-
టెస్లా కొనుగోలు దారులకు మస్క్ అనూహ్య ఆఫర్
టెస్లా సీఈవో ఎలోన్ మస్క్ బంపరాఫర్ ప్రకటించారు. టెస్లా ‘మోడల్ వై’ (Model Y) కొనుగోలు దారులకు 0.99శాతం ఏపీఆర్(యాన్యువల్ పర్సెంటేజ్ రేట్) ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఆఫర్ మే 31వరకు కొనసాగుతుంది. ఆటోమొబైల్ మార్కెట్లో ఇతర ఎలక్ట్రిక్ కార్ల కంపెనీల నుంచి పోటీ, తగ్గిపోతున్న కార్ల అమ్మకాలు టెస్లాపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి.ఈ తరుణంలో టెస్లా అమ్మకాలను పెంచే ప్రయత్నంలో టెస్లా మోడల్ వైపై మోడల్ వై భారీ ఆఫర్లు ఇస్తున్నారు. కొద్ది రోజుల క్రితం చైనా వాహనదారులు జీరో పర్సెంట్ వడ్డీతో టెస్లా కారును కొనుగోలు చేసే వెసులు బాటు కల్పించారు. దీంతో వడ్డీ చెల్లించే అవసరం లేకుండా టెస్లా కారును సొంతం చేసుకోవచ్చు.తాజాగా, అమెరికాలో మోడల్ వైపై 0.99% ఫైనాన్సింగ్తో భారీ తగ్గింపుతో పరిమిత కాల ఆఫర్ను అందిస్తున్నట్లు టెస్లా అధికారికంగా తెలిపింది. సాధారణంగా ఈ వడ్డీ 5 నుండి 7శాతం వరకు ఉంటుంది. కానీ మస్క్ వాహన కొనుగోలు దారులకు 0.99 శాతం వడ్డీకే టెస్లా వై మోడల్ కారును అందిస్తున్నారు. టెస్లా వెబ్సైట్ ప్రకారం, నిబంధనల మేరకు టెస్లా మోడల్ వై కొనుగులు దారులు 4,250వేల డాలర్లు డౌన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. 72 నెలల టెన్యూర్ ఫైనాన్స్ అందిస్తుంది. ఎలాంటి బెన్ఫిట్ లేకుండా నెలకు 603 డాలర్ల ఈఎంఐ చెల్లించాలి. అర్హతగల కొనుగోలుదారులు ఫెడరల్ టాక్స్ క్రెడిట్ నుండి కూడా ప్రయోజనం పొందవచ్చు. ఇది నిర్దిష్ట ఆదాయ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నవారికి నెలవారీ ఈఎంఐ తగ్గుతుంది. కేవలం 499 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. -
ఓహెచ్ఎమ్ ఈ లాజిస్టిక్స్తో ఫ్రెచ్ కంపెనీ డీల్.. 1000 కార్ల డెలివరీకి రెడీ
భారతీయ మార్కెట్లో అతి తక్కువ కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన ప్రెంచ్ వాహన తయారీ సంస్థ సిట్రోయెన్ ఎప్పటికప్పుడు తన ఉనికిని పెంచుకుంటూనే ఉంది. ఫ్యూయెల్ కార్లతో పాటు, ఎలక్ట్రిక్ కార్లను విక్రయిస్తున్న ఈ కంపెనీ ఇటీవల హైదరాబాద్కు చెందిన OHM E లాజిస్టిక్స్తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది.OHM E లాజిస్టిక్స్తో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం, సిట్రోయెన్ 1000 ఈ-సీ3 ఎలక్ట్రిక్ వాహనాలను దశల వారీగా సరఫరా చేయనుంది. మొదటి ఫ్లీట్ ఇండక్షన్ దశలో కంపెనీ 120 ఎలక్ట్రిక్ కార్లను డెలివరీ చేయనుంది. ఆ తరువాత 12 నెలల్లో మరో 880 కార్లను డెలివరీ చేస్తుంది.అక్టోబర్ 2022లో కేవలం 100 ఎలక్ట్రిక్ క్యాబ్లతో ప్రారంభమైన ఓహెచ్ఎమ్ ఇప్పుడు విస్తృతమైన సేవలు అందిస్తోంది. సిట్రోయెన్ ఈ-సీ3 ఎలక్ట్రిక్ కార్లు ప్రారంభం నుంచి మంచి అమ్మకాలు పొందుతూ భారతీయ వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. రానున్న రోజుల్లో కంపెనీ మరిన్ని ఉత్పత్తులను దేశీయ విఫణిలో లాంచ్ చేసే అవకాశం ఉందని భావిస్తున్నాము. -
భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా
భారత్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీని బట్టి పాలసీని రూపొందించలేదని, అన్నీ ఈవీ కంపెనీలకు ఒకేరకమైన పాలసీ ఉంటుందంటూ నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ అమితాబ్ కాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.భారత్ మార్కెట్లోకి టెస్లా ఎంట్రీపై అమితాబ్ కాంత్ ఓ కార్యక్రమంలో పరోక్షంగా స్పందించారు. కేంద్రం ప్రవేశపెట్టిన పాలసీలు అన్ని కంపెనీలు ఆ విధానాన్ని మాత్రమే అనుసరించాలని అమితాబ్ కాంత్ చెప్పారు. కొన్ని నిర్దిష్ట కంపెనీల ప్రకారం భారత్ తన ఈవీ పాలసీ విధానాన్ని మార్చదని స్పష్టం చేశారు. అంతేకాదు టెస్లా సంస్థ తమకు ప్రత్యేకంగా కొన్ని డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచి ఉండొచ్చు. భారత్లో ఎలక్ట్రిక్ కార్ల తయారీ కోసం కంపెనీలకు ప్రోత్సాహకాలు ఇస్తూ ప్రభుత్వం ఈవీ పాలసీని ప్రవేశ పెట్టిందని అన్నారు. భారత్లో కనీసం రూ.4150 కోట్ల పెట్టుబడి పెట్టే ఈవీ సంస్థలకు రాయితీలు అందిస్తామని కేంద్రం తెలిపింది. పాలసీ ప్రకారం దేశంలో ఈవీ కార్ల తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలి. లేదంటే దేశీయంగా తయారయ్యే విడిభాగాలను కనీసం 25శాతం వినియోగించాలి. ఐదేండ్ల తర్వాత ఆ మొత్తం వినియోగాన్ని 50 శాతానికి పెంచాలి అని ఈవీ పాలసీలో పేర్కొంది.కొత్త విధానం ప్రకారం, భారతదేశంలో ఈవీ ప్యాసింజర్ కార్ల తయారీ సౌకర్యాలను ఏర్పాటు చేసే కంపెనీలు 35,000 డాలర్లు, అంతకంటే ఎక్కువ ధర కలిగిన వాహనాలపై 15 శాతం తక్కువ కస్టమ్స్/దిగుమతి సుంకంతో పరిమిత సంఖ్యలో కార్లను దిగుమతి చేసుకోవడానికి అనుమతి ఉంది. -
తొక్కుతూ నడిపే మూడు చక్రాల కారు!
మీరు పెట్రోల్ లేదా డీజిల్, బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ హైబ్రిడ్ కార్లు, వాహనాలు చూసింటారు. సైకిల్ లాగా తొక్కే, బ్యాటరీతో నడిచే హైబ్రిడ్ కార్లను ఎప్పుడైనా చూశారా? పెడల్-ఎలక్ట్రిక్, సెమీ ఎన్క్లోజ్డ్, సైకిల్/కార్-హైబ్రిడ్ కార్లు జర్మనీ వీధుల్లో చక్కర్లు కొడుతున్నాయి.మొదట 2020లో కాన్సెప్ట్గా ప్రకటించిన ఈ వాహనాలను హాంబర్గ్కు చెందిన స్టార్టప్ హాప్పర్ మొబిలిటీ తయారు చేసింది. ఇది ఓపెన్-సైడ్ బాడీతో కూడిన త్రీ-వీలర్. వాతావరణ రక్షణను అందిస్తుంది. అదే సమయంలో రైడర్ను సౌకర్యవంతమైన కారు లాంటి డ్రైవింగ్ పొజిషన్లో ఉంచుతుంది. చూడటానికి కారులా ఉన్నా.. చట్టబద్ధంగా దీన్ని ఈ-బైక్గా పరిగణిస్తున్నారు.దీనికి 250-వాట్ రియర్ హబ్ మోటార్ను అమర్చారు. పెడలింగ్ చేస్తూ గంటకు 25 కిలో మీటర్ల గరిష్ట వేగంతో దూసుకెళ్లవచ్చు. అలాగే ఇందులో 30-Ah/48V/1,440-Wh లిథియం-ఐరన్-ఫాస్ఫేట్ బ్యాటరీ ఉంటుంది. ఇది ఒక్కో ఛార్జ్కు సుమారుగా 65 కిమీ ఇస్తుంది. మరో ఆసక్తికర విషయం ఏంటంటే కారుపై రూఫ్టాప్ సోలార్ ప్యానెల్ అమర్చుకుని బ్యాటరీని చార్జ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. ఇందులో వెనుక సీటు ఉండేది, లేనిది రెండు వర్షన్లు ఉన్నాయి. రెండు వెర్షన్లు గరిష్టంగా 160 కిలోల బరువును తట్టుకోగలవు.ఇలాంటి 30 వాహనాలు ప్రస్తుతం టెస్టింగ్లో ఉన్నాయి. వాహనం మొదటి ఎడిషన్ వాణిజ్య వెర్షన్ ఉత్పత్తి ఈ సంవత్సరం చివరిలో ప్రారంభం కానుంది. దీని ప్రీ ఆర్డర్ ప్రస్తుతం జర్మన్ కస్టమర్లకు అందుబాటులో ఉంది. 13,500 యూరోలు (సుమారు రూ.12 లక్షలు) చెల్లించి దీన్ని ఆర్డర్ చేయవచ్చు. కంపెనీ ప్రస్తుతం ఇతర దేశాలకు కూడా లభ్యతను విస్తరించే పనిలో ఉంది. -
త్వరలో మస్క్కు ముప్పు.. భారత్ సంతతి సీఈవో సంచలన వ్యాఖ్యలు
టెస్లా సీఈవో ఎలోన్ మస్క్ త్వరలో భారీ నష్టాల్ని చవిచూడనున్నారంటూ భారత సంతతి ఆంత్రప్రెన్యూర్ వివేక్ వాధ్వా హెచ్చరించారు. ఇటీవల టెస్లా ఎలక్ట్రిక్ కార్ల తయారీ భారత్లో కాదని చైనాతో సంత్సంబంధాలు నెరపడంపై ఎక్స్ వేదికగా వివేక్ వాధ్వా మస్క్ను ప్రశ్నించారు.తన ఈవీ కార్యకలాపాల కోసం భారత్ను కాదని చైనాని ఎంచుకోవడం మస్క్ భారీ మొత్తంలో నష్టపోనున్నారని వివేక్ వాధ్వా అన్నారు. చైనాలో ప్రమాదం అంచున వ్యాపారాలపై మస్క్కు మెయిల్ చేసినట్లు వెల్లడించారు. చైనా మస్క్ను గుడ్డిగా దోచుకుంటుందని నేను అతనిని ముందే హెచ్చరించాను. కార్ల తయారీని చైనా నుంచి భారత్కు తరలించాలని విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా సెంటర్ ఫర్ రష్యా యూరప్ ఆసియా స్టడీస్ డైరెక్టర్ థెరిసా ఫాలన్ పోస్ట్ను వివేక్ వాధ్వా ఉటంకించారు. థెరిసా ఫాలన్ తన పోస్ట్లో అమెరికా, యూరోపియన్ ఆటోమేకర్స్ చైనాలో ఎందుకు విఫలమవుతున్నారు. స్వల్ప కాలిక లాభాల కోసం టెక్, మేనేజ్మెంట్ టెక్నిక్ అంశాల్ని అక్కడ అమలు చేయడం ద్వారా చైనా ఎలాంటి ప్రయోజనాల్ని పొందుతుందని నివేదించారు. వాటి ద్వారా కార్ల తయారీ సంస్థలు ఎలా నష్టపోతున్నారని వివరించారు. ఆ అంశాన్ని ప్రధానంగా చర్చించిన వాధ్వా మస్క్ గురించి పై విధంగా వ్యాఖ్యానించారు. -
కొత్త ఎక్సీడ్ లగ్జరీ స్పోర్ట్స్కారు.. అదిరిపోయే ఫొటోలు
-
మస్క్కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
తన సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల మ్యాపింగ్, నావిగేషన్ ఫంక్షన్ల కోసం చైనా అతిపెద్ద సెర్చింజిన్ బైదూతో ప్రముఖ ఈవీ దిగ్గజం టెస్లా ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో చైనాలో టెస్లా లేటెస్ట్ డ్రైవింగ్ ఫీచర్లను పరిచయం చేయడానికి కీలకమైన అడ్డంకిని తొలగించుకోబోతుందని తెలుస్తోంది. ఫలితంగా టెస్లా స్టాక్ ధర 10 శాతానికి పైగా పెరిగింది.బైదూ అందించే టాప్ లేన్ లెవల్ నావిగేషన్, మ్యాపింగ్ ఆధారంగా టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల సేవలను అందుబాటులోకి తెచ్చే సౌలభ్యం కలగనుందని నివేదికలు వెలుగులోకి వచ్చాయి. కాగా, టెస్లా ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ వ్యవస్థ ఇప్పటి వరకు చైనాలో అందుబాటులో లేదు. దీన్ని అక్కడ ప్రవేశపెట్టేలా చైనా ప్రభుత్వ వర్గాలతో చర్చలు జరిపారు. ఈ చర్చల్లో చైనా కస్టమర్లకు సంబంధించిన డేటాను దేశం వెలుపలికి తీసుకెళ్లేందుకు అక్కడి ప్రభుత్వం అనుమతించడం లేదు. ఈ నేపథ్యంలో చైనా వెలుపలికి డేటాను బదిలీ చేసే అంశంపై కూడా మస్క్ ప్రభుత్వంతో చర్చించారు. -
భారత పర్యటన రద్దు.. అకస్మాత్తుగా చైనాలో ప్రత్యక్షమైన మస్క్
ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్ చైనాలో ప్రత్యక్షమయ్యారు. గత కొంత కాలంగా మస్క్ సారథ్యంలోని టెస్లా భారత్లో మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్ను ఏర్పాటు చేయనుందని, ఇందుకోసం మస్క్ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.కేంద్రం సైతం మస్క్ ఏప్రిల్ నెల 21, 22 తేదీలలో వస్తున్నారంటూ సూచనప్రాయంగా తెలిపింది. కానీ పలు అన్వేక కారణాల వల్ల భేటీ రద్దయింది. అయితే ఈ నేపథ్యంలో టెస్లా సీఈఓ తన ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ (ఎఫ్ఎస్డీ)కార్లలోని సాఫ్ట్వేర్ను విడుదల చేసేందుకు,ఎఫ్ఎస్డీ అల్గారిథమ్లకు శిక్షణ ఇవ్వడానికి దేశంలో సేకరించిన డేటాను విదేశాలకు బదిలీ చేసేందుకు కావాల్సిన అనుమతులను పొందేందుకు బీజింగ్లోని చైనా అధికారులతో భేటీ కానున్నారు.మరోవైపు ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్లపై ఎక్స్లో చర్చ మొదలైంది.దీనిపై మస్క్ స్పందిస్తూ అతి త్వరలో డ్రాగన్ కంట్రీలో ఎఫ్ఎస్డీ కార్లు అందుబాటులోకి రానుందని తెలిపారు. -
ఒకసారి ఛార్జ్చేస్తే 516 కి.మీ వెళ్లేలా కొత్త ఈవీ
జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ భారత విపణిలో కొత్త ఎలక్ట్రిక్ కారును విడుదల చేసింది. బీఎండబ్ల్యూ ఎలక్ట్రిక్ సెడాన్ ఐ5 మోడల్ను తాజాగా తన వినియోగదారులకు పరిచయం చేసింది. సెడాన్ సిరీస్లో భాగంగా విడుదల చేసిన కార్లలో తొలి ఎలక్ట్రిక్ మోడల్ ఇదేనని కంపెనీ వర్గాలు తెలిపాయి.సింగిల్ ఛార్జింగ్తో 516 కిలోమీటర్లు ప్రయాణించే ఈ కారు ధర రూ.1.20 కోట్లుగా నిర్ణయించినట్లు కంపెనీ అధికారులు తెలిపారు. కేవలం 3.8 సెకండ్లలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని కంపెనీ చెప్పింది. ఇది గంటకు 230 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని తెలిసింది. 83.9కిలోవాల్ హవర్ బ్యాటరీ సామర్థ్యం కలిగిన ఈ కారు కేవలం అరగంటలోనే 10 శాతం నుంచి 80 శాతం వరకు ఛార్జింగ్ అవనుంది. -
ఈవీ రూ.10 లక్షల లోపయితే ఓకే
సాక్షి, హైదరాబాద్: ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీ) కొనుగోలు చేసేవారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. పెరుగుతున్న వాయు కాలుష్యం..మండుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో వాహనదారులు వీటి వైపు మొగ్గుచూపుతున్నారు. అధికారిక గణాంకాల ప్రకారం భారత ఎలక్ట్రిక్ వాహన మార్కెట్ 2023లో రూ.16,675 కోట్లు ఉండగా..2025 నాటికి రూ. 62,532 కోట్లకు చేరే అవకాశముంది. పర్యావరణ పరిరక్షణకు దోహదపడే ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు ప్రోత్సహించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం పలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అయితే పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ కార్ల కొనుగోళ్ల విషయంలో వాహనదారులు భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్నట్టు లోకల్ సర్కిల్స్ అనే సంస్థ ఇటీవల నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా పలు జిల్లాల్లో నిర్వహించిన ఈ సర్వేలో పాల్గొన్న వారి అభిప్రాయాల్లో మెజారిటీ వ్యక్తులు రూ.8 నుంచి రూ.10 లక్షలలోపు ధర ఉంటే ఎలక్ట్రిక్ కారు కొనుగోలు సులువు అవుతుందనే అభిప్రాయపడ్డారు. ► పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో తాము ఎలక్ట్రిక్ కారు కొనాలని భావిస్తున్నట్టు 44 శాతం మంది చెప్పారు. ►పెట్రోల్, డీజిల్ ధరల నుంచి ఉపశమనం పొందేందుకు 31% మంది ఎలక్ట్రిక్ వాహనాలకు మారేందుకు ప్రయతి్నస్తున్నట్టు తెలిపారు. ►2023లో మనదేశంలో 72,321 ఎలక్ట్రిక్ కార్లు రిజిస్టర్ అయ్యాయి. లోకల్ సర్కిల్స్ సర్వేలో పాల్గొన్న వారిలో 5 శాతం మంది ఎలక్ట్రిక్ కారు కొనేందుకు ఆసక్తి చూపారు. ఈ లెక్క ప్రకారం 2024లో ఎలక్ట్రిక్ కార్ల డిమాండ్ 2,00,000కు చేరే అవకాశముంది. ►ఎలక్ట్రిక్ కార్ల కొనుగోలుకు సంబంధించి దేశవ్యాప్తంగా 319 జిల్లాల్లో లోకల్ సర్కిల్స్ సంస్థ నిర్వహించిన ఈ సర్వేలో 40 వేల మంది నుంచి అభిప్రాయాలు సేకరించింది. ►తెలంగాణలో ద్విచక్ర, త్రిచక్ర వాహనాలపైనే ప్రస్తుతం రిజి్రస్టేషన్ జీవితకాలపు ఫీజు రాయితీ ఉండగా, ఏపీలో కార్లు, జీపులపై కూడా రిజి్రస్టేషన్ ఫీజు పూర్తిగా రాయితీ ఇస్తున్నట్టు అధికారవర్గాల సమాచారం. ఎలక్ట్రిక్ కారు కొనాలనుకోవడానికి కారణం? ► పర్యావరణ హితంగా ఉండాలని.. 44% ►పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలను తట్టుకునేందుకు 31% ►తక్కువ ధరలు 15% ►ఇతర కారణాలు 5% ►చెప్పలేం 5% ఎలక్ట్రిక్ కారు కొనకపోవడానికి కారణాలు ? ►సాధారణ కార్లతో పోలిస్తే అధిక ధర 21 శాతం ►మా ప్రాంతంలో సరిపడా చార్జింగ్ స్టేషన్లు లేకపోవడం 21 శాతం ►ఎలక్ట్రిక్ కార్ల గురించి అవగాహన లేదు 12 శాతం ►ఈ సమయంలో కారు కొనాలనుకోవడం లేదు 26 శాతం ►నా బడ్జెట్కు తగిన మోడల్స్ ఈవీలో లేవు 7 శాతం ►ఇతర కారణాలు, కొనేంత డబ్బు లేదు 8 శాతం ►ఇది నాకు వర్తించదు 5 శాతం -
భారత్లో భవిష్యత్ అంతా ఎలక్ట్రిక్ కార్లదే
దేశంలో పెట్రోల్, డీజిల్ వాహనాలను పూర్తిగా లేకుండా చేయడమే తమ లక్ష్యమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఓ ఇంటర్వ్యూలో నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. భారతదేశాన్ని హరిత ఆర్థికవ్యవస్థగా మార్చేందుకు కృషి చేస్తున్నామని, ఇందులో భాగంగా హైబ్రిడ్ వాహనాలపై జీఎస్టీని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. భారత దేశం ఏటా ఇంధ దిగుమతులపై రూ.16 లక్షల కోట్లు ఖర్చు చేస్తోంది. ఈ పెట్రోల్, డీజిల్ వాహనాలు నిషేధిస్తే ఈ డబ్బును రైతులు, గ్రామాలు, యువతకు ఉపాధి వాటికి ఉపయోగించవచ్చు అని వెల్లడించారు. అంతేకాదు, హైబ్రిడ్ వాహనాలపై జీఎస్టీని 5శాతం, ఫ్లెక్స్ ఇంజన్లపై 12 శాతం మేర తగ్గించే ప్రతిపాదనను ఇప్పటికే కేంద్ర ఆర్థిక శాఖకు పంపామన్న ఆయన ప్రస్తుతం అవి పరిశీలన దశలో ఉన్నాయని పేర్కొన్నారు. పలు ఆటోమొబైల్ సంస్థలు ఫ్లెక్స్ ఇంజన్లను ఉపయోగించి మోటార్సైకిళ్లను తయారు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయని, ఆ సాంకేతికతను ఉపయోగించి ఆటో రిక్షాలను కూడా తయారు చేసేందుకు సమాయత్తం అవుతున్నాయని చెప్పారు. ప్రస్తుతం తను హైడ్రోజన్తో నడిచే కారులో తిరుగుతున్నారని, ఫ్యూచర్లో ప్రతి ఇంట్లో ఎలక్ట్రిక్ కార్లు కనిపిస్తాయని పేర్కొన్నారు. ఇది అసాధ్యమని చెప్పుకునేవాళ్లు తమ అభిప్రాయాలను మార్చుకునే రోజులు వస్తాయని నితిన్ గడ్కరీ అన్నారు. -
మొదటి విద్యుత్కారును ఆవిష్కరించిన ఫేమస్ కంపెనీ
ప్రపంచవ్యాప్తంగా ఇకపై పూర్తిగా విద్యుత్ కార్లనే తయారు చేసి విక్రయించాలని జర్మనీ వాహన సంస్థ ఫోక్స్వ్యాగన్ నిర్ణయించుకుంది. తాజాగా భారత్లో తన మొదటి విద్యుత్ కారు ‘ఐడీ.4’ను ఆవిష్కరించింది. గ్లోబల్గా ఉన్న ప్రముఖ కార్ల తయారీ సంస్థలు కొత్త పంథాను అనుసరిస్తున్నాయి. క్రమంగా దాదాపు అన్ని కంపెనీలు ఈవీవైపు మొగ్గుచూపుతున్నాయి. అందులో భాగంగా తాజాగా ఫోక్స్వ్యాగన్ భారత్లో విద్యుత్ వాహన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఈ ఏడాదిలోనే ఈ కారును విపణిలోకి విడుదల చేయనున్నట్లు ఫోక్స్వ్యాగన్ ప్యాసింజర్ కార్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (సేల్స్ ఇంటర్నేషనల్ ఆపరేషన్స్) మైఖేల్ మేయర్ తెలిపారు. ఐడీ.4ను రెండు వేరియంట్లతో తీసుకోస్తున్నారు. 62 కిలోవాట్అవర్ సామర్థ్యం ఉన్న వేరియంట్ ఒక్కఛార్జ్లో 336 కిమీ వరకు వెళ్లగలదు. సింగిల్-మోటార్, రియర్-వీల్-డ్రైవ్తో అందుబాటులో ఉంటుంది. రెండోది 82 కిలోవాట్అవర్ సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇది ఒక్కఛార్జ్తో 443 కిమీలు వెళ్లగలదు. సింగిల్-మోటార్, డ్యూయల్-మోటార్, ఆల్-వీల్-డ్రైవ్తో మార్కెట్లో రానుంది. ధరకు సంబంధించి కంపెనీ ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే రూ.50లక్షలు-రూ.60లక్షల మధ్య ధర ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. త్వరలో ఈ కారును మార్కెట్లోని తీసుకురానున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఇదీ చదవండి: క్రెడిట్ కార్డులు వాడుతున్నారా..? కీలక మార్పులు చేసిన బ్యాంకులు ఈ ఏడాది భారత ప్రయాణికుల వాహన విపణి 5-7 శాతం మేర పెరిగే అవకాశం ఉందని.. తాము 10-15 శాతం వృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. క్రమంగా విద్యుత్కార్లను ఆవిష్కరణను పెంచుతూ సమీప భవిష్యత్తులో పూర్తిగా ఈవీలను తయారుచేస్తామని మేయర్ తెలిపారు. ఈ ప్రక్రియలో ప్రపంచవ్యాప్తంగా ఫోక్స్వ్యాగన్ ముందు వరుసలో ఉందని చెప్పారు. -
ఒకసారి ఛార్జ్ చేస్తే హైదరాబాద్ టు శ్రీకాకుళం!
చైనాకు చెందిన స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ షావోమీ తాజాగా తమ తొలి విద్యుత్ కారును ఆవిష్కరించింది. బీజింగ్లో జరిగిన కార్యక్రమంలో కంపెనీ సీఈఓ ‘లీ జున్’ దీన్ని పరిచయం చేశారు. ఎస్యూ7గా వ్యవహరించే ఈ కారును మార్చి 28న చైనాలో విడుదల చేస్తామని ఆయన తెలిపారు. ఈ సెడాన్లో ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్ కంపెనీ ప్రముఖ ఫోన్లతో అనుసంధానమయ్యేలా రూపొందించారు. చైనాలో దిగ్గజ కంపెనీలుగా పేరొందిన ‘కాన్టెంపరరీ యాంపరెక్స్ టెక్నాలజీ’, బీవైడీ నుంచి తీసుకున్న బ్యాటరీలను ఈ కార్లలో వాడుతున్నారు. భవిష్యత్తులో ప్రపంచంలో తొలి ఐదు దిగ్గజ వాహన తయారీ సంస్థల్లో ఒకటిగా నిలుస్తామని లీ జున్ ధీమా వ్యక్తం చేశారు. ఈ కారుని ‘సెల్-టు-బాడీ’ టెక్నాలజీతో అభివృద్ధి చేసినట్లు తెలిపారు. దీంతో బ్యాటరీని నేరుగా వాహన నిర్మాణానికే అనుసంధానం చేసినట్లు వివరించారు. ఫలితంగా కారు దృఢత్వం పెరిగిందని పేర్కొన్నారు. ఇప్పటికే కంపెనీ రూపొందించిన అనేక యాప్లకు ఈ కారులో యాక్సెస్ ఉంటుందన్నారు. ఈ కారు ఎస్యూ7, ఎస్యూ7 మ్యాక్స్ పేరిట రెండు వేరియంట్లలో లభించనుంది. ఎస్యూ 7 విషయానికి వస్తే.. 0-100 kmph వేగాన్ని 5.28 సెకన్లలో అందుకుంటుందని కంపెనీ తెలిపింది. అలాగే ఒక్కసారి ఛార్జ్ చేస్తే 668 కిలోమీటర్లు వెళ్తుంది. గరిష్ఠ వేగం 210 కి.మీ/గం. అత్యధికంగా 400 ఎన్ఎం టార్క్ వద్ద 299 పీఎస్ శక్తిని విడుదల చేస్తుంది. ఇదీ చదవండి: కంపెనీని బురిడీ కొట్టించి రూ.180 కోట్లు గ్యాంబ్లింగ్.. అసలేం జరిగిందంటే.. మరోవైపు ఎస్యూ7 మ్యాక్స్ 2.78 సెకన్లలో 0-100 kmph వేగాన్ని అందుకుంటుంది. ఒక్క ఛార్జింగ్తో 800 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. దీని గరిష్ఠ వేగం 265 కి.మీ/గం. 838 ఎన్ఎం టార్క్ వద్ద 673 పీఎస్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ కార్ల ధరలను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. -
ఒకసారి చార్జింగ్తో 650 కిలోమీటర్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో ఉన్న చైనా దిగ్గజం బీవైడీ.. భారత్లో సీల్ ఎలక్ట్రిక్ సెడాన్ను మూడు వేరియంట్లలో ఆవిష్కరించింది. ధర రూ.41 లక్షలతో ప్రారంభమై రూ.53 లక్షల వరకు ఉంది. ఒకసారి చార్జింగ్తో వేరియంట్నుబట్టి ఈ కారు 510–650 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 3.8 సెకన్లలో అందుకుంటుంది. 15.6 అంగుళాల టచ్్రస్కీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 10.25 అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, హెడ్–అప్ డిస్ప్లే వంటి హంగులు ఉన్నాయి. ప్రపంచంలో తొలిసారిగా సెల్ టు బాడీ, ఇంటెలిజెంట్ టార్క్ అడాప్షన్ కంట్రోల్ సాంకేతికతలతో రూపుదిద్దుకుందని కంపెనీ తెలిపింది. అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ను పొందుపరిచారు. 4.8 మీటర్ల పొడవు ఉంది. పూర్తిగా తయారైన కారును చైనా నుంచి భారత్కు దిగుమతి చేస్తారు. ఇప్పటికే బీవైడీ భారత్లో ఈవీ6 ఎలక్ట్రిక్ ఎంపీవీ, ఆటో3 ఎలక్ట్రిక్ ఎస్యూవీని విక్రయిస్తోంది. రూ.30 లక్షలకుపైగా ఖరీదు చేసే లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో భారత్లో తాము నాయకత్వ స్థానంలో ఉన్నామని బీవైడీ ఇండియా ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వెహికల్ బిజినెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సంజయ్ గోపాలకృష్ణన్ తెలిపారు. -
ఈయనే లేకుంటే భారత్లో ఎలక్ట్రిక్ కారు పుట్టేదా? ఎవరీ చేతన్ మైని..
కేవలం డీజిల్, పెట్రోల్ కార్లను మాత్రమే వినియోగిస్తున్న సమయంలో ఎలక్ట్రిక్ కార్ల తయారీ కోసం వచ్చిన ఆలోచన ఆటోమోటివ్ పరిశ్రమలో విప్లవాత్మకమైన ప్రయాణానికి నాంది పలికింది. ఈ ప్రయాణంలోనే 'రేవా' (Reva) పుట్టుకొచ్చింది. ఈ కారు ఎలా వచ్చింది, భారతదేశంలో ఎలక్ట్రిక్ కారు ప్రారంభం కావడానికి కారకులు ఎవరనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఫ్యూయెల్ కార్లను వాడుతున్న కాలంలో తన దూరదృష్టితో ఎలక్ట్రిక్ కారు తయారు చేయడానికి పూనుకున్న వ్యక్తి 'చేతన్ మైని' (Chetan Maini). పచ్చని భవిష్యత్ కోసం కలలు కంటూ.. ఎలక్ట్రిక్ కారు 'రేవా'కు పునాది వేశారు. ఇదే నేడు గణనీయమైన ఎలక్ట్రిక్ వాహనాల పెరుగుదలకు మార్గదర్శం అయింది. సవాళ్లకు ఏ మాత్రం భయపడకుండా.. చేతన్ మైని ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ఇంధన వినియోగం తగ్గించడానికి, పర్యావరణ సమతుల్యతను కాపాడటానికి ఎలక్ట్రిక్ మొబిలిటీ కీలకమని తన నమ్మకానికి కట్టుబడి పనిచేశారు. అదే ఈ రోజు ప్రభుత్వం కూడా ఈవీల తయారీకి దోహదపడేలా చేస్తోంది. ఎవరీ 'చేతన్ మైని'? 1970 మార్చి 11న చేతన్ మైని బెంగళూరులో జన్మించారు. ఈయన తండ్రి సుదర్శన్ కె మైని. చేతన్ 1992లో మిచిగాన్ యూనివర్సిటీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీ, 1993లో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. చదువు పూర్తయిన తరువాత ప్రపంచం 100 శాతం ఈవీ రంగం వైపు పరుగెడుతుందని భావించి, ఇందులో భారత్ కూడా ప్రధానంగా ఉండాలని ఆశించి, బెంగళూరులో ఒక బృందాన్ని నిర్మించి దానికి నాయకత్వం వహించి.. రెండు సంవత్సరాల్లో రేవా ఎలక్ట్రిక్ కారు ప్రారంభమైంది. రేవా మహీంద్రా గ్రూప్తో చేతులు కలిపిన తర్వాత, మహీంద్రా రేవా ఏర్పడింది. ఇందులో 'చేతన్' టెక్నాలజీ & స్ట్రాటజీ చీఫ్గా పనిచేశారు. మూడు సంవత్సరాల పాటు పనిచేసి కొత్త సాంకేతికతలను నిర్మించడంపై దృష్టి సారించారు. ఆ తరువాత మహీంద్రా ఈ20 వెహికల్ పుట్టుకొచ్చింది. ఆ సమయంలోనే ఈయన కంపెనీ సీఈఓగా పదవి చేపట్టారు. కొన్ని సంవత్సరాల తరువాత కంపెనీకి రాజీనామా చేసి బయటకు వచ్చారు. ప్రస్తుతం ఈయన 'సన్ మొబిలిటీ'ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదీ చదవండి: రొమాంటిక్ సాంగ్.. ముఖేశ్-నీతాల డ్యాన్స్ చూశారా? అచంచలమైన సంకల్పంతో స్థిరమైన ఆవిష్కరణలలో అగ్రగామిగా భారతదేశాన్ని ప్రపంచ వేదికపైకి నడిపించగలదని మైనీ విశ్వసించారు. చేతన్ మైని దూరదృష్టి అపారమైనది, ఆయన ఆలోచనలను పరిశీలిస్తే.. అత్యున్నతమైన భవిష్యత్తు ఎలా సాధ్యమవుతుందని స్పష్టంగా అవగతమైపోతుంది. -
యాపిల్ కార్ల తయారీ లేనట్టేనా..?
ప్రపంచవ్యాప్తంగా ఆటోమొబైల్ రంగంలో ఎలక్ట్రిక్ కార్లతో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అందుకు అనుగుణంగా పలు దిగ్గజ ఆటోమొబైల్ సంస్థలతో పాటు స్మార్ట్ ఫోన్ కంపెనీలు సైతం ఎలక్ట్రిక్ కార్లను తయారు చేసే పనిలో పడ్డాయి. యాపిల్, షావోమీ వంటి ప్రముఖ మొబైల్ పోన్ తయారీ కంపెనీలు సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను తయారుచేస్తున్నాయనే వార్తలు ఇప్పటివరకు వచ్చాయి. అయితే తాజాగా యాపిల్ కంపెనీ తాను తయారుచేస్తున్న కార్లకు సంబంధించిన కీలక ప్రకటన చేసింది. యాపిల్ తన ప్రతిష్టాత్మకమైన కారు ప్రాజెక్టును ఎట్టకేలకు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అటానమస్ డ్రైవింగ్ సామర్థ్యం కలిగిన కారు విడుదల ప్రణాళికలను యాపిల్ పక్కన పెట్టింది. ఈ మేరకు గత దశాబ్దకాలంగా ‘టైటన్’ పేరిట పనిచేస్తున్న రహస్య ప్రాజెక్టుకు స్వస్తి పలికింది. ఈ విషయాన్ని అంతర్గత సమావేశంలో ఉద్యోగులకు ఇటీవల కంపెనీ తెలియజేసింది. ఈ విషయంపై ఇప్పటి వరకు యాపిల్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ ప్రాజెక్టులో పనిచేసిన సిబ్బందిని యాపిల్ ఇతర బాధ్యతల్లోకి బదిలీ చేయనుంది. వీరిలో మెజారిటీ సభ్యులు కృత్రిమ మేధ విభాగానికి పనిచేస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. యాపిల్ 2014 నుంచి ఈ ప్రాజెక్టుపై పనిచేస్తోంది. కానీ, ఇప్పటి వరకు కారు ఎలా ఉంటుందో వెల్లడించలేదు. కానీ, సిలికాన్ వ్యాలీ రోడ్లపై దాన్ని పరీక్షించినట్లు పలుసార్లు వార్తలు వచ్చాయి. యాపిల్ వంటి సంస్థ ఇలాంటి కీలక ప్రాజెక్టును పక్కన పెట్టడంపై టెక్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. యాపిల్ కొత్త ఆవిష్కరణల్లో వెనకబడిందనే వాదన టెక్ వర్గాల్లో కొంతకాలంగా వినిపిస్తోంది. ఐఫోన్లలోనూ పెద్దగా మార్పులేమీ ఉండట్లేదనే విమర్శలు ఉన్నాయి. టిమ్కుక్ సారథ్యంలో కంపెనీ చెప్పుకోదగ్గ స్థాయిలో కొత్త ఉత్పత్తులను తీసుకురాలేదనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. గత ఐదు సంవత్సరాల్లో కంపెనీ పరిశోధన, అభివృద్ధిపై బిలియన్ డాలర్లు వెచ్చించినట్లు తెలిసింది. ఇదీ చదవండి: గూగుల్ మ్యాప్స్లో కొత్త ఫీచర్.. ఇకపై ఆ కష్టం తీరినట్టే.. 2014లో యాపిల్ ఈ ‘ప్రాజెక్ట్ టైటాన్’ను తీసుకొచ్చింది. కానీ అంతర్గత కలహాలు, నాయకత్వ లోపాల కారణంగా యాపిల్కు ఎలక్ట్రిక్ కార్లను తయారు చేయడం సాధ్యం కాలేదు. అందుకే 2016లో కార్ల తయారీకి స్వస్తి చెప్పింది. 2020లో మరోసారి ఎలక్ట్రిక్ కార్లను తయారు చేస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 2022లో యాపిల్ సంస్థ సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను వాహనదారులకు పరిచయం చేయనున్నట్లు మరోసారి తెలిపింది. తాజాగా ఈ ప్రాజెక్ట్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. -
కేంద్రం మరో కీలక నిర్ణయం?.. ఇక ఎలోన్ మస్క్దే ఆలస్యం!
భారత్ మార్కెట్లోకి టెస్లా కార్ల రాక ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎలక్ట్రిక్ కార్ల ప్రియులకు శుభవార్త. కేంద్రం దిగుమతి సుంకంపై ఇచ్చే రాయితీని పొడిగించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే అపర కుబేరుడు ఎలోన్ మస్క్కు చెందిన టెస్లా సంస్థ భారత్లో అడుగు పెట్టడం దాదాపూ ఖరారైనట్లేనని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. రూ .30 లక్షలు (36,000 డాలర్లు) మించిన ఎలక్ట్రిక్ కార్లపై రాయితీ దిగుమతి సుంకాన్ని 2-3 సంవత్సరాల పాటు పొడిగించాలని కేంద్రం చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇదే జరిగితే టెస్లా భారత్కు రాక సుగమైనట్లే. కాగా, కేంద్రం దిగుమతి సుంకంపై రాయితీలను కొనసాగిస్తే ఎలక్ట్రిక్ వాహనాల ధరలు తగ్గడమే కాకుండా, విదేశీ వాహన తయారీ సంస్థలు భారత్లో తమ తయారీ కేంద్రాలను ప్రారంభించే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఇక కేంద్రం ఇంపోర్ట్ డ్యూటీపై నిర్ణయం తీసుకోనుందనే వార్తల నేపథ్యంలో.. టెస్లా ఇప్పటి వరకు భారత్లో టెస్లా ప్లాంట్ను ఏర్పాటు చేసుకునేందుకు బ్యాంక్ గ్యారెంటీలను అడుగుతోంది. తాజాగా పరిణామాలతో బ్యాంక్ గ్యారెంటీ బదులు దిగుమతి సుంకం తగ్గింపుపై కేంద్రంతో ఎలోన్ మస్క్ సంప్రదింపులు జరిపే అవకాశం ఉందని వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. వంద శాతం దిగుమతి సుంకం ప్రస్తుత విధానం ప్రకారం కేంద్రం 40,000 డాలర్ల (రూ.33 లక్షలు) విలువ చేసే కార్లపై 100 శాతం దిగుమతి సుంకం వసూలు చేస్తుండగా.. కారు ధర 40 వేల డాలర్ల కంటే తక్కువ ధర ఉంటే 60 శాతం పన్ను విధిస్తోంది. దిగుమతి సుంకాన్ని 15 శాతానికి తగ్గిస్తే ఎలోన్ మస్క్ కేంద్రం వాహనాలపై దిగుమతి సుంకాన్ని 15 శాతానికి తగ్గిస్తే భారత ఈవీ మార్కెట్లోకి ప్రవేశించి దేశంలో 2 బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడులు పెడతామని హామీ ఇచ్చారు. అందుకే దిగుమతి చేసుకున్న కార్లపై రాయితీ దిగుమతి సుంకాలను తగ్గించాలని, బ్యాంకు గ్యారంటీల ఆధారంగా పాలసీని ఖరారు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. దేశీయ కార్ల తయారీ సంస్థలకు భారీ షాక్! ప్రస్తుతం మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా, ఓలా ఎలక్ట్రిక్ వంటి కంపెనీలు ఈవీ కార్ల తయారీలో ముందజలో ఉన్నాయి. ఈ కంపెనీలు టెస్లా అడుగుతున్న గొంతెమ్మ కోరికలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇందులో భాగంగా మహీంద్రా అండ్ మహీంద్రా కేంద్రాన్ని సంప్రదించి భారత్లో తయారీని పెంచేలా ప్రోత్సహకాలు అందించాలని కోరింది. ఓలా సీఈఓ భవీష్ అగర్వాల్ కూడా విదేశీ సంస్థల నుంచి ఎలక్ట్రిక్ కార్లను దిగుమతి చేసుకోవాలనే ఆలోచనను వ్యతిరేకించారు. టెస్లా, ఇతర అంతర్జాతీయ కార్ల తయారీ సంస్థలకు ప్రోత్సాహకాలను అందించడం దేశీయంగా తయారయ్యే కార్ల అమ్మకాలపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని అన్నారు. -
లాంచ్కు సిద్దమవుతున్న కొత్త కారు ఇదే - టెస్లాకు గట్టి పోటీ!
ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఈవీ తయారీదారు బీవైడీ ఆటో భారతీయ మార్కెట్లో తన సీల్ మిడ్-సైజ్ సెడాన్ను మార్చి 5న లాంచ్ చేయనుంది. దేశీయ మార్కెట్లో లాంచ్ కావడానికి సిద్దమవుతున్న ఈ కొత్త చైనా మోడల్ బ్యాటరీ, రేంజ్ వంటి వివరాలు ఇప్పటికే తెలిసిపోయాయి. బీవైడీ కంపెనీ లాంచ్ చేయనున్న సీల్ ఈవీ 61.4 కిలోవాట్, 82.5 కిలోవాట్ బ్యాటరీ పొందనుంది. ఈ రెండు బ్యాటరీలు ఒక సింగిల్ చార్జితో 550 కిమీ, 700 కిమీ రేంజ్ అందిస్తాయని కంపెనీ వెల్లడించింది. పెద్ద బ్యాటరీ ప్యాక్ కోసం 150 kW ఛార్జర్, చిన్న బ్యాటరీ కోసం 110 kW ఛార్జర్ సపోర్ట్ చేస్తుంది. బీవైడీ సీల్ ఈవీ 3.8 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. డిజైన్ పరంగా అద్భుతంగా ఉన్న ఈ కారు 15.6 ఇంచెస్ రొటేటింగ్ టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 10.25 ఇంచెస్ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, హెడ్స్ ఆఫ్ డిస్ప్లే, రెండు వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్స్ వంటి అనేక ఫీచర్స్ పొందుతుంది. స్వెప్ట్బ్యాక్ హెడ్ల్యాంప్లు, ర్యాప్రౌండ్ ఎల్ఈడీ టైల్లైట్లు, ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్, పనోరమిక్ సన్రూఫ్, 360 డిగ్రీ కెమెరా, సేఫ్టీ కోసం ఏడీఏఎస్ వంటి ఫీచర్స్ ఉంటాయి. కంపెనీ బీవైడీ సీల్ ఈవీ కోడం త్వరలోనే బుకింగ్స్ ప్రారంభించనుంది. దీని ధర రూ. 65 లక్షల నుంచి రూ. 70 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉండవచ్చని అంచనా. ఇదీ చదవండి: 20 ఏళ్లకే క్యాన్సర్.. 33 ఏళ్లకు రూ.420 కోట్లు - ఎవరీ కనికా టేక్రీవాల్.. -
ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసిన ప్రముఖ కంపెనీ.. ధర ఎంతంటే..
విద్యుత్ వాహనాల వినియోగదారులు ఛార్జింగ్ సదుపాయాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ హ్యుందాయ్ అల్ట్రా-ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా ఒకేసారి 11 అల్ట్రా ఫాస్ట్ పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లను ప్రారంభించింది. హైదరాబాద్తోపాటు ముంబై, పుణె, అహ్మదాబాద్, గురుగావ్, బెంగళూరులో ఈ స్టేషన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటితోపాటు జాతీయ రహదారులైన దిల్లీ-ఛండీగఢ్, దిల్లీ-జైపూర్, హైదరాబాద్-విజయవాడ, ముంబై-సూరత్, ముంబై-నాసిక్ రోడ్లపై ఐదు అల్ట్రా ఫాస్ట్ డీసీ ఛార్జింగ్ స్టేషన్లను నెలకొల్పింది. ఈ ఛార్జింగ్ స్టేషన్లు రోజంతా తెరిచివుండనున్నాయని సంస్థ తెలిపింది. ఒక్కో స్టేషన్లలో డీసీ 150 కిలోవాట్లు, డీసీ 60 కిలోవాట్లు, డీసీ 30 కిలోవాట్ల సామర్థ్యంతో మూడు ఛార్జింగ్ పాయింట్లు ఉంటాయిని చెప్పింది. హ్యుందాయ్ కస్టమర్లతోపాటు ఇతర కస్టమర్లు కూడా ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఛార్జింగ్ స్టేషన్లు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న లాంగ్డ్రైవ్ చేసేవారికి ఇవి ఎంతగానో ఉపయోగపడనున్నాయని పేర్కొంది. ఇదీ చదవండి: డ్రాగన్మార్ట్కు పోటీగా ‘భారత్మార్ట్’.. ఎక్కడో తెలుసా.. కేవలం 21 నిమిషాల్లోనే 10 శాతం నుంచి 80 శాతం ఛార్జింగ్ అవుతుండడంతో సమయం ఆదాకానుందని పేర్కొంది. 30 కిలోవాట్ల ఛార్జర్ ఒక్కో యూనిట్పై రూ.18, 60 కిలోవాట్ల ఛార్జర్ యూనిట్పై రూ.21, 150 కిలోవాట్ల ఛార్జర్ యూనిట్కు రూ.24 ధర నిర్ణయించారు. ఛార్జింగ్ స్లాట్ను ముందస్తు బుకింగ్తోపాటు చెల్లింపులు జరుపుకునే అవకాశం కూడా సంస్థ కల్పించింది. ఈ ఏడాదిలో మరో 10 స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు సంస్థ వివరించింది. -
టాటా ఈవీలపై భారీ డిస్కౌంట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రిక్ వెహికల్స్ అయిన నెక్సన్.ఈవీ, టియాగో.ఈవీ మోడళ్లపై రూ.1.2 లక్షల వరకు తగ్గింపు ప్రకటించింది. బ్యాటరీ వ్యయాలు తగ్గుముఖం పట్టడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ మంగళవారం తెలిపింది. నెక్సన్.ఈవీ ధర రూ.1.2 లక్షల వరకు తగ్గింది. దీంతో ఈ మోడల్ ప్రారంభ ధర రూ.14.49 లక్షలు ఉంది. టియాగో.ఈవీ ధర రూ.70,000 వరకు తగ్గడంతో ఈ మోడల్ రూ.7.99 లక్షల నుంచి లభిస్తోంది. బ్యాటరీ వ్యయాలను దృష్టిలో పెట్టుకుని పంచ్.ఈవీ ధర నిర్ణయించడంతో తాజాగా ఎటువంటి సవరణ చేయలేదని టాటా మోటార్స్ వెల్లడించింది. దేశవ్యాప్తంగా 2023లో ప్యాసింజర్ వాహన పరిశ్రమ 8 శాతం వృద్ధి చెందింది. అయితే ఈవీ విభాగం 90 శాతం దూసుకెళ్లడం గమనార్హం. గతేడాదితో పోలిస్తే 2024 జనవరిలో ఈవీ విభాగం ఏకంగా 100%పెరగడం విశేషం. ఎలక్ట్రిక్ ప్యాసింజర్ కార్ల పరిశ్రమలో భారత్లో 70%పైగా వాటాతో టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ అగ్రస్థానంలో నిలిచింది. -
సరికొత్త ఫీచర్లతో మహీంద్రా ఎక్స్యూవీ400 ప్రో రేంజ్
సరికొత్త ఫీచర్లతో మహీంద్రా ఆల్ ఎలక్ట్రిక్ ఎక్స్యూవీ400 ప్రో రేంజ్ను మహీంద్ర అండ్ మహీంద్ర లిమిటెడ్ ఇటీవల విడుదల చేసింది. మహీంద్రా ఎక్స్యూవీ400కి అప్డేటెడ్ వెర్షన్గా తీసుకొచ్చిన దీని ప్రారంభ ధర రూ. 15.49 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) కంపెనీ ప్రకటించింది. మహీంద్రా ఎక్స్యూవీ400 ప్రో రేంజ్లో మూడు వేరియంట్లు ఉన్నాయి. అవి ఈసీ ప్రో (EC Pro), రెండు ఈఎల్ ప్రో (EL Pro) వర్షన్లు. మార్పుల విషయానికొస్తే, కొత్త వెర్షన్ల క్యాబిన్ రీడిజైన్ చేసిన డాష్బోర్డ్తో కొత్త బ్లాక్ అండ్ గ్రే ట్రీట్మెంట్తో వస్తోంది. కొత్త ఫీచర్ల విషయానికి వస్తే, టాప్-స్పెక్ ఈఎల్ ప్రో వేరియంట్లో ఫ్లోటింగ్ 10.25 అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆల్-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్లెస్ ఛార్జర్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, రివైజ్డ్ ఎయిర్కాన్ ప్యానెల్, రియర్ టైప్-సీ USB ఉన్నాయి. పోర్ట్, వెనుక మొబైల్ హోల్డర్, కొత్త ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. మహీంద్రా ఎక్స్యూవీ400 ప్రో రేంజ్లో రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు ఉన్నాయి. వీటిలో 34.5kWh బ్యాటరీ ప్యాక్ ఒక్క సారి చార్జ్ చేస్తే 375 కిమీల డ్రైవింగ్ రేంజ్ను ఇస్తుందని, 39.4kWh యూనిట్ 456కిమీల డ్రైవింగ్ రేంజ్ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది. వీటికి బుకింగ్స్ కొన్ని రోజుల క్రితమే ప్రారంభం కాగా ఫిబ్రవరి 1 నుంచి డెలివరీలను కూడా కంపెనీ ప్రారంభించింది. -
మంటల్లో కాలి బూడిదైన రూ.63 లక్షల ఎలక్ట్రిక్ కారు - వీడియో వైరల్
భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన స్వీడన్ కార్ల తయారీ సంస్థ 'వోల్వో' (Volvo)కు చెందిన రూ. 63 లక్షల ఎలక్ట్రిక్ కారు మంటల్లో చిక్కుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో వంటివి నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. మంటల్లో కాలుతున్న కారు వోల్వో సీ40 రీఛార్జ్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ అని తెలుస్తోంది. ఈ సంఘటన ఛత్తీస్గఢ్లో జరిగినట్లు సమాచారం. రాయ్పూర్కు చెందిన కారు ఓనర్ సౌరభ్ రాథోడ్ తన ముగ్గురు స్నేహితులతో కలిసి ఎన్హెచ్ 53 హైవేలో ప్రయాణిస్తుండగా కారులో మంటలు చెలరేగాయి. కారులో మంటలు ప్రారంభమైన వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు వెంటనే కారు దిగి బయటకు వచ్చారు. ఆ తరువాత కొంత సేపటికి పెద్ద ఎత్తున మంటలు చెలరేగి కారు మొత్తం కాలి బూడిదైపోయింది. దీనికి సంబంధించిన చిత్రాలు టెస్లా క్లబ్ ఇండియా ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేశారు. ఈ ఘటనపై వోల్వో సంస్థ అధికారులు ఇంకా స్పందించలేదు. కారులో మంటలు చెలరేగడానికి కారణం ఏంటనేది కూడా తెలియాల్సి ఉంది. కాబట్టి వోల్వో సీ40 ఎలక్ట్రిక్ కారు మంటల్లో కాలిపోవడానికి గల కారణాలు ఖచ్చితంగా చెప్పలేము. ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే వోల్వో కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ కార్లు మంటల్లో కాలిపోవడం ఇదే మొదటిసారి. కాలిపోవడానికి గల కారణాలకు కంపెనీ తప్పకుండా వెల్లడించగలదని ఆశిస్తున్నాము. గతంలో మంటల్లో కాలిన ఎలక్ట్రిక్ వాహనాలు భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లు మంటల్లో కాలిపోవడం ఇదే మొదటి సారి కాదు. గతంలో దేశీయ దిగ్గజం టాటా మోటార్ కంపెనీకి చెందిన నెక్సాన్ ఈవీలో కూడా మంటలు చెలరేగి కాలిపోయింది. ఇదీ చదవండి: అమెరికన్ యూనివర్సిటీ అద్భుత సృష్టి - ఐదు నిమిషాల్లో చార్జ్ అయ్యే బ్యాటరీ! ఎలక్ట్రిక్ స్కూటర్ల విషయానికి వస్తే.. మంటలకు ఆహుతైన ఎలక్ట్రిక్ స్కూటర్లు కోకోల్లలుగానే ఉన్నాయి. ఎలక్ట్రిక్ స్కూటర్లలో జరిగిన షార్ట్ సర్క్యూట్లు, అధిక ఛార్జింగ్ వంటి సమస్యల కారణంగా మంటలు చెలరేగిన సందర్భాలు ఎక్కువ. ఈ ప్రమాదాలు 2022లో చాలా వెలుగులోకి వచ్చాయి. ఆ తరువాత కొంత తక్కు ముఖం పట్టినప్పటికీ.. అక్కడక్కడా ఒక్కో సంఘటన అప్పుడప్పుడూ వెలుగులోకి వస్తూనే ఉంది. LG Pouch NMC cells strike again? Sadly a case of Volvo C40 Recharge getting caught on fire on NH53 has come up. From video fire is starting from the bottom. Volvo sells 78kWh pack in India which uses LG Pouch NMC cells. Hope @volvocarsin @volvocars investigates this soon. pic.twitter.com/FRnL60Cdnw — Tesla Club India® (@TeslaClubIN) January 28, 2024 -
భారత్లో టెస్లా కార్ల తయారీ షురూ.. ఆ మోడల్ పేరు ఇదేనా..?!
ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా.. భారత్లో వచ్చే ఏడాది కార్ల తయారీని ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. బడ్జెట్ ధరలో ‘రెడ్వుడ్’ అనే పేరుతో కార్లను ఉత్పత్తి చేయనున్నట్లు సమాచారం. టెస్లా 2025 మధ్యలో ‘రెడ్వుడ్’ కోడ్నేమ్తో కొత్త 'మాస్ మార్కెట్' ఎలక్ట్రిక్ కార్లను ఉత్పత్తి చేయనుందని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. రాయిటర్స్ ప్రకారం, రాబోయే మోడల్లు ప్రారంభ కారు ధర 25వేల డాలర్లతో చవకైన కార్లను విడుదల చేసి చైనాకు చెందిన బీవైడీ తయారు చేసే అధిక ధరలతో కూడిన ఈవీ కార్ల కంటే పెట్రోల్ వేరియంట్ కార్లతో పోటీ పడేలా ఎలక్ట్రిక్ కార్లను తయారు చేయాలని టెస్లా యాజమాన్యం భావిస్తున్నది. ఎలాన్ మస్క్ తొలిసారి 2020లో 25 వేల డాలర్ల ధరతో కార్లను తయారు చేస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. కాగా, అమెరికాలో టెస్లా బడ్జెట్ కారు మోడల్ 3 సెడాన్ ప్రారంభ ధర 38,990 డాలర్లుగా ఉంది. అయితే ఎలాన్ మస్క్ ఈ కార్లను అమెరికాతో పాటు భారత్లో తయారు చేస్తారా? లేదా? అనే అంశాలపై స్పష్టత ఇవ్వాల్సి ఉంది. -
అంబానీ కంటే ముందే 'లోటస్' కారు కొన్న హైదరాబాద్ మహిళ
భారతదేశంలో ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ వంటి కుబేరులు ఎప్పటికప్పుడు అత్యంత ఖరీదైన లగ్జరీ కార్లను కొనుగోలు చేసి ఉపయోగిస్తుంటారన్న సంగతి తెలిసిందే.. అయితే ఇటీవల ఓ ఖరీదైన కారుని వారికంటే ముందే, హైదరాబాద్ మహిళ కొనుగోలు చేసింది. హైదరాబాద్ వాసి 'హర్షిక రావు' ఇటీవలే రూ. 2.55 కోట్ల లోటస్ ఎలెట్రే ఎలక్రిక్ కారును కొనుగోలు చేసి, ఈ కారు కొన్న మొట్ట మొదటి భారతీయురాలిగా రికార్డ్ క్రియేట్ చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లోటస్ ఎలెట్రే ఎలక్ట్రిక్ దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన లోటస్ ఎలెట్రే ఎలక్ట్రిక్ కారు మూడు వేరియంట్లలో లభిస్తుంది. అవి ఎలెట్రే, ఎలెట్రే ఎస్, ఎలెట్రే ఆర్. అద్భుతమైన డిజైన్ కలిగిన ఈ కారు ఆధునిక ఫీచర్స్ కలిగి వాహన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది. ఇదీ చదవండి: నీతా అంబానీ వాడే ఫోన్ ధర రూ.400 కోట్లా? అసలు నిజమేంటంటే? పవర్ట్రెయిన్ విషయానికి వస్తే.. Eletre అండ్ Eletre S మోడల్స్ 603 హార్స్ పవర్ అందించే డ్యూయల్-మోటార్ సిస్టమ్ను కలిగి 600 కిమీ రేంజ్ అందిస్తాయి. Eletre R మోడల్ 905 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కారు 2.95 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఈ మోడల్ ఫాస్ట్ ఛార్జర్ ద్వారా 20 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం ఛార్జ్ చేసుకోగలదు. అంతే కాకుండా ఇది స్టాండర్డ్ 22 kWh AC ఛార్జర్ కూడా పొందుతుంది. View this post on Instagram A post shared by Car Crazy India® (@carcrazy.india) -
కొనుగోలుదారులకు టాటా మోటార్స్ భారీ షాక్!
ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ కార్ల కొనుగోలు దారులకు భారీ షాకిచ్చింది. ఫిబ్రవరి 1 నుంచి టాటా ఎలక్ట్రిక్ వెహికల్ ధరల్ని 0.7 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. కార్ల తయారీకి వినియోగించే ముడి సరకు ధరలు పెరగడమే తాజా నిర్ణయానికి కారణమని తెలుస్తోంది. ప్రతి మోడల్ ధర ఎంత పెరుగుతుందనే విషయంపై స్పష్టత రాలేదు. అయితే, టాటా మోటార్స్ నిర్దిష్ట వేరియంట్ మోడల్పై 0.7 శాతం సగటు పెరగనుంది.ఫలితంగా, టియాగో, నెక్సాన్, హారియర్, సఫారి వాహనాల ధరలు పెరగనున్నాయి. ఇటీవలే లాంచ్ చేసిన పంచ్ ఈవీ ఎక్స్ షోరూమ్ ధర రూ.11 లక్షలుగా ఉంది. టాటా కంపెనీ తాజాగా తీసుకున్న నిర్ణయంతో దీని ధరలు పెరిగే అవకాశం ఉంది. గత ఏడాది ఏప్రిల్లో టాటా మోటార్స్ తన ప్యాసింజర్ వెహికల్ ధరల్ని దాదాపు 0.6 శాతం పెంచింది. మే 1 నుంచి కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి. టాటా కంపెనీ కార్ల ధరల్ని పెంచినప్పటికీ దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలతో సహా మొత్తం ప్యాసింజర్ వాహన విక్రయాలలో కంపెనీ 9 శాతం వృద్ధిని సాధించింది. డిసెంబర్ 2022లో 40,043 యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే 2023 డిసెంబర్ 43,470 యూనిట్లకు చేరుకుంది.
Pagination
సినబాబుకి మరోసారి మంగళమేనా!
పిన్నెల్లి ఎపిసోడ్.. ఫలించని పచ్చ బ్యాచ్ కుట్రలు
చంద్రబాబుకు ‘కుప్పం’ టెన్షన్.. జరిగేది అదేనా?
ఇంకా రాదేం.. నాలుగో తేది!
అప్పుడూ అంతే! ధీమాగా ఉన్నారు.. చివరికి బోర్లా పడ్డారు!
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
Horoscope Today: ఈ రాశి వారు ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు
విజయం మనదే.. మహిళలకు పెద్దపీట..
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అప్డేట్స్..
ఏపీలో పనిచేయని NDA హవా.. షర్మిలకు డిపాజిట్ గల్లంతు
స్టార్ హీరోయిన్కు అలాంటి సమస్య.. షాకింగ్ న్యూస్ చెప్పిన భామ!
కాంగ్రెస్ ఖాతాలో రాయ్బరేలీ? రాహుల్కు పట్టం?
గెలుపు ఎవరిదో తేలిపోయింది..
బీజేపీకి పట్టం కట్టిన ఎగ్జిట్ పోల్స్..
మమ్ముట్టికి డైరెక్టర్ క్షమాపణలు.. ఎందుకంటే?
ఈ వారంలో ఈరాశివారికి అనుకోని లాభాలు.. ఉద్యోగాలలో లక్ష్యాలు నెరవేరతాయి!
Advertisement