-
ఆండ్రాయిడ్ 15 బీటా 2లోని కొత్త ఫీచర్లు
ఆల్ఫాబెట్ ఇంక్ ఇటీవల నిర్వహించిన గూగుల్ I/O 2024 సదస్సులో ఆండ్రాయిడ్ 15 బీటా 2ను పీచర్లను ప్రకటించింది. ఈ ఫీచర్లు ఇప్పటికే పిక్సెల్ మొబైల్ యూజర్లకు అందుబాటులో ఉన్నాయి. పిక్సెల్ ఫోన్ను గూగుల్ ప్రత్యేకంగా తయారుచేస్తోంది. దాంతో కొత్త ఫీచర్లు తమ వినియోగదారులకు ఇప్పటికే అందుబాటులో ఉంచింది.గూగుల్ ప్రకటించిన ఈ ఫీచర్లను త్వరలో ఆండ్రాయిడ్ వాడుతున్న ఇతర కంపెనీ ఫోన్లలోనూ ప్రవేశపెట్టనున్నారు. డెవలపర్ ప్రివ్యూ లేదా బీటా వెర్షన్లలో పాల్గొంటున్న వారికి ఆటోమేటిక్గా బీటా 2 అప్డేట్ లభిస్తుందని కంపెనీ తెలిపింది.ఆండ్రాయిడ్ 15 బీటా 2లో కొన్ని ఫీచర్లు..ఆండ్రాయిడ్ 15 బీటా 2లో ప్రైవేట్ స్పేస్ సౌకర్యం అందిస్తున్నారు. దీనివల్ల ప్రత్యేక ప్రొఫైల్ను క్రియేట్ చేసి కావాల్సిన యాప్లను విడిగా సేవ్ చేసుకోవచ్చు. ప్రొఫైల్ లాక్ చేసినప్పుడు అవి కనిపించవు.ప్రైవేట్ స్పేస్లోని యాప్లన్నీ లాంఛర్లోని ప్రత్యేక కంటైనర్లో ఉంటాయి. రీసెంట్ యాప్స్, నోటిఫికేషన్స్, సెటింగ్స్లోనూ కనిపించవు.ఫీచర్ యాప్ పెయిర్స్ అనే కొత్త ఫీచర్తో స్ప్లిట్ స్క్రీన్ మోడ్లో ఒకేసారి రెండు యాప్లను లాంఛ్ చేయొచ్చు. తరచూ ఉపయోగించే యాప్లను వెంటవెంటనే ఓపెన్ చేయొచ్చు.ఇదీ చదవండి: పాలసీదారులను మోసం చేస్తున్న బీమా ప్లాట్ఫామ్లుహెల్త్ కనెక్ట్ ఫీచర్లో స్కిన్ టెంపరేచర్, ట్రైనింగ్ ప్లాన్స్ అనే విభాగాలు చేర్చారు. దాంతో యూజర్లు తమ ఆరోగ్యం, ఫిట్నెస్పై మరింత శ్రద్ధ పెట్టేందుకు అవకాశం ఉంది. -
‘AI’తో ప్రమాదమే.. గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐ వార్నింగ్
ఆటోమేటిక్గా నడిచే కార్లు, బైక్లు.. ఇలా ఎక్కడ చూసినా కృత్రిమ మేధ మన జీవితంలో ఓ భాగంగా మారిపోతోంది. అయితే దీంతో చాలా పనులు సులభంగా పూర్తవుతున్నందుకు సంతోషంగానే ఉన్నా.. ఇది మన ఉద్యోగాలకు ఎక్కడ ఎసరు పెడుతుందోనన్న భయం నెలకొంది. తాజాగా, గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐ జెఫ్రీ హింటన్ సైతం ఇదే ఆందోళనను వెలిబుచ్చారు. ఓ ఇంటర్వ్యూలో అన్నీ రంగాల్లో పెరిగిపోతున్న ఏఐ వినియోగం గురించి చర్చించారు. రానున్న రోజుల్లో దాని పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయో హెచ్చరించారు. జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ఏఐ కారణంగా ఉద్యోగాలు కోల్పోవడంపై జెఫ్రీ హింటన్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఏఐ విషయంలో ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన అన్నారు.ఈ సందర్భంగా ప్రపంచానికి ఆదాయం అవసరమని, అలాంటి అవకాశాల్ని ప్రభుత్వాలే సృష్టించాలని తెలిపారు. ఇక లేఆఫ్స్ గురైన ఉద్యోగులకు ప్రభుత్వాలు బేసిక్ పే శాలరీ చెల్లిస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. -
16 ఏళ్లకే ఏఐ ఇంజనీర్! మన తెనాలి కుర్రాడే..
తెనాలి: తెనాలికి చెందిన 16 ఏళ్ల పిల్లి సిద్ధార్థ శ్రీవాత్సవ్ చిరు ప్రాయంలోనే ఆర్టిఫిషియల్ఇంటెలిజెన్స్ ఇంజనీర్గా అరుదైన ప్రతిభ సాధించాడు. అయితే గతంలోనే ఇతడు ఆసియాలోనే అతి పిన్నవయసు డేటా సైంటిస్ట్గా గుర్తింపు పొందాడు. హైదరాబాద్ ఐఐటీలో కొత్తగా ప్రారంభించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో బాధ్యతలు స్వీకరించాడు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ప్రియమానస, రాజ్కుమార్ దంపతుల ఏకైక కుమారుడు సిద్ధార్థ. చిన్నతనం నుంచి కంప్యూటర్పై మక్కువ చూపడంతో తల్లిదండ్రులు ప్రోత్సహించారు. నాలుగో తరగతి నుంచే కంప్యూటర్ బేసిక్స్, టెక్నాలజీ, లాంగ్వేజెస్ నేర్చుకున్నాడు. నాలుగైదేళ్లు గడిచేసరికి అడ్వాన్స్ లెవెల్కు చేరుకోగలిగాడు. సొంతంగా ఆన్లైన్లో కొన్ని నమూనా ప్రాజెక్టులు చేస్తూ, ఆన్లైన్ కోర్సులతో సిద్ధార్థ వాటిపై పట్టు సాధించాడు. మోంటెగ్న్ కంపెనీ సీఈవో సిద్ధార్థకు ఉద్యోగానికి ఆఫర్ చేశారు. ఆవిధంగా ఏడో తరగతిలో ఐటీ ఉద్యోగిగా నెలకు రూ.25 వేల వేతనంతో చేరాడు. తర్వాత ఇనిఫినిటీ లెర్న్ అనే సంస్థలో డేటా సైంటిస్ట్గా నెలకు రూ.45 వేల వేతనం అందుకుంటూ, ఆర్టిఫిషియల్ఇంటెలిజెన్స్లో వినూత్న గేమ్ డిజైనింగ్లో కృషిచేస్తున్నాడు. వారంలో మూడురోజులు పాఠశాలకు, మూడురోజులు ‘ఇన్ఫినిటీ లెర్న్’ ఐటీ సంస్థలో డేటా సైంటిస్ట్గా చేస్తూనే, అమెరికన్ కంపెనీ ‘రైట్ ఛాయిస్’ తరపున అక్కడి విద్యార్థులకు కోడింగ్ క్లాసులు నిర్వహించాడీ బాలమేధావి.మార్చిలో జూనియర్ ఇంటర్ పూర్తిచేసిన సిద్ధార్థను బైజూస్ కంపెనీ ‘యంగ్ జీనియస్’ అవార్డుతో సత్కరించింది. ‘సాక్షి’ ఎక్సలెన్స్ అవార్డును అందుకున్నాడు. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి భూకంపాలను ముందుగానే గుర్తించడమనే కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుకూ పనిచేశాడు. ఈ క్రమంలో హైదరాబాద్లో ఐఐటీ కొత్తగా ఆర్టిఫిషియల్ఇంటెలిజెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీని ఆరంభించింది. గత వారం నిర్వహించిన ఇంటర్వ్యూలో మెషీన్ లెరి్నంగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజినీరుగా సిద్ధార్థకు అవకాశం కల్పించింది. -
సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు సుందర్ పిచాయ్ సలహా: '3 ఇడియట్స్' సీన్తో..
ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) యుగంలో భారతీయ ఇంజనీర్లకు సలహాలు ఇచ్చారు. టెక్నాలజీ పెరుగుతున్న సమయంలో ఉద్యోగులు భయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.ఫేస్బుక్, యాపిల్, అమెజాన్, నెట్ఫ్లిక్స్, గూగుల్ (FAANG) వంటి సంస్థల్లో ఇంటర్వ్యూల్లో ఎలా విజయం సాధించాలో వివరిస్తూ.. రోట్ లెర్నింగ్ గురించి వివరించారు. ఒక విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోకుండా.. బట్టీ పడితే ఉపయోగం లేదని అన్నారు. కాబట్టి సాఫ్ట్వేర్ ఇంజినీర్స్ తప్పకుండా విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలని అన్నారు.దీనికి ఉదాహరణగా 3 ఇడియట్స్ సినిమా గురించి వివరించారు. ఈ సినిమాలో మోటార్ ఎలా పనిచేస్తుంది అనే ప్రశ్నకు ఓ విద్యార్ధి బట్టీ పట్టిన సమాధానం చెబుతాడు. ఆ పద్దతి సరైనది కాదని వివరించారు. ఒక వ్యక్తి ఎంత స్మార్ట్ అయినప్పటికీ.. ఫండమెంటల్స్పై దృష్టి పెట్టడంలో విఫలమవుతున్నారని ఆయన అన్నారు. -
రైజింగ్ స్టార్: 16 ఏళ్లకే రూ.100 కోట్ల ఏఐ స్టార్టప్
పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్టు టెక్ పరిశ్రమలోకి తన ఘనతను చాటుకుందో 16 ఏళ్ల బాలిక. డెల్వ్.ఏఐ (Delv.AI) స్టార్టప్తో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. రూ.100 కోట్ల విలువతో సక్సెస్ రూల్స్ను తిరగరాసింది ఈ యువ పారిశ్రామిక వేత్త. ఈ సంస్థ పరిశోధన కోసం డేటా వెలికితీతకు సంబందించిన సేవలను అందిస్తుంది. ఇప్పుడు తన సంస్థలో పది మందికి ఉపాధి కల్పిస్తోంది. ప్రాంజలి అవస్థి 2022లో Delv.AIని ప్రారంభించింది. ఈ స్టార్టప్ ఇప్పటికే రూ.100 కోట్ల (12 మిలియన్ల డాలర్లు) విలువను కలిగి ఉంది. డెల్వ్.ఏఐ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఇప్పటికే 10 మంది ప్రత్యేక నిపుణుల బృందాన్ని కలిగి ఉండటం విశేషం.పాఠశాలల్లో కంప్యూటర్ సైన్స్ విద్యను ప్రోత్సహించడం ద్వారా ఆమె తండ్రి అవస్థి ఉన్నతికి పునాది వేశారు. ఈ ప్రోత్సాహంతోనే ఆమెను కేవలం ఏడు సంవత్సరాల వయస్సులో కోడింగ్ ప్రారంభించింది. ఆమెకు 11 ఏళ్లున్నపుడు కుటుంబం భారతదేశం నుంచి ఫ్లోరిడాకు మారింది. 13 ఏళ్ల వయసులో ఫ్లోరిడా ఇంటర్నేషనల్ యూనివర్శిటీకి చెందిన రీసెర్చ్ ల్యాబ్స్లో ఆమె ఇంటర్న్షిప్ ద్వారా వ్యాపార ప్రపంచంలోకి ఆమె ప్రవేశించింది. ఇంటర్న్షిప్ సమయంలో, కోవిడ్ మహమ్మారి కారణంగా వర్చువల్ హైస్కూల్లో చదువుతున్నప్పుడు ప్రాంజలి మెషిన్ లెర్నింగ్ ప్రాజెక్ట్లలోకి ప్రవేశించింది. ఓపెన్ ChatGPT-3 బీటా విడుద లైన క్రమంలోనే ఈ వెంచర్ కూడా మొదలైంది.హైస్కూల్ విద్యార్థిని లూసీ గువో, బ్యాకెండ్ క్యాపిటల్కు చెందిన డేవ్ ఫాంటెనోట్ నాయకత్వంలో మియామిలో AI స్టార్టప్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్లోకి అడుగుపెట్టింది. తరువాత ఆన్ డెక్, విలేజ్ గ్లోబల్ నుంచి పెట్టుబడులను పొందడంలో యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ అవస్థికి సహాయపడింది. ఆ తర్వాత ఆమె వ్యాపార ప్రయాణం ప్రారంభమైంది. ప్రాంజలి అవస్తి తన కంపెనీని జనవరి 2022లో స్థాపించింది. దాదాపు రూ3.7 కోట్లతో ప్రారంభ నిధులను సేకరించింది. కేవలం ఒక ఏడాదిలోనే రూ100 కోట్లకు చేరింది. -
భవిష్యత్తులో ఏఐ ప్రభావం ఎలా ఉండబోతుందంటే..
మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్, లింక్డ్ఇన్ సంయుక్తంగా వర్క్ ట్రెండ్ ఇండెక్స్-2024ను విడుదల చేశాయి. 31 దేశాల్లోని దాదాపు 31వేల మంది ఈ సర్వేలో పాల్గొన్నారు. ఫార్చున్ 500 కంపెనీల కస్టమర్లు కూడా ఇందులో భాగమైనట్లు మైక్రోసాఫ్ట్ తెలిపింది. భారత్లో 92 శాతం మంది ప్రొఫెషనల్స్ తమ పనిలో ఏఐని వాడుతున్నారని నివేదికలో తెలిపారు. 91 శాతం కంపెనీలు ఏఐను స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు నివేదికలో వెల్లడించారు.గడిచిన ఏడాది కాలంలో ఉద్యోగాల కల్పనలో, నిత్యం చేస్తున్న పనిలో, నాయకత్వంలో కృత్రిమమేధ ప్రభావం ఎలాఉందో ఈ సర్వే ద్వారా తెలియజేశామని మైక్రోసాఫ్ట్ పేర్కొంది. ‘గత ఆరునెలల్లో జనరేటివ్ ఏఐ వల్ల పనిలో ఉత్పాదక దాదాపు రెండింతలు పెరిగింది. ఉద్యోగాలకోసం వెతికే వారి ప్రొఫైల్లో ఏఐ నైపుణ్యాలు తోడైతే వారికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. అవి లేనివారిని చాలా కంపెనీలు చేర్చుకోవడం లేదు. అయితే కొన్ని సంస్థలు ఏఐని అందిపుచ్చుకోవడంలో వెనకబడ్డామని భావిస్తున్నాయి. కొంతమంది ఉద్యోగులు తమ సొంత ఏఐ టూల్స్ను వాడుతున్నారు. ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తి దాన్ని పరిష్కరించాలంటే మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాంతో వారి వ్యాపారంపై ప్రభావం పడుతుంది. ఏఐ ఆర్థిక వ్యవస్థతోపాటు ఇప్పటికే చాలా రంగాలను మారుస్తుంది. వినియోగదారులకు అందించే ఉత్పత్తుల్లో నాణ్యత మెరుగుపరిచి యూజర్ల ఆసక్తులను ప్రోత్సహిస్తే 2030 నాటికి దాదాపు సగంకంటే ఎక్కువ లాభాలు పొందవచ్చని పీడబ్ల్యూసీ పరిశోధన విడుదల చేసింది. ఏఐ ప్రభావంతో 2030 నాటికి దక్షిణ యూరప్ జీడీపీ 11.5% వరకు పెరుగుతుంది. ఇది 700 బిలియన్ డాలర్లకు సమానం’ అని నివేదికలో తెలిపారు.కంపెనీ యాజమాన్యాలు, లేబర్ మార్కెట్కు సంబంధించి కృత్రిమమేధ ఏమేరకు ప్రభావం చూపుతుందో నివేదికలో తెలిపారు. ఈ వివరాలు కింద తెలియజేశాం.అధికశాతం ఉద్యోగులు తాము చేస్తున్న పనిలో ఏఐను వాడాలనుకుంటున్నారు. 75 శాతం వర్కర్లు ప్రస్తుతం పనిలో ఏఐను ఉపయోగిస్తున్నారు. అయితే దీన్ని వాడకంతో పనిలో వేగాన్ని పెంచడానికి కష్టపడుతున్నారు. ఏఐ తమ సమయాన్ని ఆదా చేస్తుందని, సృజనాత్మకతను పెంచుతుందని, ముఖ్యమైన పనిపై దృష్టి పెట్టడానికి వీలు కల్పిస్తుందని చెప్పారు. 79 శాతం మంది తమ పనిలో ఏఐ కీలకంగా ఉంటుందని అంగీకరించినప్పటికీ, అందులో 60 శాతం మంది తమ కంపెనీలో కృత్రిమమేధ వినియోగానికి సంబంధించి సరైన ప్రణాళిక లేదని తెలిపారు. 78 శాతం మంది తమ పనిలో సొంత ఏఐటూల్స్ను వాడుతున్నారు. కానీ ఎలాంటి ప్రణాళిక, నియంత్రణ లేకుండా వాడుతున్న ఈ టూల్స్ వల్ల కంపెనీ డేటా ప్రమాదంలో పడుతుందని కొందరు చెబుతున్నారు.ఇదీ చదవండి: త్వరలో అందరికీ ఉచితంగా జీపీటీ-4ఓ.. ప్రత్యేకతలివే..కృత్రిమమేధ వల్ల ఉద్యోగాలు కోల్పోతామనే భయం చాలా మందికి ఉన్నప్పటికీ, డేటా భిన్నమైన అభిప్రాయాన్ని తెలియజేస్తుంది. ఏఐ నైపుణ్యాలను నేర్చుకునే వారికి సైబర్ సెక్యూరిటీ, ఇంజినీరింగ్, క్రియేటివ్ డిజైన్..వంటి రంగాల్లో అవకాశాలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 46 శాతం మంది రాబోయే సంవత్సరంలో తాము చేస్తున్న ఉద్యోగం మారాలని చూస్తున్నారు. 66 శాతం కంపెనీలు ఏఐ నైపుణ్యాలు లేనివారిని నియమించుకోవడం లేదు. కోపైలట్, చాట్జీపీటీ వంటే ఏఐ నైపుణ్యాలు కలిగిన వారికి కంపెనీలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. మొత్తం కంపెనీల్లో 39శాతం మాత్రమే వారి ఉద్యోగులకు ఏఐ శిక్షణ అందించాయి. కేవలం 25 శాతం కంపెనీలు మాత్రమే ఈ సంవత్సరం ఏఐ ట్రెయినింగ్ అందిస్తున్నాయి. -
ఏకకాలంలో ఎన్నోపనులు..!
ఒకేసమయంలో రెండు పనులు చేయడం సాధ్యమా.. అని అడిగితే చాలా కష్టమని చెబుతాం. కానీ క్వాంటమ్ కంప్యూటింగ్లో క్యూబిట్స్ ఏకకాలంలో చాలా పనులు చేయగలవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆ విషయాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.నిత్యం టెక్నాలజీలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అన్నిరంగాల్లో అందరికంటే ముందుండాలనే భావనతో వేగంగా పనిచేయాలనుకుంటున్నారు. అందుకు తగ్గుట్టు ప్రముఖ కంపెనీలు సాంకేతిక పరికరాలు తయారుచేస్తున్నాయి. వాటిలో క్వాంటమ్ కంప్యూటింగ్ టెక్నాలజీను వాడే పరికరాలకు సమీప భవిష్యత్తులో గిరాకీ ఏర్పడుతుందని నిపుణులు భావిస్తున్నారు.ఈ ఏడాదిలో డేటా అనలిటిక్స్, కృత్రిమ మేధ రంగాలను క్వాంటమ్ కంప్యూటింగ్ గణనీయంగా మలుపు తిప్పగలదని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మానవ పురోగమనాన్ని మరింత ముందుకు తీసుకెళ్తుందని అభిప్రాయపడుతున్నాయి. ప్రస్తుతం వాడుతున్న కంప్యూటింగ్ టెక్నాలజీ కంటే క్వాంటమ్ కంప్యూటింగ్ ఎన్నోరెట్లు సమర్థంగా, వేగంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.ఎలా పనిచేస్తుందంటే..ఇది ఎంటాంజిల్మెంట్, సూపర్పొజిషన్స్ అనే అంశాల మూలంగా ఒకే సమయంలో వేలసంఖ్యలో గణనలు చేయగలదు. సంప్రదాయ కంప్యూటర్లు బైనరీ బిట్స్..అంటే 0 లేదా 1 రూపంలో సమాచారాన్ని నిల్వ చేసుకుంటాయి. దాన్ని విశ్లేషిస్తాయి. అదే క్వాంటమ్ కంప్యూటర్లు క్యూబిట్స్ సాయంతో పనిచేస్తాయి. ఇవి 1, 0.. లేదా ఒకే సమయంలో రెండు రూపాల్లోనూ ఉండొచ్చు. అంటే ఒక పని పూర్తి కాకుండానే మరో పనిని మొదలు పెడుతాయి. ఒకే సమయంలో రెండు పనులనూ చేస్తాయి.ఇదీ చదవండి: 100 విమానాలు కొనుగోలు చేయనున్న ఇండిగో.. ఎందుకంటే..క్వాంటమ్ రేణువులు ఎంటాంజిల్మెంట్ అనే విచిత్రమైన ప్రవర్తనను ప్రదర్శిస్తాయి. ఎంటాంజిల్ అయినప్పుడు అవి ఎంత దూరంలో ఉన్నా ఒకదాంతో మరోటి అనుసంధానమవుతాయి. అదీ లక్షలాది మైళ్ల దూరంలో ఉన్నాసరే ఎంటాంజిల్ అవుతాయి. ఈ ప్రక్రియలో క్యూబిట్ల సంఖ్యను పెంచితే క్వాంటమ్ పరికరాల సామర్థ్యం అనూహ్యంగా పెరిగిపోతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. క్వాంటమ్ కంప్యూటింగ్ పరిజ్ఞానం ప్రయోగశాలలను దాటుకొని వాడకానికి దగ్గరవుతోంది. మందుల ఆవిష్కరణ, క్రిప్టోగ్రఫీ, వాతావరణ శాస్త్రం, పదార్థ విజ్ఞానం వంటి ఎన్నో రంగాల్లో ఇది సంచలన మార్పులకు కారణం కాగలదని భావిస్తున్నారు. -
పదేళ్ల తర్వాత.. చాట్జీపీటీ కంపెనీ కోఫౌండర్ సంచలన నిర్ణయం!
కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో అగ్రగామిగా పేరొందిన ఓపెన్ఏఐ (OpenAI) సహ వ్యవస్థాపకుడు ఇల్యా సుట్స్కేవర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కంపెనీని స్థాపించిన ఇన్నేళ్లకు సంస్థను వీడుతున్నట్లు తాజాగా ప్రకటించారు."దాదాపు ఒక దశాబ్దం తర్వాత, నేను ఓపెన్ఏఐ నుంచి నిష్క్రమించాలని నిర్ణయం తీసుకున్నాను" అని సుట్స్కేవర్ ‘ఎక్స్’ (ట్విటర్)లో ఒక పోస్ట్లో చెప్పారు. ఇతర కోఫౌండర్లు సామ్ ఆల్ట్మన్, గ్రెగ్ బ్రాక్మన్, సీటీవో మిరా మురాతి, జాకబ్ పచోకీల నాయకత్వంలో కంపెనీ మరింత పురోగమిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అలాగే తాను మరో ప్రాజెక్ట్ను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. దానికి సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడిస్తానన్నారు.ఓపెన్ఏఐ అనేది ఇటీవల చాలా పాపులర్ అయిన చాట్బాట్ ‘చాట్ జీపీటీ’ నిర్వహణ సంస్థ. మైక్రోసాఫ్ట్ మద్దతు గల ఈ కంపెనీ సీఈఓ సామ్ ఆల్ట్మాన్ మాట్లాడుతూ.. ఓపెన్ఏఐ కంపెనీ నేడు ఈ స్థాయిలో ఉందంటే దానికి కారణం సుట్స్కేవర్ అని, ఆయన లేకుంటే సంస్థ ఇలా ఉండేది కాదని పేర్కొన్నారు. జాకుబ్ పచోకీ కంపెనీకి కొత్త చీఫ్ సైంటిస్ట్ అవుతారని చెప్పారు. పచోకి గతంలో ఓపెన్ పరిశోధన డైరెక్టర్గా పనిచేశారు. GPT-4, ఓపెన్ఏఐ ఫైవ్ అభివృద్ధికి నాయకత్వం వహించారు.After almost a decade, I have made the decision to leave OpenAI. The company’s trajectory has been nothing short of miraculous, and I’m confident that OpenAI will build AGI that is both safe and beneficial under the leadership of @sama, @gdb, @miramurati and now, under the…— Ilya Sutskever (@ilyasut) May 14, 2024 -
నటిస్తున్న కృత్రిమమేధ..!
తమిళ దర్శకుడు శంకర్ తీసిన రోబోకు.. విల్స్మిత్ హీరోగా నటించిన హాలీవుడ్ సినిమా ‘ఐ రోబో’లో కామన్ ఏమిటో మీకు తెలుసా? రెండింటిలోనూ యంత్రాలు తమను తయారు చేసిన మనుషులను మోసం చేస్తాయి! కల్పిత కథలతో తీసిన సినిమాలు కదా.. ఎలా ఉంటే ఏం అని అనుకోవద్దు? ఎందుకంటే ఇప్పుడు నిజజీవితంలోనూ ఇలాంటివి నిజమయ్యే అవకాశం ఏర్పడింది. ఎందుకలా అని అనుకుంటూంటే చదివేయండీ ప్రత్యేక కథనాన్ని!కృత్రిమ మేధ (ఏఐ) మనిషి జీవితంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చింది. సౌకర్యాలు పెంచింది.. కష్టాన్ని తగ్గించింది. సలహా, సూచనలు ఇచ్చేందుకూ ఉపయోగపడుతోంది. అయితే నాణేనికి రెండోవైపు ఉన్నట్లే ఈ కృత్రిమ మేధతో కొన్ని ఇబ్బందులూ లేకపోలేదు. ఉద్యోగాలకు ఎసరు పెట్టడం.. తప్పుడు సమాచారంతో వినియోగదారులను తప్పుదోవ పట్టించడం వంటి దుష్ప్రభావాలు కూడా కొన్ని కనిపిస్తున్నాయి. అయితే... ఇటీవలి కాలంలో ఈ కృత్రిమ మేధ మరింత ముదిరిపోయిందని... మరీ ముఖ్యంగా ఛాట్బోట్లు నమ్మకంగా ఉన్నట్లు నటించడమూ నేర్చుకున్నాయని అంటున్నారు ఎంఐటీ (మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) గణిత శాస్త్రవేత్త పీటర్ పార్క్. ఈ విషయం డెవలపర్లకు కూడా తెలియకపోవడం మరింత ఆందోళన కలిగించేదని ఆయన వ్యాఖ్యానించారు.‘‘కృత్రిమ మేధతో పనిచేసే రెండు బోట్లు పోటీపడినప్పుడు ప్రత్యర్థికంటే ఒక మెట్టు పైనుండాలనే ఆలోచనతో అవి మోసానికి పాల్పడే అవకాశం ఉంది.’’ అని పీటర్ పార్క్ ఇటీవలే ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ తెలిపారు. గేమింగ్ వంటి అప్లికేషన్లలో ఏఐ సిస్టమ్లు చాలా నమ్మకంగా పనిచేస్తాయని మనం అనుకుంటూ ఉంటామని, కానీ జరుగుతున్నది ఇందుకు భిన్నమని చెప్పారు. ‘‘ఏ ఆటలోనైనా గెలుపుకోసం ప్రయత్నం జరుగుతుంది. మెటా సిద్ధం చేసిన గేమింగ్ సాఫ్ట్వేర్నే ఉదాహరణగా తీసుకుందాం. సైసెరో ‘డిప్లొమసీ’ అనే ఈ గేమ్లో ఏఐ బోట్ నిజాయితీగా పనిచేసేలా కోడ్ రాశారు. అయితే వాస్తవానికి వచ్చేసరికి అది ఇందుకు భిన్నంగా ప్రవర్తిస్తోంది. ఉద్దేశపూర్వకంగా తన యూజర్ను మోసం చేస్తోంది. డిప్లొమసీతోపాటు డీప్ మైండ్ అభివృద్ధి చేసిన ఆల్ఫాస్టార్, స్టార్క్రాఫ్ట్2..వంటి ఆటల్లోనూ ఏఐ సాఫ్ట్వేర్లు మోసం చేస్తున్నాయి’ అని పీటర్ వివరిస్తున్నారు.ఆర్థిక వ్యవహారాల్లోనూ శిక్షణ...కృత్రిమమేధ ఆర్థిక అంశాలకు సంబంధించిన చర్చల్లోనూ పాల్గొనేలా శిక్షణ పొందుతున్నాయి. ఏదైనా అంశంపై ఇన్పుట్స్తో చర్చకు సిద్ధం అయితే దాన్ని అనుకరించేలా ఏఐను వాడుతున్నారు. అయితే అందులో పైచేయి సాధించడానికి ఎలా అబద్ధాలు చెప్పాలో నేర్చుకుంటాన్నాయని పార్క్ చెప్పారు. ఏఐ డెవలపర్లు, రెగ్యులేటర్లు వాటికి భద్రతా పరీక్షలు చేస్తుంటారు. ఏఐ క్రమపద్ధతిలో ఈ పరీక్షల్లోనూ మోసం చేసి నెగ్గుతోందని పార్క్ అంటున్నారు. ‘‘ఏఐ ఏదైనా అంశంపై అబద్ధం చెప్పడం నేర్చుకుంటే అదో పరిష్కరించలేని సమస్యగా మారుతుంది.. వీటి పరిష్కారానికి యూరోపియన్ యూనియన్ ఇటీవలే ఒక చట్టాన్ని రూపొందించింది. అవి అమలులోకి వస్తున్నాయి. అయితే వాటి ప్రభావం ఏమేరకు ఉంటుందో చూడాలి’’ అని పార్క్ అన్నారు.ఇదీ చదవండి: విమానంలో ల్యాండింగ్గేర్ సమస్య.. గాల్లోనే మూడు గంటలు..కృత్రిమమేధ మోసపూరిత సామర్థ్యాలు మరింత అభివృద్ధి చెందుతాయి. దాంతో సమాజానికి ప్రమాదం పొంచి ఉందని పార్క్ అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తులో ఏఐ ఉత్పత్తులు, జనరేటివ్ ఓపెన్ సోర్స్ మోడల్లు చేయబోయే మోసానికి కళ్లెం వేయాలంటే మనకు మరింత సమయం కావాలంటున్నారు. ప్రస్తుతానికి ఏఐ మోసాన్ని కట్టడి చేయడం సాధ్యం కాకపోవచ్చు. కానీ సమీప భవిష్యత్తులో దీన్ని ప్రమాదంగా పరిగణించాలని పార్క్ చెప్పారు. -
ఏఐ యూనివర్సిటీ.. ఒడిశా మేనిఫెస్టోలో ఆసక్తికర హామీలు
భువనేశ్వర్: ఒడిశాలోని బిజూ జనతాదళ్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోను గురువారం విడుదల చేసింది. ఒడిశా అసెంబ్లీ తోపాటు లోక్సభకు ఏకకాలంలో ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులతో సమానంగా కళింగశ్రీ, కళింగ భూషణ్ అవార్డులను ప్రవేశపెడుతున్నట్లు బీజేడీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ మేనిఫెస్టో విడుదల చేస్తూ ప్రకటించారు.ఏఐ (AI) యూనివర్సిటీ, 100 యూనిట్ల ఉచిత విద్యుత్, కలియా పథకం వంటి కార్యక్రమాలను కొనసాగించాలని, విస్తరించాలని పార్టీ యోచిస్తోంది. ఎన్నికల తర్వాత కొత్త బీజేడీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత రాష్ట్ర మంత్రివర్గం తన మొదటి సమావేశంలోనే ఈ మేనిఫెస్టోను ఆమోదిస్తుందని నవీన్ పట్నాయక్ చెప్పారు. 5టీ గవర్నెన్స్ మోడల్ ద్వారా ఈ మ్యానిఫెస్టోను అమలు చేస్తే ఒడిశా ఆధునికత, అభివృద్ధిలో ప్రత్యేక గుర్తింపు సాధిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.మేనిఫెస్టోలో కీలక అంశాలు⇒ వచ్చే దశాబ్దంలో ఒడిశా యువత కోసం రూ. 1 లక్ష కోట్ల ప్రత్యేక బడ్జెట్⇒ వచ్చే ఐదేళ్లలో బాలబాలికలకు స్కాలర్షిప్ల పెంపు⇒ రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు⇒ స్కిల్స్ అండ్ ఎంట్రాప్రీన్యూర్షిప్ యూనివర్సిటీ, స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, ఏఐ యూనివర్సిటీ కోసం ప్రణాళికలు⇒ 100 యూనిట్ల వరకు గృహాలకు ఉచిత విద్యుత్⇒ 100 నుంచి 150 యూనిట్లు వరకు సబ్సిడీపై విద్యుత్⇒ మధ్యతరగతి కుటుంబాల కోసం బిజూ స్వాస్త్య కళ్యాణ్ యోజన, గృహ రుణాలపై వడ్డీ రాయితీ, పిల్లల చదువుల కోసం స్కాలర్షిప్లు⇒ మహిళలు, గిరిజన, ఓబీసీ, మైనారిటీ వర్గాలకు వడ్డీ లేని రుణాలు⇒ స్వయం సహాయక బృందాలకు ఆర్థిక సాయం, పెన్షన్ పథకాల ద్వారా సాధికారత⇒ రైతులకు పంట రుణాలు, కలియా పథకం కొనసాగింపు, రైతుల అమ్మాయిల వివాహాల కోసం ఆర్థిక సహాయం. -
క్రికెట్లో కృత్రిమ మేధ.. ఐస్ కూల్గా ఐపీఎల్ (ఫోటోలు)
-
శ్రీరాముని దివ్య రూపం.. ఏఐ ఫోటోలు
-
ప్రపంచంలోనే తొలి ఏఐ అందాల పోటీలు!
ఎన్నో రకాల అందాల పోటీలను చూసి ఉంటారు. కానీ ఇలాంటి సాంకేతికతో కూడిన అందాల పోటీలను చూసి ఉండరు. ప్రపచంలోనే తొలిసారిగా ఏఐ అందాల పోటీలు వరల్డ్ ఏఐ క్రియేటర్ అవార్డ్స్(WAICA) పిలుపునిచ్చింది. ఈ పోటీలో కృత్రిమ మేధస్సుతో రూపొందించిన మోడల్స్ పాల్గొంటారు. కోటి రూపాయల విలువ చేసే ప్రైజ్మనీలతో భారీ ఎత్తున ఈ ఏఐ అందాల పోటీలను నిర్వహిస్తోంది WAICA. ఈ ఐఏ మోడల్స్ని ప్రేక్షకుల్లో వాటికున్న ఆదరణ, ఫ్లాట్ఫామ్లో ఎక్కువగా వినియోగించగలిగేది, సోషల్ మీడియా క్రేజ్ వంటి వాటిని ఆధారంగా చేసుకుని న్యాయనిర్ణేతలు విజేతను ప్రకటిస్తారు. తొలిసారిగా కంప్యూటర్ సాంకేతికత సృష్టించిన మనుషుల అందాల పోటీ అనేది ఫ్యాషన్ వైవిధ్యానికి ఓ నిదర్శనం. వరల్డ్ AI క్రియేటర్ అవార్డ్స్ వర్చువల్ మోడల్స్ని సబ్స్క్రిప్షన్-ఆధారిత ప్లాట్ఫారమ్ అయిన ఫ్యాన్వ్యూని(Fanvue) కూడా కలిగి ఉంటుంది. ఇక్కడ సదరు వర్చువల్ మోడల్ ఫ్యాన్ వ్యూ, పీఆర్ మద్దతులను కూడా బేస్ చేసుకుని విజేతను ప్రకటించడం జరుగుతుంది. అలాగే రన్నరప్, మూడో స్థానంలో ఉన్న విజేతలకు కూడా నగదు బహుమతులు అందచేయడం జరుగుతుందని వరల్డ్ ఏఐ క్రియేటర్ అవార్డ్స్ పేర్కొంది. ఈ పోటీలకు ఎంట్రీలు గత ఆదివారం(ఏప్రిల్ 14) నుంచే ప్రారంభమయ్యాయి. మే 10న విజేతలను ప్రకటిస్తారు. ఇక ఈ అందాల పోటీ ఈ నెలఖారులోపు జరగనుంది. ఇక ఈ పోటీలు నలుగురు సభ్యుల ఫ్యానెల్ సమక్లంలో జరుగుతుంది. ఆ ఫ్యానెల్లో ఇద్దరు ఏఐ ఇన్ఫ్లయోన్సర్ జడ్డిలు..ఒకరేమో మూడు లక్షల ఫ్యాన్ఫాలోయింగ్ కలిగిన స్పెయిన్కు చెందిన ఐతానా లోపెజ్, మరోకరు రెండు లక్షలకు పైగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఎమిలీ పెల్లెగ్రిని జడ్జిలుగా వ్యవహరిస్తారు. ఇక వారిలో మిగిలిన ఇద్దరు వ్యక్తులు..పీఆర్ సలహదారు, వ్యవస్థాపకుడు ఆండ్రూ బ్లాచ్, మరొకరు అందాల పోటీ చరిత్రకారుడు, బ్యూటీ క్వీన్ స్కాండల్స్ పుస్తక రచయిత అయిన సాలీ-ఆన్ ఫాసెట్ విజేతలను ప్రకటిస్తారు. ఇది ఏఐ సృష్టికర్తలలో దాగున్న ప్రతిభ సామర్థ్యాన్ని వెలికి తీసేందుకు జరుగుతున్న అందాల పోటీ అని ఫ్యానల్ వ్యక్తులు చెబుతున్నారు. ఈ పోటీల్లో పాల్గొనేవారు తప్పనిసరిగా 100 శాతం ఏఐ జనరేటేడ్ మోడల్స్నే క్రియేట్ చేయాలి. అందుకోసం ఎలాంటి టూల్స్ ఉపయోగిస్తారనేందుకు ఎలాంటి పరిమితులు లేవు. ఓన్లీ ఏఐ జెనరేటర్ క్రియేషన్స్ని స్వాగతిస్తుంది. అది డీప్ ఏఐ, లేదా వ్యకగత టూల్స్ వంటివి ఏదైనా కావొచ్చు. ఈ పోటీల్లో ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నవారు దాదాపు రూ. 4 లక్షలపైనే నగదు బహుమతి అందజేస్తారు నిర్వాహకులు. ( చదవండి: సింఘారా పిండి గురించి విన్నారా..? బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు!) -
కొత్త ఏఐ ల్యాప్టాప్లు.. ప్రత్యేకత ఏంటో తెలుసా..
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మనం వాడుతున్న ఎలక్ట్రానిక్ వస్తువుల్లో చాలామార్పులు వస్తున్నాయి. ప్రధానంగా యూత్ ఎక్కువగా వినియోగించే ల్యాప్టాప్ల సామర్థ్యం పెంచేందుకు కంపెనీలు చాలా మార్గాలు అన్వేషిస్తున్నాయి. ఇంట్లో, ఆఫీసులో ఎక్కడైనా పనిచేయడం అనివార్యమైంది. దాంతో ఉద్యోగస్థులు, స్టూడెంట్లు ఇలాంటి వాటిపై చాలా ఆసక్తి చూపిస్తున్నారు. వీరి అవసరాలు దృష్టిలో ఉంచుకొని ల్యాప్టాప్ తయారీ కంపెనీలు వాటి వేగాన్ని పెంచడానికి ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగా ల్యాప్టాప్లు మరింత వేగంగా, సమర్థంగా పనిచేయడానికి వాటిలో కృత్రిమ మేధ (ఏఐ) ఫీచర్లనూ జోడిస్తున్నారు. అయితే అలా ఇంప్లిమెంట్ చేస్తున్న ఏఐల వర్క్లోడ్ ఒక్కోసారి అధికమై ప్రాసెసర్లపై భారం పడుతుంది. దాన్ని తగ్గించేందుకు కంపెనీలు కొత్త విధానాన్ని అమలు చేస్తున్నాయి. ల్యాప్టాప్ల్లో ఏఐ వర్క్లోడ్స్ సాఫీగా, అంతరాయం లేకుండా పనిచేయటానికి న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్ (ఎన్పీయూ) అమర్చుతున్నారు. సీపీయూ, జీపీయూతోపాటు ఎన్పీయూ సైతం వీటిలో వాడుతున్నారు. దాంతో ఎన్పీయూ ఉన్న ల్యాప్టాప్లు హైబ్రిడ్ వర్క్కల్చర్కు తగ్గట్టుగా వేగంగా, సమర్థంగా పనిచేస్తాయని తయారీ సంస్థలు చెబుతున్నాయి. తాజాగా ప్రముఖ ల్యాప్టాప్ తయారీ సంస్థ హెచ్పీ ఎన్పీయూ ఫీచర్ ఉన్న ఏఐ ఆధారిత గేమింగ్ ల్యాప్టాప్ ఒమెన్ ట్రాన్సెండ్ 14, ఎన్వీఎక్స్ 360 14 మోడల్ను విడుదల చేసింది. ఇవి వేగంగా, సమర్థంగా పనిచేస్తూ వినియోగదారుల అవసరాలను తీరుస్తాయని హెచ్పీ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్, ఎండీ ఇప్సితా దాస్గుప్తా చెప్పారు. హెచ్పీతోపాటు మరిన్ని కంపెనీలు ఏఐ ఆధారిత ల్యాప్టాప్లను మార్కెట్లో విడుదల చేశాయి. వాటికి సంబంధించిన వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి. హెచ్పీ ఒమెన్ ట్రాన్సెండ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్: విండోస్ 11 హోమ్ ఇంటెల్ కోర్ ఆల్ట్రా 9 ప్రాసెసర్ 14 అంగుళాల డిస్ప్లే 11.5 గంటల బ్యాటరీ బ్యాకప్ 1.637 కేజీల బరువు ఎన్వీడియా జీఈఫోర్స్ ఆర్టీఎక్స్ 4060 గ్రాఫిక్కార్డు ప్రారంభ ధర అంచనా: రూ.1,74,999 హెచ్పీ ఎన్వీఎక్స్ 360 14 ఆపరేటింగ్ సిస్టమ్: విండోస్ 11 హోమ్ గ్రాఫిక్ మెమరీ: జీడీడీఆర్6 గ్రాఫిక్ మెమరీ కెపాసిటీ: 4 జీబీ ప్రాసెసర్: ఇంటెల్ i7 ప్రాసెసర్ జనరేషన్: 13వ తరం ఎస్ఎస్డీ: 1 టీబీ ర్యామ్: 16 జీబీ గ్రాఫిక్ ప్రాసెసర్: NVIDIA GeForce RTX 3050 ప్రారంభ ధర అంచనా: రూ.99,999 ఎంఎస్ఐ ప్రెస్టీజ్ 16 ఏఐ ఈవో బీ1ఎం ఆపరేటింగ్ సిస్టమ్: విండోస్ 11 హోమ్ స్క్రీన్: 16 అంగుళాలు ప్రాసెసర్: ఇంటెల్ కోర్ అల్ట్రా 9 ఇందులో ఎన్పీయూ, ఇంటెల్ ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ సదుపాయాలు ఉన్నాయి. బరువు: 1.5 కిలోలు. ధర సుమారు: 1,19,990 ఆసుస్ ఆర్ఓజీ జెఫిరస్ G14 ఆపరేటింగ్ సిస్టమ్: విండోస్ 11 హోమ్ గ్రాఫిక్ మెమరీ: జీడీడీఆర్6 గ్రాఫిక్ మెమరీ కెపాసిటీ: 12 GB ప్రాసెసర్: AMD రైజెన్ 9 ఆక్టా కోర్ ఎస్ఎస్డీ: 1 టీబీ ర్యామ్: 32 GB DDR5 గ్రాఫిక్ ప్రాసెసర్: NVIDIA GeForce RTX 4080 ధర సుమారు: 2,49,990 ఇదీ చదవండి: ఆకాశవీధిలో 15.4 కోట్ల ప్రయాణికులు ఆసుస్ జెన్బుక్ 14 ఓలెడ్ ఆపరేటింగ్ సిస్టమ్: విండోస్ 11 హోమ్ ప్రాసెసర్: ఇంటెల్ కోర్ i7 ఎస్ఎస్డీ: 512 GB ర్యామ్: 16 జీబీ LPDDR5 గ్రాఫిక్ ప్రాసెసర్: ఇంటిగ్రేటెడ్ ఇంటెల్ ఐరిస్ X గ్రాఫిక్స్ ధర సుమారు: రూ.99,990 -
జీమెయిల్ యూజర్లకు శుభవార్త
ప్రముఖ టెక్ దిగ్గజం జీమెయిల్ యూజర్లకు శుభవార్త చెప్పింది. ఆండ్రాయిడ్ ఆధారిత అండ్రాయిడ్ యూజర్లకు ఏఐని జోడిస్తున్నట్లు తెలిపింది.ఇందుకోసం రిప్లయ్ సజెషన్స్ ఫ్రం జెమిని పేరిట వ్యవహరిస్తున్న ఈ ఫీచర్పై పనిచేస్తుందని, ఈ ఫీచర్ సాయంతో ఈమెయిల్స్కు రిప్లయి ఇచ్చేలా యూజర్లు వినియోగించుకునే అవకాశం కలగనుంది. గూగుల్ ఇప్పటికే గూగుల్ వన్ ఏఐ ప్రీమియం సబ్స్క్రిప్షన్ ద్వారా గూగుల్ డ్రైవ్, డాక్స్ వంటి సర్వీస్లలో జెమిని అడ్వాన్స్డ్ పవర్డ్ ఏఐ టూల్స్ను అందుబాటులోకి తెచ్చింది. అయితే కంపెనీ ఇప్పుడు తన మొబైల్ జీమెయిల్ అప్లికేషన్లో ఏఐని ఇంటిగ్రేట్ చేసే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. నివేదిక ప్రకారం.. కొత్త ఏఐ ఫీచర్ ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి వచ్చిన తర్వాత వచ్చిన మెయిల్స్ను విశ్లేషించడం, సూచనలిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఎవరికైనా మెయిల్స్ పంపే సమయంలో అందులో ఉన్న కంటెంట్ సరిగ్గా ఉందా, లేదంటే ఇంకా ఏమైనా జోడించాల్సి ఉంటుందా అనే సలహాలు ఇస్తుంది. అవసరమైతే మెయిల్స్లో యూజర్కు కావాల్సిన కంటెంట్ను ఏఐ అందిస్తుందని నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఫీచర్ ప్రస్తుతం ఎంపిక చేసిన వినియోగదారులకు అందుబాటులో ఉంది. అయితే త్వరలో ప్రపంచవ్యాప్తంగా గూగుల్ వన్ ఏఐ సబ్స్క్రైబర్లకు అందుబాటులోకి రానుందని సమాచారం. View this post on Instagram A post shared by BSTech (@bstechofficial) -
మిమిక్రీ టూల్ను పరిచయం చేసిన ఓపెన్ఏఐ
కృత్రిమ మేధ రంగంలో కంపెనీల మధ్య రోజురోజుకు పోటీ పెరుగుతోంది. దాంతో వినియోగదారులకు మెరుగైన సేవలందించేందుకు నిత్యం కంపెనీలు తమ ఉత్పత్తుల్లో మార్పులు చేస్తూన్నాయి. తాజాగా ఓపెన్ఏఐ వాయిస్ అసిస్టెంట్ రంగంలోకి అడుగుపెట్టింది.కొత్త ఫీచర్లో భాగంగా వాయిస్ ఇంజిన్ అనే వినూత్న టూల్ను పరిచయం చేసింది. వ్యక్తుల గొంతులను అచ్చం అలాగే తిరిగి వినిపించడం దీని ప్రత్యేకత. కేవలం 15 సెకండ్ల నిడివి రికార్డు స్పీచ్ సాయంతోనే గొంతులను అనుకరించటం విశేషం. అంటే ఒకరకంగా దీన్ని మిమిక్రీ ఇంజిన్ అనుకోవచ్చు. ఇది మంచి టూలే అయినప్పటికీ దీన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉండటం వల్ల ప్రస్తుతానికి ఎంపికచేసిన కొందరు టెస్టర్లకే అందుబాటులోకి తెచ్చారు.మనదేశంలో ఎన్నికలు జరుగుతుండటం.. ఇటీవల ఏఐ సృష్టించిన రాజకీయ నాయకుల గొంతులతో రోబో కాల్స్ పుట్టుకొస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండటం అవసరం. నిజానికి ఇప్పటికే చాలా అంకుర సంస్థలు వాయిస్ క్లోనింగ్ సొల్యూషన్లను అందిస్తున్నాయి. వీటి విషయంలో ఓపెన్ఏఐ నైతికతకు ప్రాధాన్యం ఇవ్వటం విశేషం. వాయిస్ ఇంజిన్ను పరీక్షించటానికి అనుమతి పొందినవారూ నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందే. ఆయా వ్యక్తుల అనుమతి తీసుకున్న తర్వాతే వారి గొంతులను సృష్టించటానికి వీలుంటుంది. అలాగే అవి ఏఐ ద్వారా సృష్టించినవని తప్పకుండా ప్రకటించాలి. -
మిమిక్రీ టూల్ను పరిచయం చేసిన ప్రముఖ ఏఐ సంస్థ
కృత్రిమ మేధ రంగంలో కంపెనీల మధ్య రోజురోజుకు పోటీ పెరుగుతోంది. దాంతో వినియోగదారులకు మెరుగైన సేవలందించేందుకు నిత్యం కంపెనీలు తమ ఉత్పత్తుల్లో మార్పులు చేస్తూన్నాయి. తాజాగా ఓపెన్ఏఐ వాయిస్ అసిస్టెంట్ రంగంలోకి అడుగుపెట్టింది. కొత్త ఫీచర్లో భాగంగా వాయిస్ ఇంజిన్ అనే వినూత్న టూల్ను పరిచయం చేసింది. వ్యక్తుల గొంతులను అచ్చం అలాగే తిరిగి వినిపించడం దీని ప్రత్యేకత. కేవలం 15 సెకండ్ల నిడివి రికార్డు స్పీచ్ సాయంతోనే గొంతులను అనుకరించటం విశేషం. అంటే ఒకరకంగా దీన్ని మిమిక్రీ ఇంజిన్ అనుకోవచ్చు. ఇది మంచి టూలే అయినప్పటికీ దీన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉండటం వల్ల ప్రస్తుతానికి ఎంపికచేసిన కొందరు టెస్టర్లకే అందుబాటులోకి తెచ్చారు. ఇదీ చదవండి: కళను హరిస్తున్న ఏఐ.. ఆర్టిస్టులు ఏం చేశారంటే.. మనదేశంలో ఎన్నికలు జరుగుతుండటం.. ఇటీవల ఏఐ సృష్టించిన రాజకీయ నాయకుల గొంతులతో రోబో కాల్స్ పుట్టుకొస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండటం అవసరం. నిజానికి ఇప్పటికే చాలా అంకుర సంస్థలు వాయిస్ క్లోనింగ్ సొల్యూషన్లను అందిస్తున్నాయి. వీటి విషయంలో ఓపెన్ఏఐ నైతికతకు ప్రాధాన్యం ఇవ్వటం విశేషం. వాయిస్ ఇంజిన్ను పరీక్షించటానికి అనుమతి పొందినవారూ నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందే. ఆయా వ్యక్తుల అనుమతి తీసుకున్న తర్వాతే వారి గొంతులను సృష్టించటానికి వీలుంటుంది. అలాగే అవి ఏఐ ద్వారా సృష్టించినవని తప్పకుండా ప్రకటించాలి. -
కళను హరిస్తున్న ఏఐ.. ఆర్టిస్టులు ఏం చేశారంటే..
ఒకప్పుడు సైన్స్ కాల్పనిక నవలలు, సినిమాలకే పరిమితమైన కృత్రిమ మేధ (ఏఐ) నేడు జనజీవితాల్లో భాగమైంది. ఈ సాంకేతికత ద్వారా ఎన్నో సేవలు, సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయి. కానీ, మనిషికన్నా ఏఐ తెలివిమీరితే మన భవిష్యత్తు ఏమవుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కృత్రిమ మేధ (ఏఐ) మనిషి జీవితంలో ఎన్నో మార్పులు, సౌకర్యాలు తీసుకొస్తోంది. ఆన్లైన్లో వస్తుసేవల క్రయవిక్రయాలకు తోడ్పడుతోంది. ఓటీటీలో ఏయే సినిమాలు, సిరీస్ చూడవచ్చో సలహాలిస్తోంది. సిరి, అలెక్సాల ద్వారా మాట్లాడుతోంది. వ్యాపారాలు సులభంగా వేగంగా సాగేందుకు ఉపకరిస్తోంది. అదే సమయంలో మనిషి అవసరాన్ని తగ్గించేస్తుందన్న బెరుకు వ్యక్తమవుతోంది. తాజాగా ఓపెన్ఏఐ తన ఎల్ఎల్ఎంలకు శిక్షణ ఇచ్చేందుకు అనుమతి లేకుండానే తమ బుక్స్ను వాడుతోందని ఆరోపిస్తూ కొద్దినెలల కిందట వందలాది రచయితలు టెక్ కంపెనీకి వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించారు. ఇక ఇదే తరహాలో జొనాస్ బ్రదర్స్ సహా 200 మందికిపైగా మ్యూజీషియన్లు ఏఐకి వ్యతిరేకంగా గళం విప్పారు. తమ హక్కులను ఉల్లంఘించే పద్ధతులను నిలిపివేయాలని కోరుతూ ఏఐ కంపెనీలకు బహిరంగ లేఖ రాశారు. తమ కళను హరించకూడదంటూ అందులో పేర్కొన్నారు. ఇదీ చదవండి: ‘ఐదు రోజులు తిండి లేదు.. ఆ బాధ మీకు తెలియదు’ ఆర్టిస్ట్స్ రైట్స్ అలయన్స్ ఆధ్వర్యంలో రాసిన ఈ లేఖపై జొనాస్ సోదరులు, బిల్లీ ఇలిష్, క్యాటీ పెర్రీ, స్మోకీ రాబిన్సన్ వంటి ప్రముఖ ఆర్టిస్ట్లు సంతకాలు చేశారు. మ్యూజిక్ పరిశ్రమలో ఏఐ వినియోగంతో తలెత్తే దుష్ప్రభావాలపై ఈ లేఖలో వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐ దుర్వినియోగంతో సృజనాత్మకత దెబ్బతింటుందని, ఆర్టిస్టులు, హక్కుదారుల ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని ఏఐ డెవలపర్లు, టెక్నాలజీ కంపెనీలు, డిజిటల్ వేదికలకు వారు విజ్ఞప్తి చేశారు. -
డెవిన్కు పోటీగా భారత్ సాఫ్ట్వేర్ ఇంజనీర్.. ఎవరీ దేవిక?
టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో కొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తున్నాయి. ఇందులో భాగంగానే అమెరికాకు చెందిన కాగ్నిషన్ కంపెనీ ‘ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్’ను సృష్టించి.. దానికి ‘డెవిన్’ అని పేరు పెట్టింది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్. దీనికి పోటీగా భారత్లో 'దేవిక' వచ్చేసింది. ఇంతకీ దేవిక ఎవరు? ఇది ఎలాంటి పనులు చేయగలదు.. అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.. భారతదేశానికి చెందిన ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్, లిమినల్ అండ్ స్టిటైన్.ఏఐ 'ముఫీద్ వీహెచ్' డెవిన్కు ప్రత్యర్థిగా దేవికను రూపొందించారు. దేవిక, డెవిన్ మాదిరిగానే.. మనిషి ఇచ్చే సూచనలను అర్థం చేసుకోవడానికి కావలసిన మెషిన్ లెర్నింగ్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ వంటి వాటిని పొందుతుంది. తద్వారా సూచనలను తీసుకుని, వాటిని కార్యాచరణలో పెడుతుంది. దేవిక అనేది కూడా ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇది మనం ఇచ్చే సూచనల మేరకు నిర్దేశించిన లక్ష్యాలను సాధించడానికి సొంతంగా కోడ్ రాస్తుంది. ఇది అమెరికా రూపొందించిన డెవిన్కు ఏ మాత్రం తీసిపోకుండా.. గట్టి ప్రత్యర్థిగా నిలుస్తుంది. ఏఐ టెక్నాలజీలో కొత్త ఆవిష్కరణలను ప్రవేశపెట్టి.. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ రంగంలో కొత్త శకానికి నాంది పలకడమే ఉద్దేశ్యంగా ఈ ఏఐ దేవికను రూపొందించారు. అయితే ఇది టెక్ జాబ్ మార్కెట్ను ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకోవడానికి వేచి చూడాలి. అయితే ఖచ్చితంగా కోడింగ్ భవిష్యత్తు గణనీయమైన పరివర్తన చెందుతుందని మాత్రం చెప్పవచ్చు. ప్రాజెక్ట్ దేవికకు సంబంధించి టెస్టర్లు, కంట్రిబ్యూటర్ల నుంచి ఆహ్వానం వచ్చినట్లు ముఫీద్ వీహెచ్ ఎక్స్ (ట్విటర్) ద్వారా పేర్కొన్నారు. ముఫీద్ దేవిక ఫీచర్స్ వివరించారు. మరిన్నిటెస్టులు నిర్వహించిన తర్వాత, బగ్ పరిష్కారాలు పూర్తయిన తరువాత అధికారికంగా ప్రారంభమవుతుందని డెవలపర్ పేర్కొన్నారు. ఏఐ దేవిక ఫీచర్స్ ఒక ప్రాజెక్ట్ను పూర్తి చేయడానికి.. వినియోగదారు ప్రశ్నను అర్థం చేసుకోవడానికి, బ్రౌజ్ చేయడానికి, పరిశోధన చేయడానికి, కోడ్, డాక్యుమెంట్ వంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఫీడ్బ్యాక్ లూప్లో ఒకదానితో ఒకటి పరస్పర చర్య చేయగల 12 ఏజెంట్ మోడల్లు ఉన్నాయి. ఒల్లామా ద్వారా క్లాడ్ 3, GPT-4, GPT-3.5, లోకల్ LLMలకు మద్దతు ఇస్తుంది. దేవికా తను వ్రాసిన కోడ్ని రన్ చేయగలదు, వినియోగదారు ప్రమేయం లేకుండా ఏదైనా లోపాలను ఎదుర్కొంటే కోడ్ను స్వయంగా సరిదిద్దుతుంది. Inviting early testers and contributors to Project Devika - The open-source alternative to Devin. 👩💻 As of now, Devika is far from the capabilities of Devin... but we'll eventually get there. So I am calling the open-source community to join forces! ❤️ Features: - 12 Agentic… pic.twitter.com/if8qfuiKm8 — mufeed vh (@mufeedvh) March 21, 2024 -
ఇలా ‘భాషించారు’!
మీరు ప్రధాని మోదీ, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్గేట్స్ ‘చాయ్ పే చర్చ’ వీడియో చూశారా? అందులో ఓ విషయం గమనించారా? మోదీ హిందీలో మాట్లాడుతుంటే.. అది అర్థమవుతున్నట్లు బిల్గేట్స్ తలాడించడం, తిరిగి బదులివ్వడం చేశారు. బిల్గేట్స్కు హిందీ రాదుగా.. మరి ఇదెలా సాధ్యమైంది? ఈ చర్చలో వారు ప్రధానంగా మాట్లాడుకున్న ఏఐ (కృత్రిమ మేథ)దే ఈ మాయ అంతా. అంటే ఏఐ సాయంతో అప్పటికప్పుడు రియల్ టైంలో ఆంగ్లంలోకి అనువాదమైపోవడమన్న మాట. ఇంతకు ముందు కూడా.. అంటే.. గతేడాది డిసెంబర్లో వారణాసిలో జరిగిన ‘కాశీ తమిళ సంగమం’లో పాల్గొన్న ప్రధాని మోదీ... భారతీయ భాషలను రియల్ టైంలో అనువదించగల ఏఐ ఆధారిత టూల్ ‘భాషిణి’ని ఆవిష్కరించారు. ఆపై ఆ వేదిక నుంచే దాన్ని ఉపయోగించారు కూడా. అంటే మోదీ హిందీలో మాట్లాడుతుంటే.. అది అక్కడ ఇయర్ బడ్స్ పెట్టుకున్న తమిళులకు వారి భాషలోకి అనువాదమై.. వినిపించింది. అలాగే జీ20 శిఖరాగ్ర సదస్సులోనూ ఈ టూల్ను ఉపయోగించే వివిధ దేశాధినేతలను ఉద్దేశించి ప్రసంగించారు. తాజాగా చాయ్ పే చర్చ కూడా ఇలాంటి ఏఐ ఆధారిత భాషానువాద టూల్ ద్వారానే సాధ్యమైందని నిపుణులు చెబుతున్నారు. మీకో విషయం తెలుసా? త్వరలో స్మార్ట్ఫోన్ల తయారీ దిగ్గజం యాపిల్.. తమ తదుపరి మోడల్ ఐఫోన్–16లో రియల్ టైం ట్రాన్స్లేషన్ టూల్ సహా మరికొన్ని ఏఐ ఆధారిత ఫీచర్లను అందుబాటులోకి తీసుకురానుందట. భాషిణి ఎలా పనిచేస్తుందంటే.. భాషిణి అనేది ఏఐ ఆధారిత భాషానువాద టూల్. యాండ్రాయిడ్, ఐఓఎస్ యాప్ల ద్వారా ఇది సులువుగా పనిచేస్తుంది. దీని సాయంతో ఎవరైనా వ్యక్తులు ఇతర భాషల వారితో మాతృ భాషలో మాట్లాడినా అది ఆయా భాషల్లోకి అప్పటికప్పుడే అనువదించేస్తుంది. దేశంలోని భిన్న భాషలు మాట్లాడే వారి మధ్య భాషా సమస్యను ఇది తొలగిస్తుంది. నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్తోపాటు క్రౌడ్ సోర్సింగ్ ద్వారా పొందిన (భాషాదాన్) వివిధ భాషల పదాలతో తయారు చేసుకున్న డేటాతో వివిధ భాషలను అనర్గళంగా అనువదిస్తుంది. దీన్ని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ రూపొందించింది. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
3.5 లక్షల ఉద్యోగులకు ట్రైనింగ్.. టీసీఎస్ కీలక ప్రకటన
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)కు డిమాండ్ పెరుగుతున్న తరుణంలో.. ఈ టెక్నాలజీలో నైపుణ్యం ఉన్న వారికే దిగ్గజ కంపెనీలు ఉద్యోగాలు ఇవ్వడానికి సుముఖత చూపిస్తున్నాయి. ఇప్పటికే చాలామంది ఏఐలో శిక్షణ పొందుతున్నారు. ఈ నేపథ్యంలో దేశంలో అతిపెద్ద టెక్ కంపెనీ 'టీసీఎస్' లక్షల మంది ఉద్యోగులకు ఏఐలో ట్రైనింగ్ ఇచ్చినట్లు తెలిపింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు టీసీఎస్ దాదాపు 3.5 లక్షల మంది ఉద్యోగులకు శిక్షణ ఇప్పించినట్లు తాజాగా వెల్లడించింది. ఇప్పటి వరకు ఈ టెక్నాలజీలో ఎక్కువ మందికి శిక్షణ ఇచ్చిన కంపెనీల జాబితాలో టీసీఎస్ ముందు వరుసలో నిలిచింది. టీసీఎస్ కంపెనీ ఈ ఏడాది ప్రారంభంలో 1.5 లక్షల మందికి ఏఐలో శిక్షణ ఇచ్చినట్లు తెలిపింది. ఆ తరువాత కూడా ఇంకొంతమందికి ట్రైనింగ్ ఇచ్చింది. మొత్తం మీద కంపెనీ ఇప్పటి వరకు ఏకంగా 3.5 లక్షల మందికి ఏఐ విభాగంలో ప్రాథమిక నైపుణ్య శిక్షణ ఇచ్చినట్లు తెలిపింది. ఏఐలో శిక్షణ పొందిన వారిలో.. సగం కంటే ఎక్కువ మంది కంపెనీకి చెందిన వారు ఈ టెక్నాలజీలో నైపుణ్యం సాధించినట్లు టీసీఎస్ పేర్కొంది. క్లౌడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో కస్టమర్ అవసరాలకు దృష్టిలో ఉంచుకుని ఆయా విభాగాలలోని ప్రత్యేక యూనిట్ను ఏర్పాటు చేసిన ఘనత కూడా టీసీఎస్ సొంతం కావడం గమనార్హం. రాబోయే రోజుల్లో కంపెనీ మరింత మంది ఉద్యోగులకు ఏఐలో శిక్షణ ఇవ్వడానికి సంసిద్ధంగా ఉంది. -
మారుతున్న రాజకీయ ప్రచార పంథా.. సోషల్ మీడియా సాయమెంత..?
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియకు సర్వం సిద్ధమవుతోంది. అన్ని రాజకీయపార్టీలు ప్రజలను తమవైపు ఆకర్షించేందుకు పావులు కదుపుతున్నారు. అందులో భాగంగానే ప్రచారసభలతో అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రచారాలతో హోరెత్తిస్తున్నాయి. నేరుగా ఓటర్ల దగ్గరకు వెళ్లేందుకు కొన్నిసార్లు ప్రతి ప్రచారకర్తకు వీలుకాకపోవచ్చు. కానీ ప్రస్తుతం అందరూ స్మార్ట్ఫోన్ వాడుతున్నారు. అందులో సోషల్ మీడియా యాప్స్ వినియోగిస్తున్నారు. దాంతో పార్టీలు ప్రచార పంథాను మార్చుకుంటున్నాయి. రాజకీయ పార్టీలు వీటినే ప్రచారసాధనాలుగా ఉపయోగించుకుంటున్నాయి. ఇందులో ఇన్ఫ్లూయెన్సర్లదే కీలక పాత్ర. ఎన్నికల సంఘం వెల్లడించిన వివరాల ప్రకారం.. 2019 పార్లమెంట్ ఎన్నికల ప్రచారం కోసం భాజపా రూ.325 కోట్లు ఖర్చు చేయగా, కాంగ్రెస్ రూ.356 కోట్లు ఖర్చు చేసింది. కొవిడ్-19 పరిస్థితుల తర్వాత సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ల సంఖ్య పెరిగింది. వాళ్లకు ఇచ్చే ప్రత్యేక ఇంటర్వ్యూలను పార్టీ అనుకూల ప్రచారానికి మాధ్యమాలుగా ఉపయోగిస్తున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియా ప్రచారం లేకుండా గెలిచే పరిస్థితి లేదని పార్టీలు గట్టిగా నమ్ముతున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇదీ చదవండి: వాట్సప్ స్టేటస్ పెడుతున్నారా..? అదిరిపోయే అప్డేట్ మీ కోసమే! ఇందుకోసం ప్రత్యేకంగా జిల్లా, నియోజకవర్గాల వారీగా బృందాలను ఏర్పాటు చేసుకుని ప్రచారంలో ముందుకు సాగుతున్నాయి. టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో మరిన్ని మార్పులు చోటుచేసుకోబోతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఓటర్లను నేరుగా కలవకుండా.. ఏఐ సాంకేతికతతో సంభాషించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయంటున్నారు. మరోవైపు ఎన్నికల సంఘం కూడా సోషల్ మీడియా ప్రచారంపై ప్రత్యేక దృష్టి సారించింది. నకిలీ సమాచారం వ్యాప్తి చెందకుండా జిల్లాల వారీగా ప్రత్యేక అధికారులను నియమించి వాటిపై నిఘా పెట్టింది. -
ఉద్యోగులకు ఏమైంది..? కంపెనీ ఎందుకు మారడం లేదు..
ఐటీ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు 2-3 ఏళ్లు కుదురుగా ఒక కంపెనీలో పనిచేశాక సంస్థ మారడం ఆనవాయితీగా వస్తోంది. అందుకు చాలాకారణాలు ఉన్నాయి. అందులో ప్రధానంగా కొత్త కంపెనీ భారీగా వేతనం ఆఫర్ చేస్తుండడమే. కానీ ప్రస్తుత రోజుల్లో ఆ పద్ధతి మారుతోంది. రెండేళ్ల క్రితం వరకైతే ఐటీ ఉద్యోగులు తరచూ కంపెనీలు మారుతూ ఉండేవారు. ఇప్పుడు ఈ ధోరణితో మార్పు కనిపిస్తోంది. గతంలో లాగా కంపెనీ మారినప్పుడు, వేతనాల్లో పెంపు భారీగా ఉండకపోవడంతో ఉద్యోగులు సంస్థలు మారడం లేదని తెలుస్తుంది. అంతర్జాతీయ అనిశ్చితుల నేపథ్యంలో ఐటీ పరిశ్రమ ప్రస్తుతం విభిన్న పరిస్థితులను ఎదుర్కొంటోంది. కొత్తగా వస్తున్న ప్రాజెక్టులు తగ్గడంతో నియామకాలు తగ్గిస్తున్నారు. కొన్ని విభాగాల్లో చూస్తే, కావాల్సిన నిపుణుల లభ్యతా తక్కువగానే ఉంటోంది. కృత్రిమ మేధ (ఏఐ), ప్రాంప్ట్ ఇంజినీరింగ్, మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), డేటా అనలిటిక్స్ నిపుణులకు ఇప్పుడు గిరాకీ పెరుగుతోంది. మరో వైపు, అమెరికాలాంటి దేశాల్లో వేల సంఖ్యలో ఉద్యోగాల కోత మొదలయ్యింది. జీతం పెరగకపోయినా అదే కంపెనీలో.. చాలాకాలంపాటు ఒకే కంపెనీలో పనిచేస్తే వేతనం పెద్దగా పెరగదు అని ఐటీ నిపుణులు భావిస్తుంటారు. అందుకే, తరచూ ఉద్యోగాలు మారేందుకు సిద్ధం అవుతారు. సంస్థలు మారినప్పుడల్లా 15-20 శాతం వేతనం అధికంగా వచ్చేలా చూసుకుంటారు. ఇప్పుడా పరిస్థితులు మారాయి. నియామకాలు అంతగా లేకపోవడంతో, ఉన్న కంపెనీలో కొనసాగేందుకే ప్రయత్నిస్తున్నారు. అధునాతన నైపుణ్యాలున్న వారికి మాత్రం ఈ బాధ లేదు. ఏఐ, ఎంఎల్ నైపుణ్యాలున్న వారికి, సంప్రదాయ కోడింగ్లో మంచి పట్టు ఉన్న వారికీ మంచి అవకాశాలు వస్తున్నాయి. ఉద్యోగాలపై ఏఐ ప్రభావం ఎంత..? ఐటీ రంగంలో ఉద్యోగాలు తగ్గుతున్నాయని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి ఇది 2019 స్థాయిలోనే ఉన్నాయని ఐటీ రంగ నిపుణులు వెల్లడించారు. 2020 తర్వాత కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అధిక సంఖ్యలో ఐటీ ఉద్యోగాల సృష్టి జరిగింది. ఆ తర్వాత క్రమంగా ఇవి నెమ్మదించాయి. ముఖ్యంగా ఫ్రెషర్ల(తాజా ఉత్తీర్ణుల) నియామకంపై ప్రభావం కనిపిస్తోంది. ఏఐ వల్ల ఉద్యోగాలు పోతున్నాయి అని అనుకుంటున్నారు. కృత్రిమ మేధ(ఏఐ) అన్ని రంగాల్లోనూ విస్తరిస్తోంది. ఇది కొత్త ఉద్యోగాలను సృష్టిస్తోంది మినహా, ఉన్న ఉద్యోగాలను తగ్గించే స్థాయికి చేరుకోలేదని కొందరు నిపుణులు చెబుతున్నారు. ఇదీ చదవండి: ఎల్ఐసీ ఉద్యోగులకు శుభవార్త.. భారీగా వేతన పెంపు కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాల్సిందే.. మారుతున్న ప్రాజెక్ట్లు, టెక్నాలజీ కారణంగా పాత ఉద్యోగులు కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాల్సి ఉంటుంది. ఏటా కొత్తగా ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు ఉద్యోగ మార్కెట్లోకి వస్తున్నారు. వీరు ఇప్పటికే కొత్త తరం సాంకేతికతలను నేర్చుకుంటున్నారు. దీంతో పాత వారికి వీరి నుంచి పోటీ ఎదురవుతోంది. మరోవైపు గ్రాడ్యుయేషన్ పూర్తయిన వారు, తొందరగా ఏదో ఒక ఉద్యోగంలో చేరాలని భావిస్తున్నారు. -
ఒక్కో వ్యక్తికి వందల్లో సిమ్ కార్డులు, బ్యాంక్ ఖాతాలు..!
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరాలు అధికమవుతున్నాయి. సైబర్ నేరాల నియంత్రణకు పోలీసులు కృత్రిమ మేధను వాడుతున్నారు. దీని ద్వారా అనుమానిత సిమ్కార్డులు, బ్యాంకు ఖాతాలను గుర్తించి బ్లాక్ చేయించి.. సైబర్ నేరగాళ్ల ఆగడాలను అడ్డుకోవాలనేది వారి ఆలోచన. టెలికాం, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లతో ఇటీవల నిర్వహించిన సమావేశంలో దీనిపై చర్చ జరిగింది. సాంకేతిక పరిజ్ఞానం అండతో నేరాలకు పాల్పడుతున్నవారికి అదే ఆయుధంతో చెక్ పెట్టనున్నారు. ప్రత్యేక ముఠాలు ఏర్పాటు సైబర్ నేరాలు ఇటీవలి కాలంలో అడ్డూఅదుపు లేకుండా పెరిగిపోతున్నాయి. ఇవి సామాన్యులనే కాదు పోలీసులనూ ఇబ్బంది పెడుతున్నాయి. ఈ మోసాల బారిన పడకుండా ప్రజలను ఎన్ని రకాలుగా చైతన్యపరుస్తున్నా.. నేరగాళ్లు కొత్త కొత్త పద్ధతుల్లో దోపిడీకి పాల్పడుతూనే ఉన్నారు. ఇతర రాష్ట్రాలు, దేశాల్లో ఉండి మరీ.. ఇక్కడి వారి ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. ఫోన్ కాల్తో బురిడీ కొట్టించి.. ఖాతాలో ఉన్న సొత్తు అంతా ఊడ్చేస్తున్నారు. తప్పుడు చిరునామాలతో సిమ్కార్డులు తీసుకొని, బోగస్ ఖాతాల్లోకి డబ్బు మళ్లించి.. కొల్లగొడుతున్నారు. ఒక్కో నేరగాడు వందల సంఖ్యలో సిమ్కార్డులు సమకూర్చుకుంటున్నాడు. సిమ్కార్డులు, బ్యాంకు ఖాతాలు సమకూర్చేందుకు ప్రత్యేకంగా ముఠాలే ఉన్నాయి. నిరక్షరాస్యులు, నిరుద్యోగులను నమ్మించి.. బ్యాంకు ఖాతా వాడుకునేందుకు అనుమతి ఇస్తే మంచి కమీషన్ ఇస్తామని ఆశపెడుతున్నారు. బాధితుల నుంచి కొల్లగొట్టిన డబ్బును ఈ ఖాతాల్లోకి, వాటిలో నుంచి వేరే ఖాతాలోకి మార్చి.. డ్రా చేసుకుంటున్నారు. కష్టమ్మీద ఆచూకీ కనిపెట్టినా.. నేరగాళ్ల ఆచూకీని పోలీసులు అతికష్టమ్మీద కనిపెట్టినా ఇతర రాష్ట్రాలకు వెళ్లి.. వారిని పట్టుకోవడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో నేరగాళ్లు వాడుతున్న సిమ్కార్డులు, బ్యాంకు ఖాతాలను గుర్తించి.. వాటిని రద్దు చేయించగలిగితే వారిని కట్టడి చేయచ్చని అధికారులు భావిస్తున్నారు. సిమ్కార్డు లేకపోతే మోసం చేసేందుకు కాల్ చేయలేరు. బ్యాంకు ఖాతా లేకపోతే మళ్లించిన డబ్బు దోచుకోలేరు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా నేరగాళ్ల సిమ్కార్డులను అధికారులు గుర్తిస్తున్నారు. ఇప్పటివరకు సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు 28,610 సిమ్కార్డులను బ్లాక్ చేయించగలిగారు. వాటిని వాడిన ఫోన్ల ఐఎంఈఐ నంబర్ను గుర్తించి, వాటిని కూడా బ్లాక్ చేయిస్తున్నారు. దాదాపు 2 వేల బ్యాంకు ఖాతాలనూ రద్దు చేయించారు. తమకు వస్తున్న ఫిర్యాదుల ఆధారంగానే ఇవన్నీ చేయించారు. ప్రక్షాళన షురూ.. సిమ్కార్డులు, బ్యాంకు ఖాతాలను ముందుగానే గుర్తించేందుకు కృత్రిమ మేధను వినియోగించుకోవాలని భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇండియన్ సైబర్ క్రైం కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ)కు పెద్దఎత్తున ఫిర్యాదులు వస్తుంటాయి. బాధితులకు వచ్చిన ఫోన్ కాల్స్, డబ్బు మళ్లించిన బ్యాంకు ఖాతాల వివరాలన్నీ ఇక్కడ నమోదవుతుంటాయి. ఈ సమాచారంతోపాటు బ్యాంకింగ్ డేటా ఆధారంగా అనుమానాస్పద ఖాతాలను గుర్తించాలని అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం కృత్రిమమేధ సాయం తీసుకోనున్నారు. ఇదీ చదవండి: బెంట్లీ కార్లను ఎలా టెస్ట్ చేస్తారో తెలుసా..? చాలాకాలంగా పనిచేయని బ్యాంకు ఖాతాలోకి ఒకేసారి ఎక్కువ మొత్తంలో డబ్బు జమ అయినా, ఒక ఖాతాలోకి దేశవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల నుంచి డబ్బు జమ అవుతున్నా అటువంటి వాటిని గుర్తించి, ఆయా బ్యాంకులను అప్రమత్తం చేయనున్నారు. అలాగే సిమ్కార్డుల విషయంలో సర్వీస్ ప్రొవైడర్లను ఇప్పటికే అప్రమత్తం చేశారు. -
లోకం మెచ్చిన కోడింగ్ మాంత్రికుడు : అద్రిత్ సక్సెస్ జర్నీ
‘అబ్బ...ఖాళీ సమయం దొరికింది. ఎంజాయ్ చేయాలి’ అనుకునేవారు కొందరు. ‘ఖాళీ సమయం దొరి కింది... ఏదైనా నేర్చుకోవాలి’ అనుకునేవారు మరికొందరు. అద్రిత్రావు రెండో కోవకు చెందిన కుర్రాడు. కోవిడ్ మహమ్మారి సమయంలో దొరికిన విరామంలో ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ద్వారా ఎన్నో సాంకేతిక విషయాలను స్వయంగా నేర్చుకున్నాడు. కోడింగ్ మాంత్రికుడిగా పేరు తెచ్చుకున్నాడు... ‘కోడింగ్ మేధావి’గా పేరుగాంచిన ఇండియన్–అమెరికన్ అద్రిత్రావు యాప్ డెవలప్మెంట్ వరల్డ్, డిజిటల్ హెల్త్ ఇన్నోవేషన్లో తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నాడు. కాలిఫోర్నియాకు చెందిన పదహారు సంవత్సరాల అద్రిత్ ఎన్నో యాప్లను రూపొందించి టెక్ దిగ్గజం యాపిల్ ప్రశంసలు అందుకున్నాడు. ప్రస్తుతం స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీలో హెల్త్కేర్కు సంబంధించిన కట్టింగ్–ఎడ్జ్ రిసెర్చ్లో భాగం అయ్యాడు. ఎనిమిదేళ్ల వయసులో కోడింగ్తో ప్రయాణం ప్రారంభించాడు అద్రిత్. ‘బ్లాక్ ప్రోగ్రామింగ్’తో కంప్యూటర్ సైన్స్తో పరిచయం అయింది. ఆ పరిచయం ఇష్టం అయింది. ఆ ఇష్టం శోధనకు మూలం అయింది. కంప్యూటర్ సైన్స్ ప్రపంచంలోకి అడుగు పెట్టిన అద్రిత్ ట్రెడిషనల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లను గురించి ఆసక్తిగా తెలుసుకోవడం ప్రారంభించి ఆ తరువాత వాటిపై పట్టు సాధించాడు. కోవిడ్ మహమ్మారి సమయంలో అద్రిత్కు బోలెడు ఖాళీ సమయం దొరికింది. ఈ ఖాళీ సమయంలో యూట్యూబ్, ఇతర ఆన్లైన్ వనరుల ద్వారా యాప్ డెవలప్మెంట్ నేర్చుకున్నాడు. పన్నెండేళ్ల వయసులో ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ సిఫ్ట్ స్టూడెంట్ చాలెంజ్లో అద్రిత్రావు విజేతగా నిలిచాడు. ఈ సందర్భంగా ఆపిల్ సీఈవో టిమ్ కుక్ను కలిసే అరుదైన అవకాశం లభించింది. ‘అదొక ఉత్తేజకరమైన అనుభవం. యాప్ డెవలప్మెంట్కు సంబంధించి నా ప్రయాణాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లడానికి ప్రేరణ ఇచ్చింది’ కుక్తో జరిగిన మీటింగ్ గురించి చెబుతాడు అద్రిత్. సినిమాలు, టీవీ షోలను చూడడానికి ప్రేక్షకులకు సహాయపడే యాప్ల నుంచి ఆరోగ్య సంరక్షణలో ఉపయోగపడే యాప్ల వరకు...అద్రిత్ ఖాతాలో వినూత్న యాప్లు ఎన్నో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది బధిరులు ఉన్నారు, కమ్యూనికేషన్ విషయంలో ఇతరులతో వారికి ఎదురవుతున్న సమస్యల గురించి అధ్యయనం చేసిన అద్రిత్కు వారి హావభావాలను ఐఫోన్ కెమెరా ద్వారా స్పీచ్గా మార్చాలనే ఆలోచన వచ్చింది. ఆ తరువాత ‘సిగ్నర్’ అనే యాప్ ద్వారా తన ఆలోచనను నిజం చేసుకున్నాడు. పదమూడు సంవత్సరాల వయసులో చదివిన ఒక వ్యాసం ద్వారా అద్రిత్కు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై ఆసక్తి పెరిగింది. ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉయోగించాలనే ప్రయత్నంలో స్టాన్ఫోర్ట్ యూనివర్శిటీలో రిసెర్చ్ ఇంటెర్న్షిప్ ప్రారంభించాడు అద్రిత్. వ్యాధులను గుర్తించే, స్టాండ్ఔట్ ఇన్నోవేషన్గా చెప్పబడుతున్న ‘ఆటోఏబీఐ’లాంటి ఐఫోన్ యాప్లు క్లినికల్ ట్రయల్స్, పేటెంట్ప్రాసెస్లో ఉన్నాయి. పది సైంటిఫిక్ రిసెర్చ్ పేపర్లను ప్రచురించిన అద్రిత్ డిజిటల్ హెల్త్ సోల్యూషన్స్కు సంబంధించి క్రియాశీల పాత్ర పోషిస్తున్నాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్లపై పని చేయడానికి సిలికాన్ వ్యాలీలో ఎక్కువ సమయం గడిపినప్పటికీ ‘సాంకేతిక సహాయంతో ఆరోగ్య సంరక్షణ’ అంశంపై ఎక్కువ దృష్టి పెట్టాడు అద్రిత్. ‘వైద్యుల స్థానాన్ని ఏఐ భర్తీ చేయాలని నేను అనుకోవడం లేదు. అయితే అది వైద్యులకు సహాయపడుతుంది’ అంటున్నాడు. ఈ కోడింగ్ మాంత్రికుడిలోని మరో కోణం...లాభాపేక్ష లేకుండా యంగ్ ఇన్నోవేటర్స్ కోసం ΄ాఠాలు బోధిస్తున్నాడు. ఎంతోమందికి విలువైన సలహాలు ఇస్తున్నాడు.వయసు అడ్డంకి కాదు... కొత్త ఆవిష్కరణలకు వయసు అనేది అడ్డు కాదు. అభిరుచి అనేది ఆవిష్కరణకు ప్రమాణం. మనం ఇష్ట పడుతున్న సబ్జెక్ట్పై ఎంత ఎక్కువ సమయాన్ని కేటాయిస్తే అంత విజయం సాధించగలం. కాలం అనేది విలువైనది. విలువైన కాలాన్ని వృథా చేయకుండా విలువైన విషయాలపై దృష్టి పెడితే అద్భుతాలు సాధించగలం. మార్పును తీసుకురాగలం. – అద్రిత్
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
సమ్మర్ ట్రిప్లో ఎంజాయ్ చేస్తున్న ప్రియాంక మోహన్
రూ. 2,599 కోట్లు వడ్డీతో సహా 15 రోజుల్లో కట్టాలి..
హమాస్ చెరలో ఇజ్రాయెల్ మహిళా సైనికులు! వీడియో విడుదల
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
అలాంటి వార్తలతో నాతో పాటు కుటుంబం మొత్తం బాధ పడింది: లయ
పిచ్చుకను కాపాడిన బుడతలు..! ఇంతకీ ఏం జరిగిందంటే?
ఢిల్లీ మెట్రోలో రాహుల్.. ఫొటో వైరల్
వడదెబ్బకు గురైన నటుడు షారూఖ్! దీని బారిన పడకూడదంటే..!
టీడీపీ రిగ్గింగ్ చేస్తోందని చెప్పినా పోలీసులు స్పందించలేదు: అనిల్ కుమార్
విరాట్ కోహ్లి ఆర్సీబీని వీడాలి.. ఆ జట్టులో చేరాలి: ఇంగ్లండ్ స్టార్
తప్పక చదవండి
- పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
- అలాంటి వార్తలతో నాతో పాటు కుటుంబం మొత్తం బాధ పడింది: లయ
- పవిత్ర-చందు మరణం.. అదే అసలు కారణమన్న నరేశ్
- Raisin Water : ఎండు ద్రాక్ష నీళ్లు తాగితే ఇన్ని లాభాలా
- ‘నాగి..నిన్ను కొట్టాలి.. ‘బుజ్జి’ గ్లింప్స్పై ప్రభాస్ రియాక్షన్
- భార్యతో హార్దిక్కు విభేదాలు?.. అతడి వల్లే అంటూ నటాషా పోస్ట్!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ దౌత్య పాస్పోర్టు రద్దు చేయండి’
- జీహెచ్ఎంసీలో కామ పిశాచి.. కమిషనర్ రియాక్షన్
- అంబానీల అతిథులకు కరీంనగర్ కానుకలు
Advertisement