముందు జరిగిన రాజకీయ పరిణామాలను కూడా గమనంలోకి తీసుకోవాలి. ఎన్డీఏ కూటమిలో చేరడం కోసం చంద్రబాబు పడిన పాట్లు, భరించిన అవమానాలు తెలిసినవే. కూటమిగా కుదురుకున్న తర్వాత వారు ‘ఎలక్షనీరింగ్’ మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. అనేక ప్రాంతాల్లోని ప్రభుత్వాధికారులను బదిలీ చేశారు. కనీవినీ ఎరుగని విధంగా ఏ ప్రాంతంలో ఏ అధికారిని నియమించాలో కూడా ఎన్నికల సంఘానికి సూచించారు. ఈసీ కూడా కూటమి కోర్కెలన్నింటినీ మారుమాట్లాడకుండా నెరవేర్చింది. సాధారణంగా తెలుగు రాష్ట్రాల ఎన్నికలు ఎప్పుడూ తొలి ఫేజ్లోనే ఉంటూ వచ్చాయి. కానీ కూటమి కోరిక మేరకు ఈసారి నాలుగో ఫేజ్కు నెట్టివేశారు.మొదటి మూడు దశల పోలింగ్ తర్వాత జాతీయ స్థాయిలో ఎన్డీఏలో అభద్రతా భావం మొదలైందట. పోలింగ్ సరళి తమకు అనుకూలంగా లేదనే నిర్ధారణకు ఎన్డీఏ పెద్దలు వచ్చారు. నాలుగో దశకు ఎన్నికలను వాయిదా వేయించుకున్న చంద్రబాబు అదనంగా లభించిన సుమారు నెల రోజుల సమయాన్ని ప్రత్యేక ‘ఏర్పాట్ల’ కోసం ఉపయోగించుకున్నారు. ఈ ఏర్పాట్లకు ‘హ్యాండ్ ఆఫ్ గాడ్’ పూర్తిగా సహకరించింది. దేశవ్యాప్తంగా 19 లక్షల ఈవీఎమ్ల మిస్సింగ్పై ఇప్పటికీ కేంద్రం నుంచి స్పష్టమైన సమాధానాలు రాలేదు. ఇవెక్కడున్నాయి? ఏ పనికి వినియోగిస్తున్నారు? ఎవరి సేవల కోసం ‘హ్యాండ్ ఆఫ్ గాడ్’ వీటిని వినియోగిస్తున్నారో తేలవలసి ఉన్నది.గడచిన ఐదేళ్లుగా ప్రత్యర్థులపై లేని దాడులను ఉన్నట్లుగా చూపించి గగ్గోలు పెట్టినవారు పోలింగ్ రోజు సాయంత్రం, మరునాడు – మళ్లీ కౌంటింగ్ రోజు నుంచి గత నాలుగు రోజులుగా జరిగిన హింసాకాండపై మౌనం వహించారు. ఈ హింసాకాండ కూడా అప్పటికప్పుడు ఆవేశంతో చెలరేగినట్టు లేదు. జాగ్రత్తగా పరిశీలిస్తే ఒక క్రమం కనిపిస్తున్నది. కృత్రిమ ఓట్ల వర్షం కురిసే సమయానికి ఎవరూ పోలింగ్ కేంద్రాల వైపు వెళ్లకుండా బెదరగొట్టేందుకు దాడులు జరిగాయి. మరుసటి రోజు కూడా చాలాచోట్ల ఇవి కొనసాగాయి. మళ్లీ కౌంటింగ్ పూర్తవుతున్న సమయం నుంచి నాలుగు రోజులుగా యథేచ్ఛగా రాష్ట్రవ్యాప్తంగా దాడులు జరుగుతున్నాయి. అసాధారణమైన ఓటింగ్ సరళిని సమీక్షించడానికి ప్రత్యర్థులు గ్రామాల్లో పర్యటించే అవకాశం లేకుండా బెదరగొట్టడానికి ఈ దాడులు జరిగాయి. పోలీసు యంత్రాంగం పూర్తిగా కూటమి వ్యూహానికి తోడుగా నిలబడింది.విచక్షణారహితంగా జరుగుతున్న ఈ దాడులు మన ప్రజాస్వామ్య భవిష్యత్తు మీద ప్రశ్నార్థకాన్ని రచిస్తున్నాయి. ఈ దాడులను ఖండించకపోగా ‘వైఎస్సార్సీపీ కవ్వింపు చర్యలకు రెచ్చిపోకండ’ని ముఖ్యమంత్రి కాబోయే చంద్రబాబు ట్వీట్ చేశారు. గత రెండేళ్లుగా లోకేశ్ ఒక రెడ్బుక్ను సభల్లో ప్రదర్శిస్తూ హెచ్చరికలు జారీ చేసేవారు. తాను రెడ్బుక్లో పేర్లు ఎక్కించిన వారి సంగతి అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తానని చెప్పేవారు. ఇప్పుడా రెడ్బుక్ హోర్డింగ్లను కూడళ్లలో ఏర్పాటు చేశారు. దాని సందేశమేమిటో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.సందేశం గూండాతండాలకు స్పష్టంగానే అర్థమైంది. టీడీపీ వారికి చాలాచోట్ల జనసైనికులు కూడా తోడయ్యారు. ప్రత్యర్థులపై దాడులు చేస్తున్న సందర్భాల్లో పోలీసులు మౌన ప్రేక్షక పాత్రను పోషించారు. కొన్నిచోట్ల పారిపోతూ కనిపించారు. ఇప్పటివరకు బయటకొచ్చిన వీడియోల్లో ఇటువంటి దృశ్యాలెన్నో కలవరం కలిగించాయి.నూజివీడులో వైసీపీకి చెందిన ముసినిపల్ కౌన్సిలర్ను వెంబడించి కత్తులతో పొడుస్తున్న దృశ్యం పిండారీల దండయాత్రను తలపించింది. ఒక హాస్టల్ నిర్వాహకుడి ఇంటిపై దాడిచేసి గృహాన్ని ఛిద్రం చేసి, ఆ పెద్దమనిషిని మోకాళ్లపై కూర్చోబెట్టి కాళ్లు పట్టించుకున్న పైశాచికత్వం భయానకంగా కనిపించింది. రాళ్ల దాడులు, కర్రలతో దాడులు, కత్తులతో దాడులు, కిడ్నాప్లు... ఎన్నెన్ని దృశ్యాలు? వైసీపీకి చెందిన వారి కార్యాలయాలను పెట్రోల్ పోసి తగలబెట్టారు. వాహనాలను తగులబెట్టారు. జెండా దిమ్మెలను సుత్తులతో పగులగొట్టారు. శంకుస్థాపన ఫలకాలను ధ్వంసం చేశారు. గ్రామ సచివాలయాల మీద దాడులు చేశారు. వైఎస్సార్ విగ్రహాలను తొలగించి ఈడ్చుకుంటూ అవమానించారు.వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయంపై వైఎస్సార్ అక్షరాలు తొలగించారు. ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్స్ల వంటి విప్లవాత్మక కార్యక్రమాలను ప్రారంభించిన వైఎస్సార్ పేరు ఆరోగ్య విశ్వవిద్యాలయానికి బాగుంటుందని భావించిన ప్రభుత్వం చట్టసవరణ ద్వారా ఎన్టీఆర్ పేరును మార్చి వైఎస్సార్ పేరు పెట్టారు. బదులుగా విజయవాడ కేంద్రంగా ఏర్పడిన కొత్త జిల్లాకు ఎన్టీఆర్ పేరును పెట్టారు. ఒక అల్లరిమూక దాడి చేసి ఇప్పుడా అక్షరాలను తొలగించింది..విశ్వవిద్యాలయాల మీద కూడా దాడులకు తెగబడ్డారు. వీసీలు, రిజిస్ట్రార్లు తప్పుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభు త్వం మారితే యూనివర్సిటీ పాలకవర్గాలను కూడా మార్చాలనే ఓ కొత్త ఆచారానికి శ్రీకారం చుట్టబోతున్నట్టు కనిపిస్తున్నది. నామినేటెడ్ పదవుల్లో ఉన్నవారు రాజీనామాలు చేయడం సంప్రదాయం కానీ, ఇవి నామినేటెడ్ పదవులు కావు. సెర్చ్ కమిటీ సిఫారసుల మేరకు గవర్నర్ చేసిన నియామకాలు. అయినా సరే తమ పార్టీవాడే వీసీగా కూర్చోవాలనే దుందుడుకుతనం ప్రజాస్వామిక పద్ధతులను దెబ్బతీస్తున్నది.భయానక వాతావరణాన్ని కల్పించడం ద్వారా ప్రతిపక్షాలను కట్టడి చేయాలని కొత్త ప్రభుత్వం భావిస్తే అది నెరవేరే అవకాశం ఉండదు. నాలుగు రోజులు ఆలస్యమైనా సరే ఎన్నికల అవకతవకలపై వారు దృష్టి సారించకుండా ఉండరు. నిజానిజాలు తవ్వితీయకుండా ఉండరు. అలాగే కొత్త ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం జనంతో కలిసి విపక్షాలు కచ్చితంగా ఉద్యమిస్తాయి. కూటమికి లభించిన విజయం సాంకేతికమైనదే. అయినా సరే, ప్రభుత్వాన్ని అదే ఏర్పాటు చేస్తుంది. అడ్డంకులేమీ ఉండవు. చేసిన హామీలను నెరవేర్చి, ప్రజాస్వామిక వాతావరణాన్ని పునరుద్ధరించితే కొత్త ప్రభుత్వం ప్రజల మన్నన పొందుతుంది.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
రామోజీరావు పార్థివ దేహానికి చంద్రబాబు నివాళి
-
ఏపీలో దాడుల వెనుక ఆ ఇద్దరు: పేర్ని నాని
సాక్షి, కృష్ణా: ఎన్నికల్లో గెలిచిన టీడీపీ ఎమ్మెల్యేలు రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తూ.. మారణ హోమం చేస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని ఆవేదవ వ్యక్తం చేశారు. రాష్ట్రం నలుమూలలా టీడీపీ శ్రేణులు కొనసాగిస్తున్న అరాచకాలపై శనివారం ఆయన మీడియాతో మాట్లాడుడారు. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై సంచలన ఆరోపణలు చేశారాయన. కౌంటింగ్ రోజు నుంచే వైఎస్సార్సీపీ నాయకుల పై దాడులు చేస్తున్నారు. టీడీపీ , జనసేన పార్టీ రౌడీ మూకలు అధికారమదంతో రెచ్చిపోతున్నాయి. టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలే ఈ దాడుల్ని ప్రోత్సహిస్తున్నారు. డీజీపీ, పోలీసులు ఉద్యోగం చేయకుండా చంద్రబాబు వాళ్ల చేతులు కట్టేశారు. బీహార్, యూపీ మాదిరి ఏపీలో హింసా రాజ్యం రచిస్తున్నారు. చంద్రబాబు , ఆయన కుమారుడే ఇదంతా చేయిస్తున్నారు.... పోలీసులను టీడీపీ రౌడీలు , రౌడీషీటర్లు బెదిరిస్తున్నారు. దాడులు చేస్తున్న టీడీపీ రౌడీలను ఆపే ప్రయత్నం కూడా పోలీసులు చేయడం లేదు. మా ఇళ్ల పై పడి దాడులు చేస్తుంటే పోలీసులు కనీసం కేసు కూడా పెట్టడం లేదు. పోలీసు వ్యవస్థను చంద్రబాబు పతనావస్థకు తీసుకొచ్చాడు. టీడీపీ రౌడీ షీటర్లు మహిళల పట్ల అత్యంత దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఇంత జరుగుతున్న జిల్లా ఎస్పీ ఏమైపోయారు. .. చంద్రబాబు సీఎం అయ్యాక రౌడీలు సీఐలు,డీఎస్పీలు , ఎస్పీలు అయిపోయారు.మేం మీటింగ్ పెట్టుకుంటే మా నాయకులను రాకుండా అడ్డుకున్నారు. దాడులు చేస్తున్నా పోలీసులు చూస్తూ ఉంటే.. మేం కూడా తిరగబడక తప్పదుచంద్రబాబు చేయిస్తున్న దౌర్జన్యాల పై చర్యలు తీసుకోనందుకు కోర్టుకు వెళ్తాం. రెండు రోజుల్లో జిల్లా ఎస్పీని మా నాయకులమంతా కలుస్తాం’’ అని పేర్ని నాని అన్నారు. -
కాకినాడ అభివృద్ధిపై దృష్టి పెట్టండి..
-
మళ్లీ 2014 నాటి అరాచక పాలన రిపీట్ అవుతుందా?
ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్న నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో జరుగుతున్న హింసాకాండ గురించి చేసిన ట్వీట్ ఏ మాత్రం పద్ధతిగా ఉన్నట్లు అనిపించదు. వందల గ్రామాలు, పట్టణాలలో తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు చెలరేగి వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకుల ఇళ్లపై దాడులు చేస్తుంటే ఖండించకపోతే మానే, పరోక్షంగా వాటిని సమర్థిస్తున్నట్లుగా ఉందన్న విమర్శలు వస్తున్నాయి.కౌంటింగ్ జరుగుతున్న రోజే వైఎస్సార్సీపీ ఓడిపోతోందని తెలిసిన క్షణం నుంచే టీడీపీ శ్రేణులు దాడులకు తెగబడ్డాయి. గత నాలుగు రోజులుగా కత్తులు, కర్రలతో యథేచ్ఛగా తిరుగుతుంటే, ఎక్కడో ఒకటి, అరచోట తప్ప, మిగిలిన అన్ని ప్రాంతాలలో పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారు. ఇప్పటికీ అదే పరిస్థితి కొనసాగుతోంది. హింసాకాండకు ఎవరూ పాల్పడవద్దని చెప్పవలసిన సీనియర్ నేత చంద్రబాబు నాయుడు ఏమని అంటున్నారో చూడండి. "రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల అనంతరం జరుగుతున్న వైఎస్సార్సీపీ కవ్వింపు చర్యలు, దాడులపై టీడీపీ క్యాడర్ అప్రమత్తంగా ఉండాలి" అని అన్నారు.ఎక్కడైనా ఓడిపోయినవారు కవ్వింపు చర్యలకు దిగే పరిస్థితి ఉంటుందా? ఒకవేళ ఎక్కడైనా జరిగితే వెంటనే టీడీపీ మీడియా పెద్ద ఎత్తున గగ్గోలు పెట్టి ఉండేది కాదా! ఒకపక్క అంతగా టీడీపీ వారు చెలరేగిపోతున్న సమయంలో ముఖ్యమంత్రి కాబోతున్న చంద్రబాబు నాయుడు వైఎస్సార్సీపీ కవ్వింపు చర్యలు అనడం ఏమిటి? ఆ పేరుతో దాడులు చేసుకోండని చెప్పినట్లు శ్రేణులు అర్థం చేసుకోవా! ఈ నెల పన్నెండున ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. పదకుండు రాత్రివరకు ఇలాంటి దాడులు జరుగుతాయన్న ప్రచారం ఉంది. ఈలోగా అనూహ్యంగా ఈనాడు అధినేత రామోజీరావు కన్నుమూశారు కనుక ఈ దాడులను ఏమైనా ఆపుతారేమో చూడాలి.టీడీపీ క్యాడర్ అప్రమత్తంగా ఉండాలి అని చెప్పడం అంటే, వారు దాడులు చేసినప్పుడు వైఎస్సార్సీపీవారు ఏమైనా ప్రతిదాడికి దిగుతారేమో జాగ్రత్త అని చెప్పినట్లు అనిపిస్తుంది తప్ప శాంతిభద్రతలను కాపాడాలని కోరుకున్నట్లుగా లేదు. వైఎస్సార్సీపీ కవ్వింపు చర్యల పట్ల నాయకులు సైతం అలర్ట్ గా ఉండి.. ఎటువంటి దాడులు, ప్రతిదాడులు జరగకుండా చూడాలి అని ఆయన అన్నారు. దీనిని బట్టి టీడీపీ నేతలు ఏమి చేయాలో అర్థం చేసుకోవాలన్నమాట. వైఎస్సార్సీపీ మూకలు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడినా కార్యకర్తలు పూర్తి సంయమనం పాటించాలి అని ఆయన సూచించారు. అంతే తప్ప టీడీపీ కార్యకర్తలు దాడులు చేయవద్దని అనడానికి ఇష్టపడడం లేదనుకోవాలి. పోలీసులు సైతం ఇంతవరకు జరిగిన హింసాకాండను వైఎస్సార్సీపీ వారి చర్యగానే చూడాలి తప్ప, టీడీపీ దాడులుగా చూడకూడదని అనుకునే అవకాశం కనిపించడం లేదా?వందల చోట్ల ఈ దాడులు జరిగితే పోలీసులు ఎంతమంది మీద కేసులు పెట్టారు? ఇదేనా రాజ్యాంగం, చట్టబద్ధపాలన అంటే! పోలీసు అధికారులు సైతం శాంతి భద్రతలు అదుపులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నానని ముక్తాయింపుగా చివరిలో ఒక మాట అన్నారు. అసలు ఇది ట్విటర్ లో చెప్పవలసిన విషయమా! పోలీసు డీజీపీ తదితర ఉన్నతాధికారులను పిలిచి సమీక్షించి, లేదా వారికి ఫోన్ చేసి వెంటనే కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసి ఏపీకి చెడ్డపేరు రాకుండా చూడాలని చెప్పవలసిన చంద్రబాబు ఈ రకంగా మాట్లాడుతున్నారంటే వచ్చే రోజులు ఇంకెంత భయానకంగా ఉంటాయో అనే సందేహం వస్తుంది.అధికారం ఎవరికి శాశ్వతం కాదు. ఎవరు హింసాయుత చర్యలకు దిగినా తప్పే. గ్రామాలలో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలపై దాడులు చేస్తే అది వైఎస్సార్సీపీ మూకల చర్యలు అని అనుకోవాలని టీడీపీ నాయకత్వం భావిస్తున్నట్లుగా ఉంది. వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలను ధ్వంసం చేయడం, వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ది పనుల శిలాఫలకాలు ధ్వంసం చేయడం వైఎస్సార్సీపీవారి పనేనని టీడీపీ చెప్పేలా ఉంది. మాజీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశి, కొడాలి నాని, తదితరుల ఇళ్లపైకి దాడి చేసింది వైఎస్సార్సీపీ మూకలని చెప్పదలిచారా? ఒక పక్క టీడీపీ జెండాలతో కత్తులు, కర్రలతో టీడీపీ కార్యకర్తలు, అసాంఘీక శక్తులు స్వైర విహారం చేస్తుంటే, వైఎస్సార్సీపీ మూకలు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడ్డా సంయమనంగా ఉండాలని టీడీపీ వారిని కోరుతున్నానని చంద్రబాబు అంటున్నారు. ఇది ప్రజాస్వామ్యాన్ని పరిహసించడమే. రాజ్యాంగ విధులను కాలరాయడమే.గతంలో ఏ ఒక్క చిన్న ఘటన జరిగినా నానా హడావుడి చేసిన చంద్రబాబు ఇప్పుడు తాపీగా ఒక కామెంట్ ను అది కూడా ట్విటర్ లో చేసి ఊరుకున్నారు. ఇది సమంజసమేనా? కానీ దీని గురించి ఆయనను అడిగేదెవ్వరు. ప్రశ్నిస్తానని చెబుతూ రాజకీయాలలోకి వచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తాను ఎమ్మెల్యేగా గెలిచానన్న ఆనందంలో ఇలాంటివాటిపై కనీసం స్పందించలేకపోతున్నారు. జనసేన కార్యకర్తలు చేస్తున్న దాడులను కూడా ఆయన నిరోధించడం లేదు. ఈ నేపధ్యంలోనే టీడీపీ నేత వర్మ కారుపై జనసేన కార్యకర్తలు చేసిన దాడిని కూడా ఆయన ఖండించినట్లు అనిపించడం లేదు. ఇక లోకేష్ ఎర్రబుక్ సిద్ధం అంటూ ఆయా చోట్ల టీడీపీ వారు ప్లెక్సీలు పెడుతున్నారని కొందరు చెబుతున్నారు. అది మరింత రెచ్చగొట్టే చర్య అవుతుంది. అధికారంలోకి వచ్చాక కూడా అలాంటివాటిని ప్రోత్సహిస్తే విపరిణామాలు ఎదురవుతాయి.వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చినప్పుడు ఇలాంటి ఘటనలు దాదాపు జరగలేదు. అయినా హింసాకాండ అంటూ తమకు మద్దతు ఇచ్చే మీడియా ద్వారా విపరీతమైన ప్రచారం చేయించారు. ఇప్పుడు ఆ మీడియాలో ప్రస్తుత హింసకు సంబంధించి కథనాలేవీ ప్రముఖంగా రావడం లేదు. ఈ పరిస్థితిలో వైఎస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఒక ప్రకటన చేస్తూ గవర్నర్ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తన పార్టీ నేతలతో జిల్లాలవారీగా కమిటీలు ఏర్పాటు చేసి బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పే యత్నం చేస్తున్నారు. బహుశా ఆయన కూడా కొద్ది రోజులలో టీడీపీ దాడులవల్ల తీవ్రంగా గాయపడిన, ఆస్తులు కోల్పోయిన వారి కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పవచ్చు.కొద్ది మంది ఈ దాడులలో గాయపడి ప్రాణాలు కోల్పోయినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. వైఎస్సార్సీపీ ఓటమి భరించలేక కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మస్థైర్యంతో ఉండవలసిన సమయం ఇది. ఏ పార్టీకి అయినా గెలుపు, ఓటములు ఉంటాయి. జగన్ అన్నట్లుగా టీడీపీ ప్రభుత్వం కొలువు తీరకముందే ఏపీలో రాజ్యాంగ వ్యవస్థలను కుప్పకూల్చారనిపిస్తుంది. చంద్రబాబు కక్షలకు ప్రజాస్వామ్యానికి ముప్పు వచ్చిందని ఆయన అన్నారు. చివరికి యూనివర్సిటీలలో కూడా టీడీపీ శక్తులు అరాచకం సృష్టిస్తుంటే వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయితే ఎవరికి చెప్పుకోవాలి.ప్రధానమంత్రి మోదీ కూడా ఈ విషయంలో ఎందుకు మౌనంగా ఉంటున్నారో తెలియదు. దేశంలో ఎక్కడ ఏ ఘటన జరిగినా మాట్లాడే ప్రధాని ఏపీని మాత్రం విస్మరించడం బాధాకరం. ఈ హింసాకాండలో బాధితులైన కార్యకర్తలకు అండగా ఉంటానని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. కచ్చితంగా బాధితులకు ధైర్యం చెప్పవలసిన సమయం ఇది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక్కసారి బయటకు వచ్చి ఆయా ప్రదేశాలకు వెళ్లి పరిశీలన చేస్తే వైఎస్సార్సీపీ క్యాడర్ కు నైతికబలం వస్తుంది. అలాగే రెచ్చిపోయే టీడీపీ మద్దతుదారులు కొంత వెనక్కి తగ్గే అవకాశం ఉంటుందని చెప్పాలి. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు టీడీపీ కార్యకర్తలు చేస్తున్న అరాచకాలకు ముగింపు పలికేలా చర్యలు తీసుకోకపోతే ఆయన మళ్లీ 2014నాటి పాలనను పునరావృతం చేయడానికే సిద్ధపడుతున్నారన్న సంకేతాలు వెళతాయని అర్థం చేసుకోవాలి.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
KSR Live Show: ప్రజాస్వామ్యానికే పెనుముప్పుగా చంద్రబాబు కక్ష సాధింపు
-
ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోయాయి.. గవర్నర్ జోక్యం చేసుకోవాలి.. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి విజ్ఞప్తి.. ఇంకా ఇతర అప్డేట్స్
-
బుచ్చయ్యకు ఈసారైనా దక్కేనా?
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఎన్నికలు ముగిశాయి. ఫలితాలు వెలువడ్డాయి. టీడీపీ అధికారం చేజిక్కించుకుంది. ఇప్పుడు ఆ పార్టీలో అందరి కళ్లూ కేబినెట్ కూర్పుపైనే ఉన్నాయి. మంత్రివర్గం ఎలా ఉండబోతోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రాతిపదికన తీసుకుంటారా, సామాజిక సమతూకాల మాటేమిటి, కూటమిలో క్రియాశీలకమైన జనసేనకు లభించే ప్రాతినిధ్యం ఎంతవరకూ ఉంటుంది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో చర్చ అంతా ఈ అంశాలపైనే జరుగుతోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అన్ని స్థానాల్లోనూ టీడీపీ, జనసేన అభ్యర్థులు గెలుపొందడంతో మంత్రివర్గంపై ఆశలు పెంచుకున్న వారి జాబితా చాంతాడులా మారుతోంది. పార్టీ సీనియర్లు ఈసారి కేబినెట్లో బెర్త్ ఖాయం చేసుకోవాలని లాబీయింగ్ చేయడంలో బిజీబిజీగా గడుపుతున్నారు. మంత్రివర్గంలో బెర్త్ కోసం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సీనియర్లంతా రేసులో ఉన్నారు. పార్టీలో నంబర్ టుగా పేర్కొనే యనమల రామకృష్ణుడు సహా నిమ్మకాయల చినరాజప్ప, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, జ్యోతుల నెహ్రూ, బండారు సత్యానందరావు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. స్పీకర్, ఆర్థిక మంత్రిగా పనిచేసిన యనమల ప్రత్యక్ష రాజకీయాలకు దూరమై మండలిలో ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు. ఈసారి ఎన్నికల్లో ఆయన కుమార్తె దివ్య తుని నుంచి ఎన్నికయ్యారు. మండలి నుంచి మంత్రివర్గంలోకి యనమలకు బెర్త్ దక్కితే సరేసరి లేదంటే కుమార్తె దివ్య రేసులో ఉండటం ఖాయమంటున్నారు. గత చంద్రబాబు కేబినెట్లో ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రిగా చేసిన పెద్దాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప కూడా మంత్రివర్గంలో ప్రాతినిధ్యాన్ని కోరుకుంటున్నారు. వివాదరహితుడనే పేరున్న చినరాజప్ప రెండో సారి ప్రయత్నాల్లో ఉన్నారు. దాదాపు మూడు దశాబ్దాలుగా మెట్ట ప్రాంత రాజకీయాల్లో చక్రం తిప్పిన జ్యోతుల నెహ్రూ ఈసారి బెర్త్ ఖాయం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్నారు. మంత్రి అనిపించుకోవాలనే ఆత్రం ఎవరికి మాత్రం ఉండదని నెహ్రూ సన్నిహితులు చెబుతున్నారు. పార్టీ కాకినాడ జిల్లా అద్యక్షుడు నవీన్ ఇప్పటికే లోకేష్ను కలిసి వచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.బుచ్చయ్యకు ఈసారైనా దక్కేనా?రాజమహేంద్రవరం రూరల్ నుంచి గెలుపొందిన సీనియర్ నాయకుడు గోరంట్ల బుచ్చయ్యచౌదరి పేరు కూడా కేబినెట్ రేసులో ప్రచారంలోకొచ్చింది. ఉమ్మడి తూర్పు గోదావరిలో అందరి కంటే సీనియర్ అయిన తనకు బెర్త్ ఖాయమనే ధీమాతో బుచ్చయ్యచౌదరి ఉన్నారు. దివంగత ఎన్టీఆర్ హయాంలోనే పౌర సరఫరాలు వంటి కీలక శాఖలు చేసిన తమ నేతకు ఈసారి మంత్రివర్గంలో చోటు కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నామని అనుచరులు బాహాటంగానే చెబుతున్నారు. బుచ్చయ్యకు పోటీగా సిటీ ఎమ్మెల్యేగా ఎన్నిక అయిన ఆదిరెడ్డి వాసు కూడా రేసులో ఉన్నారు. ఆది నుంచీ సిటీ సీటు విషయంలో గోరంట్ల...ఆదిరెడ్డి వర్గాల మధ్య వైషమ్యాలు ఉన్న విషయం బహిరంగ రహస్యమే. ఈ నేపథ్యంలో వాసు కోటరీ లోకేష్ ద్వారా బెర్త్ కోసం పావులు కదుపుతున్నారు. ఇప్పటికే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, చిన్న మావ అయిన అచ్చెన్నాయుడుతో చంద్రబాబుకు సిఫార్సు చేయించుకుంటున్నారు అని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వీరితోపాటు కొత్తపేట నుంచి బండారు సత్యానందరావు, ఎస్సీ, బీసీ కోటాలో అమలాపురం అయితాబత్తుల ఆనందరావు, కాకినాడ నుంచి వనమాడి కొండబాబు అమాత్య పదవి కోసం పావులు కదుపుతున్నారు.యనమల హవా నడుస్తుందా?మంత్రివర్గం కూర్పులో సామాజికవర్గాల సమతూకమే ప్రామాణికంగా ఉంటుందని పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ లెక్కలను పరిగణనలోకి తీసుకుంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు కాపు, బీసీ, ఎస్సీ సామాజిక వర్గాల నుంచి మూడు బెర్త్లు ఖాయం కావచ్చనే ప్రచారం టీడీపీలో జరుగుతోంది. అదే నిజమైతే సీనియర్ల మధ్యనే పోటీ ప్రధానంగా ఉంటుందని నేతలు విశ్లేషిస్తున్నారు. ఉమ్మడి జిల్లా టీడీపీ రాజకీయాల్లో ఆది నుంచి యనమల, జ్యోతుల వర్గాలకు పొసగని పరిస్థితి. ఆది నుంచీ జ్యోతుల మంత్రి పదవికి మోకాలడ్డుతున్నది యనమల వర్గమేనని ఆయన సన్నిహితులు పేర్కొంటుంటారు. ఈసారి ఏమి జరుగుతుందో చూడాలంటున్నారు. గతంలో మాదిరి కేబినెట్ కూర్పులో యనమల హవా నడుస్తుందా లేదా మారిన సమీకరణలు ఎవరికి ప్లస్ అవుతాయో వేచి చూడాల్సిందేనంటున్నారు.కాపుల నుంచే పోటీ ఎక్కువప్రధానంగా కాపు సామాజికవర్గం నుంచి పోటీ ఎక్కువగా ఉండేటట్టు కనిపిస్తోంది. ఇటు టీడీపీ, అటు జనసేనలో ఈ సామాజికవర్గం నుంచి అమాత్య పదవిని ఆశిస్తున్నవారు ఎక్కువగా ఉన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరిలో జనసేన అధ్యక్షుడు పవన్ పోటీ చేసిన పిఠాపురం సహా రాజోలు, పి.గన్నవరం, నిడదవోలు, కాకినాడ రూరల్, రాజానగరం స్థానాల్లో కాపు సామాజిక వర్గీయులు గెలుపొందారు. వీరిలో మొదటి ప్రాధాన్యంగా నిడదవోలు నుంచి గెలుపొందిన కందుల దుర్గేష్కు చాన్స్ లభించవచ్చునంటున్నారు. ఆవిర్భావం నుంచి పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా దుర్గేష్పై పవన్కు ఉన్న గుడ్లుక్స్ కేబినెట్లో చోటుకు సానుకూల అంశంగా మారుతుందంటున్నారు. పవన్కల్యాణ్ ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి అంటూ జరుగుతోన్న ప్రచారమే నిజమైతే ఉమ్మడి జిల్లాలో కాపు సామాజికవర్గం నుంచి మరొకరికి అవకాశం లభించడం కష్టమేనంటున్నారు. ఉమ్మడి తూర్పున జనసేనలో ఎస్సీల నుంచి పవన్ ప్రతిపాదించాలనుకుంటే రాజోలులో గెలుపొందిన దేవ వరప్రసాద్ పేరు మొదటి వరుసలో ఉంటుందంటున్నారు. గత ఎన్నికల్లో రాష్ట్రంలో గెలుపొందిన ఏకై క రాజోలు చీకటిలో చిరుదీపంగా నిలిచిందంటూ పవన్ ఆ నియోజకవర్గం పార్టీకి ప్రత్యేకం అని చెప్పుకొచ్చారు. అందునా రిటైర్డ్ ఐఏఎస్గా, పార్టీ జనవాణి కార్యక్రమ కోఆర్డినేటర్గా వరప్రసాదరావు వైపే పవన్ మొగ్గు చూపుతారంటున్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్గా చంద్రబాబు హయాంలో పనిచేయడంతో వరప్రసాదరావుకు అటు టీడీపీ నుంచి కూడా సానుకూలం అవుతుందంటున్నారు. టీడీపీలో ఎస్సీ సామాజికవర్గం నుంచి అమలాపురంలో గెలుపొందిన ఆనందరావు పేరు తెరమీదకు వచ్చింది. కానీ కాకినాడ జిల్లాకు పొరుగున ఉన్న పాయకరావుపేట నుంచి గెలిచిన అదే సామాజికవర్గానికి చెందిన వంగలపూడి అనితకు అవకాశం దక్కవచ్చునంటున్నారు. -
కేంద్రంలో కేబినెట్ పదవి.. 2 సహాయ శాఖలు!
సాక్షి, న్యూఢిల్లీ: కొత్తగా కొలువుదీరనున్న ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామ్య పార్టీలైన టీడీపీ, జేడీయూలు అడుగుతున్నన్ని కేబినెట్ బెర్త్లు, కీలక శాఖలు ఇచ్చేందుకు బీజేపీ సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో 16 లోక్సభ స్థానాలు గెలుచుకున్న టీడీపీ కోరుతున్నట్లుగా ఐదు కేబినెట్ పదవులతో పాటు స్పీకర్ పదవి ఇవ్వడం సాధ్యం కాదనే విషయాన్ని బీజేపీ పెద్దలు చంద్రబాబుకు తేల్చి చెప్పినట్లు సమాచారం.టీడీపీకి ఒక కేబినెట్ మంత్రిత్వ శాఖతో పాటు రెండు సహాయక మంత్రి పదవులను ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు ఢిల్లీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. శాఖల కేటాయింపుపై చంద్రబాబు శుక్రవారం రెండో దఫా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు ఇతర పెద్దలతో చర్చించినా సానుకూల ఫలితం దక్కలేదని తెలుస్తోంది.కీలక శాఖలు ఇవ్వలేం..!కేంద్రంలో ముచ్చటగా మూడోసారి కొలువుదీరనున్న మోదీ ప్రభుత్వంలో కీలకమైన హోం, ఆర్ధిక, రక్షణ, రైల్వే, న్యాయ, ఐటీ, రోడ్లు, రహదారుల శాఖలను భాగస్వామ్య పక్షాలకు ఇవ్వకూడదని ఇప్పటికే బీజేపీ పెద్దలు నిరాకరించారు. దీంతో కేంద్ర జలశక్తి శాఖతో పాటు పట్టణాభివృద్ధి, గ్రామీణాభివృధ్ధి, ఐటీ కమ్యూనికేషన్లు, నౌకాయాన శాఖలను టీడీపీ కోరినట్లు తెలిసింది. దీనికి అదనంగా స్పీకర్ పదవి కూడా తమకే ఇవ్వాలని అడిగినట్లు జాతీయ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. అయితే బీజేపీ పెద్దలు ఇందుకు సుముఖంగా లేరని తెలుస్తోంది.2014లో మాదిరిగానే పౌర విమానయాన శాఖతో పాటు సహాయ శాఖల్లో కీలక శాఖలు ఇచ్చేందుకు ఓకే చెప్పినట్లు సమాచారం. ఆ కీలక సహాయ శాఖలు ఆర్ధిక లేదా జల శక్తి శాఖ కావచ్చనే ఊహాగానాలు సాగుతున్నాయి. స్పీకర్ పదవి కాకుండా డిప్యూటీ స్పీకర్ పదవిని ఇచ్చేందుకు బీజేపీ పెద్దలు సానుకూలంగా ఉన్నట్లు చెబుతున్నారు. 2019లో ఎన్డీఏ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు డిప్యూటీ స్పీకర్ పదవిని అసలు కేటాయించలేదు. కేవలం స్పీకర్తోనే లోక్సభ వ్యవహారాలను నిర్వహించగా ప్రొటెం స్పీకర్లతో సభను నడిపించారు. 2014లో మాత్రం అన్నాడీఎంకేకు చెందిన తంబిదొరై, జార్ఖండ్కు చెందిన బీజేపీ సీనియర్ నేత కరియా ముండా డిప్యూటీ స్పీకర్లుగా వ్యవహరించారు. మోదీతోపాటే ప్రమాణం..!మంత్రి పదవులు, శాఖలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో చంద్రబాబు విడిగా చర్చించారు. ప్రాధాన్యతలను ఆయన దృష్టికి తెచ్చారు. నరేంద్ర మోదీతో పాటు ప్రమాణ స్వీకారం చేసే మంత్రుల్లో తమ పార్టీ వారు కచ్చితంగా ఉండేలా చూడాలని కోరినట్లు తెలిసింది. -
ఈవీఎంల ట్యాంపరింగ్ ఆరోపణలపై ఈసీ స్పందించాలి
సాక్షి, అమరావతి: ఏపీ ఎన్నికల్లో ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం స్పందించాలని ప్రజా సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈవీఎంల పనితీరుపై ఉన్న సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందన్నారు. విజయవాడలో ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వీవీఆర్ కృష్ణంరాజు శుక్రవారం మాట్లాడుతూ.. ఈవీఎంల పనితీరుపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించాలన్నారు.గతంలో ఆయన ఈవీఎంల పనితీరుపై పలు సందేహాలు వ్యక్తంచేశారని, ఈవీఎం చిప్లను ట్యాంపరింగ్ చేసి ప్రజా తీర్పును మార్చి వెయొ్యచ్చని.. అలాగే, ప్రపంచంలో ఎక్కడా ఈవీఎంలను ఉపయోగించడంలేదని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను కృష్ణంరాజు గుర్తుచేశారు. ఇప్పుడు ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో చంద్రబాబు వైఖరి ఏమిటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.గతంలో చంద్రబాబు సాంకేతిక సలహాదారుడిగా పనిచేసిన వేమూరు హరికృష్ణ ప్రసాద్ తన అమెరికన్ మిత్రులు అలెక్స్ హాల్దార్ మెన్, రాస్గోమ్ గ్రీస్ సహకారంతో ఎన్నికల సంఘం నుంచి దొంగిలించిన ఈవీఎంను బహిరంగంగానే హ్యాక్చేసి చూపించారన్నారు. ఈవీఎం దొంగతనం ఆరోపణపై హరికృష్ణ ప్రసాద్ అరెస్టు కూడా అయ్యారన్నారు. ప్రజాతీర్పు ఏకపక్షంగా, మెజార్టీలు అత్యధికంగా ఉండటంతో ప్రజల్లో ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు.బాబు విదేశీ పర్యటనపై అనుమానాలు..బెటర్ ఆంధ్రప్రదేశ్ కన్వీనర్ సునీత లక్కంరాజు మాట్లాడుతూ.. స్ట్రాంగ్ రూముల్లో ఉన్న అన్ని ఈవీఎంలను ఒకేసారి హ్యాక్ చేయవచ్చునని కూడా హరికృష్ణ ప్రసాద్ చెప్పారన్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు విదేశీ పర్యటనలపై కూడా ప్రజలకు అనేక సందేహాలున్నాయని, వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉందన్నారు. ఆంధ్ర అడ్వకేట్ ఫోరం కన్వీనర్ బి.అశోక్కుమార్ మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం వివరణ ఇవ్వకపోతే తమ వద్ద ఉన్న ఆధారాలతో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని పౌర సంఘాల ప్రతినిధులు తెలిపారు. -
కుర్చీలపై కన్ను!
సాక్షి, అమరావతి: టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 12వ తేదీన నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో మంత్రి పదవులు ఎవరిని వరిస్తాయనే అంశంపై పెద్ద ఎత్తున చర్చలు సాగుతున్నాయి. టీడీపీ నుంచి 135 మంది ఎమ్మెల్యేలుగా గెలిచినందున ఆశావహుల సంఖ్య భారీగా ఉంది.అయితే మొత్తం 24 మంత్రి పదవులే ఇచ్చే అవకాశం ఉన్నందున అందులోనే మూడు పార్టీలకు సర్దుబాటు చేయడం కత్తిమీద సాములా మారింది. జనసేనకు కనీసం ఐదు మంత్రి పదవులు దక్కుతాయనే ప్రచారం జరుగుతుండగా బీజేపీకి రెండు పదవులు ఇచ్చే అవశాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ రెండు పార్టీలకూ ఇవ్వగా మిగిలిన మంత్రి పదవులను టీడీపీ సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది. అచ్చెన్నా..! రామ్మోహనా!ఉమ్మడి శ్రీకాకుళం నుంచి టీడీపీ సీనియర్ నేత, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి మంత్రివర్గంలో బెర్త్ ఖాయమనే ప్రచారం జరుగుతోంది. అయితే కేంద్ర మంత్రివర్గంలో ఆయన సోదరుడి కుమారుడు రామ్మోహన్ నాయుడికి అవకాశం దక్కితే మాత్రం అచ్చెన్నాయుడికి ఛాన్స్ ఉండకపోవచ్చనే వాదన వినిపిస్తోంది. ఒక కుటుంబంలో ఒకరికే పదవి ఇచ్చే యోచన ఉంటే వీరిలో ఒకరికే అవకాశం లభించవచ్చు. అదే జిల్లా నుంచి కూన రవికుమార్, కొండ్రు మురళీమోహన్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. విజయనగరం జిల్లా నుంచి గెలిచిన కళా వెంకట్రావు, అదితి గజపతిరాజు పేర్లు సైతం పరిశీలనలో ఉన్నాయి.విశాఖ జిల్లాలో ఈసారి గంటా శ్రీనివాసరావుకు మంత్రి పదవి దక్కకపోవచ్చని చెబుతున్నారు. చింతకాయల అయ్యన్న పాత్రుడికి కచ్చితంగా మంత్రి పదవి ఇస్తారని.. మహిళ, ఎస్సీ కోటాలో వంగలపూడి అనితకు అవకాశం లభిస్తుందనే చర్చ నడుస్తోంది. ఉమ్మడి తూర్పు గోదావరి నుంచి జ్యోతుల నెహ్రూ, నిమ్మకాయల చినరాజప్ప, గోరంట్ల బుచ్చయ్య చౌదరిలో ఒకరిని మంత్రివర్గంలోకి తీసుకునే వీలుందని చెబుతున్నారు. సీనియర్ల అవసరం ఉందని భావిస్తే యనమల రామకృష్ణుడిని మంత్రివర్గంలోకి తీసుకోవచ్చని భావిస్తున్నారు. ఆయన కుమార్తె దివ్య తుని నుంచి ఎమ్మెల్యేగా గెలిచినా యనమలకు తగిన ప్రాధాన్యం ఉంటుందని భావిస్తున్నారు.నిమ్మలకు పక్కాఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి నిమ్మల రామానాయుడికి మంత్రివర్గంలో పక్కాగా చోటు దక్కుతుందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. క్లిష్ట సమయంలో పార్టీ కోసం చురుగ్గా పని చేసి చంద్రబాబు, లోకేశ్కి దగ్గరవడంతో ఆయనకు అవకాశం కచ్చితంగా లభిస్తుందని చెబుతున్నారు. బీసీ కోటాలో పితాని సత్యనారాయణ పేరు బలంగా వినిపిస్తోంది. ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుకి మంత్రి పదవిపై రకరకాల చర్చలు సాగుతున్నాయి. ఆయన మంత్రిగా పని చేయరని పార్టీలో కొందరు చెబుతుండగా, ఇస్తే తీసుకుంటారని మరి కొందరు వాదిస్తున్నారు.చింతమనేని ప్రభాకర్ పేరు కూడా రేసులో వినిపిస్తోంది. ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి కొల్లు రవీంద్ర ఖాయంగా మంత్రి అవుతారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. బీసీ నేతగా పని చేసిన అనుభవం, ప్రతిపక్షంలోనూ చురుగ్గా వ్యవహరించడంతో ఆయనకు అవకాశం ఖాయమని భావిస్తున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి ప్రత్తిపాటి పుల్లారావు, యరపతినేని శ్రీనివాసరావు, ధూళిపాళ్ల నరేంద్ర, కన్నా లక్ష్మీనారాయణ, రామాంజనేయులు, నక్కా ఆనంద్బాబు పేర్లు సైతం వినిపిస్తున్నాయి. వీరిలో ఒకరికి అవకాశం లభించవచ్చని చెబుతున్నారు.నారాయణకు మళ్లీ ఛాన్స్ ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, డి. బాలవీరాంజనేయస్వామిలో ఒకరికి మంత్రి పదవి దక్కనున్నట్లు ప్రచారం జరుగుతోంది. నెల్లూరు జిల్లా నుంచి గెలిచిన వారిలో పి.నారాయణ గ్యారంటీగా మంత్రి అయ్యే ఛాన్స్ ఉంది. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు కావడంతో ఆయనతోపాటే ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని సమాచారం. సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి పేర్లు కూడా చంద్రబాబు పరిశీలనలో ఉన్నాయి.చిత్తూరు జిల్లా నుంచి అమర్నాథ్రెడ్డి, పులివర్తి నానిలో ఒకరిని మంత్రిగా చేస్తారని చెబుతున్నారు. కడప జిల్లా నుంచి రెడ్డప్పగారి మాధవి, వరదరాజులరెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. కర్నూలు జిల్లా నుంచి కోట్ల సూర్యప్రకాష్రెడ్డి మంత్రి అవుతారని చెబుతున్నారు. అనంతపురం జిల్లా నుంచి గెలిచిన వారిలో పయ్యావుల కేశవ్, పరిటాల సునీతలో ఒకరికి ఛాన్స్ దక్కవచ్చు. కాల్వ శ్రీనివాసుల పేరు కూడా పరిశీలనలో ఉంది.పవన్కు పదవిపై అస్పష్టతే..జనసేన నుంచి గెలిచిన 21 మంది ఎమ్మెల్యేల్లో ఐదుగురికి మంత్రివర్గంలో చోటు దక్కుతుందనే ప్రచారం జరుగుతోంది. పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చే విషయంపై స్పష్టత రాలేదు. నాదెండ్ల మనోహర్ మంత్రివర్గంలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. కొణతాల రామకృష్ణ, పంతం నానాజీ, కందుల దుర్గేష్, పులపర్తి రామాంజనేయులు పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి.బీజేపీ కోటాలో సుజనాబీజేపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల్లో చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడైన సుజనా చౌదరికి మంత్రివర్గంలో చోటు పక్కాగా ఉంటుందని చెబుతున్నారు. కామినేని శ్రీనివాస్ పేరు కూడా వినిపిస్తున్నా ఎంత వరకు అవకాశం దక్కుతుందనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సుజనా చౌదరి పోటీలో ఉన్నందున ఆయనకు అవకాశాలు సన్నగిల్లాయి. సత్యకుమార్, విష్ణుకుమార్రాజులో ఒకరిని మంత్రి పదవి వరించే అవకాశం ఉందని చెబుతున్నారు. -
ప్రజాస్వామ్యమా? ఆటవిక రాజ్యమా?
పూర్వం యుద్ధం ముగిశాక విజయం సాధించిన రాజులు ఓడిపోయిన రాజు రాజ్యంపై పడి విధ్వంసం సృష్టించేవారు. జనావాసాలపై దాడులు చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేవారు. అందినకాడికి దోచుకునేవారు. ప్రజలంతా ఒకచోటుకు చేరి.. మోకరిల్లి శరణుకోరాక కానీ శాంతించే వారు కాదు. ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితి చూస్తుంటే అలాంటి దుస్థితే కనిపిస్తోంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుక్షణం నుంచి టీడీపీ శ్రేణులు యథేచ్ఛగా విధ్వంసకాండ కొనసాగిస్తున్నాయి. ఎక్కడికక్కడ దాడులకు తెగబడి భయోత్పాతం సృష్టిస్తున్నాయి.ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ అయినా విజయం సాధించాక తొలుత దృష్టి సారించాల్సింది శాంతి భద్రతల పరిరక్షణపైనే. అందుకు విరుద్దంగా రాష్ట్రంలో టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యం కొనసాగిస్తుండగా... టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం వారిని నిలువరించే ప్రయత్నం చేయకుండా... తిరిగి వైఎస్సార్సీపీ కవ్వంపుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, వైఎస్సార్సీపీ కవ్వంచినా సంయమనం పాటించాలంటూ ట్వీట్ చేయటం విధ్వంసాలకు మరింత ఊతమిచ్చేదిగా కనిపిస్తోంది. ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది... వచ్చామన్న కిక్కుతో ఊరూరా కవ్వంపులకు, దాడులకు తెగబడుతున్నది తెలుగుదేశమే.మూడు రోజులుగా వరుస దాడులు చేస్తున్నా పోలీసులకు పైనుంచి ఆదేశాలుండటంతో చేష్టలుడిగి చూస్తున్నారు తప్ప నిలువరించే ప్రయత్నం చేయటం లేదు. తాను ప్రమాణ స్వీకారం చేసే వరకు ఏమైనా చేయండని, రెచ్చిపోండని చంద్రబాబు పరోక్షంగా సంకేతాలిచ్చారని, అందుకే పోలీసులు పట్టనట్లు ఊరుకుంటున్నారని విశ్వసనీయంగా తెలిసింది. ఎందుకంటే తాను ప్రమాణ స్వీకారం చేయకముందయితే తన హయాంలో జరగలేదని చెప్పొచ్చనేది బాబు యోచనగా చెబుతున్నారు. -
విలువల జాడేది?!
వేదికలపై గంభీరోపన్యాసాలు చేయడంలో, విలువల గురించి మాట్లాడటంలో మన నాయకులకు ఎవరూ సాటిరారు. ఆ ఉపన్యాసాలకూ, ఆచరణకూ పెద్దగా పొంతనవుండదు. శుక్రవారం జరిగిన ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ, జేడీ(యూ) అధినేత నితీశ్ కుమార్, టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన ప్రసంగాలు ఈ సంగతిని మరోసారి ధ్రువీకరించాయి. అన్ని నిర్ణయాలూ ఏకాభిప్రాయం ప్రాతిపదికనే తీసుకుంటామని మోదీ ప్రకటించారు. మంచిదే. గత అయిదేళ్ల పాలనలో ఏకాభిప్రాయం జాడ ఎక్కడా కనబడకపోగా చాలా నిర్ణయాలు విపక్షాన్ని సభనుంచి గెంటేశాక మూజువాణి ఓటుతో ఆమోదం పొందాయి. ఆ నిర్ణయాలపై తీవ్ర విమర్శలూ వచ్చాయి. ప్రతిఘటన కూడా ఎదురైంది. బహుశా అందువల్లే కావొచ్చు... 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా వచ్చిన మెజారిటీ ఈసారి మాయమైంది. మిత్రపక్షాలపై ఆధారపడక తప్పని స్థితి ఏర్పడింది. రామమందిర నిర్మాణం లక్ష్యంగా ఉద్యమాన్ని నడిపి, దానిమాటున మూడున్నర దశాబ్దాలుగా ఎదుగుతూ వచ్చిన బీజేపీ... తీరా ఆలయ నిర్మాణం కొనసాగుతున్న దశలో కనీస మెజారిటీకి దూరంకావటం, యూపీలో సగంపైగా సీట్లు కోల్పోవటం కేవలం యాదృచ్ఛికమని మోదీ చెప్పగలరా? చివరకు అయోధ్య ఉన్న ఫైజాబాద్ నియోజకవర్గాన్ని సైతం బీజేపీ కోల్పోవలసి వచ్చిందని ఆయనకు గుర్తుందో లేదో! అయోధ్య ప్రాంతంలోని 9 స్థానాల్లో 5, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి ప్రాంతంలోని 12 స్థానాల్లో తొమ్మిదింటిని ఈసారి బీజేపీ చేజార్చుకుంది. బీజేపీ హిందుత్వ ప్రాజెక్టుకు ఈ రెండు ప్రాంతాలూ ఆయువుపట్టు. అంతేకాదు... వివిధ రాష్ట్రాల్లో బీజేపీ 2019 ఎన్నికల్లో 50 శాతంపైగా వోట్లతో 224 స్థానాలు గెల్చుకోగా, ఇప్పుడు ఆ సంఖ్య 156కి పడిపోయింది. బీజేపీ 500 కంటే తక్కువ వోట్లతో గెలిచిన స్థానాలు 30... వేయి కంటే తక్కువ వోట్లతో గెలిచిన స్థానాలు 100 ఉన్నాయి. ఇండియా కూటమి, మరీ ముఖ్యంగా అందులోని సమాజ్వాదీ పార్టీ దాదాపు అన్నిచోట్లా గణనీయంగా కోలుకుంది. తమ గెలుపును ఓటమిగా చిత్రిస్తున్న కాంగ్రెస్ను విమర్శిస్తూ ఇప్పుడూ, గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీకొచ్చిన మొత్తం సీట్ల సంఖ్యతో పోల్చినా ఈసారి తమకొచ్చిన స్థానాలు చాలా ఎక్కువని ఎద్దేవా చేయటం బాగానేవుంది. అయితే జరిగిందేమిటో లోతుగా విశ్లేషిస్తే సత్యం బోధపడుతుంది. మోదీ పైకేమి మాట్లాడినా నిరుపేదలూ, మధ్యతరగతి తమకు క్రమేపీ దూరం జరుగుతున్నారని బీజేపీకి అర్థమయ్యే ఉంటుంది. అందుకే ఈసారి ఆ రెండు వర్గాలకూ కొత్తగా సంక్షేమ పథకాలు తీసుకురాబోతున్నట్టు తెలిపారు. పార్లమెంటులో ఏ అంశంపైన అయినా చర్చ జరిగినప్పుడు ఉపన్యాస పోటీలుగా భావించి మాట్లాడటంకాక ఆరోగ్యకరమైన చర్చలకు చోటీయడం ఎంతో అవసరం. ఎన్డీఏ సహజసిద్ధమైన కూటమని, ఇందులో అధికార యావలేదని మోదీ చెప్పటం కూడా వింతగానే ఉంది. ఇప్పుడు ఎన్డీఏకు మద్దతుగా నిలిచిన నితీశ్, చంద్రబాబులిద్దరూ ఊగిసలాటకు పెట్టింది పేరు. నిలకడ తక్కువ, అవకాశవాద రాజకీయం ఎక్కువ. ఏ గట్టున బాగుంటుందనుకుంటే అటు దూకే బాపతు. 2014 ఎన్నికల్లో ఏపీలో బీజేపీతో కలిసి ప్రయాణించిన చంద్రబాబు 2019 ఎన్నికల్లో హఠాత్తుగా కాడి పారేసి విడిగా ఎందుకు పోటీ చేశారో, అంతకు సంవత్సరం ముందు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్తో ఎందుకు అంటకాగారో ఎవరైనా చెప్పగలరా? తరచు యూటర్న్లు తీసుకోవటంలో నితీశ్, చంద్రబాబులకు పోటీ పెడితే ఎవరు ప్రథమ స్థానం గెల్చుకుంటారో చెప్పటం కొంత కష్టమే. ఇలాంటివారిని పక్కనబెట్టుకుని ‘ఇది సహజసిద్ధమైన కూటమి, సుపరిపాలన కోసం కలిశాం’ అంటూ పెద్ద పెద్ద మాటలు వల్లిస్తే నమ్మడానికి దేశ ప్రజలు తెలివితక్కువవారు కాదు. మోదీని చంద్రబాబు పొగడ్తలతో ముంచడంమాట అలావుంచి 2014లోనే ‘మీరు పదిహేనేళ్లు అధికారంలో వుంటారని బాబు జోస్యం చెప్పార’ని జనసేన నాయకుడు పవన్ కల్యాణ్ అనటం ఆశ్చర్యం కలిగిస్తుంది. మరి 2019లో వీరిద్దరూ ఎన్డీఏ నుంచి ఎందుకు బయటకొచ్చినట్టు... ఇప్పుడెందుకు కలిసినట్టు? ఏపీలో వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై అసత్య కథనాలు ప్రచారంలో పెట్టి, చివరకు కేంద్రమే ప్రతిపాదించిన భూ యాజమాన్య హక్కు చట్టంపై ప్రజానీకాన్ని పక్కదోవ పట్టించి బాబు లాభపడ్డారు. విలువలన్నిటినీ గాలికొదిలి ఏం చేసైనా అధికారంలోకి వచ్చితీరాలన్న పట్టుదలతో వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అత్యంత హీనంగా దుర్భాషలాడారు. కేంద్రంలో నరేంద్ర మోదీ తదితరులు ఏం మాట్లాడినా మౌనంగా ఉండిపోవటమో, ఆలస్యంగా స్పందించటమో చేసిన కేంద్ర ఎన్నికల సంఘం పెద్దలను అనుకరిస్తూ ఏపీలో ఏం జరిగినా, బాబు తదితరులు అవాకులూ చవాకులూ మాట్లాడినా ప్రధాన ఎన్నికల అధికారి ఉలుకూ పలుకూ లేకుండా నిమిత్తమాత్రుడిగా మిగిలిపోయారు. ఆఖరికి పోలైన వోట్లకన్నా గెలిచిన అభ్యర్థికి అధికంగా వోట్లు వచ్చిన ఉదంతాలు అక్కడక్కడ బయటపడ్డాయి. ఇలాంటి అక్రమాలతో గట్టెక్కాలనే కాళ్లావేళ్లాపడి మరీ బాబు ఎన్డీఏలోకి లంఘించారు.వేదికలెక్కి విలువల గురించి గంభీరోపన్యాసాలు చేసేముందు మొన్న ఎన్నికల్లో తమ ప్రవర్తన ఎలావుందో, ఏం మాట్లాడామో చూసుకోవటం వారికే మంచిది. పిల్లి కళ్లు మూసుకుని పాలుతాగిన చందాన వేదికలెక్కి విన్యాసాలు చేస్తే జనం నవ్విపోతారని నరేంద్ర మోదీతోపాటు ఎన్డీఏ భాగస్వామ్యపక్ష నేతలు తెలుసుకోవాలి. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. కానీ ఉన్నన్నాళ్లూ ఏం చేశారో, ఎలా మెలిగారో ప్రజలు గమనిస్తూనే ఉంటారు. -
ఎన్డీయే కూటమి: ముగిసిన మంత్రివర్గ కసరత్తు
ఢిల్లీ: ఎన్డీయే కూటమిలో భాగంగా ఏర్పడే సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రివర్గ కూర్పుపై శుక్రవారం జరిగిన కసరత్తు ముగిసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీజేపీ అగ్రనేతల నేతృత్వంలో సుదీర్ఘంగా మంత్రివర్గ కూర్పుపై భేటీలు జరిగాయి. జేపీ నడ్డా నివాసంలో ఎన్డీయే భాగస్వామి పక్ష నేతలను ఒక్కొక్కరిని పిలిచి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్నాథ్సింగ్లు చర్చలు జరిపారు. ముందుగా ఎన్సిపీ చీఫ్ అజిత్ పవార్, శివసేన చీఫ్ ఏక్నాథ్ షిండేతో బీజేపీ అగ్ర నేతలు చర్చించారు. అనంతరం టీడీపీ చీఫ్ చంద్రబాబుతో మంత్రివర్గంపై చర్చలు జరిపారు. అయితే మంత్రివర్గం కూర్పు ఫైనల్ అయిందా? లేదా? అనే అంశంపై అధకారికంగా స్పష్టత లేదు.ఇక.. ఎన్డీయే పక్ష నేత నరేంద్ర మోదీ ఎల్లుండి( 9వ తేదీ) ప్రమాణస్వీకారం చేయటంతో కేంద్రంలో కొత్త ప్రభుత్వ కొలువుదీరనుంది. అందుకోసం శుక్రవారం భాగస్వామ్య పక్ష నేతలు మోదీని ఏకగ్రీవంగా ఎన్డీయే పక్షనేతగా ఎన్నుకున్న విషయం తెలిసిందే. మోదీ.. కూటమి నేతలతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కోరారు. ఎన్డీయే పక్షనేతగా తనను ఎన్నుకున్నారని రాష్ట్రపతికి మోదీ తెలిపారు. ఎంపీల మద్దతు లేఖను రాష్ట్రపతికి అందజేశారు. -
చంద్రబాబూ.. ఛీ అనిపించుకోకండి: కేఏ పాల్
విశాఖపట్నం, సాక్షి: ఏపీలో జరుగుతున్న ప్రతీకార రాజకీయ దాడుల పర్వంపై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ స్పందించారు. రాజకీయంగా కక్షలు తీర్చుకోనని చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు దాడులకు దిగిన తన కార్యకర్తలను కంట్రోల్ చేయలేకపోతున్నారని మండిపడ్డారాయన. ఈ మేరకు కేఏ పాల్ ఓ వీడియో విడుదల చేశారు. ‘‘చంద్రబాబు గారూ.. మన రాష్ట్రం ఏమైపోతోంది. ఈ వయసులో మీ పార్టీ కార్యకర్తలను మీరు అదుపు చేయలేరా?. ఎన్నికల్లో ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి ఎలా గెలిచారో అందరికీ తెలుసు. బుద్ధి లేని మీ పార్టీ గాడిదలకు చెప్పండి. ఇంత నీచమైన స్థితికి మీ పార్టీ కార్యకర్తలు దిగజారిపోయారు. ప్రజల చేత ఛీ అనిపించుకోకండి. చరిత్ర హీనులు కాకండి’’ అని పాల్ హితవు పలికారు. ‘‘గతంలో ఇలాంటి దాడుల్ని జగన్ పార్టీ ఏనాడూ ప్రొత్సహించలేదు. కానీ, కక్ష తీర్చుకోను అని చెప్పి.. ఇప్పుడు మీ కార్యకర్తలు చేస్తోంది ఏంటి?. లా అండ్ ఆర్డర్ మెయింటెన్ చేయలేని మీరూ.. ఆరునెలలకు మించి ముఖ్యమంత్రిగా ఉండలేరు. రాష్ట్రం అభివృద్ధి బాటలో వెళ్లాలంటే ఇలాంటి కక్షపూరిత రాజకీయాలను వదిలేయాలి. కక్ష పూరిత రాజకీయాలు మానేసి రాష్ట్రం బాగు చేయడం కోసం పాటు పడాలి. ఇంకో 48 గంటల్లో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలి. లేకుంటే మీరు రాష్ట్రాన్ని పాలించేందుకు పనికి రారని కోర్టుకు వెళ్లా. అక్కడా న్యాయం జరగకపోతే దేవుడి కోర్టుకు వెళ్తా’’ అని ఆయన హెచ్చరించారు. -
చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం, వేదిక ఖరారు
విజయవాడ, సాక్షి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు అయ్యింది. ఈ నెల 12వ తేదీన ఆయన ఆంధ్రప్రదేశ్ సీఎంగా ప్రమాణం చేయనున్నారు. ప్రమాణ స్వీకార ప్రాంగణంగా గన్నవరం ఎయిర్పోర్టు సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ ప్రాంతాన్ని ఎంపిక చేసిన టీడీపీ సీనియర్లు.. దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.ఈ నెల 11వ తేదీన టీడీఎల్పీ సమావేశం జరగనుంది. ఆ భేటీలో చంద్రబాబును తమ లీడర్గా ఎన్నుకోనున్నారు. ఆపై 12వ తేదీ బుధవారం ఉదయం 11.27ని. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. ఎన్డీయే ప్రధాన మిత్రపక్షం కావడంతో చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి నరేంద్ర మోదీ హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఎన్డీయే పక్ష నేతలు, పలు రాష్ట్రాల సీఎంలు కూడా హాజరు కావొచ్చని టీడీపీ భావిస్తోంది. -
‘మోదీ 1/3 పీఎం మాత్రమే’.. కాంగ్రెస్ నేత జైరాం రమేష్ విమర్శలు
ఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత జైరాం రమేష్ నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ పార్టీ భారీ నష్టాన్ని మూటగట్టుకుందని అన్నారు. నరేంద్ర మోదీ ఇక నుంచి ఒకటిలో మూడో వంతు ప్రధాని (1/3 పీఎం)గా కొనసాగుతారని ఎద్దేవా చేశారు. కూటమిలో భాగంగా జేడీ(యూ) చీఫ్ నితీష్కుమారు, టీడీపీ చీఫ్ చంద్రబాబుతో కలిసి మోదీ ‘1/3 పీఎం’ అవుతారని అన్నారు.బీజేపీ ప్రజాస్వామ్యం కంటే పదవుల కుర్చినే ఎక్కువగా నమ్ముతుందని మండిపడ్డారు. ఎన్డీయే కూటమి ఎక్కువ కాలం ఉండలేదని అన్నారు. చంద్రబాబు, నితీష్ కుమార్ ఇద్దరూ.. ఎప్పటికైనా ఎన్డీయే కూటమి నుంచి బయటకువెళ్లే వ్యక్తులేనని అన్నారు.లోక్సభ ఎన్నికలలో బీజేపీ సొంతంగా పూర్తి మెజార్టీ స్థానాలు గెలుచుకోలేకపోయింది. దీంతో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటంకోసం ఎన్డీయే కూటమి పార్టీల మద్దతు తీసుకుంది. అందులో భాగంగానే ఎన్డీయే కూటమిలో జేడీ(యూ) నితీష్ కుమార్, టీడీపీ చంద్రబాబు కీలకంగా మారారు. బీజేపీ సొంతంగా 240 సీట్లు మత్రామే గెలుచుకుంది. మ్యాజిక్ ఫిగర్ 272. ప్రస్తుతం ఎన్డీయే కూటమిలో మొత్తం ఎంపీల సంఖ్య 293గా ఉంది. -
ఏపీలో కలకలం రేపుతున్న రెడ్ బుక్ హోర్డింగ్స్
-
ఎన్డీఏ పక్ష నేతగా మోదీ ఎన్నిక దక్షిణాది ఆదరించింది
-
ప్రధాని మోడీపై ప్రశంసల వర్షం
-
నా ఆఖరి శ్వాస ఉన్నంతవరకు జగన్ తోనే
-
ఎన్డీఏ పక్ష నేతగా ఎన్నికైన మోదీ
న్యూఢిల్లీ: ఎన్డీఎపక్ష నేతగా నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ఎన్నికయ్యారు. పార్లమెంట్లో సెంట్రల్హాల్లో శుక్రవారం(జూన్7) సమావేశమైన ఎన్డీఏ కూటమి పార్టీల నేతలు, ఎంపీలు మోదీని తమ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో తొలుత మోదీ పేరును రాజ్నాథ్ సింగ్ ప్రతిపాదించగా చంద్రబాబు, నితిశ్ కుమార్ సహా ఎన్డీఏ ఎంపీలంతా లేచి నిలబడి రాజ్నాథ్ ప్రతిపాదనను బలపరిచారు. ఈ సందర్భంగా మోదీ సహా ఎన్డీఏ ముఖ్య నేతలు మాట్లాడారు.దక్షిణాది ఆదరించింది: మోదీ ఇంత భయంకర ఎండల్లో ఎన్డీఏ పార్టీల కార్యకర్తలు కష్టపడి శ్రమించారువారందరికీ నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాఎన్డీఏ పార్లమెంటరీ కమిటీ నేతగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు మీకెంతా కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. ఇవి నాకు భావోద్వేగ క్షణాలు మీరు మళ్లీ నాకు నాయకత్వం ఇచ్చారంటే మన మధ్య బంధం బలంగా ఉందని అర్థందేశంలో 22 రాష్ట్రాల్లో ఎన్డీఏ అధికారంలో ఉంది. భారత దేశ కూటముల చరిత్రలో ఏ ప్రీ పోల్ కూటమి ఎన్డీఏలా విజయవంతమవడవం ఇప్పటివరకు చూడలేదుఈసారి ఎన్డీఏ కూటమిని దక్షిణాది అక్కున చేర్చుకుంది. ప్రభుత్వం నడపడానికి మెజారిటీ అవసరం. కానీ దేశాన్ని నడపడానికి అందరి సహకారం అవసరం. ఎన్డీఏకు దేశమే ముఖ్యంఎన్డీఏ ఒక ఆర్గానిక్ కూటమిఈవీఎంలు బతికున్నాయా...చచ్చాయా..ఈవీఎంలు బతికున్నాయా మరణించాయాప్రతిపక్షాలు మాట్లాడితే ఈవీంఎలు, ఈసీని తిట్టాయిఎన్నికల ఫలితాల తర్వాత ప్రతిపక్షాలు సైలెంట్ అయ్యాయిఇదే ప్రజాస్వామ్యం గొప్పతనంమోదీ ప్రచారం వల్లే కూటమి విజయం.. చంద్రబాబు నాయుడులోక్సభ ఎన్నికల్లో మోదీ ఎలాంటి విశ్రాంతి తీసుకోకుండా ఎన్నికల్లో ప్రచారం చేశారుమోదీ ప్రచారం వల్ల కూటమి విజయం సాధించిందిఏపీ ఎన్నికల్లో అమిత్ షా సభ టర్నింగ్ పాయింట్ అయింది బీజేపీ అగ్ర నేతల ప్రచారం మాలో విశ్వాసాన్ని నింపిందిమోడీ వల్ల ప్రపంచంలో భారత్ ఖ్యాతి పెరిగిందిమోడీ నాయకత్వంలో భారత్ నెంబర్ వన్గా మారుతుందిప్రాంతీయ మనోభావాలు, జాతీయ లక్ష్యాలను బ్యాలెన్స్ చేయాలిఏపీలో కూటమి ఉమ్మడిగా పనిచేసి అద్భుత ఫలితాలు సాధించాం పవన్ కళ్యాణ్, జనసేన చీఫ్ మోదీ అందరిలో ప్రేరణ నింపారుమోదీ 15 ఏళ్ల పాటు ప్రధానిగా ఉంటారన్న చంద్రబాబు మాట నిజమైందిమోదీ వల్లే ఏపీలో 91 శాతం ఫలితాలు సాధించాం
Pagination
ఈనాడు సంస్థల ఛైర్మన్ రామోజీరావు కన్నుమూత
రాజీనామా చేసి వెళ్లిపోండి.. టీడీపీ కార్యకర్తల అల్టిమేటం
పట్టలేని సంతోషం.. మర్చిపోలేని విషాదం.. రెండూ ఈ నెలలోనే!
పిఠాపురం వర్మపై జనసేన దాడి
ఇదేం వ్యాధి..నిద్రలో షాషింగ్ చేయడమా..?
టీడీపీ యథేచ్ఛదాడులతో ఏపీలో ఆటవిక పరిస్థితులు: వైఎస్ జగన్
పాస్వర్డ్ మర్చిపోయాడు.. 11 ఏళ్ల తరువాత చూస్తే రూ. కోట్ల డబ్బు
T20 WC 2024: పాక్ను మట్టికరిపించిన అమెరికా జట్టులో సగం మంది మన వారే..!
T20 World Cup 2024: టీమిండియాతో మ్యాచ్.. టాస్ గెలిచిన పాకిస్తాన్.. తుది జట్లు ఇవే..!
ప్రముఖ సింగర్పై రూమర్స్.. నాలుగో భర్తకు కూడా..!
టాలీవుడ్ హీరోయిన్కి అరుదైన వ్యాధి.. షాకింగ్ విషయాలు రివీల్
మూడోసారి ప్రధానిగా మోదీ ప్రమాణస్వీకారం
నీట్ పరీక్ష ఫలితాల వివాదం : రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
T20 World Cup 2024: అదే జరిగితే పాక్ క్వాలిఫయర్స్ ఆడక తప్పదు..!
బాలీవుడ్ భామ బర్త్ డే.. స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన భర్త!
జూన్ 13న లాంచ్ అయ్యే బీఎండబ్ల్యూ బైక్ ఇదే - వివరాలు
ఎన్నికల వరకే రాజకీయాలు.. ఎన్నికల తర్వాత అభివృద్దే తారక మంత్రం
సిమ్రాన్, అవినాష్ హీరోగా కొత్త సినిమా ప్రారంభం
Advertisement