-
ముందు పరిహారం ఇవ్వండి..
గజ్వేల్రూరల్: పరిహారం, ప్యాకేజీ ఇవ్వకుండా సర్వే ఎందుకు చేస్తున్నారంటూ మల్లన్నసాగర్ ముంపు గ్రామాల బాధితులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఈ సంఘటన గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలో చోటు చేసుకుంది. పట్టణంలోని సంగాపూర్ మార్గంలో బాలుర ఎడ్యుకేషన్ హబ్ పక్కన నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లల్లో ఉంటున్న వారి వివరాలను తెలుసుకునేందుకు అధికారులు సోమవారం సర్వే చేపట్టారు. విషయం తెలుసుకున్న ముంపు గ్రామాల ప్రజలు అక్కడికి చేరుకొని అధికారులతో వాగ్వాదానికి దిగారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణం పేరుతో మమ్మల్ని తీసుకువచ్చి తాత్కాలికంగా డబుల్ బెడ్రూం ఇళ్లలోకి పంపించి చేతులు దులుపుకొన్నారని వాపో యారు. ఈ ఇళ్లలో నివాసముంటున్న మాకు మూడేళ్లుగా పరిహారం, ప్యాకేజీ ఇవ్వకుండా ప్రభు త్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందన్నారు. సర్వే పేరుతో అధికారులు ‘డబుల్’ ఇళ్లలో నివసిస్తున్న వారి వివరాలను సేకరిస్తున్నప్పటికీ... పూర్తి స్థాయిలో పరిహారం అందిన తర్వాతే ఇళ్లను ఖాళీ చేస్తామంటూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఆరుగురుఅధికారులతో ఒక బృందం చొప్పున మొత్తం 3బృందాలు ఈ సర్వేలో పాల్గొన్నాయి. ఆ తరువాతే సర్వే చేపట్టండి అధికారులతో ముంపు బాధితుల వాగ్వాదం -
తేనెటీగల పెంపకం లాభదాయకం
చిన్నకోడూరు(సిద్దిపేట): పంట దిగుబడులు పెంచడంలో తేనెటీగలు ప్రధాన పాత్ర పోషిస్తాయని శాస్త్రవేత్తలు డాక్టర్ ఉమారెడ్డి, డా. రాంగోపాల్ వర్మ, డా. అరుణశ్రీ, డా. సునీత, డా. శ్రీదేవి, డా.పల్లవి తెలిపారు. తేనెటీగల పెంపకం వల్ల ఆదాయంతో పాటు నాణ్యమైన పంట దిగుబడులు పొందవచ్చని అన్నారు. సోమవారం చిన్నకోడూరులో ప్రపంచ తేనెటీగల దినోత్సవం సందర్భంగా రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తేనె ఉత్పత్తి ద్వారా రైతులకు ఆర్థిక వెసులుబాటు ఉంటుందన్నారు. తేనెటీగల పెంపకానికి శ్రమ, పెట్టుబడి ఎక్కువ అవసరం లేదన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివప్రసాద్, ఏడీఏ పద్మ, ఏఓ జయంత్ కుమార్, రైతులు పాల్గొన్నారు. విద్యార్థుల ర్యాలీ ములుగు(గజ్వేల్): తేనెటీగల ప్రాధాన్యతను చాటుతూ ములుగు అటవీ కళాశాల, పరిశోధన సంస్థ విద్యార్థినులు సోమవారం ములుగు మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. తేనెటీగలను రక్షిద్దాం..పర్యావరణాన్ని కాపాడుదాం అంటూ ప్ల కార్డులు ప్రదర్శించారు. నినాదాలు చేశారు. తేనెటీగల సంరక్షణ, సుస్థిర అభివృద్ధిలో యువత భాగస్వాములు కావాలని వారు ఈ సందర్భంగా కోరారు. యువతీ యువకులు తేనెటీగల సంరక్షణలో పాల్గొనాలని అవగాహన కల్పించారు. శాస్త్రవేత్తల వెల్లడి రైతులకు అవగాహన -
చట్టాలపై అవగాహన అవసరం
సంగారెడ్డి టౌన్: ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి రమేష్ అన్నారు. సోమవారం పట్టణంలో భవన నిర్మాణ కార్మికులకు చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మికులందరూ చట్టాలపై అవగాహన పెంచుకోవాలని, న్యాయ సహాయం కోసం కోర్టులో ఉచిత సలహాలు తీసుకోవచ్చని తెలిపారు. కార్మికుల కోసం అనేక పథకాలు అందుబాటులో ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో అధికారులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ‘రైతుల గోస పట్టని సర్కార్’కొండపాక(గజ్వేల్): కాంగ్రెస్ ప్రభుత్వ పాలన రైతుల పాలిట శాపంగా మారుతోందని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తిమ్మారెడ్డిపల్లిలోని కొనుగోలు కేంద్రంలో పేరుకు పోయిన ధాన్యం కుప్పలను సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రతాప్రెడ్డి మాట్లాడుతూ ఆరుగాలం పాటు కష్టించి పండించిన ధాన్యం అమ్ముకోవడంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కుప్పల వద్ద కాపలా ఉండాల్సిన దుస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేయడంలో, మిల్లుల్లో అన్లోడింగ్ చేయడంలో నత్తనడకన సాగుతోందన్నారు. రెండు మూడు రోజుల్లో నియోజక వర్గ వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లో పేరుకు పోయిన ధాన్యంను కొనుగోలు చేయాలని లేని పక్ష్యంలో ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దేవి రవీందర్, ఎన్ఆర్ఈజీఎస్ రాష్ట్ర మాజీ కౌన్సిల్ సభ్యురాలు కోల సద్గుణ, నాయకులు పాల్గొన్నారు. -
చంపుతామంటూ భార్యాపిల్లల బెదిరింపులు
మెదక్ మున్సిపాలిటీ: నేను అనారోగ్యంతో బాధపడుతున్నా. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం చంపుతామంటూ నా భార్యాపిల్లలు బెదిరిస్తున్నారు. న్యాయం చేయండి అని బాధితుడు చల్లరాజు కోరారు. సోమవారం మెదక్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఎస్పీ బాలస్వామి జిల్లాస్థాయి ప్రజావాణి నిర్వహించారు. ఈ సందర్భంగా తాను కూడా ఫిర్యాదు చేశాడు. ‘‘నా పేరు చల్లరాజు.. మాది హవేళీఘణాపురం మండలం ఔరంగాబాద్ గ్రామం. నేను అనారోగ్యంతో బాధపడుతున్నాను. నా పేరిట రూ.5లక్షల బీమా ఉంటే దాని కోసం చంపివేస్తామని భార్య, చిన్న కుమారుడు బెదిరిస్తున్నారు అని ఎస్పీకి ఫిర్యాదు చేశారు’’. స్పందించిన ఎస్పీ తగిన న్యాయం చేయమని హవేళీఘణాపురం ఎస్ఐ సూచించారు. అలాగే శివ్వంపేట మండలం బీమ్లా తండాకు చెందిన కేతావత్ శిరీషా తాను అనారోగ్యంతో పుట్టింటికి వెళ్లగా భర్త రెండో పెళ్లి చేసుకున్నాడని ఫిర్యాదు చేసింది. కాగా సమస్యను పరిష్కరించాలని శివంపేట ఎస్ఐకి సూచనలు చేశారు. అయితే.. శివ్వంపేట పోలీస్స్టేషన్ కానిస్టేబుల్ లక్ష్మారెడ్డి 2023 జూన్ 5న విధులు ముగించుకొని ఇంటికి వెళ్తుండగా ముప్పిరెడ్డిపల్లి వద్ద రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. ఆయన కుటుంబీకులకు రూ.30 లక్షల చెక్కును ఎస్పీ అందజేశారు. ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే ఇదంతా ఎస్పీ బాలస్వామికి.. తన గోడు విన్నవించిన బాధితుడు చల్లరాజు -
పచ్చిరొట్ట సాగు.. భూమికి బాగు
జహీరాబాద్ టౌన్: రైతులు రసాయనాలు, ఎరువులు మోతాదుకు మించి వాడరాదు. వాడితే భూమిలోని సారం పూర్తిగా తగ్గిపోతుంది. పైగా.. నేల ఆరోగ్యం దెబ్బతిని పంటల దిగుబడులు తగ్గుతాయి. భూమికి సేంద్రియ ఎరువుల వాడకం తగ్గడానికి కారణం గ్రామీణ ప్రాంతాల్లో పశు సంపద తగ్గడమే. పచ్చిరొట్ట విత్తనాలు భూసారం పెంపునకు వాడాల్సి ఉంది. ప్రభుత్వం కూడా రాయితీపై అందజేస్తున్నట్లు వ్యవసాయ శాఖ జహీరాబాద్ ఏడీ భిక్షపతి తెలిపారు. జీలుగ, జనుము విత్తనాలను తొలకరి వర్షాలు కురియడం ప్రారంభమైన తరువాత విత్తనాలను విత్తుకోవాలన్నారు. ఉపయోగాలు పచ్చిరొట్ట నేలలో కలియదున్నిన పంట కుళ్లేటప్పుడు విడుదల చేసే వ్యర్థాల వల్ల నేలలలో మొక్కలకు భాసరం, పొటాష్ అందుతుంది. పైగా గాలిలోని నత్రజని నేలలో స్థిరీకరించబడుతుంది. సూక్ష్మపోషకాలు మొక్కలకు లభ్యమై అధిక దిగుబడులు వస్తాయి. మొక్కల వేళ్లు కూడా ఆరోగ్యం, పట్టుత్వం పెరుగుతుంది. ఎరువుల వాడకం.. పచ్చిరొట్ట పైర్లలో 16 రకాలు ఉంటాయి. జీలుగ, అవిశ, జనుము, వెంపల్లి, అలసంద, పిల్లిపెసర, పెసర, మినుము, గోడుచిక్కుడు, అజోల్ల, కానుగ, జిల్లేడు, నేల తంగేడు, కొండ మిరప తదితర రకాలున్నాయి. ఈ ప్రాంత రైతులు ఎక్కువగా జీలుగ, జనుము విత్తనాలు వేస్తారు. పచ్చిరొట్టను పూత దశలో నేలలో కలియదున్నాలి. ఈ సమయంలో ఎకరాకు 50 కిలోల సూపర్ ఫాస్ఫేట్ వేస్తే త్వరగా కుళ్లుతుంది. 8 కిలోల నత్రజని వేయడం వల్ల మొక్క ఏపుగా పెరిగి రొట్ట ఎక్కువగా వస్తుంది. జీలుగ సాగు ఇలా జీలుగ పంటను చౌడు, వరి పండించే భూముల్లో సాగు చేసినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. ఎకరానికి 20 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. మొక్కలు పెరిగి పూత దశకు వచ్చే సరికి 6 నుంచి 8 టన్నుల పచ్చిరొట్ట లభిస్తుంది. వీటిని అదే పొలంలో కలియదున్ని మురగపెట్టినట్లయితే 30 నుంచి 32 కిలోల యూరియా లభిస్తుంది. ఈ పంటను సాగు చేస్తే పొలంలో వేయాల్సిన యూరియా కన్నా 30 నుంచి 32 కిలోలు తక్కువగా వేస్తే సరిపోతుంది. తద్వారా 3.5 శాతం నత్రజని, 0.6 శాతం భాస్వరం, 1.2 శాతం పొటాష్ లభిస్తుంది. జనుము సాగు విధానం జనుము సాగు చేసేందుకు ఒక ఎకరానికి 9 నుంచి 14 కిలోల విత్తనాలు అవసరం ఉంటాయి. తద్వారా ఎకరానికి 5 నుంచి 6 టన్నుల పచ్చిరొట్ట లభిస్తుంది. వీటిని పొలంలోనే కలియదున్నితే 24 కేజీల యూరియా లభిస్తుంది. ఇందులోనూ 2.3 శాతం నత్రజని, 0.5 శాతం భాస్వరం, 1.8 శాతం పొటాష్ ఉంటుంది.పంపిణీకి సిద్ధంగా ఉన్న విత్తనాలు చేనుకు చేవా.. పంటకు బలం సబ్సిడీపై విత్తనాల పంపిణీసబ్సిడీపై విత్తనాలు వ్యవసాయ శాఖ అధికారులు రాయితీపై జీలుగ, జనుము విత్తనాలను పంపిణీకి శ్రీకారం చుట్టారు. క్వింటాలు బస్తా ధర రూ. 9,050 కాగా సబ్సిడీ రూ. 5,400 పోను రైతులు రూ.3,620 చెల్లించాలి. 40 కిలోల బస్తాకు రూ.1,148లు చెల్లించాలని అధికారులు తెలిపారు. అవసరం ఉన్న రైతులు పట్టదారు పాస్పుస్తకం, ఆధార్ కార్డు జిరాక్స్తో ఏఈఓను కలిసి అనుమతి తీసుకోవాలన్నారు. తీసుకున్న రైతులు జహీరాబాద్లో విత్తనాలు తీసుకోవాలన్నారు. -
తీరని శోకం మిగిల్చారు...
వేర్వేరు ప్రాంతాల్లో నలుగురి ఆత్మహత్య ఉమ్మడి జిల్లాలో వేర్వేరు చోట్ల నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. మృతుల్లో ఇద్దరు వృద్ధులు, మరో ఇరువురు యువకులు ఉన్నారు. కాగా, రాయపోలు, నిజాంపేట, మనోహరాబాద్ల్లో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. రాయపోలు(దుబ్బాక): కడుపునొప్పి భరించలేక జీవితంపై విరక్తి చెందిన వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన రాయపోలులో చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై రఘుపతి తెలిపిన వివరాల మేరకు.. మండలకేంద్రానికి చెందిన తుడుం నర్సయ్య (60) కొంతకాలంగా కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. పలు ఆస్పత్రుల్లో చికిత్సలు తీసుకున్నా తగ్గలేదు. ఆదివారం రాత్రి కుటుంబసభ్యులతో కలిసి అతను భోజనం చేశాడు. సోమవారం ఉదయం నిద్ర లేచేసరికి కన్పించకపోవడంతో కుటుంసభ్యులు వెతికారు. కాగా, తన పొలం వద్ద ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. జీవితంపై విరక్తి చెంది ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని చెబుతున్నారు. మృతుడి కొడుకు అశోక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. కల్హేర్(నారాయణఖేడ్): కుటుంబ కలహాలు, అనారోగ్యం కారణంగా పెట్రోల్ పోసుకుని యువకు డు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన నిజాంపేట మండలంలో జరిగింది. ఎస్ఐ వెంకటేశం కథనం ప్రకారం.. నాగధర్ గ్రామానికి చెందిన పన్నెల అశోక్(25) ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంటలను ఆర్పిన కుటుంబసభ్యులు.. తీవ్రగాయాలైన అతడిని వెంటనే చికిత్స నిమిత్తం నారాయణఖేడ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇక్కడి నుంచి వైద్యులు సంగారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్కు రిఫర్ చేశారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్లోని వెల్నెస్ ఆస్పత్రికి తరలించారు. ఇక్కడ చికిత్స పొందుతూ అశోక్ చనిపోయాడు. అతడికి భార్య దుర్గ, కుమారుడు ప్రణీత్ ఉన్నారు. మృతుడి తల్లి వీరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ వెంకటేశం తెలిపారు. మనోహరాబాద్(తూప్రాన్): నిత్యం మద్యం తాగితే ఆరోగ్యం పాడవుతుందని, కుటుంబసభ్యులు మందలించారు. క్షణికావేశంలో గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మనోహరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్ఐ కరుణాకర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని లింగారెడ్డిపేటకు చెందిన అబ్బదాసరి పోషయ్య(55) ఈ నెల 18న మద్యం తాగి ఇంటికి రావడంతో కుటుంబసభ్యులు మందలించారు. దీంతో క్షణికావేనికి లోనైన అతడు మరుసటిరోజు ఉదయం ఇంట్లో ఉన్న గడ్డి మందును తాగాడు. ఈ విషయం కుటుంబసభ్యులకు తెలపడంతో వారు హుటాహుటిన తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు ప్రాథమిక చికిత్స అందించారు. ఇంకా పరిస్థితి విషమంగానే ఉండటంతో హైదరాబాద్లో ఉన్న గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఇక్కడి చికిత్స పొందుతూ మృతిచెందినట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడికి భార్య రేఖ, కుమారుడు స్వామి, కూతురు ఉన్నారు. మనస్తాపం చెందిన వ్యక్తి ... అనారోగ్యంతో సతమతమవుతున్న యువకుడు తన కుటుంబానికి భారం కావద్దని భావించి, ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన పాలాటలో జరిగింది. ఎస్ఐ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చాకలి నాగరాజు(28) కొన్ని రోజులుగా అనారోగ్యం బారిన పడ్డాడు. చికిత్స కోసం ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ఈక్రమంలో కుటుంబానికి ఆర్థికంగా భారమవుతున్నానని మనస్తాపం చెందుతున్నాడు. కాగా, ఆదివారం రాత్రి ఇంట్లో సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య రజిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. క్షణికావేశంలో.. -
ప్రతిభకు పురస్కారం
‘పది’లో 9.5 జీపీఏ సాధించిన వారికి సన్మానం జిల్లావ్యాప్తంగా 398 విద్యార్థుల ఎంపిక కలెక్టర్ వినూత్న ప్రయోగం 23న మెదక్లో కార్యక్రమం పాపన్నపేట(మెదక్): ప్రభుత్వ పాఠశాలల్లో చది వే విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపేందుకు కలెక్టర్ రాహుల్రాజ్ వినూత్న ప్రయోగానికి రూపకల్పన చేశారు. (2023– 24) బ్యాచ్ పదో తరగతి పరీక్షలో 9.5 జీపీఏ సాధించిన విద్యార్థులకు ఈనెల 23న సన్మానపత్రాలు అందజేయనున్నారు. ఇందుకు జిల్లావ్యాప్తంగా 398 మంది విద్యార్థులను అర్హులుగా గుర్తించామని డీఈఓ తెలిపారు. 92.90 శాతం ఉత్తీర్ణత జిల్లాలో 146 ఉన్నత పాఠశాలలు, 15 కేజీబీవీలు, 7 మోడల్ స్కూల్స్, 23 గురుకులాలు ఉన్నాయి. 10,283 మంది పదో తరగతి పరీక్షలు రాయగా 9,553 విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అందులో 4,608 మంది బాలురు, 4,945 బాలికలు ఉన్నారు. ఇటీవల వెలువడిన ఫలితాల్లో 92.90 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో జిల్లా 18వ స్థానంలో నిలిచింది. కాగా ప్రభుత్వ బడుల నుంచి తక్కువ మంది 10 జీపీఏ సాధించారు. ఈ క్రమంలో వారిలో ఆత్మస్థైర్యం నింపుతూ, స్ఫూర్తిని రగిలించే ఉద్దేశంతో కలెక్టర్ 9.5 జీపీఏ సాధించిన విద్యార్థులందరినీ ఈనెల 23వ తేదీన మెదక్లోని వైస్రాయి గార్డెన్లో సన్మానించనున్నారు. గురుకులాలు.. ఆదర్శ బడుల హవా 9.5 జీపీఏ సాధించిన 398 మంది విద్యార్థుల్లో గురుకులాలు, ఆదర్శ పాఠశాలల విద్యార్థులు ఎక్కువగా ఉన్నారు. మండలాల వారీగా చూస్తే అత్యధికంగా మెదక్ మండలంలో 78 మంది, చేగుంట మండలంలో 65, హవేళిఘనపూర్ మండలంలో 48, తూప్రాన్లో 47 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. అత్యల్పంగా నిజాంపేట, నార్సింగి మండలాల నుంచి ఒక్కో విద్యార్థి ఎంపికయ్యారు. 9.5 జీపీఏ సాధించి ఎంపిక లిస్టులో పేరు లేకుంటే తమ దృష్టికి తీసుకురావాలని డీఈఓ సూచించారు. కలెక్టర్కు కృతజ్ఞతలు నిరుపేదలైన గ్రామీణ విద్యార్థులు ఎక్కువ మంది ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుతున్నారు. నేను 9.8 జీపీఏతో మండల టాపర్గా నిలిచా. నిజానికి ప్రభుత్వ బడులు పరిపూర్ణ వికాస కేంద్రాలు. ఎలాంటి ఒత్తిడి లేకుండా, ఆట పాటలతో చదువు కొనసాగిస్తాం. సర్కార్ బడిలో చదివిన చాలా మంది సివిల్ సర్వీసెస్, ఐఆర్ఎస్ లాంటి ఉద్యోగాలు సాధించారు. సర్కార్ బడుల విద్యార్థులను సన్మానిస్తున్న కలెక్టర్కు కృతజ్ఞతలు. – వరలక్ష్మి, పాపన్నపేట మండల టాపర్ -
డీజిల్కు బదులు పెట్రోల్
చిన్నశంకరంపేట(మెదక్): డీజిల్కు బదులుగా పెట్రోల్ పోయగా ట్రాక్టర్ మొరాయించింది. ఈ సంఘటన చిన్నశంకరంపేట మండలం గవ్వలపల్లిలో చోటుచేసుకుంది. సోమవారం మండలంలోని వెంకట్రావుపల్లి గ్రామానికి చెందిన పెద్దంకి రాజు ట్రాక్టర్లో డీజిల్ పోయించేందుకు గవ్వలపల్లిలో పెట్రోల్ పంప్కు వచ్చాడు. రూ.1000 డీజిల్ పోయాల్సిందిగా చెప్పగా.. పంప్ వర్కర్ పెట్రోల్ పోస్తున్నడాన్ని గమనించిన ట్రాక్టర్ యజమాని రాజు.. వర్కర్ను హెచ్చరించి ఆపివేయించాడు. అప్పటికే 5 లీటర్ల వరకు పోసేశాడు దీంతో ఇంజిన్ మోరాయించింది. దీనిపై యజమాని వెంటనే పోలీస్లకు సమాచారం అందించాడు. దీంతో వారు చేరుకుని పంప్ మేనేజర్ను ప్రశ్నించగా, పెట్రోల్ పొరపాటున పోసినట్లు అంగీకరించారు. ట్రాక్టర్ ఇంజిన్ను బాగు చేయిస్తామని చెప్పి.. మరో వాహనం సాయంతో మెకానిక్ షెడ్డుకు తరలించారు. కాగా, రెండు రోజుల క్రితం శాలిపేటకు చెందిన వ్యక్తికి చెందిన ట్రాక్టర్లోనూ పెట్రోల్ పోశారన్న విషయం వెలుగుచూసింది. ఇప్పటికై నా అధికారులు స్పందించి పెట్రోల్ యజమాన్యంపై చర్యలు చేపట్టాలని కోరారు. ఓ ఆయిల్ బంక్ వర్కర్ నిర్వాకం మొరాయించిన ట్రాక్టర్ పోలీసులకు యజమాని ఫిర్యాదు -
కరాటే మెగా టోర్నీ విజేత ప్రణవి
మద్దూరు(హుస్నాబాద్): కరాటే మెగా చాంపియన్ షిప్ టోర్నీలో బట్టర ప్రణవి చాంప్గా నిలిచింది. గోవాలో జరిగిన యూనివర్శల్ 369 షోటోకాన్, కరాటే అసోషియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో టోర్నీ జరిగింది. ఇందులో మద్దూరు మండలం రేబర్తికి చెందిన బాలిక.. ఫైరింగ్ విభాగంలో గోల్డ్మెడల్, కటాస్ విభాగంలో సిల్వర్ మెడల్ సాధించింది. రెండు పతకాలను సాధించిన ప్రణవిని సినీనటుడు సుమన్తో పాటు పలువురు కరాటే మాస్టర్లు ప్రత్యేకంగా అభినందించారు. బాలిక ఏడేళ్లుగా కరాటేలో శిక్షణ తీసుకొని బ్లాక్బెల్ట్ను సాధించింది. చదువుతో పాటు కరాటేలో రాణిస్తుండటం పట్ల ఆమె తల్లిదండ్రులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వివాహిత అదృశ్యం కొండపాక(గజ్వేల్): వివాహిత మహిళ అదృశ్యమైన సంఘటన కుకునూరుపల్లి మండలంలో జరిగింది. ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్.. ధార్ జిల్లా భాగ్ గ్రామానికి చెందిన దంపతులు బులియా సలాం, భార్య బులియా పింకీ. వీరు మేదినీపూర్ శివారులో గల కామాక్షి ఇటుకుల తయారీ కంపెనీలో ఆరు నెలలుగా కూలీ పనులు చేస్తూ అక్కడే నివాసం ఉంటున్నారు. ఈనెల 15న ఇటుకల కంపెనీలో పనులు ముగించుకొని ఇద్దరూ ఆరోజు రాత్రి నిద్రించారు. మరుసటి రోజు ఉదయం నిద్ర లేచే సరికి భార్య కనిపించడం లేదు. బంధువుల, తెలిసిన వారిని భర్త సంప్రదించినా ఎలాంటి ఆచూకీ లభించలేదు. దీంతో పింకీ అదృశ్యంపై పోలీస్టేషన్న్లో చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. ఎవరికై నా కనిపిస్తే 87126–67345 నంబర్కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. రాజశేఖర్రెడ్డికి సన్మానంరామాయంపేట(మెదక్): రెడ్క్రాస్ సంస్థ జిల్లా చైర్మన్, లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షుడు ఏలేటి రాజశేఖర్రెడ్డి ఉత్తమ సభ్యుడిగా ఎన్నికయ్యారు. రామాయంపేట లయన్స్ క్లబ్లో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు కొత్త సభ్యులను చేర్పించారు. అందుకు గాను ఆదివారం రాత్రి కరీంనగర్లో జరిగిన క్లబ్ సమావేశంలో లయన్ రాష్ట్ర ప్రతినిధి సునిల్కుమార్, కౌన్సిల్ చైర్మన్ తీగల మోహన్రావు.. ఆయనకు గోల్డ్ మెడల్, ప్రశంసాపత్రాన్ని అందజేశారు. -
పరిమితి పెంచారు.. కొనుగోలు ఆపారు
కంగ్టి(నారాయణఖేడ్): జొన్నపంట పండించిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వారం రోజుల పాటు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల ఆధ్వర్యంలో మార్క్ఫెడ్ అఽధికారులు సవ్యంగా కొనుగోళ్లు నిర్వహించారు. 18 రోజులుగా కొనడం ఆపి వేశారు. ప్రతి ఎకరాకు 8.85 క్వింటాళ్ల కొంటామని ప్రభుత్వం చెప్పింది. అయితే ప్రతి ఎకరాకు 12 క్వింటాళ్ల వరకు కొంటామని ఇటీవల వ్యవసాయ శాఖ మంత్రి ప్రకటించారు. అప్పటి నుంచి ఎందుకు కొనడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కంగ్టి మండలంలో 6,600 ఎకరాల్లో జొన్న పంటను రైతులు పండించారు. అందులో 10 వేల బస్తాలు కూడా కొన లేదని రైతులు చెబుతున్నారు. అందులోనూ ఈ నెల 3వ తేదీ నుంచి కొనుగోలు నిలిపేశారని అంటున్నారు. దీంతో చేలల్లో జొన్నలు కుప్పలుగా చేసి 15 రోజులు గడుస్తున్నాయి. ఇటు చూస్తే అకాల వానలు కురుస్తుండటంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంటలు తడిచి ఎక్కడ రేటు నష్టపోతామోనని లోలోన మథనపడుతున్నారు. కాగా, మార్క్ఫెడ్ డీఎం రంజితారెడ్డికి వివరణ కోరగా.. కొనుగోలు కేంద్రాల్లోని బస్తాలు గోదాంలకు తరలించాల్సి ఉందన్నారు. ఆతర్వాత కొంటామని చెప్పారు. అయితే అప్పటి నుంచి మూడు, నాలుగు లారీలు మాత్రమే గోదాంలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. దీంతో జొన్నల కొంటారా? లేదా అని సందిగ్ధంలో రైతులు ఉన్నారు. సంబంధిత అధికారులు స్పందించి పంట కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతున్నారు. 8.85 క్వింటాళ్ల నుంచి 12 క్వింటాళ్ల వరకు పెంపు ఆ వెంటనే ఆగిన జొన్న విక్రయాలు చేలల్లోనే కుప్పలు అకాల వర్షాలతో రైతుల్లో ఆందోళన -
ఏడుపాయల హుండీ లెక్కింపు
పాపన్నపేట(మెదక్): ఏడుపాయల వన దుర్గాభవానిదేవి హుండీ ఆదాయం రూ 47,50,681 వచ్చినట్లు అసిస్టెంట్ కమిషనర్ శివరాజ్, ఆలయ చైర్మన్ బాలాగౌడ్లు సోమవారం తెలిపారు. 70 రోజుల అనంతరం హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని రాజరాజేశ్వరి సేవా సమితి ఆధ్వర్యంలో గోకుల్షెడ్లో నిర్వహించారు. దేవాదాయ ధర్మాధాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్, ఇన్స్పెక్టర్ రంగారావు పర్యవేక్షణలో చేపట్టారు. మిశ్రమ బంగారు, వెండి కానుకలు కూడా వచ్చాయని తెలిపారు. కార్యక్రమంలో పాలకమండలి సభ్యులు వెంకటేశం, మనోహర్, చక్రపాణి, మోహన్రావు, పెంటయ్య, నాగభూషణం, రఘు, యాదయ్య, సాయిలు, బాగారెడ్డితోపాటు ఆలయ సిబ్బంది, సూర్య, శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, మధుసూదన్రెడ్డి, ప్రతాప్రెడ్డి, శ్రీనివాస్ శర్మ, యాదగిరి పాల్గొన్నారు.70 రోజుల ఆదాయం రూ.47.50 లక్షలు -
దరఖాస్తుల ఆహ్వానం
నారాయణఖేడ్: నాగల్గిద్ద మండలంలోని మోర్గి మోడల్ కళాశాలలో 2024– 25 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ రమేష్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ గ్రూపులలో 40 చొప్పున మొత్తం 120 సీట్లు ఉన్నాయని పేర్కొన్నారు. టెన్త్ ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈనెల 31 వరకు ఎలాంటి ఫీజు లేకుండా ఆన్లైన్లో అప్లయ్ చేసుకోవచ్చని సూచించారు. రైతు సమస్యలు పరిష్కరించాలని ఆందోళన సంగారెడ్డి టౌన్: రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం బీజేపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. అనంతరం కార్యాలయంలో వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు వడ్లకు రూ.500 బోనస్ ఇస్తామన్న హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని చివరి గింజ వరకు కొనుగోలు చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు రాజేశ్వరరావు దేశ్పాండే, రాజు గౌడ్, రవి పాల్గొన్నారు. విత్తనాల పంపిణీ ప్రారంభం న్యాల్కల్(జహీరాబాద్): న్యాల్కల్లో సోమ వారం విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని మండల వ్యవసాయశాఖ అధికారి లావణ్య ప్రారంభించారు. 450 బస్తాలు (40 కేజీల బస్తా) జనుము విత్తనాలను స్థానిక ఎరువుల విక్రయ కేంద్రంలో రైతులకు అందజేశారు. విత్తనాలు అవసరమైన రైతులు ధ్రువీకరణ పత్రాలతో రావాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో ఏఈఓలు షరీఫ్ పాల్గొన్నారు. ఉల్లాసంగా కుస్తీ పోటీలు నారాయణఖేడ్: మండలంలోని తుర్కాపల్లి గ్రామంలోని భూలక్ష్మమ్మ ఉత్సవాల్లో భాగంగా సోమవారం కుస్తీ పోటీలు నిర్వహించారు. వివిధ గ్రామాలకు చెందిన మల్లయోధులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. గెలుపొందిన విజేతలకు నగదు బహుమతులు అందజేశారు. జాతరను పురస్కరించుకొని ఉదయం నుంచి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాణ్యత పాటించాలి వట్పల్లి(అందోల్): ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని రాయికోడ్ ఏడీఏ సత్యనారాయణ అఽన్నారు. సోమవారం మండలంలోని ఖాదిరాబాద్, బిజిలీపూర్, కేరూర్ గ్రామాల్లో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా కొనుగోళ్లకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. ధాన్యం తేమశాతం 17లోపు ఉండేలా చూసుకోవాలని రైతులకు సూచించారు. వడ్లను వెంటనే మిల్లులకు తరలించాలని ఆదేశించారు. ఏఓ మహేష్చౌహాన్, ఏఈఓ భాగేష్, పీఏసీఎస్ చైర్మన్ వినోద్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనాలి సంగారెడ్డి టౌన్: వర్షానికి తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనాలని భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షుడు నరసింహారెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం ఆయన రైతులతో కలిసి కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ మాధురి, వ్యవసాయ శాఖ అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అకాల వర్షాలతో ధాన్యం తడిసి రైతులు ఇబ్బందుల్లో ఉన్నారని, అధికారులు స్పందించి ధాన్యాన్ని కొనుగోలు చేసి న్యాయం చేయాలన్నారు. కార్యక్రమంలో కిసాన్ సంఘ్ నాయకులు, రైతులు పాల్గొన్నారు. తొలిరోజు ‘టెట్’ ప్రశాంతం సిద్దిపేటఅర్బన్: జిల్లాలో సోమవారం నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ప్రశాంతంగా జరిగింది. సీబీటీ విధానంలో పరీక్షను రెండు సెషన్లుగా నిర్వహించారు. ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు నిర్వహించిన తొలి సెషన్కు 50 మందికి 40 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం 2 నుంచి 4.30 గంటల వరకు నిర్వహించిన సెషన్కు 51 మందికి 50 మంది హాజరయ్యారు. -
ఇదో రకం దోపిడీ!
ఖాళీ సంచులకూ కాసులే.. ● అడ్వాన్సుల పేరుతో గన్నీ బ్యాగుకు రూ.పది చొప్పున వసూలు ● వంద బస్తాలు తీసుకెళితే రూ.వెయ్యి ● ధాన్యం నింపుకొచ్చినా అడ్వాన్సు తిరిగివ్వని నిర్వాహకులు ● కొనుగోలు కేంద్రాల్లో ఇష్టారాజ్యం మా దృష్టికి రాలేదు.. గన్నీ బ్యాగుల కోసం రైతుల వద్ద అడ్వాన్సులు తీసుకుంటున్నట్లు మా దృష్టికి రాలేదు. మేము తరచూ కొనుగోలు కేంద్రాలను విజిట్ చేస్తున్నాం. సోమవారం కూడా అందోల్ ప్రాంతంలో కేంద్రాలను సందర్శించాం. అడ్వాన్సులు తీసుకుంటున్నట్లు రైతులు ఎక్కడా మాకు ఫిర్యాదు చేయడం లేదు. గన్నీ బ్యాగుల కోసం డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. – శ్రీధర్, జిల్లా సహకార శాఖ ఇన్చార్జి అధికారి, సంగారెడ్డి సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అన్నదాతలను అడుగడుగునా దోపిడీ చేస్తున్నారు. ట్రాన్స్పోర్టు కాంట్రాక్టర్లు రైతుల వద్ద ట్రిప్పునకు రూ.వెయ్యి నుంచి రూ.రెండు వేలు వసూలు చేస్తున్నారు. అంతేకాకుండా గన్నీ బ్యాగుల అడ్వాన్సుల పేరుతో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఒక్కో గన్నీ బ్యాగుకు రూ.10 చొప్పున తీసుకున్న అడ్వాన్సును రైతులకు తిరిగి చెల్లించడం లేదు. ఇదేమని అడిగితే నాణ్యత, తేమ శాతం సాకుగా చూపి ధాన్యం దించుకునేందుకు కొర్రీ పెడుతున్నారని రైతులు వాపోతున్నారు. అసలే అకాల వర్షాలు.. మరోవైపు నత్తనడకన సాగుతున్న తూకాలు.. ఇలా అనేక ఇబ్బందులు పడుతున్న రైతుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు కూడా చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఉచితంగా ఇవ్వాలి.. నిబంధనల ప్రకారం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు రైతులకు గన్నీబ్యాగులు ఉచితంగా ఇవ్వాలి. ఈ బ్యాగుల్లో ధాన్యాన్ని నింపుకుని కేంద్రాలకు తీసుకువస్తారు. కానీ అడ్వాన్సు పేరుతో తీసుకున్న డబ్బును అందిన కాడికి దండుకుంటున్నారు. రెండు ఎకరాలున్న చిన్న, సన్నకారు రైతు 40 క్వింటాళ్ల ధాన్యాన్ని తెచ్చేందుకు 100 బస్తాలు అవసరం ఉంటుంది. ఈ వంద బస్తాలు ఇవ్వాలంటే రూ.వెయ్యి అడ్వాన్సు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. అడ్వాన్సులు అడిగితే ధాన్యం దించుకోవడంలో కిరికిరి, నాణ్యత పేరుతో ఇబ్బందులు పెడతారనే భయంతో రైతులు ఇచ్చిన అడ్వాన్సు అడగడం లేదు. దీంతో నిర్వాహకులు ఈ మొత్తాన్ని జేబులో వేసుకుంటున్నారు. ఈ వ్యవహారాన్ని విలేకరులకు చెప్పేందుకు కూడా రైతులు నిరాకరిస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఐకేపీ మహిళలు నిర్వహిస్తున్న కేంద్రాల్లో ఈ పరిస్థితి లేదు. ప్రధానంగా రాజకీయ నేతల కనుసన్నల్లో నడుస్తున్న కేంద్రాల్లో ఈ దందా యథేచ్ఛగా సాగుతోంది. చాలా కేంద్రాల్లో ఇదే తంతు.. ● సంగారెడ్డి జిల్లాలో మొత్తం 211 కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ జరుగుతోంది. ఇప్పటి వరకు 14,524 మంది రైతుల వద్ద 74,894 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. ఈ సీజనులో ధాన్యం సేకరణకు మొత్తం 49.05 లక్షల గన్నీ బ్యాగులు అవసరమని పౌరసరఫరాల శాఖ అధికారులు అంచనా వేశారు. అవసరం మేరకు గన్నీ బ్యాగులు అందుబాటులో ఉన్నాయని అధికారులు పేర్కొంటున్నారు. ● మెదక్ జిల్లాలో 410 కేంద్రాల్లో ధాన్యం సేకరణ జరుగుతోంది. మొత్తం 47,254 మంది రైతుల వద్ద 2.05 లక్షల మెట్రిక్ టన్నుల ధ్యానాన్ని సేకరించారు. ఇప్పటి వరకు 54.80 లక్షల గన్నీ బ్యాగులను వినియోగించారు. మరో 38.64 లక్షల గన్నీ బ్యాగులు కేంద్రాల్లో అందుబాటులో ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ● సిద్దిపేట జిల్లాలో 403 కేంద్రాల్లో ధాన్యం కొంటున్నారు. ఇప్పటి వరకు 48,294 మంది రైతుల వద్ద 2.08 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇప్పటి వరకు సుమారు 52 లక్షల గన్నీ బ్యాగులను వినియోగించగా, మరో ఎనిమిది లక్షల బ్యాగులు అందుబాటులో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. -
రారండోయ్.. మా కళాశాలకు..
మీ భవితకు మాది గ్యారంటీ మా కళాశాలలో చేరండి.. మీకు ఉజ్వల భవిష్యత్ ఉంటుంది. కార్పొరేట్ కళాశాలలకు దీటుగా నాణ్యమైన బోధన ప్రమాణాలున్నాయి. అపార అనుభవం గల అధ్యాపకులు అంతా కలిసి.. మిమ్మల్ని ది బెస్ట్గా తీర్చిదిద్దుతారు. ఇక సౌకర్యాలు అంటారా? ఎలాగో అన్ని మౌలిక వసతులున్నాయి. దీని గురించి ఆలోచించే పనే లేదు. పైగా మా వద్ద చదివిన విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ర్యాంక్లు కొట్టారు. మీ భవిష్యత్కు మాది గ్యారంటీ. అని సర్కార్కళాశాల అధ్యాపకులు ఇంటర్ అడ్మిషన్ల కోసం తల్లిదండ్రులను కోరుతున్నారు. హుస్నాబాద్: స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల అధ్యాపక బృందం సభ్యులు అడ్మిషన్ల కోసం గ్రామగ్రామాన క్యాంపెయిగ్ నిర్వహిస్తున్నారు. ఒకప్పుడు కళాశాలలో సీటు దొరకాలంటే పెద్ద ప్రయాసే ఉండేది. కళాశాలలో సీటు కోసం పైరవీలు ఉండేవి. పైరవీలు ఉన్న కావాల్సిన గ్రూప్ దొరికేది కాదు. ఓ వైపు ప్రైవేట్ కళాశాలలు ఉన్నప్పటికీ సర్కార్ కళాశాలల్లో చదివే విద్యార్థులు అత్యుత్తమ ర్యాంక్లు సాధించిన పరిస్థితి ఉండేది. ప్రస్తుతం ప్రైవేట్ కళాశాలలు అన్ని మూతపడినా విద్యార్థుల కోసం వెతకాల్సిన పరిస్థితి నెలకొంది. దీనికి కారణం ప్రభుత్వం కులాల వారీగా రెసిడెన్షియల్ కళాశాలలు, గిరిజన, మైనార్టీ కళాశాలలు నెలకొల్ప డం. మరో వైపు మోడల్ స్కూల్లో ఇంటర్ విద్యాబోధన ప్రవేశపెట్టగా సర్కార్ కళాశాలలకు విద్యార్థుల అడ్మిషన్లు తగ్గుతూ వస్తున్నాయి. ఆర్థికంగా ఉన్న వారు కార్పొరేట్ కళాశాలలకు వెళ్తుడటంతో స్థానిక కళాశాల్లో వారి సంఖ్య గనణీయంగా తగ్గుతుంది. దీంతో స్థానిక కళాశాలలకు మనుగడ ఉండాలంటే అడ్మిషన్లు పెంచే బాధ్యతను అధ్యాపకులు తీసుకున్నారు. ప్రస్తుతం తమ కళాశాలలో అడ్మిషన్లు తీసుకోవాలని టెన్త్ ఉత్తీర్ణ సాధించిన వారి ఇళ్ల చుట్టూ తిరుగుతూ అధ్యాపకులు పాట్లు పడుతున్నారు. క్యాంపెయిన్ చేస్తున్న కళాశాల అధ్యాపకులుప్రత్యేక ప్రచారంప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలోని ప్రత్యేకతలను చెబుతూ కళాశాలలో అడ్మిషన్ల సంఖ్యను పెంచేలా అధ్యాపకులు కృషి చేస్తున్నారు. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ గ్రూప్లు ఇంగ్లిష్, తెలుగు మీడియంలో బోధన చేస్తున్నారు. ఎంపీసీ, బైపీసీ విద్యార్థినులకు ఎంసెట్, నీట్, సీఈసీ, హెచ్ఈసీ విద్యార్థినులకు టీటీసీ, లాసెట్ వంటి పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తున్నారు. ఉచిత పాఠ్యపుస్తకాలు, స్టడీ మెటీరియల్ అందజేస్తున్నారు. 2023లో ఎంపీసీ విభాగంలో స్టేట్ 8వ ర్యాంక్ సాధించారు. 2024 విద్యా సంవత్సరంలో ద్వితీయ సంవత్సరంలో 84 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈ విద్యా సంవత్సరంలో బైపీసీ విభాగంలో, ఎంపీసీ విభాగంలో మంచి మార్కులను విద్యార్థులు సాధించారు.కాగా,10 రోజుల నుంచి అధ్యాపకులు 10 తరగతిలో ఉత్తీర్ణత సాధించిన వారి జాబితా తీసుకొని ఊరురా తిరుగుతున్నారు. ఇంటింటికి వెళ్లి కళాశాలలో చేరండంటూ కరపత్రాలు పంపిణీ, డోర్ స్టిక్కర్లు అతికించి అధ్యాపకులు విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులను ప్రొత్సహిస్తున్నారు. -
తరలుదాం.. చదువుదాం..
న్యాల్కల్(జహీరాబాద్): మండల పరిధిలోని హద్నూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు ఊరు బాట పట్టారు. టెన్త్ ఉత్తీర్ణులైన విద్యార్థుల ఇళ్ల వద్దకు వెళ్లి వారిని కళాశాలలో చేర్పించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నారు. సోమవారం కళాశాల ప్రిన్సిపాల్ అశోక్ ఆధ్వర్యంలో అధ్యాపకులు అర్జున్, జగదీష్, శ్రీనివాస్, యాదగిరి, స్వర్ణలత, సౌందర్య, యాదగిరి, రాములు తదితరులు మామిడ్గి, ఇబ్రహీంపూర్, చినిగెపల్లి, ముంగి, రుక్మాపూర్ తదితర గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం నాణ్యమైన విద్యతో పాటు అన్ని సౌకర్యాలను కల్పిస్తోందని, విద్యార్థులను తమ కళాశాలలో చేర్పించాలని కోరారు. అందుకు స్పందించిన తల్లిదండ్రులు తమ పిల్లల వివరాలను తెలపడంతో పేర్లు నమోదు చేసుకున్నారు. -
గ్యాస్ రీఫిల్లింగ్ కేంద్రంపై పోలీసుల దాడులు
పది సిలిండర్లు సీజ్.. నిందితులపై కేసు సదాశివపేట (సంగారెడ్డి): గ్యాస్ రీఫిల్లింగ్ కేంద్రంపై పోలీసులు దాడులు చేసి సిలిండర్లను సీజ్ చేశారు. నిందితులపై కేసు నమోదు చేశారు. సీఐ మహేశ్గౌడ్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. గురునగర్ కాలనీలోని ఓ ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా పెద్ద రాయితీ సిలిండర్ల నుంచి అక్రమంగా చిన్న సిలిండర్లలోకి రీఫిల్లింగ్ చేస్తున్నారు. ఆపై అమ్మతున్నారని సమాచారం అందింది. కాగా సోమవారం ఎస్ఐ, వెంకట్రెడ్డి ఆధ్వర్యంలో దాడులు చేసి పది పెద్ద సిలిండర్లు, చిన్న సిలిండర్లను సీజ్ చేశామని సీఐ తెలిపారు. -
పేదరికాన్ని జయించి.. ప్రభుత్వ కొలువులు సాధించి..
పేదరికం.. చదువుకు అడ్డుకాదని నిరూపించారు. విద్యే ఆయుధంగా చేసుకొని జీవితంపై పోరాడారు. చదువులు పూర్తయిన వెంటనే పోటీ పరీక్షలకు సిద్ధమై ముగ్గురు కూడా.. ఒకరి తర్వాత మరొకరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. వారే హుస్నాబాద్ పట్టణానికి చెందిన రాజ్కుమార్, శ్వేత, శ్రీకాంత్. తండ్రి హమాలీ కారి్మకుడిగా పడిన కష్టానికి న్యాయం చేకూర్చారు. పట్టణ యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. హుస్నాబాద్: పట్టణానికి చెందిన చేర్యాల మైసయ్య, స్వరూప దంపతులు. వీరికి రాజ్కుమార్, శ్వేత, శ్రీకాంత్ సంతానం. పెద్ద కుమారుడు రాజ్కుమార్ అక్కన్నపేట పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పని చేస్తున్నారు. కూతురు శ్వేత గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తుంది. చిన్న కుమారుడు శ్రీకాంత్ నెల రోజుల క్రితం ఫైర్స్టేషన్ కానిస్టేబుల్గా ఎంపికయ్యాడు. కాల్ లెటర్ రాగానే జూలైలో ఫైర్ కానిస్టేబుల్గా శిక్షణ పొందనున్నాడు. తండ్రి మైసయ్య రోజు వారి హమాలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇంటిని చక్కదిద్దుకుంటూనే సంతానాన్ని ప్రయోజకులుగా తీర్చిదిద్దాలని సంకలి్పంచారు. భవిష్యత్లో తన పిల్లలు ఉన్నతమైన స్ధానంలో ఉండాలని ఆకాంక్షించారు. కష్టాన్ని పంటి కింద భరిస్తూనే కూలీ పనులు చేస్తూ పిల్లలకు ఉన్నత చదువులు చెప్పించారు. అనంతరం ఉద్యోగులు సాధించాలని భావించాడు. తండ్రి కష్టాన్ని చూసిన వారు కూడా ఆయన నమ్మకాన్ని ఒమ్ముచేయకుండా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యారు. ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. ఇప్పుడు ఆ కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నారు. -
12 స్థానాల్లో కాంగ్రెస్దే గెలుపు
మంత్రి దామోదర రాజనర్సింహ జోగిపేట(అందోల్): రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 12 లోక్సభ స్థానాల్లో గెలుస్తుందని మంత్రి దామోదర రాజనర్సింహ ధీమా వ్యక్తం చేశారు. జోగిపేట వ్యవసాయ మార్కెట్లోని 196 పోలింగ్ కేంద్రంలో తన కూతురు త్రిషతో కలిసి ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లాలోని జహీరాబాద్, మెదక్ పార్లమెంట్ స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంటుందని, ప్రజలు దేశంలో కూడా ప్రభుత్వ మార్పు కోరుకుంటున్నారని తెలిపారు. ఇండియా కూటమి అధికారంలోకి వచ్చి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం ఖాయమన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తర్వాతి స్థానం కోసం బీజేపీ, బీఆర్ఎస్లు పోటీ పడుతున్నాయన్నారు. రాష్ట్రం ప్రభుత్వం అమలుచేస్తున్న ఆరు గ్యారంటీలకు ప్రజలు ఆకర్షితులై కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారన్నారు. మున్సిపల్ చైర్మన్ జి.మల్లయ్య, మార్క్ఫెడ్ డైరెక్టర్ ఎస్.జగన్మోహన్రెడ్డి, ప్రవీణ్కుమార్ ఉన్నారు. -
పోలింగ్ సరళి ఇలా.. (ఓటింగ్ శాతం) ఉదయం 9 గంటలకు 12.88 ఉదయం 11 గంటలకు 31.83
మధ్యాహ్నం 1 గంటకు 50.71 మధ్యాహ్నం 3 గంటలకు 63.96 సాయంత్రం 5 గంటలకు 71.91 పోలింగ్ ప్రక్రియ ముగిశాక 80 (సుమారు) అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా..(సాయంత్రం 5 గంటల వరకు..) జహీరాబాద్ 71.91 అందోల్ 73.69 నారాయణఖేడ్ 70.83 కామారెడ్డి 67.79 ఎల్లారెడ్డి 74.74 జుక్కల్ 72.91 బాన్సువాడ 73.99 నియోజకవర్గం సగటు 71.91 -
పలుచోట్ల మొరాయించిన ఈవీఎంలు..
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు పలు చోట్ల మొరాయించాయి. పోలింగ్ ప్రక్రియ ప్రారంభానికి ముందు నిర్వహించే మాక్ పోలింగ్లోనే కొన్ని ఈవీఎంలలో సమస్య తలెత్తింది. దీంతో వాటిని సరిచేసి పోలింగ్ను ప్రారంభించారు. పోలింగ్ ప్రారంభమయ్యాక కూడా కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. తెల్లాపూర్లో ఈవీఎం మొరాయించడంతో ఓటేయడానికి వచ్చిన బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డితో సహా ఓటర్లు క్యూలైన్లో సుమారు గంట వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే నారాయణఖేడ్, తెల్లాపూర్, జోగిపేట్లలో టేక్మాల్ మండలం పల్వంచల్లోని పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలలో సమస్య వచ్చింది. హత్నూర, చీక్మద్దూర్, పల్పనూర్, గుండ్లమాచనూర్లలో కూడా ఇబ్బంది కలిగించాయి. ఆయా సెక్టోరల్ అధికారులు సాంకేతిక నిపుణుల సహాయంతో సరిచేసి పోలింగ్ను కొనసాగించారు. ఈ క్రమంలో ఓటర్లు కొంత ఇబ్బంది పడ్డారు. -
ప్రముఖులు ఓటేశారు..
రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి సిలారపు దామోదర రాజనర్సింహ తన కుటుంబసభ్యులతో కలిసి జోగిపేటలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి తెల్లాపూర్ మున్సిపాలిటీలో, పటాన్చెరు మండలం చిట్కుల్ గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్, బీజేపీ అభ్యర్థి రఘునందన్రావు బొప్పాపూర్లో ఓటేశారు. జహీరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనీల్కుమార్ మొగుడంపల్లి మండలం మాడ్గిలో, నారాయణఖేడ్లో కాంగ్రెస్ అభ్యర్థి సురేష్షెట్కార్, కామారెడ్డి జిల్లా డోంగ్లీ మండలం సిర్పూర్లో బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్ తమ కుటుంబసభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. కలెక్టర్ క్రాంతి సంగారెడ్డి పాతబస్టాండ్ వద్ద ఉన్న ప్రభుత్వ జూనియర్ కాలేజీ పోలింగ్ కేంద్రంలో, ఎస్పీ చెన్నూరి రూపేష్ 106 పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఓటు వేశారు. -
ఉదయం నుంచే ఉత్సాహంగా..
పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైన ఉదయం 7 గంటల నుంచే ఓటర్లలో ఉత్సాహం కనిపించింది. మధ్యాహ్నం 12 గంటల వరకు పోలింగ్ వేగంగా సాగగా.. మూడు గంటల వరకు కొంత మందకొడిగా సాగింది. మళ్లీ సాయంత్రం 4 తర్వాత ఊపందుకుంది. దీంతో ఓటింగ్ శాతం పెరిగింది. పోలింగ్ ముగిసే సమయం సాయంత్రం 6 గంటలలోపు కేంద్రాలకు చేరుకున్న వారందరికీ అధికారులు ఓటు వేసే అవకాశం కల్పించారు. రామచంద్రాపురం మండలంలో పలు కేంద్రాల్లో సాయంత్రం 6 గంటల తర్వాత కూడా క్యూలైన్లు కనిపించాయి. 6 గంటలు కాగానే పోలింగ్ కేంద్రాలకు తాళం వేసి ఓటర్లను లోపలికి అనుమతించలేదు. సంగారెడ్డిలో వృద్ధురాలిని పోలింగ్ కేంద్రంలోకి తీసుకు వస్తున్న సిబ్బంది -
ఈవీఎంల మొరాయింపు
నారాయణఖేడ్: ఖేడ్ నియోజకవర్గంలోని 298 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం మాక్ పోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో 7 ఈవీఎంలు మొరాయించాయి. వెంటనే వాటిని మార్చి కొత్త ఈవీఎంలను ఏర్పాటు చేశారు. పోలింగ్ ప్రారంభించాక నారాయణఖేడ్ పట్టణంలోని 170వ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం మొరాయించి 45నిమిషాల పాటు పోలింగ్ నిలిచిపోయింది. అధికారులు ఈవీఎం, వీవీ ప్యాట్ రెండింటినీ మార్చి పోలింగ్ ప్రక్రియను కొనసాగించారు. పోలింగ్ తీరు తెన్నులను ఎప్పటికప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం సాధారణ పరిశీలకులు గోపాల్ తివారీ, కలెక్టర్ వల్లూరి క్రాంతిలు పర్యవేక్షించారు. నారాయణఖేడ్లోని కంట్రోల్ రూంలో 12 మంది కంప్యూటర్ ఆపరేటర్లను ఏర్పాటు చేసి, ఎప్పటికప్పుడు సమాచారం సేకరించడమే కాకుండా ఉన్నతాధికారులకు అందించినట్లు ఆర్డీవో అశోక చక్రవర్తి తెలిపారు. ఎన్నికల తీరు తెన్నులను జిల్లా అధనపు ఏస్పీ సంజీవరావు పోలింగ్ కేంద్రాలను సందర్శించి పరిశీలించారు. లోక్సభ ఎన్నికల పోలింగ్ నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఉదయం మందకొడిగా ప్రారంభమైంది. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి పోలింగ్ కేంద్రాలు ఓటర్లు లేక అనేకచోట్ల వెలవెల బోయాయి. -
ఊర కుక్కల దాడిలో 48 జీవాలు మృతి
వర్గల్(గజ్వేల్): ఊరకుక్కల దాడిలో 48 మూగజీవాలు మృత్యువాత పడ్డాయి. ఈ ఘటన సోమవారం ఉదయం వర్గల్ మండలం అంబర్పేటలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. వర్గల్ మండలం అంబర్పేటకు చెందిన గొర్రెల పెంపకందారు బండ సత్యనారాయణకు 150 దాకా గొర్రెలు ఉన్నాయి. వాటిని గ్రామ సమీపంలోని గొర్రెల కొట్టంలోకి పంపి వంతుల వారీగా కుటుంబసభ్యులు కాపలా ఉంటారు. ఆదివారం సాయంత్రం జీవాలను కొట్టంలోకి పంపి భోజనం చేసేందుకు ఇంటికెళ్లాడు. భోజనం చేసిన తర్వాత గాలి, వాన రావడంతో సత్యనారాయణ ఇంటి వద్దే ఉండిపోయాడు. అదే రాత్రి కొట్టంపై ఊరకుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో 48 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. అనేక గొర్రెలు గాయాలపాలయ్యాయి. సోమవారం ఉదయం కొట్టం వద్దకు వెళ్లిన సత్యనారాయణ గొర్రెలు మృత్యువాత పడినట్లు గుర్తించాడు. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు కోరాడు. మృతిచెందిన గొర్రెలను వర్గల్ జెడ్పీటీసీ బాలమల్లు యాదవ్ పరిశీలించి బాధితుడిని ఓదార్చి ఆర్థికసాయం అందజేశారు. -
హల్దీవాగులో దూకి వృద్ధుడు ఆత్మహత్య
తూప్రాన్: హల్దీవాగులో దూకి వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం చోటు చేసుకుంది. ఎస్ఐ శివానందం కథనం మేరకు.. మనోహరాబాద్ మండలం కాళ్లకల్ గ్రామానికి చెందిన చీర్ల ఆగమయ్య(65) భార్య కొంతకాలం కిందట అనారోగ్యంతో చనిపోయింది. పెళ్లీడు వచ్చిన కూతురు వివాహం చేయలేని స్థితిలో ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపం చెందేవాడు. ఆదివారం ఇంట్లోంచి బయలుదేరిన ఆగమయ్య తూప్రాన్ పట్టణ సమీపలలోని నాగులపల్లి చౌరస్తా సమీపంలోని హల్దీవాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం హల్దీవాగులో మృతదేహం గుర్తించి దర్యాప్తు చేపట్టగా కాళ్లకల్ గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించామని ఎస్ఐ తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
టీడీపీ మరో కుట్ర మాచర్లలో హైటెన్షన్
బంగారుకొండను పేరుస్తున్న ఆర్బీఐ..!
రేవ్ పార్టీలో పట్టుబడ్డ టీడీపీ నేతలు
’ఆప్‘ రాకతో నెలకు రూ. 18 వేలు ఆదా: రాఘవ్ చద్దా
ఈ భారత సంతతి సీఈవో వేతనం రూ.1,260 కోట్లు!
16ఏళ్లకు స్టార్ ఆపై 22ఏళ్లకే విషాదం.. రజనీకి ఇష్టమైన హీరోయిన్ ఎవరు?
రిమాండ్ రిపోర్టులోవిస్తుపోయే నిజాలు
బెంగళూరు: రేవ్పార్టీ ముసుగులో వ్యభిచార దందా?
షోకాజ్ నోటీసులపై స్పందించిన బీజేపీ ఎంపీ
అసలు ఈ గొడవ కి ముందు వీడియో.. లైవ్ లో చూపించిన అంబటి
తప్పక చదవండి
- జీహెచ్ఎంసీలో కామ పిశాచి!
- అందుకే నా పేరుకి బ్లూ చేర్చా: ‘పుష్ప పుష్ప..’ సింగర్
- ‘బీజేపీ చేయలేని పని రాహుల్ చేస్తున్నారు’
- అంబానీల అతిథులకు కరీంనగర్ కానుకలు
- కన్హయ్యకు రూ. 52 లక్షలు? ఎవరెవరిచ్చారు?
- హిట్ సినిమా మేకర్స్కు ఇళయరాజా నోటీసులు
- తెలుగు రాష్ట్రాల్లో డెత్ ట్రావెల్స్
- ఛాన్స్ వచ్చినా మోదీ బయోపిక్లో నటించను: సత్యరాజ్
- ‘గేటు’లో గూండాగిరి.. ఓటర్లను బెదిరించి పచ్చముఠాల రిగ్గింగ్
- రాయల్స్ ముందుకు...చాలెంజర్స్ ఇంటికి...
Advertisement