జాతీయ కిక్‌బాక్సింగ్‌ పోటీలకు జిల్లా క్రీడాకారులు | Sakshi
Sakshi News home page

జాతీయ కిక్‌బాక్సింగ్‌ పోటీలకు జిల్లా క్రీడాకారులు

Published Sat, May 4 2024 7:35 AM

-

నిర్మల్‌టౌన్‌: రాష్ట్రస్థాయి కిక్‌ బాక్సింగ్‌ పోటీలు ఈనెల 1 నుంచి 2వ వరకు వనపర్తిలో నిర్వహించారు. ఇందులో నిర్మల్‌ జిల్లా నుంచి పలువురు క్రీడాకారులు పాల్గొని అద్భుత ప్రతిభ కనబర్చారు. ఆరు బంగారు పతకాలు, ఒక వెండి పతాకం సాధించి జాతీయస్థాయికి ఎంపికయ్యారు. వీరిలో ఎల్‌.నాగలక్ష్మి 32 కేజీలు లైక్‌ కాంటాక్ట్‌, కె.సాహితీ 37 కేజీలు లైట్‌ కాంటాక్ట్‌ , కె.దివ్య 32 కేజీలు ఫైన్‌ ఫైట్‌, ఎం.అక్షయ 42 కేజీలు ఫైన్‌ఫైట్‌, ఎల్‌.సుజల 53 కేజీలు కిక్‌ లైట్‌, సీహెచ్‌.నక్షత్ర 70 కేజీలు లైట్‌ కాంటాక్ట్‌లో బంగారు పతకాలు సాధించారు. ఎం.శశివర్ధన్‌ 72 కేజీలు లైట్‌ కాంటాక్ట్‌లో వెండి పతాకం సాధించారు. ఈనెల 21 నుంచి 26 వరకు పూణేలో జరిగే జాతీయస్థాయి పోటీల్లో వీరు పాల్గొననున్నట్లు కిక్‌ బాక్సింగ్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు చందుల స్వామి తెలిపారు.

Advertisement
Advertisement