నిర్మల్చైన్గేట్: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈనెల 5న కాంగ్రెస్ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ నిర్మల్లో ప్రచార సభ నిర్వహించనున్నారు. ఈమేరకు సభా స్థలిని ఉమ్మడి ఆదిలాబాద్ ఇన్చార్జి మంత్రి సీతక్క, డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు, ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణతో కలిసి శుక్రవారం పరిశీలించారు. రాహుల్గాంధీ బహిరంగ సభకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, టీపీసీసీ కార్యదర్శి సత్తు మల్లేశ్, ఆసిఫాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ అజ్మీరా శ్యామ్నాయక్, మాజీ కేంద్ర మంత్రి సముద్రాల వేణుగోపాలచారి, నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్లో చేరికలు..
జిల్లా కేంద్రంలోని డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు క్యాంపు కార్యాలయంలో మంత్రి సీతక్క సమక్షంలో గొల్లపేట, భాగ్యనగర్ కాలనీలకి చెందిన బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీతక్క వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.