-
AP: జెట్ స్పీడ్గా సిట్ దర్యాప్తు
ఎన్టీఆర్, సాక్షి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల పోలింగ్ సందర్భంగా చెలరేగిన హింసపై ప్రత్యేక బృందం(SIT) దర్యాప్తు జెట్ స్పీడ్తో ముందుకు సాగుతోంది. ఎన్నికల సంఘం ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీనియర్ ఐపీఎస్ అధికారి వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో టీంను నియమించిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే సిట్ బృందం దర్యాప్తు ప్రారంభమైంది. శుక్రవారం రాత్రి నుంచి వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలోని 13 మంది అధికారుల బృందం దర్యాప్తులోకి దిగింది. ఈ టీంలో ఏసీబీ ఎస్పీ రమాదేవి, అడిషనల్ ఎస్పీ సౌమ్య లత, ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి, సీఐడీ డీఎస్పీ శ్రీనివాసులు, డీఎస్పీ వి శ్రీనివాసరావు, డీఎస్పీ రవి మనోహర చారి, ఇన్స్పెక్టర్లు భూషణం, వెంకట రావు, రామకృష్ణ, జిఐ శ్రీనివాస్, మెయిన్, ఎన్ ప్రభాకర్, శివ ప్రసాద్ లు ఉన్నారు. పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో హింసపై సిట్ దర్యాప్తు చేస్తోంది. ఎన్నికల అనంతర హింస లో పోలీస్ అధికారులు పాత్ర పైనా ఆరాలు తీస్తోంది. ఈ మొత్తం ఘటనలపై ఆదివారం లోగా ఈసీకి సిట్ నివేదిక ఇవ్వనుంది.ఇంకా 144 సెక్షన్పోలింగ్ రోజు మధ్యాహ్నం ప్రారంభమైన హింస నాలుగు రోజుల పాటు కొనసాగింది. మాచర్ల, నరసరావుపేట, పల్నాడు, చంద్రగిరి, తాడిపత్రి, తిరుపతిల్లో జరిగిన ఘటనలు స్థానికంగా ఉద్రిక్తతలకు దారి తీశాయి. ఇంకా కొన్ని ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. తాడిపత్రి, సత్తెనపల్లి, జమ్మలమడుగులో పోలీస్ పహారా ఇంకా కొనసాగుతోంది. ప్రధాన పార్టీల ఆఫీస్ల ముందు బందోబస్తు ఏర్పాటు చేశారు.పోలీసుల పచ్చపాత వైఖరిమరోవైపు.. ఏపీలో పోలీసులు పక్షపాత వైఖరిపై నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. పల్నాడు జిల్లాలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ నేతలు దాడి చేస్తుంటే చూస్తూ ఉండిపోయారు. దాడి చేసిన టీడీపీ నేతలను వదిలేసి.. గొడవలతో ఏమాత్రం సంబంధం లేని వైఎస్సార్సీపీ నేతలను, అలాగే వైఎస్సార్సీపీకి ఓటేసిన వాళ్లను పోలీసులు టార్గెట్ చేస్తున్నారు. తమ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించడాన్ని వైఎస్సార్సీపీ నేతలు ఖండిస్తున్నారు. -
ఏపీ ఫలితాలపై సజ్జల కీలక వ్యాఖ్యలు
సాక్షి, గుంటూరు: ఎన్నికల్లో విజయంపై తాము పూర్తి విశ్వాసంతో ఉన్నామని.. గత ఎన్నికల్లో గెలిచిన సీట్ల కంటే ఈ సారి ఎక్కువే గెలుస్తామని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఓటింగ్ సరళిని చూసి ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనుకోవద్దన్నారు.‘‘చంద్రబాబుకు ఆయన మీద ఆయనకే నమ్మకం లేదు. చంద్రబాబు పూర్తిగా నెగిటివ్ క్యాంపెన్ చేశారు. జగన్ ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళ్లింది. కుప్పంలోనూ వైఎస్సార్సీపీ గెలవబోతోంది. కుట్రపూరితంగా కేంద్రం సహాయంతో కొందరు అధికారులను తప్పించారు. ల్యాండ్ టైట్లింగ్పై చంద్రబాబు అర్థంలేని ఆరోపణలు చేశారు. చంద్రబాబు హామీలపై ప్రజలకు నమ్మకం లేదు’’ అని సజ్జల పేర్కొన్నారు.‘‘పోలీసులు పెద్దారెడ్డి ఇంట్లోని సీసీటీవీలు ధ్వంసం చేయడం అన్యాయం. పెద్దారెడ్డి ఇంట్లో పోలీసులు సీసీ కెమెరాలు ధ్వంసం చేయడమేంటి?. దాడిపై ఈసీకి ఫిర్యాదు చేస్తున్నాం’’ అని సజ్జల చెప్పారు.‘‘కౌంటింగ్లో అక్రమాలు జరుగుతాయని అనుకోవడం లేదు.. కౌంటింగ్లో అక్రమాలు జరిగితే ఎదుర్కొంటాం. ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరుతున్నాం. ఇప్పటికేనీ ఈసీ తప్పు సరిదిద్దుకుంటే మంచింది’’ అని సజ్జల హితవు పలికారు.మళ్లీ అధికారంలోకి వస్తున్నాం. సాంప్రదాయ ఓటు బ్యాంక్ మావైపు ఉంది. మాకు కాన్ఫిడెన్స్ ఉంది, ఓవర్ కాన్ఫిడెన్స్ లేదు. ప్రజలు ఓటింగ్ లో పాల్గొన్న తీరు చూస్తుంటే మళ్ళీ విజయం సాధిస్తాం. పొలింగ్ పర్సంటేజ్ పెరిగితే మేము ఓడిపోతామన్న భ్రమలో టీడీపీ ఉంది. మాపై వ్యతిరేకత ఉన్న వర్గాలు ఎక్కడా లేవు. ప్రజలు నమ్మటం లేదని చంద్రబాబు సుపర్ సిక్స్ గురించి ప్రచారం చేసుకోలేదు. వివేకా హత్య, ల్యాండ్ టైట్లింగ్ గురించి తప్ప తాను చేసే మంచి గురించి ఎక్కడైనా చెప్పాడా. సీఎం జగన్ చేసిన అభివృద్ది సంక్షేమం అభివృద్ధి చూసి ఓటు వేయాలని అడిగారు. నన్ను చూసి నేను చేసిన మంచి చూసే ఓటు వేయాలని జగన్ అడిగారు. టీడీపీ గెలవడానికి ఉన్న ఒక్క కారణమైనా చెప్పగలరా?’’ అంటూ సజ్జల ప్రశ్నించారు.‘‘చంద్రబాబు కూడా ఎన్నికల్లో విజయం సాధిస్తామని చెప్పలేక పోతున్నారు. టీడీపీ కూటమి వలనే పోలింగ్ లో హింస జరిగింది. వారు చెప్పిన అధికారులే హింసకు కారణమయ్యారు. ఇప్పుడు వాళ్లనే ఈసీ తొలగించి చర్యలు తీసుకుంది. ఇంకా తొలగించాల్సిన వాళ్ళు కొందరు ఉన్నారు. పోలింగ్ కు ముందు అడ్డగోలుగా అధికారుల బదిలీ చేశారు. అల్లర్లు జరిగాయి అంటే ఈసీ విఫలం అయ్యినట్లే. వీటి వెనుక చంద్రబాబు పాత్ర ఉన్నట్లే. ఈ-ఆఫీసు అప్ గ్రేడ్ చేస్తుంటే గవర్నర్కు లేఖలు రాస్తున్నారు. రికార్డులు మాయం అవుతున్నాయని పిచ్చి పిచ్చి లేఖలు రాస్తున్నారు’’ అని సజ్జల ధ్వజమెత్తారు.‘‘తాడిపత్రిలో పెద్ధారెడ్డి ఇంట్లో పోలీసులే సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు. ల్యాండ్ టైట్లింగ్ గురించి ఎన్నికల తరువాత టీడీపీ ఎందుకు మాట్లాడటం మానేసింది?. ల్యాండ్ టైటలింగ్ అమలు చేయాలని నీతి అయోగ్ చెప్పింది. కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగాలంటే పోలీసు అబ్జర్వర్ దీపక్ మిశ్రాను తొలగించాలి. టీడీపీ కొంతమంది పోలీసులను తమ ఏజెంట్లుగా మార్చుకుంది. ప్రశాంతంగా కౌంటింగ్ జరగాలని కోరుకుంటున్నాం. ఎన్నికల కమిషన్ బాధ్యతాయుతంగా ఉంటే ఇంత విద్వంసం అల్లర్లు జరిగేవి కావు. ఒక వర్గానికి కొమ్ము కాస్తున్న వారిని పక్కన పెట్టాలని ఎన్నికల కమిషన్ను కోరుతున్నాం. కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు అన్ని ప్రాంతాల్లోనూ గెలుస్తాం. జగన్ పాలనలో లబ్ధి పొందని వర్గాలు, న్యాయం జరగని కుటుంబం అంటూ ఏమీ లేవు. అందరికీ మేలు చేసినందునే భారీ సీట్లతో గెలవబోతున్నాం’’ అని సజ్జల ధీమా వ్యక్తం చేశారు. -
అ‘ధిక్కారుల’పై ఈసీ వేటు
నరసరావుపేట: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పల్నాడు జిల్లాలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. దీనికి బాధ్యులుగా పరిగణిస్తూ కలెక్టర్ ఎల్.శివశంకర్ను బదిలీ, ఎస్పీ జి.బిందుమాధవ్ను సస్పెండ్ చేస్తూ గురువారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. శాంతిభద్రతలు అదుపుతప్పడంపై విచారణకు ఆదేశించింది. కలెక్టర్ శివశంకర్ రెండేళ్ల నుంచి జిల్లాలో పనిచేస్తుండగా ఎన్నికలకు ముందే ఈసీ నియమించిన బిందు మాధవ్ అప్పుడే సస్పెండ్ కావటం గమనార్హం. ఎన్నికల ముందు వరకు సమర్థంగా జిల్లాను నడిపించిన ఎస్పీ వై.రవిశంకర్రెడ్డిని టీడీపీ నాయకుల ఫిర్యాదు మేరకు ఈసీ తప్పించింది. బిందుమాధవ్ను ఎస్పీగా నియమించింది. పోలింగ్ రోజున మాచర్ల, గురజాల, నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో టీడీపీ నాయకులు యథేచ్ఛగా హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నా నిలువరించలేకపోవటం, వైఎస్సార్ సీపీ అభ్యర్థులు చేసిన ఫోన్లకు కలెక్టర్, ఎస్పీ స్పందించలేదనే విమర్శలు ఈసీ వరకు వెళ్లాయి. దీంతో చర్యలకు ఉపక్రమించింది. అధికార యంత్రాంగం పూర్తిగా విఫలం పల్నాడు జిల్లాలో ఎన్నికలను సజావుగా నిర్వహించడంలో అధికారయంత్రాంగం పూర్తిగా విఫలమైంది. నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై టీడీపీ వర్గీయులు దాడి చేయటంపై ఎమ్మెల్యేతోపాటు ఎంపీ అభ్యర్థి డాక్టర్ పి.అనిల్కుమార్ యాదవ్ పలుమార్లు కలెక్టర్, ఎస్పీలకు ఫోన్ చేసినా స్పందించలేదు. వారు టీడీపీ నాయకులపై ఉదారంగా వ్యవహరించటంతో వారు రెచ్చిపోయి హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు. నరసరావుపేటలోని మున్సిపల్ బాలికోన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రం ఏజెంట్లుగా కూర్చున్న వైఎస్సార్సీపీ నాయకులపై టీడీపీ అభ్యర్థి డాక్టర్ చదలవాడ అరవిందబాబు, అతని అనుయాయులు దాడిచేసి బయటకు లాగి కొట్టినా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ఆ సమీపంలో ఉన్న ఎమ్మెల్యే డ్రైవర్ను టీడీపీ నేతలు చితక బాదారు. ఎమ్మెల్యే గోపిరెడ్డిని మధ్యాహ్నం రెండు గంటలకే హౌస్ అరెస్టుచేసిన పోలీసులు టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ చదలవాడలు యథేచ్ఛగా పోలింగ్ కేంద్రాల్లోకి చొరబడినా పోలీసులు చోద్యం చూస్తూ ఉండిపోయారు. మాచర్ల నియోజకవర్గంలో పోలీసులు మరీ విచ్రితంగా వ్యవహరించారు. సమస్యాత్మకంగా లేకపోయినా వైఎస్సార్సీపీ సానుకూల గ్రామాలకు రెంటికి ప్రత్యేకంగా డీఎస్పీని నియమించి పోలింగ్ నిర్వహించారు. సమస్యాత్మక మండలంగా పేరుగాంచిన కారెంపూడి మండలంలో సరైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయలేదు. ఏడెనిమిది గ్రామాల్లో టీడీపీ నేతలు రిగ్గింగ్ చేసుకునేందుకు అవకాశం కల్పించారనే విమర్శలు పోలీసులపై వెల్లువెత్తాయి. ఎన్నికల మరుసటిరోజు గొడ్డళ్లు, రాడ్లు, మారణాయుధాలతో చుట్టుప్రక్కల గ్రామాల నుంచి పచ్చమూకలు కారెంపూడికి వచ్చి వైఎస్సార్ సీపీ వర్గీయులపై దాడులు చేస్తున్నా పోలీసులు నిలువరించలేకపోయారు. ఎన్నికల ప్రచారానికి వెళ్లిన మాచర్ల ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి భార్యపై దాడినీ పోలీసులు ఆపలేకపోయారు. మంత్రి అంబటి రాంబాబుకు ఒక సీఐ రివాల్వర్ గురిపెట్టాడంటే ఆ ధైర్యం అతనికి ఎస్పీ నుంచే వచ్చిందనే వాదన వినపడుతోంది. గురజాలలోని కొత్తగణేశునిపాడులో బీసీ వర్గాలను పలుకరించేందుకు వెళ్లిన పి.అనిల్, కాసు మహేష్రెడ్డిలపై టీడీపీ వర్గీయులు దాడులకు తెగబడడం కూడా పోలీసుల ఉదాసీనతకు నిదర్శనంగా ఉంది. ఎన్నికల ముగిసి నాలుగు రోజులు గడుస్తున్నా ఇంకా జిల్లాలో 144 సెక్షన్ అమలులో ఉండడం విస్మయం కలిగిస్తోంది. దీంతో వీటిన్నింటికీ కలెక్టర్, ఎస్పీలే బాధ్యులని నిర్ణయానికొచ్చిన ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. వీరితోపాటు గురజాల డీఎస్పీ పల్లపురాజు, నరసరావుపేట డీఎస్పీ వర్మ, ఇద్దరు స్పెషల్ బ్రాంచ్ సీఐలు, కారంపూడి, నాగార్జునసాగర్ ఎస్ఐలపైనా ఈసీ వేటు వేసింది. పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ బదిలీ ఎస్పీ బిందుమాధవ్ సస్పెన్షన్ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు -
No Headline
గుంటూరు ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఏపీ ఈఏపీ సెట్–2024) గురువారం ప్రారంభమైంది. గుంటూరు, పల్నాడు జిల్లాల పరిధిలోని తొమ్మిది పరీక్ష కేంద్రాల్లో ఉదయం, మధ్యాహ్నం రెండు విడతలుగా జరిగిన అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలకు విద్యార్థులు హాజరయ్యారు. ఆయా పరీక్ష కేంద్రాల పరిధిలో శుక్రవారం వరకు జరగనున్న కంప్యూటర్ బేస్డ్ పరీక్షలకు దాదాపు ఐదు వేల మంది విద్యార్థులు హాజరవుతున్నారు. గుంటూరు జిల్లాలో ఏడు కేంద్రాలతో పాటు పల్నాడులోని రెండు కేంద్రాల్లో పరీక్షలు సజావుగా జరిగాయి. వివిధ ఇంజినీరింగ్ కళాశాలల్లోని కంప్యూటర్ ల్యాబ్లలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్దేశించిన నియమ, నిబంధనలకు అనుగుణంగా పరీక్షలు నిర్వహించారు. పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఆయా పరీక్ష కేంద్రాల పరిధిలో ప్రతి సెషన్ ఆన్లైన్ పరీక్షకు 100 నుంచి 200 మంది విద్యార్థుల చొప్పున కేటాయించారు. ఈనెల 18 నుంచి 23 వరకు ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు ప్రారంభం జరగనున్నాయి. ఓట్ల లెక్కింపునకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి కలెక్టర్ వేణుగోపాల్రెడ్డి గుంటూరు వెస్ట్: జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలను అనుసరించి పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎం.వేణుగోపాల్రెడ్డి తెలిపారు. గురువారం కలెక్టరేట్లో అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో వచ్చే నెల 4న జరగనున్న ఓట్ల లెక్కింపుపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా టేబుల్స్ వేయించడం, సీసీ కెమేరాల ఏర్పాటు, బారికేడ్లు, విద్యుత్, మౌలిక సదుపాయాల కల్పనపై అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. రిటర్నింగ్ అధికారులు ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పరిశీలించి లోపాలను సరిచేయాలని ఆదేశించారు. సిబ్బంది వివరాలతోపాటు కంప్యూటర్లు, నెట్ తదితర సాంకేతిక అంశాలనూ తనిఖీ చేసుకోవాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ జి.రాజకుమారి, జీఎంసీ కమిషనర్ కీర్తి చేకూరి, తెనాలి సబ్ కలెక్టర్ ప్రఖార్ జైన్, డీఆర్వో పెద్ది రోజా, జీఎంసీ అడిషనల్ కమీషనర్ కె.రాజ్యలక్ష్మి, గుంటూరు ఆర్డీఓ పి.శ్రీకర్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. సాక్షి భావనారాయణస్వామి బ్రహ్మోత్సవాలు పొన్నూరు: పట్టణంలోని సుందరవల్లీ రాజ్యలక్ష్మీ సమేత సాక్షి భావనారాయణస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. గురువారం ఉదయం పెండ్లి కుమారుని ఉత్సవం, స్వామికి పంచామృత స్నపన తిరువంజనోత్సవం, సాయంత్రం విష్ణు సహస్రనామ పారాయణ సంఘం నిర్వహణలో విష్ణు సహస్రనామ పారాయణం, రాత్రి శేష వాహనంపై స్వామి గ్రామోత్సవం నిర్వహించారు. ఉత్సవ కార్యక్రమాలను ఆలయ సహాయ కమిషనర్ మండెపూడి పానకాలరావు పర్యవేక్షించారు. -
అదుపులోకి వస్తున్న శాంతి భద్రతలు
● వైఎస్సార్ సీపీ నేతపై హత్యాయత్నానికి ఉపయోగించిన కారు స్వాధీనం ● కేసానుపల్లిలో పోలీసు కవాతు ● వైఎస్సార్ సీపీ నాయకులపై దాడులకు పథక రచన ● జిల్లాలో కొనసాగుతున్న 144 సెక్షన్ ● బిక్కుబిక్కుమంటున్న ప్రజలు పల్నాడులో తెలుగుదేశం పార్టీ అరాచకాలు ఆగడం లేదు. వైఎస్సార్ సీపీ నేతలు లక్ష్యంగా దాడులు చేసేందుకు వ్యూహరచనలు చేస్తూనే ఉంది. దీంతో జిల్లా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. నాదెండ్ల మండలం అప్పాపురంలో వైఎస్సార్ సీపీ నాయకుడు, మాజీ ఎంపీపీ కె.సాంబశివరావుపై హత్యాయత్నం సంఘటన జిల్లాలో సంచలనం సృష్టించింది. ఈ సంఘటనలో టీడీపీ వర్గీయులు ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో 144 సెక్షన్ గురువారం కూడా కొనసాగింది. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు పోలీసులు పెద్ద ఎత్తున బలగాలను రంగంలోకి దించారు. గ్రామాల్లో కవాతు నిర్వహించి ప్రజల్లో ధైర్యం నెలకొల్పుతున్నారు. – సాక్షి నెట్వర్క్రెండవ రోజూ 144 సెక్షన్ అమలుపల్నాట భయం.. భయంకారెంపూడి: మండలంలో శాంతి భద్రతలు అదుపులోకి వస్తున్నాయి. రెండో రోజైన గురువారం కూడా 144 సెక్షన్ను పోలీసులు పటిష్టంగా అమలు చేశారు. కారెంపూడిలోని ప్రధాన కూడళ్లలో చెక్పోస్టులు ఏర్పాటు చేసి వాహనాల తనిఖీ చేస్తున్నారు. పోలీసు అధికారుల బృందాలు సీఆర్పీఎఫ్ బలగాలతో కలసి మండలంలోని ప్రతి గ్రామంలో తిరుగుతూ శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నారు. ఉదయం గంట సమయం మాత్రమే దుకాణాలు తెరిచారు. ఆ సమయంలో ప్రజలు అవసరమైన నిత్యావసరాలు కొనుగోలు చేశారు. ఆ తర్వాత మళ్లీ షాపులన్నింటిని వ్యాపారులు మూసివేశారు. ముగ్గురు కంటే ఎక్కువ మంది కన్పించకుండా భద్రతా బలగాలు చర్యలు తీసుకున్నాయి. దాదాపు ప్రజలంతా ఇళ్లకే పరిమితయ్యారు. అత్యవసర సమయంలో తప్ప ఎవరూ బయటకు రాలేదు. పోలీస్ శాఖ చర్యలతో ఉద్రిక్తతలు కూడా తగ్గుముఖం పట్టాయి. దౌర్జన్యాలు, దాడులకు పాల్పడిన వారు గ్రామాలు వదలి పారిపోయారు. ఇదిలా ఉంటే పల్నాడు జిల్లా కలెక్టర్ ఎల్ శివశంకర్ ఎప్పటికప్పుడు పోలీస్, రెవెన్యూ అధికారుల ద్వారా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సాధారణ పౌర జీవనం పునరుద్ధరణ జరిగేలా ఎస్పీ జి బిందుమాధవ్ ఆధ్వర్యంలో పలువురు డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐల పర్యవేక్షణలో వందలాది పోలీస్, పారా మిలటరీ బలగాలు శ్రమిస్తున్నాయి. ఎప్పుడూ లేని విధంగా సామూహిక దాడులతో కారెంపూడి తీవ్రంగా కలవర పడిన నేపథ్యంలో పరిస్థితిని అధికారులు చక్కదిద్దుతున్నారు. ఇదిలా ఉంటే మరో వైపు దాడులకు పాల్పడి ఆస్తి నష్టాలకు పాల్పడిన వారిని, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన వారిని గుర్తించి పట్టుకుని అరెస్టు చేసేందుకు పోలీస్ అధికారులు ముమ్మరంగా గాలిస్తున్నారు. -
శిక్షణలో నేర్పించే అంశాలు
● త్రెడ్డింగ్ ● వ్యాక్స్ ● పెడిక్యూర్ ● మెనిక్యూర్ ● బ్లీచింగ్ ● స్కిన్కేర్ ● హెయిర్ ఫాల్ ట్రీట్మెంట్ ● హెయిర్ కేర్ ● వైట్నింగ్ ఫేస్ ప్యాక్స్ ● డ్యాండ్రఫ్ ట్రీట్మెంట్ ● హెయిర్ కట్స్ ● హెయిర్ స్టైల్ ● హెన్నా ప్రిపరేషన్ ● డై అప్లికేషన్ ● ఒబెసిటీ అండ్ న్యూట్రిషియన్ డైట్ ● బ్రైడల్ మేకప్స్ ● హెయిర్ మసాజ్ ● కమ్యూనికేషన్ అండ్ గ్రూమింగ్ ● ఫేషియల్స్ ● యాంటీ యేజింగ్ థర్మో హెర్బ్ ఫేషియల్స్. -
కొనసాగుతున్న 144 సెక్షన్
పిడుగురాళ్ల: సార్వత్రిక ఎన్నికల వేళ పల్నాడు ప్రాంతంలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో పోలీసు శాఖ 144 సెక్షన్ విధించింది. గురువారం కూడా పిడుగురాళ్ల పట్టణంలోని ప్రధాన రహదారిలో ఉన్న వ్యాపార సముదాయాలన్నీ మూతపడ్డాయి. ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. వీధులన్నీ బోసిపోయాయి. అత్యవసరమైతేనే ప్రజలు కూడా ప్రయాణాలు కొనసాగించారు. మొత్తం మీద 144 సెక్షన్ కారణంగా వాతావరణం ప్రశాంతంగా మారింది. గురజాల: గురజాల పట్టణంలో ఎటువంటి అల్లర్లు జరగకుండా పోలీస్ అధికారులు తగు చర్యలు చేపట్టారు. గ్రామ పురవీధులు నిర్మానుష్యంగా దర్శనమిచ్చాయి. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాలు 144 సెక్షన్ కారణంగా ఖాళీగా కనిపించాయి. దుకాణాలను వ్యాపారస్తులు స్వచ్ఛందంగా మూసివేశారు. సీఐ టి బాలకృష్ణ ఆదేశాల మేరకు ఎస్ఐలు 144 సెక్షన్ అమలు జరిగేలా చర్యలు చేపట్టారు. అమరావతి: అమరావతిలో గురువారం కూడా దుకాణాలను మూయించి మెయిన్ బజార్లో పోలీసు పహారా కాస్తున్నారు. సీఐ ఏవీ బ్రహ్మం మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 144వ సెక్షన్ అమలు చేస్తున్నామని ప్రజలంతా సహకరించాలని కోరారు. నరసరావుపేటటౌన్: పట్టణంలో 144 సెక్షన్ గురువారం కొనసాగింది. 144 సెక్షన్ కారణంగా పట్టణంలోని ప్రధాన వీధుల్లోని దుకాణాలు మూసివేశారు. వ్యాపారస్తులు తమ దుకాణాలను స్వచ్ఛందంగా మూశారు. సినిమా థియేటర్లలో ప్రదర్శనలు నిలిపివేశారు. పరిస్థితులు అదుపులోకి వచ్చినప్పటికీ మరో రెండురోజులు 144 సెక్షన్ అమల్లో నే ఉంచాలని పోలీసులు భావిస్తున్నారు. వ్యాపారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని దుకాణాలకు సమయపాలన విధించి నిర్వహించుకునేలా రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం భావిస్తుంది. సత్తెనపల్లి: పట్టణంలో చేపట్టిన 144 సెక్షన్ రెండవ రోజు గురువారం కూడా కొనసాగింది. పట్టణంలో పలు దుకా ణాలను మూసివేశారు.144 సెక్షన్ నిబంధనలకు విరుద్దంగా రోడ్లపై తిరగడం, నలుగురు కంటే మించి గుంపులుగా ఉన్న వారికి పోలీసులు హెచ్చరికలు చేస్తున్నారు. 144 సెక్షన్ నిబంధనలు అతిక్రమించిన 35 మందిపై గురువారం కేసులు నమోదు చేశారు. నిబంధనలు అతిక్రమించిన 18 మందిపై పట్టణ ఎస్ఐ ఎం సంధ్యారాణి, 17 మందిపై పట్టణ ఎస్ఐ ఎం సత్యనారాయణ కేసులు నమోదు చేశారు. ఎక్కడైనా ఘర్షణలకు పాల్పడినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రెంటచింతల: రెంటచింతల మండలంలో గురువారం కూడా 144సెక్షన్ కొనసాగింది. దుకాణాలు, హోటల్స్ ఇతర వ్యాపార సంస్థలను పోలీసులు మూయించారు. ఎన్నికల రోజున ఘర్షణ జరిగిన రెంటచింతల, రెంటాల, పాలవాయి గేటు, తుమృకోట, గోలి, జెట్టిపాలెం గ్రామాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు పికెట్ ఏర్పాటు చేశారు. పాలవాయి గేటు, తుమృకోట, జెట్టిపాలెం గ్రామాలలో ఈవీఎంలు పగలగొట్టిన కేసులోని నిందితులకు ఘర్షణలకు పాల్పడిన వైఎస్సార్ సీపీ, టీడీపీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరందరికీ 41(ఎ) నోటీసులు జారీ చేస్తున్నారు. కొందరు నేతలు గ్రామాలు విడిచి రహస్య ప్రాంతాలకు తరలిపోయారు. తెరుచుకొని దుకాణాలు ఇళ్లకే పరిమితమైన ప్రజలు -
దాడికి ఉపయోగించిన కారు స్వాధీనం
నాదెండ్ల: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై టీడీపీ వర్గీయులు హత్యాయత్నానికి వినియోగించిన కారును గురువారం నాదెండ్ల పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈనెల 13న జరిగిన సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం అప్పాపురం గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ మండల ఉపాధ్యక్షుడు కోయలమూడి సాంబశివరావుపై దాడి చేసేందుకు టీడీపీ వర్గీయులు కర్రలు, కత్తులతో వెంటపడ్డారు. సాంబశివరావు ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీసి ఓ ఇంట్లో దాక్కున్నాడు. ఇతన్ని కారులో వెంబడించారు. ఈ క్రమంలో కారు సైడు కాల్వలో దిగబడి ముందుకు కదలకపోవటంతో వారు వెనుదిరిగారు. పోలింగ్ జరిగిన రోజున గ్రామంలోని ఎస్సీ వర్గీయులు 12,13 పోలింగ్ బూత్ల్లో తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తీరారు. సాయంత్రం 6 గంటలైనా ఓటేసేందుకు క్యూలో నిల్చుని రాత్రి సమయం వరకూ వేచి ఉండి ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎస్సీ వర్గీయులకు అండగా నిలబడిన సాంబశివరావుపై కక్ష కట్టిన టీడీపీ వర్గీయులు అదనుచూసి దాడికి యత్నించారు. తృటిలో ప్రాణాలు కాపాడుకోవటంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. దాడికి వినియోగించిన కారును గురువారం పోలీసులు స్వాధీనం చేసుకుని వివరాలు పరిశీలించగా, కారు గ్రామానికి చెందిన నీలకంఠం అనే వ్యక్తిదిగా గుర్తించారు. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వైఎస్సార్సీపీ నాయకులు సాంబశివరావు తనపై దాడికి యత్నించిన 22 మంది టీడీపీ వర్గీయులపై ఫిర్యాదు చేయటంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
స్ట్రాంగ్రూమ్ను పరిశీలించిన కలెక్టర్
నరసరావుపేటరూరల్: కాకాని జేఎన్టీయూఎన్ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్రూమ్ను జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి గురువారం పరిశీలించారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాలకు చెందిన ఈవీఎం యంత్రాలను ఇక్కడే స్ట్రాంగ్రూమ్లో భద్రపరిచారు. స్ట్రాంగ్రూమ్ వద్ద భద్రతను పరిశీలించి సూచనలు చేశారు. స్ట్రాంగ్రూమ్ వద్ద పటిష్ట భద్రతా చర్యలు తీసుకుంటున్నట్టు కలెక్టర్ తెలిపారు. కూల్డ్రింక్ షాపు దహనం నరసరావుపేటరూరల్: వైఎస్సార్ సీపీ సానుభూతిపరుడికి చెందిన కూల్డ్రింక్ షాపును బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దహనం చేశారు. బాధితుడు తెలిపిన వివరాలు మండలంలోని పాలపాడుకు చెందిన పచ్చి సురేష్ పాలపాడు రోడ్డులో కూల్డ్రింక్ షాపు నిర్వహిస్తున్నాడు. బుధవారం అర్ధరాత్రి దుకాణంపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టడంతో పూర్తిగా దగ్ధమయింది. దుకాణంలోని రెండు ఫ్రిజ్లతోపాటు సామాగ్రి పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. రూరల్ ఎస్ఐ బాలకృష్ణ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధితుడి నుంచి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు రూరల్ పోలీసులు తెలిపారు. దోమల నివారణ– నియంత్రణ అందరి బాధ్యత జాతీయ డెంగీ దినోత్సవం సందర్భంగా ర్యాలీ నరసరావుపేట: దోమల నివారణ, నియంత్రణ ప్రతి ఒక్కరి బాధ్యత కావాలని జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి.రవి పేర్కొన్నారు. గురువారం జాతీయ డెంగీ దినోత్సవం సందర్భంగా పల్నాడు రోడ్డులోని జిల్లా కార్యాలయ ఆవరణలో ఆశాలు, ఏఎన్ఎంలతో ర్యాలీ చేసి ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉంచకుండా చేసుకోవటం ద్వారా చికెన్గున్యా, డెంగీ, మలేరియా, పైలేరియా, మెదడువాపు లాంటి జబ్బులను నివారించవచ్చన్నారు. దోమలు వ్యాప్తి చెందకుండా ప్రతి శుక్రవారం డ్రైడే పాటించాలన్నారు. ప్రతి ఒక్కరూ దోమతెరలు వాడుతూ పొడవాటి దుస్తులు ధరించటం, మస్కిటో రెఫెల్లెంట్లు వాడటం ద్వారా దోమలను నివారించవచ్చు అన్నారు. ఈసందర్భంగా నిర్వహించిన ర్యాలీలో చిన్న దోమ–పెనుప్రమాదం, దోమ పుట్టరాదు–కుట్టరాదు, దోమతెరలు వాడండి–దోమకాటును నివారించండి, చేయి చేయి కలుపుదాం–డెంగీ వ్యాధిని నివారిద్దాం, నీటి తెట్లపై మూత–దోమల పెరుగుదలకు కోత అనే ప్లకార్డులను ప్రదర్శిస్తూ కొనసాగారు. కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి డాక్టర్ రత్నాకరం రాము, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
సమస్యాత్మక గ్రామాల్లో ప్రత్యేక బలగాలు
దాచేపల్లి: సమస్యాత్మక గ్రామాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని సీఐ ఎ. సురేంద్రబాబు చెప్పారు. మండలంలో సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించిన కేసానుపల్లి, నడికుడి, మాదినపాడు, తంగెడలో గురువారం కవాతు నిర్వహించారు. ప్రత్యేక పోలీస్ బలగాలతో గ్రామాల్లో కవాతు చేపట్టి ప్రజలతో మాట్లాడారు. ఎన్నికలు ముగిసిన తర్వాత పలు గ్రామాల్లో జరిగిన ఘటనలు దృష్టిలో పెట్టుకుని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రత్యేక బలగాలను గ్రామాల్లోనే ఉంచుతున్నామని ఆయన చెప్పారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన, ఇతరుల పట్ల దురుసుగా ప్రవర్తించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్ఐలు దాసరి శివనాగరాజు, జీ.సంధ్యారాణి తదితరులున్నారు. -
కొత్త సిలబస్పై శిక్షణను వినియోగించుకోవాలి
గుంటూరు ఎడ్యుకేషన్: వచ్చే విద్యాసంవత్సరం నుంచి సీబీఎస్ఈ సిలబస్లో రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెస్తున్న పదో తరగతి నూతన పాఠ్యాంశాలపై ఈనెల 19న నిర్వహిస్తున్న ఓరియెంటేషన్ కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు పేర్కొన్నారు. జన విజ్ఞానవేదిక ఆధ్వర్యంలో లాంలోని చలపతి ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్న ఓరియెంటేషన్కు సంబంధించిన పోస్టర్లను గురువారం బ్రాడీపేటలోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా లక్ష్మణరావు మాట్లాడుతూ ఫిజికల్ సైన్స్, బయాలాజికల్ సైన్స్, సోషల్ స్టడీస్తో పాటు ఇంగ్లిషు సబ్జెక్టుల పాఠ్య పుస్తకాలపై నిష్ణాతులైన ఉపాధ్యాయులతో శిక్షణ ఇవ్వనున్నట్టు వివరించారు. పేర్లు నమోదు చేసుకునేందుకు 99480 15701 నంబర్లో సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో జనవిజ్ఞానవేదిక ప్రతినిధులు టీఆర్ రమేష్, బి.ప్రసాద్, జి. వెంకటరావు, టీఆర్ చాందిని, జీవీవీ సుబ్బారాయుడు, బి.ఉదయభాస్కర్, బి.శంకర్సింగ్, ఎం.ఉదయభాస్కర్, ఎస్ఎం సుభానీ, ఇ.అనిల్కుమార్ పాల్గొన్నారు. -
సమాజ చైతన్య గీతికలు నాటికలు
తెనాలి: కొలంకపురి నాటక కళాపరిషత్, కొలకలూరు, వైకే నాటక కళాపరిషత్, హైదరాబాద్ సంయుక్త ఆధ్వర్యంలో కొలకలూరులో దశమ రాష్ట్రస్థాయి ఆహ్వాన నాటికల పోటీలు గురువారం రాత్రి అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజున ప్రదర్శించిన రెండు నాటికలు సమాజ చైతన్య గీతికలు అనిపించుకున్నాయి. తొలి ప్రదర్శన రైతుల ప్రాధాన్యాన్ని చాటిచెబితే, రెండో నాటిక నేటి సమాజంలో యువత పాత్రను ప్రస్తావించింది. తొలుత ప్రదర్శితమైన కళాంజలి, హైదరాబాద్ వారి ‘రైతే రాజు’ కర్షకుల సంక్షేమాన్ని కాంక్షించింది. కంచర్ల సూర్యప్రకాష్ రచించిన ఈ నాటికకు కొల్లా రాధాకృష్ణ దర్శకత్వం వహించారు. సభానంతరం ఉషోదయ కళానికేతన్, కట్రపాడు వారి ‘విముక్తి’ నాటికను ప్రదర్శించారు. యువత గంజాయి, ఇతర మత్తుపదార్థాలకు అలవాటుపడి జీవితాలను నాశనం చేసుకుంటున్న ఇతివృత్తంతో ఇది రూపొందింది. రచయిత చెరుకూరి సాంబశివరావు దర్శకత్వంలోనే ప్రదర్శితమైంది. నరసయ్య పాత్రలోనూ ఆయన కనిపించారు. జనాబ్ ఎండీ ఖాజావలికి సవ్యసాచి అవార్డు గ్రామంలోని చిన్న రథశాల వద్ద నాలుగురోజులపాటు జరిగే నాటికల పోటీల ప్రారంభోత్సవంలో కారంపూడి వెంకట్రావు, వైకే నాటక కళాపరిషత్ అధినేత బొప్పన నరసింహారావు జ్యోతిప్రజ్వలన చేశారు. ప్రారంభ సభకు అధ్యక్షత వహించిన పరిషత్ గౌరవాధ్యక్షుడు వైఎస్కేఎస్ స్వామి మాట్లాడుతూ కళాసాహిత్య రంగాల్లో విలసిల్లిన కొలకలూరులో ఆ కళా వారసత్వాన్ని కొనసాగించడం అభినందనీయమన్నారు. కొలంకపురి నాటక కళాపరిషత్ పదేళ్లుగా పరిషత్ నాటిక పోటీలను నిర్వహించడం ప్రశంసనీయమని పేర్కొన్నారు. అనంతరం ప్రముఖ నటుడు, దర్శకుడు కరణం సురేష్ జ్ఞాపకార్థం ఏటా ప్రదానం చేస్తున్న సవ్యసాచి అవార్డును ఏలూరుకు చెందిన నటుడు, దర్శకుడు జనాబ్ ఎండీ ఖాజావలికి ప్రదానం చేశారు. యడ్లపాడుకు చెందిన రంగస్థల నటుడు డాక్టర్ ముత్తవరపు సురేష్బాబు, నాటక రచయిత పిన్నమనేని మృత్యుంజయరావులకు ఆత్మీయ సత్కారం చేశారు. కార్యక్రమంలో లంకా లక్ష్మీనారాయణ, జాగర్లమూడి శ్రీనివాస్ మాట్లాడారు. పరిషత్ అధ్యక్షుడు గోపరాజు రమణ, కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
డెంగీపై అవగాహన ర్యాలీ
గుంటూరు మెడికల్: జాతీయ డెంగీ దినం సందర్భంగా ఆ వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో గురువారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ముత్యాల రెడ్డి నగర్లోని పట్టణ ఆరోగ్య కేంద్రం వద్ద ప్రదర్శనను డీఎంహెచ్ఓ డాక్టర్ కె.విజయలక్ష్మి జెండా ఊపి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ డెంగీ రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు. పరిసరాల పరిశుభ్రతతో దోమల నివారణ సాధ్యమవుతుందన్నారు. అందరూ దోమతెరలు వాడాలని సూచించారు. అనంతరం పట్టణ ఆరోగ్య కేంద్రంలో అడల్ట్ బీసీజీ వ్యాక్సినేషన్ను ప్రారంభించారు. 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ టీ.బీ.విన్ పోర్టల్లో తమ పేరు నమోదు చేసుకుని వ్యాక్సిన్ తీసుకోవచ్చని పేర్కొన్నారు. ప్రతి గురువారం ఈ వ్యాక్సిన్ను సచివాలయంలో అందుబాటులో ఉంచుతున్నట్టు వెల్లడించారు. కార్యక్రమంలో డాక్టర్ కె.వి.సుబ్బరాజు, సుబ్బరాయనన్, డాక్టర్ లక్ష్మా నాయక్, డాక్టర్ ప్రవీణ, రాజు నాయక్, ఘం టసాల శ్రీనివాసరావు, గణేష్, సూపర్వైజర్లు సుబ్బారెడ్డి, శాస్త్రి, మల్లికార్జున రావు, ఆరోగ్య కార్యకర్తలు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. -
రెండు వర్గాల ఘర్షణ.. 12 మంది అరెస్టు
గుంటూరు ఈస్ట్: రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగిన నేపథ్యంలో గాయపడిన బాధితుడి ఫిర్యాదు మేరకు గురువారం నగరంపాలెం పోలీసులు 12 మందిని అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. కేవీపీ కాలనీలో పాత కక్షల నేపథ్యంలో మంగళవారం కొందరు పరస్పర దాడి చేసుకున్నారు. ఘర్షణలో షేక్ మునాఫ్ తీవ్రంగా గాయపడ్డాడు. మునాఫ్ ఫిర్యాదు మేరకు పోలీసులు బండారు ప్రభు, కారసాల కోటేశ్వరరావు, బత్తుల అశోక్, మరో తొమ్మిది మందిని అరెస్టు చేశారు. నిడుముక్కల సర్పంచ్పై దాడి చేసిన 11 మందిపై అట్రాసిటీ కేసు తాడికొండ: తాడికొండ మండలం నిడుముక్కల సర్పంచ్ మాదాసు రత్నకుమారిని కులం పేరుతో దూషించి ఆమె, ఆమె సామాజిక వర్గంపై దాడిచేసిన ఘటనలో టీడీపీ వార్డు మెంబర్ నాగ స్వరూపతోపాటు మరో 10 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు సీఐ సీహెచ్ ప్రభాకర్ తెలిపారు. అలాగే తనపై దాడి జరిగిందంటూ నాగ స్వరూప ఇచ్చిన ఫిర్యాదు మేరకు 22 మందిపై కేసు నమోదు చేసినట్లు సీఐ వివరించారు. డివైడర్ను ఢీకొట్టిన కారు అద్దంకి: కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందారు. ఈ సంఘటన మండలంలోని అద్దంకి–నార్కెట్పల్లి రాష్ట్రీయ రహదారిలోని చక్రాయపాలెం గ్రామ సమీపంలో గురువారం జరిగింది. వివరాల్లోకి వెళితే..హైదరాబాద్లోని కొండాపూర్కు చెందిన భానూ శరత్శర్మ ఒంగోలులోని స్నేహితుడ్ని కలిసేందుకు కారులో ఒంగోలు బయలుదేరారు. మండలంలోని చక్రాయపాలెం గ్రామ సమీపంలోకి రాగానే అదుపుతప్పి రోడ్డు పక్కనున్న దిమ్మెలను ఢీకొట్టడంతో కారు గాల్లోకి లేచి, పొలాల్లోకి పల్టీలు కొట్టింది. ప్రమాదంలో భానూ శరత్శర్మకు తీవ్ర గాయాలయ్యాయి. అతడ్ని ఒంగోలులోని వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స చెందుతూ మృతి చెందాడు. బంధువుల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్షయ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషియడ్లపాడు: వచ్చే ఏడాది నాటికి క్షయ (టీబీ)వ్యాధి రహిత రాష్ట్రంగా చేయాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించేందుకు జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆరోగ్య కేంద్రాల్లో బీసీజీ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె అర్జునరావు పిలుపునిచ్చారు. యడ్లపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. పీహెచ్సీలోని అన్ని వ్యాక్సిన్ల నిల్వలను పరిశీలించారు. అవి సరిపడా ఉన్నాయా లేదా..అనే విషయాలపై ఆరా తీశారు. అక్కడ నుంచి వంకాయలపాడు గ్రామంలోని ఆరోగ్య ఉపకేంద్రాన్ని సందర్శించారు. స్థానిక ప్రజలను కలిసి క్షయ వ్యాధి లక్షణాలు, వాటి నిర్మూలనకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బీసీజీ వ్యాక్సిన్ ప్రయోజనాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. 18–60 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన వారు, ఐదేళ్లలో క్షయ వ్యాధికి గురైన వ్యాధిగ్రస్తుల కుటుంబీకులను బాడీమాస్ ఇండెక్స్ తక్కువగా ఉన్న, పొగత్రాగడం అలవాటు కల, మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఈ వ్యాక్సిన్లు వేస్తున్నట్లు వెల్లడించారు. మండల పరిధిలో 464 మందికి బీసీజీ వ్యాక్సిన్లు వేసేందుకు అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. 16వ తేదీ నుంచి వ్యాక్సిన్లు వేయడం జరుగుతుందన్నారు. 2025 నాటికి పూర్తిగా క్షయవ్యాధిని నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పల్నాడు జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ బి గీతాంజలి, యడ్లపాడు పీహెచ్సీ వైద్యాధికారి ఎం ప్రభాకరరావు, డాక్టర్ బి భరద్వాజ, సీహెచ్వో ఎస్ పున్నారావు, సూపర్వైజర్లు వి రాజశేఖర్, బి గంగానమ్మ, ఆరోగ్య పర్యవేక్షకులు, ఆరోగ్య సిబ్బంది ఉన్నారు. భట్టిప్రోలు మండలంలో భారీ వర్షం భట్టిప్రోలు: మండలంలో గురువారం ఉదయం నుంచి వాతావరణంలో నెలకొన్న అనూహ్య మార్పుతో భారీ వర్షం కురిసింది. తీవ్రమైన ఎండల నుంచి ప్రజలు ఉపశమనం పొందారు. వాతావరణం చల్లబడటంతో ఊపిరి పీల్చుకున్నారు. వర్షంతో రహదారులు జలమయమయ్యాయి. రైతులు సాగుకు సన్నాహాలు చేస్తున్నారు. వర్షాలకు కృష్ణానదీ పఈవాహక లంక గ్రామాల్లోని వాణిజ్య పంటలకు కొంత మేర నష్టం వాటిల్లింది. మునగ చెట్లు నేల వాలాయి. మామిడి, సపోట తోటల్లో పక్వానికి వచ్చిన కాయలు కూడా నేల రాలాయి. అయితే ఇటీవల నాటిన అరటి పిలకలతో పాటు బొప్పాయి, తమలపాకు, కూరగాయలు, ఆకు కూరల పంటలకు వర్షం జీవం పోసింది. రోహిణీకార్తె రాక ముందే పరిస్థితి ఇలా ఉంటే.. రానున్న రోజుల్లో ఎండ తీవ్రంగా ఉంటుందా ? అనే సందిగ్ధంలో ప్రజలున్నారు. చెల్లని చెక్కు కేసులో ఏడాది జైలు నరసరావుపేట టౌన్: చెల్లని చెక్కు కేసులో నిందితురాలికి ఏడాది జైలు శిక్ష విధిస్తూ మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి టి.ప్రవల్లిక గురువారం తీర్పు చెప్పారు. బరంపేటకు చెందిన గొట్టిపాటి చంద్రమౌళి వద్ద చిలకలూరిపేటకు చెందిన షేక్ నాగూర్బీ 2020 అక్టోబర్ 10వ తేదీన రూ.5 లక్షలు అప్పుగా తీసుకుంది. చెల్లింపులో భాగంగా ఇచ్చిన చెక్కు చెల్లకపోవటంతో బాధితుడు కోర్టును ఆశ్రయించాడు. నేరం రుజువు కావటంతో న్యాయమూర్తి నిందితురాలికి ఏడాది జైలు శిక్షతోపాటు ఫిర్యాదుదారుడికి రూ.7.5 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని తీర్పులో పేర్కొన్నారు. రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య రాజుపాలెం: భార్య అలిగి పుట్టింటికి వెళ్లిందని మనస్తాపానికి గురైన యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని చౌటపాపాయపాలెం పెట్రోల్ బంక్ సమీపంలో బుధవారం రాత్రి జరిగింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రెంటచింతల మండలం తుమృకోటకు చెందిన శిరమనేని నాగరాజు(32) భార్య కొంత కాలం కిందట అలిగి పుట్టింటికి వెళ్లింది. మనస్తాపానికి గురైన నాగరాజు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహం రెండుగా విడిపోయింది. మృతుడి వద్ద ఆధార్ కార్డు, ఓటరు కార్డు ఉండడంతో నడికూడి రైల్వే ఎస్ఐ శ్రీనివాసరావునాయక్ బంధువులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టమార్టం నిమిత్తం సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. -
వాసవీమాత జన్మదిన వేడుకలు ప్రారంభం
తెనాలి: స్థానిక బోసురోడ్డులోని వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో అమ్మవారి జన్మదిన వేడుకలు గురువారం ప్రారంభమయ్యాయి. మూడు రోజులపాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా తొలిరోజున ఉదయం 5.30 గంటలకు సుప్రభాత సేవ ప్రాతఃకాల అర్చనలు నిర్వహించారు. దేవస్థాన ప్రాంగణంలో వైశ్య పతాకాన్ని ఆవిష్కరించారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, వాసవి ఉత్సవ మూర్తికి పంచామృత అభిషేకం జరిపించారు. వాసవి అమ్మవారి మూలమూర్తికి దుర్గాదేవి అలంకారం చేసి, సహస్ర కుంకుమార్చనలు నిర్వహించారు. పూజా కార్యక్రమాలను ఆలయ అర్చకులు నుదురుపాటి రామకోటేశ్వర శర్మ జరిపించారు. ఉత్సవాలలో భాగంగా శుక్రవారం అమ్మవారికి లక్ష మల్లెపూల పుష్పార్చన జరుగుతుందని కమిటీ సభ్యులు తెలిపారు. శనివారం అమ్మవారి పుట్టిన రోజున పూజాది కార్యక్రమాలు, అలంకారాలు, కుంకుమార్చన, హోమాలు, విశేష అర్చనలు, అభిషేకాలు ఉంటాయని వివరించారు. అనంతరం అన్న ప్రసాద వితరణ జరుగుతుందని వెల్లడించారు. ఉత్సవాలను దేవస్థాన పాలకవర్గ అధ్యక్షుడు నూకల వెంకట వేణుగోపాలరావు, కార్యదర్శి బూర్లె నరసింహారావు, పాలకవర్గ సభ్యులు పర్యవేక్షించారు. మున్సిపల్ వైస్చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్, ఆర్యవైశ్య ప్రముఖులు వుప్పల వరదరాజులు, మద్దాళి శేషాచలం, గొడవర్తి సాయి హరేరామ్, నూకల భాస్కరరావు, ఆకి అచ్చుతరావు, గోపు రామకృష్ణ, గ్రంధి విశ్వేశ్వరరావు, కొణిజేటి శంకరరావు, అన్నవరపు నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. -
క్షయ వ్యాధి నివారణకే అడల్ట్ బీసీజీ వ్యాక్సిన్
మంగళగిరి : క్షయ వ్యాధిని పూర్తిస్థాయిలో నివారించే లక్ష్యంతోనే అడల్ట్ బీసీజీ వ్యాక్సిన్ వేస్తున్నట్లు రాష్ట్ర నోడల్ ఆఫీసర్ ఇ.ప్రశాంత్ తెలిపారు. పట్టణంలోని గణపతినగర్ వైఎస్సార్ అర్బన్ హెల్త్ సెంటర్లో గురువారం అడల్డ్ బీసీజీ వ్యాక్సిన్ను డాక్టర్ ప్రశాంత్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ 18 సంవత్సరాలు పైబడిన వారికి, పొగతాగేవారికి, షుగర్ వ్యాధి గ్రస్తులకు వ్యాక్సిన్ ఇస్తున్నట్టు వెల్లడించారు. .ఆశా వర్కర్లు ఇంటింటికీ వెళ్లి అర్హులను గుర్తిస్తున్నారని వివరించారు. ప్రతి గురువారం ఆరోగ్య కేంద్రాలలో వ్యాక్సిన్ వేస్తారని తెలిపారు. అర్హులంతా వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరారు. కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి. అనూష, డీటీసీఓ డాక్టర్ శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు. గణపతినగర్లో.. తాడేపల్లిరూరల్: గణపతినగర్లో ఇందిరానగర్ అర్బన్ ప్రైమరీ హెల్త్సెంటర్లో అడల్ట్ బీసీజీ వ్యాక్సినేషన్ను స్టేట్ నోడల్ అధికారి డాక్టర్ ఇ.ప్రశాంత్ ప్రారంభించారు. -
విద్యాసంస్థల బస్సులకు ఫిట్నెస్ తప్పనిసరి
పట్నంబజారు(గుంటూరు ఈస్ట్): విద్యా సంస్థలకు సంబంధించి పాఠశాల, కళాశాలల బస్సుల ఫిట్నెస్ గడువు ఈనెల 15తో ముగిసిందని, రెన్యూవల్ చేయించుకోవాలని డీటీసీ షేక్ కరీమ్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 1500లకుపైగా విద్యా సంస్థల బస్సులు కచ్చితంగా 32 నిబంధనలు పాటిస్తూ ఫిట్నెస్ కలిగి ఉండాలని వెల్లడించారు. పాఠశాల బస్సు డ్రైవర్ 60 సంవత్సరాల వయో పరిమితి దాటిన వ్యక్తి అయితే అనర్హుడని పేర్కొన్నారు. డ్రైవర్ ప్రతి మూడు నెలలకొకసారి కచ్చితంగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని, ఆ రికార్డులు భద్రపరచాలని వివరించారు. డ్రైవర్ల నియామకాన్ని ఆర్టీఓ అధికారులకు తెలియజేయడంతోపాటు, ఐదేళ్ల అనుభవం, హెవీడ్రైవింగ్ లైసెన్సు కలిగి ఉండాలని సూచించారు. పాఠశాల, కళాశాల ప్రిన్సిపాల్, విద్యార్థుల తల్లిదండ్రులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయడంతోపాటు, ప్రతినెలా వాహనానికి సంబంధించి స్థితిగతులను నమోదు చేయాలని తెలిపారు. బస్సులో అత్యవసర ద్వారం, ఫస్ట్ ఎయిడ్ బాక్స్, అగ్నిమాపక పరికరం, బ్యాగులు భద్రపరుచుకునే బాక్స్లు తప్పనిసరిగా ఉండాలని వెల్లడించారు. విద్యా సంస్థల యాజమాన్యాలు తప్పనిసరిగా వాహనాలను సరైన కండీషన్లో ఉంచుకుని రూల్ 185 (జీ) నిబంధనల ప్రకారం తప్పనిసరిగా ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందాలని సూచించారు. ఫిట్నెస్ లేని బస్సులను ఎట్టి పరిస్థితుల్లోనూ తిప్పకూడదని స్పష్టం చేశారు. అలా తిరిగే వాహనాలు సీజ్ చేయడంతోపాటు, కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. డీటీసీ షేక్ కరీమ్ స్పష్టీకరణ -
పోలీసుల వైఫల్యం వల్లే పల్నాడులో హింస
వైఎస్సార్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి బాలహనుమంతరెడ్డి నరసరావుపేట: పోలింగ్ రోజున పల్నాడు జిల్లా వ్యాప్తంగా జరిగిన హింసకు పోలీసు అధికారులే బాధ్యత వహించాలని వైఎస్సార్సీపీ లీగల్సెల్ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ కాకుమాను బాలహనుమంతరెడ్డి పేర్కొన్నారు. గురువారం సాయంత్రం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నరసరావుపేట నియోజకవర్గంలో పలుచోట్ల హింసాత్మక సంఘటనలు జరిగే అవకాశం ఉందని తాను ముందుగానే జిల్లా కలెక్టర్ ఎల్.శివశంకర్, జిల్లా ఎస్పీ జి.బిందుమాధవ్లకు వినతిపత్రాలు అందజేసినా పట్టించుకోలేదన్నారు. ప్రజలు ప్రశాంతంగా ఓటువేసే పరిస్థితులు కల్పించటంలో విఫలమయ్యారన్నారు. డాక్టర్ గోపిరెడ్డి గృహంపై టీడీపీ వర్గీయుల దాడిలోనూ వారి నిఘా వైఫల్యం స్పష్టమవుతోందని చెప్పారు. దాడి జరిగిన 72 గంటలవుతున్నా ఏ పోలీసు అధికారి వచ్చి పరిశీలించలేదన్నారు. పోలింగ్ రోజున గోపిరెడ్డిని మధ్యాహ్నం 2 గంటలకు హౌస్ అరెస్టు చేసి సాయంత్రం వరకు టీడీపీ అభ్యర్థి డాక్టర్ చదలవాడ అరవిందబాబును బూత్ల చుట్టూ తిరిగే అవకాశం కల్పించడంలోనే వారి పక్షపాత ధోరణి తెలుస్తోందని తెలిపారు. డాక్టర్ గోపిరెడ్డిని అరెస్టు చేసేముందు కనీసం సీఆర్పీసీ 41 నోటీసు కూడా ఇవ్వలేదన్నారు. పైగా దాడిచేసిన వారిపై కేసులు నమోదుచేసి వదిలేశారన్నారు. అల్లర్లు జరుగుతున్నపుడు ఎంపీ అభ్యర్థి డాక్టర్ పి.అనిల్కుమార్ యాదవ్ 10సార్లు ఫోన్ చేసినా ఎస్పీ స్పందించలేదని చెప్పారు. టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు అనేక కార్ల కాన్వాయ్తో తిరుగుతుంటే ఎందుకు నిలువరించలేదని ప్రశ్నించారు. లావు శ్రీకృష్ణదేవరాయలు భార్య, జిల్లా ఎస్పీ బిందుమాధవ్ భార్య బంధువులని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి సహకారంతో ఆయన ఇక్కడకు జిల్లా ఎస్పీగా వచ్చారని తెలిపారు. సస్పెండైన వీరాస్వామి అనే సీఐను మాచర్లలో ఏ విధంగా నియమించారని ప్రశ్నించారు. డాక్టర్ చదలవాడ గృహంలో పెట్రోలు బాంబులు, రాళ్లు స్వాధీనం చేసుకున్నారని, ఫినోలెక్స్ అనే కన్సల్టెన్సీ ద్వారా 40మంది బౌన్సర్లను హైదరాబాదు నుంచి తెప్పించి దాడులకు తెగబడ్డారని వివరించారు. ఎస్పీ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు 144సెక్షన్ పెట్టి వ్యాపారాలు జరగకుండా నిలిపేశారని తెలిపారు. హింస సంఘటనల్లో అరవిందబాబుతో పాటు నల్లపాటి రాము, దేశిరెడ్డి చిన్నపరెడ్డి, కపలవాయి విజయకుమార్ పాల్గొన్న విషయం పోలీసులకు తెలిసినా ఎలాంటి చర్యా తీసుకోకపోవడం విస్మయం కలిగిస్తోందన్నారు. డీఐజీ, ఎస్పీపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్టు వివరించారు. -
జగన్ ఈజ్ ది సీక్రెట్ ఆఫ్ అవర్ ఎనర్జీ
గుంటూరు, సాక్షి: నాయకుడంటే.. జనంలో కలిసిపోవాలి. కార్యకర్తలకు క్రమశిక్షణ నేర్పాలి. తన దిగువన పనిచేసే యంత్రాంగం యావత్తును తనదిగా భావించి.. కష్టం వస్తే ఆదుకోవాలి. తగినంత గౌరవం ఇవ్వగలగాలి. అప్పుడే ఆ పార్టీ కేడర్ నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతుంది. అన్నింటికి మించి నిజమైన నాయకుడు.. కార్యకర్తల్లో, నేతల్లో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోగలిగేందుకు సిద్ధపర్చాలి. ఇలాంటి నాయకత్వానికి నిదర్శనంగానే సీఎం జగన్ను చూపిస్తోంది యావత్ దేశం ఇప్పుడు.ఒకవైపు ఐదేళ్లుగా పాలన కొనసాగుతూనే ఉంది. మరోవైపు ప్రతిపక్షాలు, పచ్చ మీడియా రోజూ పాలనపై విషం చిమ్ముతూ వచ్చాయి. మాములుగా అయితే అలాంటి ప్రచారాలకు ఏ పార్టీ కేడర్లో అయినా ధైర్యం సడలిపోయేది. ఆ ప్రచారం తారాస్థాయిలో జరిగింది కాబట్టి భయం కూడా పుట్టేదేమో. కానీ, వైఎస్సార్సీపీలో అలాంటి అధైర్యం, భయం మచ్చుకు కూడా లేకుండా పోయింది. పైగా ముందు నుంచి రెట్టించిన ఉత్సాహాంతో పని చేస్తోంది. ఎందుకు?.. జగన్ పీపుల్స్ లీడర్ మాత్రమే కాదు.. తన కేడర్ను సంరక్షించుకునే దళపతి కూడా. ప్రతిపక్షంలో ఉన్నా.. అధికారంలో ఉన్నా.. కార్యకర్త స్థాయి నుంచి కీలక నేతల దాకా అందరికీ సముచిత గౌరవం ఇస్తుంటారు. అదే సమయంలో.. ఏ జనసేనలాగానో, టీపీపీలాగానో కేడర్ను గందరగోళానికి గురి చేయరు. చంద్రబాబులా, పవన్లా కుట్రలు, వెన్నుపోట్లలాంటి ఊసే ఉండదు. ఒక క్లారిటీతో పార్టీని ముందుకు తీసుకెళ్తుంటారు. చివరకు.. క్షేత్రస్థాయి కేడర్కు సైతం ప్రత్యర్థుల కుట్రలను ఎలా తిప్పి కొట్టాలో స్వయంగా ఆయనే దిశానిర్దేశం చేస్తుంటారు. ఒకరకంగా సీఎం జగన్ మాటలు వాళ్లకు ఒక బూస్ట్. అందుకే అవతలి నుంచి కూడా అంతే గౌరవం ఆయనకూ దక్కుతుంది. ఆ అభిమానం ఎంతలా మారిందంటే.. సీఎం జగన్ వస్తున్నారంటే చాలూ స్వచ్చందంగా, ఆయన్ని చూసేందుకు కనివిని ఎరుగని రీతిలో ఎగబడిపోయేంతలా!. నో డౌట్.. ఏపీ రాజకీయాల్లో సీఎం జగన్ ఒక ట్రెండ్ సెట్టర్. రాష్ట్రం విడిపోయాక జరిగిన రెండో ఎన్నికల్లోనే 175కి 151 అసెంబ్లీ సీట్లు సాధించి వైఎస్సార్సీపీతో చరిత్ర సృష్టించారాయన. పాలనలోనూ విప్లవాత్మక మార్పులతో రాష్ట్రం ముఖచిత్రం మార్చేశారు. అందుకే వైఎస్సార్సీపీ శ్రేణులు కూడా గత 59 నెలలో కాలంలో ప్రజలకు జరిగిన మంచినే నమ్ముకున్నాయి. అదే సమయంలో గడప గడపకు మన ప్రభుత్వం, సిద్ధం, మేమంతా సిద్ధం, ఇంటింటికీ మేనిఫెస్టోతో జగన్ కోసం సిద్ధం.. ఇలాంటి నిర్ణయాలతో పార్టీ కేడర్లో ఆయన నింపిన ఉత్సాహం అంతా ఇంతా కాదు. ఇక ఇప్పుడు గెలుపు ధీమాతో ఆయన చేసిన వ్యాఖ్యల్ని పరిశీలిస్తే.. ‘‘నేను ప్రామిస్ చేస్తున్నా ఏపీలో మరోసారి వైసీపీ ప్రభంజనం ఖాయం. మనమే అధికారంలోకి రాబోతున్నాం. ఈసారి చరిత్ర సృష్టించబోతున్నాం. జూన్ 4వ తేదీన వచ్చే ఫలితం తర్వాత యావత్ దేశం మనవైపు చూస్తుంది. గతంలో కంటే ఎక్కువ అసెంబ్లీ, లోక్సభ స్థానాలు గెలవబోతున్నాం. ఒకరు ఊహించిన దానికంటే మనకు ఎక్కువ సీట్లు వస్తాయి. 2019లో 151 అసెంబ్లీ, 22 లోక్సభ స్థానాలు గెలిస్తే ఈసారి 151 అసెంబ్లీ సీట్లకు పైగా గెలవబోతున్నాం. అలాగే 22కు పైగా లోక్సభ స్థానాలు గెలుస్తాం. తద్వారా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ప్రజలకు ఈ ఐదేళ్లకు మించిన గొప్ప పాలన అందిస్తాం. వచ్చే ప్రభుత్వంలో ప్రజలకు మరింత మేలు చేద్దాం’’గత 59 నెలలుగా చేసిన సుపరిపాలనతో జనం జగన్కే అండగా నిలిచారంటూ విశ్లేషకుల అభిప్రాయాలు.. చంద్రబాబు కూటమి కుట్రలను ప్రజలు ఛీకొట్టారన్న చర్చలు. ఆఖరికి.. మళ్లీ అధికారంలోకి రాబోతున్నాం.. చరిత్ర సృష్టించబోతున్నాం. మరింత మేలు చేసేలా పాలన సాగించే దిశగా అడుగులేద్దామన్న సీఎం జగన్ వ్యాఖ్యలు.. పార్టీలో ఫుల్ జోష్ నింపుతోంది. -
AP: పాలన బాగుంటే పోలింగ్ పెరుగుతుంది
సాక్షి, అమరావతి: పరిపాలన నచ్చితే ప్రజలు తమ మద్దతు ఓట్ల రూపంలో చూపిస్తారని, అందుకు అనుగుణంగానే పోలింగ్ శాతం పెరుగుతుందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్సార్కు, రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో కేసీఆర్కు ప్రజలు వరుసగా రెండుసార్లు అధికారం కట్టబెట్టటాన్ని ఇందుకు నిదర్శనంగా ఉదహరిస్తున్నారు. ఇప్పుడు ఏపీలోనూ అదే ట్రెండ్ కనిపిస్తోందని, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న జగన్ ప్రభుత్వానికి మరోసారి పట్టం గట్టడం ఖాయమని, అందుకనే పోలింగ్ శాతం పెరిగిందని విశే్లషిçÜ్తున్నారు. పోలింగ్ శాతం పెరగడం ప్రభుత్వంపై వ్యతిరేకతను సూచిస్తోందనే ప్రచారంలో నిజం లేదని సీనియర్ రాజకీయ నేత ఒకరు అభిప్రాయపడ్డారు. ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చితే నిస్సంకోచంగా మళ్లీ అదే ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారని పేర్కొంటున్నారు.ఈ మంచి కొనసాగేలా..ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 99 శాతం హామీలను అమలు చేయడంతోపాటు పథకాలన్నీ కొనసాగిస్తామని ప్రజల్లో విశ్వాసం కల్పించడంతో పెద్ద ఎత్తున పోలింగ్కు తరలి వచ్చారని, ఈ మంచి కొనసాగాలని కోరుకుంటున్నారనేందుకు పోలింగ్ శాతం పెరగడమే రుజువని సీనియర్ రాజకీయవేత్తలు స్పష్టం చేస్తున్నారు. 2019లో కంటే 2024లో పోలింగ్ శాతం పెరగడం వైఎస్ జగన్ను మళ్లీ సీఎంగా చూడాలన్న ఆకాంక్షలకు సంకేతమని పేర్కొంటున్నారు.వైఎస్సార్ పాలనే రుజువు..ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2004 అసెంబ్లీ ఎన్నికల్లో 69.8 శాతం పోలింగ్తో దివంగత వైఎస్సార్ అధికారం చేపట్టారు. 2004 నుంచి 2009 వరకు ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చి ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఈ క్రమంలో 2009 ఎన్నికల్లో 72.7 శాతం పోలింగ్తో ప్రజలు మరోసారి వైఎస్సార్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు.విద్య, వైద్య రంగాలలో తొలిసారిగా పెను మార్పులు తెచ్చిన వైఎస్సార్కు జేజేలు పలికారు. పోలింగ్ శాతం పెరగడం వల్ల వైఎస్సార్కు ప్రజల మద్దతు పెరిగినట్లు స్పష్టంగా కళ్లెదుట కనిపించిన వాస్తవమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. 2004కు మించి 2009లో పోలింగ్ 2.9 శాతం పెరిగింది.కేసీఆర్కు రెండుసార్లు అధికార పగ్గాలు..రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో 2014 ఎన్నికల్లో 69.5 శాతం పోలింగ్ నమోదు కాగా కేసీఆర్ అధికారం చేపట్టారు. కేసీఆర్ పాలన నచ్చడంతో 2018 ఎన్నికల్లో 73.2 శాతం పోలింగ్తో మళ్లీ కేసీఆర్ను ముఖ్యమంత్రిని చేశారని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.సానుకూల ప్రచారంతో..ఆంధ్రప్రదేశ్లో 2019 ఎన్నికల్లో 79.77 శాతం పోలింగ్తో ప్రజలు వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిగా దీవించారు. ఐదేళ్ల సీఎం జగన్ పాలన నచ్చడంతో పాటు పథకాలన్నీ కొనసాగాలని ప్రజలు కోరుకోవడంతో ఈదఫా పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చి ఓట్లు వేశారని, అందుకే పోలింగ్ శాతం 81.86 శాతానికి పెరిగిందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. మళ్లీ సీఎంగా జగనే ఉండాలని ప్రజలు భావిస్తున్నారనేందుకు గత ఎన్నికల కంటే పోలింగ్ అదనంగా 2.09 శాతం పెరగడం సంకేతమని స్పష్టం చేస్తున్నారు. ఐదేళ్లుగా మీ బిడ్డ పాలనలో మీ ఇంటికి మంచి జరిగిందని భావిస్తే ఓటుతో ఆశీర్వదించాలని, సైనికులుగా తోడుగా నిలవాలని, పథకాలన్నీ కొనసాగాలంటే వైఎస్సార్సీపీకి ఓటు వేయాలని సీఎం జగన్ ఎన్నికల్లో సానుకూల ప్రచారం చేయడం ప్రజలకు నచ్చిందని, అందుకే ఓట్ల రూపంలో జేజేలు పలికారని సీనియర్ రాజకీయ నేత ఒకరు వ్యాఖ్యానించారు. -
ఏపీలో పథకాలకు నిధుల విడుదల ప్రారంభం
విజయవాడ, సాక్షి: ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాల లబ్ధిదారులకు ఊరట ఇస్తూ.. డీబీటీ(నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకే నగదు జమ) పథకాలకు నిధుల విడుదల ప్రారంభం అయ్యింది. నిన్న ఒక్కరోజే ఆసరాకు రూ.1,480 కోట్లు, జగనన్న విద్యాదీవెన కింద సంపూర్ణ ఫీజు రింబర్స్ మెంట్కు రూ.502 కోట్లు విడుదల అయ్యాయి. రెండు మూడు రోజుల్లో మిగిలిన పథకలకూ నిధుల్ని విడుదల చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇదిలా ఉంటే.. ఎన్నికల వేళ నిధులు విడుదల కాకుండా తెలుగు దేశం పార్టీ కుట్రలు చేసింది. ఈసీకి ఫిర్యాదు చేయడం.. ఆ వెంటనే ఈసీ సైతం డీబీటీ నిధులు విడుదలకు చేయకుండా ఆదేశాలిచ్చింది. దీంతో.. ఎన్నికల సంఘంపై ఏపీ ప్రభుత్వం కోర్టుకు వెళ్లింది. అయితే విచారణ సందర్భంగా ఈసీ తీరుపై కోర్టు ఆగ్రహం వెల్లగక్కింది. ఈలోపే పోలింగ్ తేదీ వచ్చేయడంతో నిధుల విడుదల ఆగిపోయింది. ఇప్పుడు పోలింగ్ ముగియడంతో నిధుల విడుదల తిరిగి ప్రారంభం అయ్యింది.మాట నిలబెట్టుకున్న సీఎం @ysjagan డీబీటీ పథకాల నిధుల విడుదలకి గత వారం ఏపీ హైకోర్టు అనుమతించినా.. కుట్రపూరితంగా అడ్డుకున్న చంద్రబాబు పోలింగ్ తర్వాత అకౌంట్లలో డబ్బులు వేస్తామని లబ్ధిదారులకి హామీ ఇచ్చిన జగనన్న మాట ప్రకారం ఆసరా కింద అక్కచెల్లెమ్మల అకౌంట్లలో రూ.1480 కోట్లు,…— YSR Congress Party (@YSRCParty) May 16, 2024 -
జంగా ఎమ్మెల్సీ సభ్యత్వం రద్దు
గుంటూరు, సాక్షి: ఆంధ్రప్రదేశ్ సీనియర్ పొలిటీషియన్, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తికి బిగ్ షాక్ తగిలింది. పార్టీ ఫిరాయింపు కారణంగా ఆయనపై అనర్హత వేటు వేశారు శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు. వైఎస్సార్సీపీ తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికైన జంగా.. ఆ తర్వాత టీడీపీలో చేరారు. దీంతో.. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు వేయాలని వైఎస్సార్సీపీ కోరింది. ఈ మేరకు వైఎస్సార్సీపీ విప్ లేళ్ల అప్పిరెడ్డి అసెంబ్లీ సెక్రటరీ జనరల్కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై శాసనమండలి ఛైర్మన్ కొయ్యే మోషేనురాజు విచారణ నిర్వహించారు. ఆయన నుంచి వివరణ తీసుకున్నారు. చివరకు.. ఎమ్మెల్సీగా కృష్ణమూర్తి అనర్హుడని పేర్కొంటూ ఆయన సభ్యత్వాన్ని రద్దు చేస్తూ బుధవారం అర్ధరాత్రి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. జంగా కృష్ణమూర్తి.. 2009 నుంచి 2019 మధ్య పల్నాడు జిల్లా గురజాల ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆయన్ని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీని చేసింది. వైఎస్సార్సీపీలో ఉన్నప్పుడు మండలిలో విప్గా కూడా పని చేశారు. -
AP: ప్రారంభమైన ఈఏపీ సెట్ పరీక్షలు
విజయవాడ: ఏపీ ఈఏపీ సెట్(ఎంసెట్) పరీక్షలు ప్రారంభం అయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు మొదటి సెషన్ పరీక్ష ప్రారంభం అయింది. అనంతరం మద్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు రెండో సెషన్గా పరీక్షలు జరగనుంది. రేపు( శుక్రవార) బైపీసీ గ్రూపుకి ఎప్సెట్ పరీక్షలు జరుగనున్నాయి. 18వ తేదీ నుంచి 23 వరకు ఇంజనీరింగ్ విభాగానికి ఈఏపీ సెట్ పరీక్షలు జరుగుతాయి. రోజుకి రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తారు. ఆన్లైన్ విధానంలో ఎప్సెట్ పరీక్షలు జరుగుతాయి.రాష్ట్ర వ్యాప్తంగా 140 సెంటర్లు ఉన్నాయి. హైదరాబాద్లో రెండు సెంటర్లు ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏపి ఎప్సెట్కి హాజరవుతున్న విద్యార్ధుల సంఖ్య 3,61,640. ఇందులో మహిళలు1,81,536 మంది. పురుషులు 1,80,104 మంది విద్యార్ధులు ఉన్నారు. గత ఏడాదితో పోలిస్తే 22 వేలకి పైగా విద్యార్థులు అదనంగా దరఖాస్తు చేసుకున్నారు. ఇక.. ఒక నిమిషం నిబందన పక్కాగా అమలు చేయనున్న ఉన్నత విద్యా మండలి పేర్కొంది. విద్యార్ధులను పరీక్షా కేంద్రం లోపలికి గంటన్నర ముందుగానే అనుమతి ఉంటుంది. ఏ రకమైన ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకు రాకూడదు. విద్యార్ధులు చేతులకి మెహందీ పెట్డుకోకూడదు. ఇయర్ రింగ్స్ పెట్టుకోవడంపైనా నిషేదం ఉన్నట్లు ఉన్నతి విద్యామండలి తెలిపింది. -
ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించిందని ఎలా నమ్మాలి?: సజ్జల
సాక్షి, తాడేపల్లి: ఎన్నికల కమిషన్ పక్షపాత ధోరణితో వ్యవహరించిందని.. టీడీపీ దాడులు చేస్తున్నా.. పోలీసులు పట్టించుకోలేదని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. బుధవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అసాంఘిక శక్తులు రాజకీయ కక్షతో దాడులు, హింసాకాండ కొనసాగిస్తున్నాయని మండిపడ్డారు.రాజకీయ కక్షతో బడుగు బలహీన వర్గాలపై దాడులకు చేశారు.ఈసీ ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. పోలింగ్ సమయంలో టీడీపీ గూండాలు ఎక్కడికక్కడ తెగబడ్డారు.పోలింగ్ సజావుగా జరగకూడదని టీడీపీ దాడులు చేసింది. టీడీపీ దాడులపై డీజీపీకి, ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశాం’’ అని సజ్జల చెప్పారు.‘‘రిగ్గింగ్ చేయాలనే ఆలోచనతో దాడులకు తెగబడ్డారు. కూటమి నేతలు చెప్పినచోటే పోలీసు అధికారులను మార్చారు. ఈసీ నియమించిన పోలీస్ అధికారులకు రాష్ట్రంపై అవగాహన లేదు. టీడీపీ నేతలు ఇచ్చి పార్టీకి పోలీస్ అబ్జర్వర్ హాజరయ్యారు. పోలింగ్కు ముందే పోలీస్ ఉన్నతాధికారులను మార్చేశారు. ఎక్కడైతే పోలీస్ అధికారులను మార్చారో అక్కడే హింస జరిగింది. ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించిందని ఎలా నమ్మాలి?’’ అంటూ సజ్జల ప్రశ్నించారు.పోలింగ్ రోజు వైఎస్సార్సీపీ అభ్యర్థులను హౌస్ అరెస్ట్ చేశారు. టీడీపీ అభ్యర్థులు మాత్రం యథేచ్చగా తిరిగారు. గురజాలలో ఓ గుడిలో తలదాచుకున్న దళితులపై దాడులు చేశారు. ఈసీ వైఫల్యం కారణంగానే పల్నాడులో గొడవలు జరిగాయి. వీటన్నిటికి ఎన్నికల కమిషనే బాధ్యత తీసుకోవాలి’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు.‘‘ఎన్నికల సంఘం విధుల్లో కూడా టీడీపీ దూరింది. పురందేశ్వరి ఎవరిపై ఫిర్యాదు చేశారో వారిని బదిలీ చేశారు. వారు కోరిన అధికారులను వేశారు. మొత్తం 29 మంది అధికారులను ఉన్నట్టుండి ట్రాన్సఫర్ చేశారు. విష్ణువర్ధనరావు అనే రిటైర్డ్ ఆఫీసర్ ఇచ్చిన విందుకు పోలీసు అబ్జర్వర్ దీపక్ మిశ్రా వెళ్లారు. విష్ణువర్ధన్ రావు టీడీపీ నేత సుజనాచౌదరికి దగ్గరి మనిషి. అలాంటి వ్యక్తి ఇచ్చిన విందుకు పోలీసు అబ్జర్వర్ వెళ్లితే ఇక ఎన్నికలు ప్రశాంతంగా ఎలా జరుగుతాయి?. టీడీపీ ఆఫీసులో రూపు దిద్దుకున్న ప్లాన్ ని దీపక్ మిశ్రా ద్వారా ఈసీ అమలు చేసింది. రెడ్డి, ఎస్సీ, ఎస్టీ అధికారులు అందరినీ వరుసపెట్టి ట్రాన్సఫర్ చేశారు. ఎవరిపై ఫిర్యాదు వచ్చినా విచారణ చేయకుండానే వెంటనే ట్రాన్సఫర్ చేశారు. ప్రకాశం, పల్నాడు, తాడిపత్రి, తిరుపతిలలో అధికారులను మార్చారు. అక్కడే ఎక్కువ హింస చెలరేగింది’’ అని సజ్జల ధ్వజమెత్తారు.జరుగుతున్న దాడులన్నీ ఒన్ సైడే జరుగుతన్నాయి. మంత్రి అంబటి రాంబాబును అన్యాయంగా హౌస్ అరెస్టు చేశారు. ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి కుటుంబంపై దాడులు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. వెంటనే పోలీసు అబ్జర్వర్ దీపక్ మిశ్రాని వెంటనే వెనక్కు పిలవాలి. ఎన్నికల కమిషన్ త్వరగా స్పందించి శాంతిభద్రతలను పరిరక్షించాలి. సంక్షేమ పథకాల నిధులను కాంట్రాక్టర్లకు ఇస్తున్నారని ఎల్లోమీడియా తప్పుడు ప్రచారం చేస్తోంది. కౌంటింగ్ సందర్భంగా అల్లర్లు చేసేందుకు కూడా టీడీపీ కుట్రలు పన్నుతోంది. కచ్చితంగా రెండోసారి జగన్ పాలన రాబోతోంది’’ అని సజ్జల చెప్పారు.‘‘సీఎస్, డీజీపీని కేంద్ర ఎన్నికల సంఘం పిలిపించటం అసాధారణం. పోలింగ్ తర్వాత కూడా పరిపాలన జరగకుండా చేయటం ఏంటి?. వీటన్నిటిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాం. పురందేశ్వరి ఇచ్చిన లేఖల ప్రకారం ఈసీ పనిచేయటంపై సీఈసీకి ఫిర్యాదు చేస్తాం. పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రాని నియమించటం వెనుక కుట్ర ఉంది. లేకపోతే రిటైర్డ్ ఆఫీసర్ ని పోలీసు అబ్జర్వర్గా నియమించటం ఏంటి?. ఉద్యోగంలో ఉన్న ఆఫీసర్ని నియమిస్తే బాధ్యతతో వ్యవహరిస్తారు. రిటైర్డ్ అధికారిని నియమిస్తే బాధ్యత ఏం ఉంటుంది?’’ అంటూ సజ్జల ప్రశ్నించారు. -
టీడీపీతో కుమ్మక్కు.. ఏపీ పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రాపై వైఎస్సార్సీపీ ఫిర్యాదు
సాక్షి, విజయవాడ: ఏపీ పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా అక్రమాలపై వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. టీడీపీ నేతలతో కుమ్మక్కై తెరవెనుక కథ నడిపినట్టు దీపక్ మిశ్రాపై ఆరోపణలు ఉన్నాయి. డీజీపి హరీష్ కుమార్ గుప్తా, ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాకు వైఎస్సార్సీపీ ఫిర్యాదులు చేసింది. పోలింగ్ రోజు టీడీపీ కూటమికి మద్దతుగా వ్యవహరించాలని పోలీసు అధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చినట్లు ఫిర్యాదులో వైఎస్సార్సీపీ నేతలు పేర్కొన్నారు.పోలింగ్ కు మూడు రోజుల ముందు విజయవాడలో టీడీపీ నేత విష్ణువర్ధనరావు ఇచ్చిన పార్టీకి దీపక్ మిశ్రా హాజరైనట్లు గుర్తించారు. ఆ తర్వాత నుండి భారీగా పోలీసు అధికారుల మార్పులు జరగటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మాచర్ల, గురజాలలో రాత్రికి రాత్రే సీఐలు, ఎస్ఐలను మార్చేశారు.చివరికి సీఎం జగన్ పై జరిగిన హత్యాయత్నం కేసులో కూడా జోక్యం చేసుకున్నట్లు వైఎస్సార్సీపీ చెబుతోంది. ఆ మేరకు ఆధారాలు కూడా ఉన్నాయని వైసీపి నేతలు తెలిపారు. కేసులోని A2 నిందితుడిని అరెస్టు చేయవద్దని విచారణ అధికారిపై ఒత్తిడి తెచ్చినట్లు వైఎస్సార్సీపీ పేర్కొంది. ఆధారాలను సేకరించి డీజీపి, ఈసీలకు వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- అనంతలో ఘోర ప్రమాదం: పెళ్లి షాపింగ్ చేసి తిరిగొస్తుండగా..
- తిరుమల: నేడు ఆగష్టు ఆర్జితసేవా టికెట్ల విడుదల
- అలాంటి సీన్స్ నా వల్ల కాదు.. కొందరు దర్శకులు కావాలనే..
- Naveen Patnaik: రాజకీయ పర్యాటకుల ప్రభావం సున్నా
- నేడు ఈఏపీ సెట్ ఫలితాలు
- ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి మాకు భార్యాపిల్లలు లేరా?
- Global Burden of Disease: సగటు జీవితకాలం పైపైకి..
- Delhi liquor scam: నిందితుల జాబితాలో ఆప్, కేజ్రీవాల్
- ఆంధ్రాలో ఓటేసిన కొటియా ఓటర్లు
- త్వరలో గ్రూప్–4 ఎంపిక జాబితా
Advertisement