-
'వెనకవైపు నుంచి అనుచితంగా తాకాడు'.. టాలీవుడ్ హీరోయిన్!
ఉయ్యాలా జంపాలా చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ అవికా గోర్. ఈ సినిమాలో రాజ్ తరుణ్ సరసన మెప్పించింది. ఆ తర్వాత లక్ష్మి రావే మా ఇంటికి, సినిమా చూపిస్తా మావ, తను నేను, ఎక్కడికీ పోతావు చిన్నవాడా, రాజుగారి గది-3 సినిమాలతో మెప్పించింది. గతేడాది వధువు అనే వెబ్ సిరీస్తో అలరించింది. బాలికా వధు(చిన్నారి పెళ్లికూతురు) సిరీయల్ గుర్తింపు తెచ్చుకున్న అవికా గోర్.. ప్రస్తుతం బాలీవుడ్లో బిజీగా ఉంది. ఆమె ప్రస్తుతం బ్లడీ ఇష్క్లో అనే చిత్రంలో నటిస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన బాలీవుడ్ భామ ఒక ఈవెంట్లో ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకుంది. తాను వేదికపై వెళ్లే క్రమంలో వెనకవైపున అసభ్యంగా తాకాడని తెలిపింది. తిరిగి చూస్తే అక్కడ కేవలం తన బాడీగార్డ్ మాత్రమే ఉన్నారని వెల్లడించింది. అతను సారీ చెప్పడంతో ఆ సంగతి వదిలేశానని చెప్పుకొచ్చింది.అయితే ఇదే సంఘటన రెండోసారి కూడా జరిగిందని అవికా గోర్ తెలిపింది. అయితే ఈసారి నన్ను పట్టుకోకముందే బాడీగార్డ్ చేయి పట్టుకున్నానని అవికా పేర్కొంది. అసలేం ఏం చేస్తున్నావ్ గట్టిగా నిలదీయడంచో క్షమాపణలు చెప్పాడని వెల్లడించింది. దీంతో అతన్ని వదిలిపెట్టాటని వివరించింది. అలాంటి వ్యక్తులను ఎదుర్కోవడానికి ధైర్యం ఉండాలని ఆమె అన్నారు. నాకే గనుక ధైర్యం ఉంటే ఈపాటికి చాలా మందిని తిరిగి కొట్టేదానినని అవికా గోర్ నవ్వుతూ చెప్పింది. -
సోషల్ మీడియా ఖాతాలో అశ్లీల చిత్రాలు.. హీరోయిన్ టీం క్లారిటీ!
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ ఇటీవలే మిస్టర్ అండ్ మిసెస్ మహి చిత్రంతో ప్రేక్షకులను అలరించింది. ఈ చిత్రంలో రాజ్కుమార్ రావు సరసన నటించింది. మే 31న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 50 కోట్లకు పైగా వసూలు చేసి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రానికి శరణ్ శర్మ దర్శకత్వం వహించారు. అయితే ప్రస్తుతం జాన్వీ కపూర్ జూనియర్ ఎన్టీఆర్తో కలిసి దేవర చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే .తాజాగా జాన్వీ కపూర్ సోషల్ మీడియాలోనూ ఎప్పుడు యాక్టివ్గానే ఉంటోంది. ఎప్పటికప్పుడు తన అభిమానులతో టచ్లో ఉంటూ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఉంటోంది. అయితే ఊహించని విధంగా జాన్వీ కపూర్ తన ఎక్స్ ఖాతాలో అశ్లీల చిత్రాలు పోస్ట్ చేసినట్లు కనిపించింది. దీంతో ఆమె ఫ్యాన్స్ ఒక్కసారిగా షాకింగ్కు గురయ్యారు. అయితే ఇది గమనించిన జాన్వీకపూర్ టీమ్ ఆ పోస్టులపై క్లారిటీ ఇచ్చింది.అసలు జాన్వీకపూర్కు ఎక్స్లో అకౌంట్ లేదని తెలిపారు. జాన్వీ కపూర్ పేరుతో ఉన్న ఫ్యాన్ అకౌంట్గా గుర్తించారు. ఆమె పేరుతో ఖాతా ఉండడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ తర్వాత ఫ్యాన్ అకౌంట్ అని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. సోషల్ మీడియాలో నకిలీ ఖాతాల పట్ల అప్రమత్తంగా ఉండాలని జాన్వీకపూర్ ప్రతినిధి సూచించారు. ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో ఎవరి పేరుతోనైనా ఖాతాను సృష్టించడం చాలా సులభమని.. జాన్వీ కపూర్కు ఎక్స్లో ఎలాంటి అధికారిక ఖాతా లేదని స్పష్టం చేశారు. కాగా.. జాన్వీ జూనియర్ ఎన్టీఆర్తో కలిసి దేవరలో కనిపించనుంది. ఆ తర్వాత బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కించనున్న రామ్ చరణ్ చిత్రంలో నటించనుంది. -
పిల్లల కోసం నటి ఆలియా భట్ డ్రీమ్ ప్రాజెక్ట్ లాంచ్ (ఫొటోలు)
-
సుశాంత్ వర్ధంతి.. వెక్కివెక్కి ఏడ్చిన బుల్లితెర నటి!
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ పేరు బాలీవుడ్లో తెలియనివారు ఉండరు. ఎంఎస్ ధోని చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. అయితే ఊహించని విధంగా 2020లో ముంబయిలోని తన నివాసంతో సూసైడ్ చేసుకున్నారు. ఇవాళ అతని నాలుగో వర్ధంతి సందర్భంగా పలువురు బాలీవుడ్ ప్రముఖులు సుశాంత్కు నివాళులర్పించారు. అతని ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. సుశాంత్ వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు, అతని సోదరి శ్వేతా సింగ్ కీర్తి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమానికి సుశాంత్ సన్నిహితురాలు, సహనటి క్రిస్సన్ బారెట్టో కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా సుశాంత్ను తలుచుకుని బోరున విలపించారు. అతనికి ఇలా జరిగి ఉండాల్సింది కాదంటూ వెక్కివెక్కి ఏడ్చారు. సుశాంత్ తనతో ప్రతి చిన్న విషయంలోనూ ఎప్పుడు చాలా సంతోషంగా, ఉత్సాహంగా ఉండేవాడని అన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా.. సుశాంత్.. ఎంఎస్ ధోని మూవీతో పాటు డ్రైవ్, చిచోరే, కేదార్నాథ్, దిల్ బేచారా లాంటి సినిమాల్లో నటించారు. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) -
తొమ్మిదేళ్ల తర్వాత తల్లి కాబోతున్న బుల్లితెర నటి!
బాలీవుడ్ భామ, బుల్లితెర నటి ద్రష్టి ధామి ఫ్యాన్స్కు గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే తాను తల్లి కాబోతున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఈ వార్త తెలుసుకున్న పలువురు బాలీవుడ్ నటులు ఈ జంటకు అభినందనలు తెలుపుతున్నారు. ఈ ఏడాది అక్టోబర్లో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు వెల్లడించింది.కాగా.. ద్రష్టి ధామి 2015లో నీరజ్ ఖేమ్కాను వివాహం చేసుకున్నారు. కెరీర్ విషయానికొస్తే డ్యాన్స్ రియాలిటీ షో నాచ్ బలియేలో కూడా ఆమె పాల్గొన్నారు. ధామి 2007లో టీవీ సీరియల్ దిల్ మిల్ గయేతో ద్వారా ఎంట్రీ ఇచ్చింది. 2010లో గుర్మీత్ చౌదరి సరసన గీత్ - హుయ్ సబ్సే పరాయి సీరియల్లోనూ కనిపించింది. ఆమెకు మధుబాల, ఏక్ ఇష్క్ ఏక్ జునూన్ సీరియల్తనే ఎక్కువగా ఫేమ్ తెచ్చుకుంది. ఇందులో ఆమె వివియన్ దేనాకు జంటగా నటించింది. అంతే కాకుండా ఇటీవలే ఓటీటీలోనూ ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్లో ది ఎంపైర్, దురంగ అనే వెబ్ సిరీస్లలో కనిపించింది. ప్రస్తుతం పెళ్లయిన దాదాపు తొమ్మిదేళ్లకు ద్రష్టి ధామి తల్లి కాబోతోంది. View this post on Instagram A post shared by Drashti Dhami 💜 (@dhamidrashti) -
స్టార్ హీరో కుమారుడితో నటి డేటింగ్.. వీడియో వైరల్!
బాలీవుడ్ భామ పాలక్ తివారీ గతేడాది కిసీ కా భాయ్.. కిసీ కా జాన్ చిత్రంతో అలరించింది. సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ఈ మూవీలో పూజా హెగ్డే లీడ్రోల్లో కనిపించింది. నటి శ్వేత తివారీ వారసులరాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. అయితే గత కొద్ది రోజులుగా ఈ ముద్దుగుమ్మపై డేటింగ్ రూమర్స్ వినిపిస్తున్నాయి.బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీఖాన్తో ప్రేమాయణం కొనసాగిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. గత ఏప్రిల్లో ఇబ్రహీం, పాలక్ తివారీ గోవా నుంచి తిరిగివస్తూ విమాశ్రయంలో కనిపించారు. అప్పటి డేటింగ్ రూమర్స్ మరింత ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో పాలక్ తివారీ తాజాగా ప్రియుడు ఇబ్రహీం అలీ ఖాన్ ఇంటివద్ద కనిపించింది. అతని ఇంటి నుంచి కారులో వెళ్తుండగా కెమెరాలకు చిక్కింది.ఇది చూసిన ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. పాలక్, ఇబ్రహీం డేటింగ్లో ఉన్నారంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు కరణ్ జోహార్ రాబోయే చిత్రం 'సర్జమీన్'చిత్రం ద్వారా ఇబ్రహీం బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ చిత్రంలో కాజోల్, పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా కీలక పాత్రల్లో నటించనున్నారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
మెథడ్ డ్రెస్సింగ్ ట్రెండ్.. ఈ బ్యూటీ ఫ్యాషన్ టాలెంట్ అదుర్స్ (ఫోటోలు)
-
‘‘నా పెళ్లి, నా ఇష్టం..మీకెందుకబ్బా!’’ సోనాక్షి రియాక్షన్, వీడని సస్పెన్స్!
సినీ నటి సోనాక్షి సిన్హా పెళ్లి పుకారు సోషల్ మీడియాలో హాట్టాపిక్గా నిలిచింది. బాయ్ఫ్రెండ్ జహీర్ ఇక్బాల్ను పెళ్లాడ బోతోందంటూ పుకార్లు షికారు చేశాయి. ఈ నెల 23న దక్షిణ ముంబైలో అత్యంత సన్నిహితుల సమక్షంలో సోనాక్షి- జహీర్ పెళ్లాడబోతున్నారని వార్తలొచ్చాయి. ఈ వార్తలపై సోనాక్షి ఘాటుగా సమాధాన మిచ్చింది. ‘ ..ఇది నా పెళ్లి.. ఇది ఎవరికి సంబంధించిన విషయం కాదు. ఇక రెండోది నా పెళ్, నా ఇష్టం. జనాలకు ఎందుకింత ఆందోళన అంటూ మండిపడింది. అలాగే తన పెళ్లి గురించి అడగాల్సింది తనను గానీ, తన తల్లిదండ్రులను కాదంటూ చురకలేసింది. ఎపుడూ తన పెళ్లి గురించి అడుగుతూ ఉంటారని అయితే దీన్ని తాను పెద్దగా పట్టించుకోనని వ్యాఖ్యానించింది.అటు సోనాక్షి తండ్రి, బాలీవుడ్ హీరో, నేత శత్రుఘ్న సిన్హా కూడా స్పందించారు. తన కుమార్తె పెళ్లి గురించి తనకు తెలియదని సోనాక్షి పెళ్లి గురించి ప్రశ్నించిన మీడియాతో చెప్పారు. ‘‘ ఎన్నికల ఫలితాలు తరువాత ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నాను. సోనాక్షి వెడ్డింగ్ ప్లాన్స్ గురించి నాకేమీ తెలియదు. నాకేమీచెప్పలేదు నేనూ ఎవరితోనూ మాట్లాడలేదు’’ అంటూ సమాధానమిచ్చారు.అంతేకాదు ఈ విషయంలో ప్రధానమీడియాకు ఎంత తెలుసో, తనకూ అంతే తెలుసుననీ, ఈ రోజుల్లో, పిల్లలు తల్లిదండ్రుల అనుమతి తీసుకోరు.. జస్ట్ వారు సమాచారం ఇస్తున్నారు.. మేము దానికోసం వెయిట్ చేస్తున్నాం అంటూ ముగించారు. దీంతో సోనాక్షి-జహార్ పెళ్లి సందడిపై సస్పెన్స్ మరింత ముదిరింది.కాగా సోనాక్షి, జహీర్ ఇద్దరూ సల్మాన్ఖాన్ సినిమాలతోనే బాలీవుడ్లో అడుగుపెట్టారు. సోనాక్షి 2010లో దబాంగ్ సినిమాలో నటించగా, సల్మాన్ నిర్మించిన నోట్బుక్ సినిమాతో 2019లో జహీర్ బాలీవుడ్లో అరంగేట్రం చేశాడు. ‘డబుల్ ఎక్స్ఎల్’ సినిమాలో ఇద్దరూ కలిసి నటించారు. ఇరు కుటుంబాల ఆశీర్వాదంతో జూన్ 23న సోనాక్షి, జహీర్ వివాహం జరుగు తుందని, ఆ తర్వాత రాత్రి రిసెప్షన్ కూడా ఉంటుందనేది మీడియా నివేదికల సారాంశం వీరిద్దరూ చాలా కాలంగా తమ పెళ్లికి ప్లాన్ చేస్తున్నప్పటికీ, సోనాక్షి తండ్రి శతృఘ్న సిన్హా ఎన్నికల్లో బిజీగా ఉండటంతో ఇప్పటిదాకా వాయిదా వేసుకున్నారని తెలుస్తోంది. -
నా కూతురి పెళ్లి గురించి తెలియదు: సోనాక్షి తండ్రి కామెంట్స్ వైరల్!
బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా త్వరలోనే పెళ్లి పీటలెక్కనుంది. ఈనెల 23న వివాహాబంధంలోకి అడుగుపెట్టనుంది. తన ప్రియుడు, నటుడైన జహీర్ ఇక్బాల్తో ఏడడుగులు వేసేందుకు సిద్ధమైంది. ముంబయిలో జరిగనున్న వీరి వివాహానికి కొద్దిమంది సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరవుతారని తెలుస్తోంది. సోనాక్షి పెళ్లి వార్తల నేపథ్యంలో తాజాగా ఆమె తండ్రి, నటుడు శత్రుఘ్న సిన్హా చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి. తన కూతురు సోనాక్షి పెళ్లి గురించి తనకు ఎలాంటి విషయం తెలియదని పేర్కొన్నారు. సోనాక్షి, జహీర్ల వివాహం గురించి తనకు తెలియదని.. అయితే వారి బంధానికి వ్యతిరేకం కాదని ఆయన తెలిపారు. పెళ్లి విషయం నాకు తెలిసినప్పుడు ఆ జంటను ఆశీర్వదిస్తానని శత్రుఘ్న సిన్హా అన్నారు.శత్రుఘ్న సిన్హా మాట్లాడుతూ.."నేను ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నా. నా కుమార్తె పెళ్లి గురించి ఎవరితోనూ మాట్లాడలేదు. తన పెళ్లి గురించి నాతో ఏం చెప్పలేదు. నేను కూడా మీడియాలో చదివి మాత్రమే తెలుసుకున్నా. ఒకవేళ తాను మాకు చెబితే నేను, నా భార్య ఆశీస్సులు అందిస్తాం. మేము కూడా ఆమె నిర్ణయాన్ని గౌరవిస్తాం. తనకు స్వంత నిర్ణయాలు తీసుకునే హక్కు కూడా ఉంది. ఈ రోజుల్లో చాలామంది పెళ్లికి తల్లిదండ్రుల అనుమతి తీసుకోవడం లేదు.' అని చెప్పారు.కాగా.. సోనాక్షి, జహీర్ చాలా కాలంగా డేటింగ్ చేస్తున్నారు. వీరిద్దరు తమ రిలేషన్ గురించి సోషల్ మీడియా ద్వారా ఎప్పుటికప్పుడు పోస్టులు పెడుతుంటారు. కాగా.. సోనాక్షి ఇటీవలే సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన హీరామండి ది డైమండ్ బజార్ వెబ్ సిరీస్లో కనిపించింది. ప్రస్తుతం ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. సోనాక్షి, జహీర్ 2022లో వచ్చిన డబుల్ ఎక్స్ఎల్ చిత్రంలో కలిసి నటించారు. -
నిన్ను టీవీలోనే చాలామంది చూశారు.. ఇంకా ఓటీటీలో కష్టమే అన్నారు
కొన్ని పాత్రలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అలా కసౌటీ జిందగీ కే సీరియల్లో కోమలిక అనే నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర పోషించి గుర్తింపు పొందింది ఊర్వశి ఢోలకియా. ఈ సీరియల్ వచ్చి దాదాపు 15 ఏళ్లవుతున్నా ఇప్పటికీ ఆమెను కోమలికగానే ప్రేక్షకులు గుర్తుపెట్టుకున్నారు. తాజాగా ఆమె దీని గురించి మాట్లాడుతూ.. 'ఇప్పటికీ జనాలు నన్ను కోమలిక అనే పిలుస్తారు. ఆ ఒక్క పాత్రను మాత్రమే గుర్తుపెట్టుకున్నారంటే నేను వేరే సీరియల్స్ ఏమీ చేయలేనని కాదు! నా విషయంలో దర్శకులు, నిర్మాతల క్రియేటివిటీ ఏమైపోయిందోనని అర్థం! ఇకపై అలాంటివి చేయనుఎన్నో పాత్రలు పోషించాను కానీ వాటికంత గుర్తింపు రాకుండా పోయింది. ఒకే రకమైన పాత్రలు చేసి బోర్ కొడుతోంది. ఇకపై నెగెటివ్ రోల్స్ చేయను. ప్రస్తుతం న్యాయవాదిగా పాజిటివ్ రోల్ చేస్తున్నాను. అందుకు సంతోషంగా ఉంది. ఇక మీదట కూడా ఇలాంటివే చేయాలనుంది. ప్రేక్షకులు ఊహించని పాత్రల్లో కనిపించాలనుంది. ఓటీటీల విషయానికి వస్తే ఇప్పుడు దానికి చాలా క్రేజ్ ఉంది. కానీ గతేడాది ఈ ప్లాట్ఫామ్లో నన్ను తిరస్కరించారు. ఓటీటీలు నన్ను పక్కన పెట్టేశాయినిన్ను టీవీలోనే చాలామంది చూసేశారు.. అని ఛాన్స్ ఇవ్వకుండా పక్కన పెట్టేశారు. అసలు ఈ ఓటీటీ ప్లాట్ఫామ్లో టీవీ సెలబ్రిటీలే లేరా? అంతటా ఉన్నారు.. మరి ఎందుకని నన్ను అలా చిన్నచూపు చూశారని బాధేసింది. అయినా నాకు ఓటీటీల నుంచి ఎటువంటి మంచి ఛాన్సులు రావడం లేదు' అని చెప్పుకొచ్చింది. కాగా ఊర్వశి ప్రస్తుతం పుష్ప ఇంపాజిబుల్ అనే సీరియల్ చేస్తోంది. అందులో లాయర్ దేవి సింగ్ శిఖావత్గా నటిస్తోంది. చదవండి: ఆ డైరెక్టర్ నన్ను పనిమనిషిలా చూశాడు.. అందరిముందు.. -
పెళ్లి చేసుకోబోతున్న హీరామండి నటి.. వరుడు ఎవరంటే?
బాలీవుడ్ భామ, హీరామండి నటి సోనాక్షి సిన్హా త్వరలోనే పెళ్లి పీటలెక్కనుంది. నటుడు జహీర్ ఇక్బాల్ను పెళ్లాడనున్నట్లు తెలుస్తోంది. ఈనెల 23న వివాహాబంధంలోకి అడుగు పెట్టనున్నారు. ముంబయిలోనే వీరిద్దరి వివాహం జరగనుంది. కాగా..కొన్నేళ్లుగా సోనాక్షి, జహీర్ డేటింగ్లో ఉన్నారు. అయితే ఈ జంట తమ రిలేషన్ గురించి ఎక్కడా బయటికి చెప్పకుండా జాగ్రత్తపడ్డారు.ఇటీవల సోనాక్షి సిన్హా బర్త్ డే సందర్భంగా ప్రియుడు జహీర్ ఇక్బాల్ విషెస్ తెలిపారు. ఇన్స్టా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. వీరి పెళ్లికి సన్నిహితులు, కుటుంబ సభ్యులతో హాజరు కానున్నారు. వీరితో పాటు హీరామాండి నటీనటులను కూడా వివాహానికి ఆహ్వానించారు. కాగా.. సోనాక్షి సిన్హా చివరిసారిగా సంజయ్ లీలా భాన్సాలి తెరకెక్కించిన వెబ్ సిరీస్ హీరామండిలో కనిపించింది. View this post on Instagram A post shared by Zaheer Iqbal (@iamzahero) -
Nitanshi Goel: 16 ఏళ్ల ఈ అమ్మాయి.. బాలీవుడ్ ఇండస్ట్రీలో..
నితాంశీ గోయల్.. 16 ఏళ్ల ఈ అమ్మాయి ‘లాపతా లేడీస్’లో ఫూల్ కుమారీగా అమాయకత్వాన్ని ఒలకబోసి విమర్శకుల ప్రశంసలూ అందుకుంది. స్క్రీన్కి నితాంశీ కొత్తేం కాదు. చైల్డ్ ఆర్టిస్ట్గా బుల్లితెర, వెండితెర ప్రేక్షకాభిమానులకు సుపరిచితురాలు! ఈ యంగెస్ట్ యాక్ట్రెస్కి సోషల్ మీడియాలో హయ్యెస్ట్ ఫాలోవర్స్ ఉన్నారు.నోయిడాలో పుట్టి పెరిగింది. తల్లి.. రాశి గోయల్, గృహిణి. తండ్రి నితిన్ గోయల్, యాక్సిస్ బ్యాంక్ ఉద్యోగి.చిన్నప్పుడే కరాటే కూడా నేర్చుకుంది. ‘మోహినీ ఆట్టమ్’లోనూ శిక్షణ పొందింది. శాస్త్రీయ నృత్య పోటీల్లో పాల్గొని బహుమతులూ అందుకుంది. పియానో కూడా వాయిస్తుంది.చైల్డ్ మోడల్గా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. పేరుమోసిన ఎన్నో బ్రాండ్స్కి మోడలింగ్ చేసింది. ఇటు ప్రింట్, అటు టీవీ యాడ్స్లో నటించింది.ఇండియన్ కిడ్స్ ఫ్యాషన్ వీక్ మొదలు పలు ఫ్యాషన్ షోల్లో పాల్గొంది. 2015లో ‘మిస్ పాంటలూన్స్ జూనియర్ ఫ్యాషన్ ఐకాన్’ టైటిల్ని గెలుచుకుంది.తన పేరుతోనే ఓ యూట్యూబ్ చానెల్ని కూడా స్టార్ట్ చేసింది. 2022లో యునైటెడ్ బిజినెస్ జర్నల్ ‘ఇన్ఫ్లుయెన్షియల్ పర్సనాలిటీస్–30 అండర్ 30’ జాబితాలో చోటు దక్కించుకుంది.చైల్డ్ ఆర్టిస్ట్గా ‘వికీ డోనర్’తో బాలీవుడ్లోకి ఎంటర్ అయింది. ఆ తర్వాత ‘ఎమ్.ఎస్. ధోనీ : ది అన్టోల్డ్ స్టోరీ’, ‘ఇందూ సర్కార్’, ‘హుడ్దంగ్’.. తాజాగా ‘లాపతా లేడీస్’ సినిమాల్లో నటించింది.‘మన్ మే విశ్వాస్ హై’తో బుల్లితెర ప్రవేశం చేసింది. అందులో శబ్రీగా ఆమె చూపిన అభినయం.. టీవీ ఇండస్ట్రీలో నితాంశీ ఉనికిని చాటింది. ‘నాగార్జున : ఏక్ యోధా’, ‘ఇష్క్బాజ్’, ‘పేశ్వా బాజీరావు’ లాంటి సీరియల్స్లో చక్కటి అవకాశాలను తెచ్చిపెట్టింది.నితాంశీ చురుకుదనం, ప్రతిభ ఆమెను వెబ్స్క్రీన్కీ పరిచయం చేశాయి ‘లవ్ స్లీప్ రిపీట్’ అనే వెబ్ సిరీస్తో. తర్వాత ‘ఇన్సైడ్ ఎడ్జ్’లోనూ నటించింది. అంతేకాదు ‘మేరే సప్నే’, ‘నఖ్రా’, ‘హమ్ మిలే థే జాహా’ వంటి మ్యూజిక్ ఆల్బమ్స్లో కూడా నితాంశీ మెరిసింది."ప్రియంకా చోప్రా అంటే చాలా ఇష్టం. ఆమె సినిమాలు చూస్తూ.. ఆమె యాక్టింగ్ స్కిల్స్ అబ్జర్వ్ చేస్తూ పెరిగాను. అందుకే ఆమే నాకు ఇన్స్పిరేషన్!" – నితాంశీ గోయల్ -
12 మందితో ఎఫైర్స్.. ఆ ఒక్క తప్పుతో కెరీర్ క్లోజ్.. ఆ స్టార్ హీరోయిన్ ఎవరంటే?
1991లో సుభాష్ ఘాయ్ 'సౌదాగర్' సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన బాలీవుడ్ బ్యూటీ. స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించింది. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, అజయ్ దేవగన్, జాకీ ష్రాఫ్, సన్నీ డియోల్, గోవిందతో లాంటి సూపర్ స్టార్లతో కలిసి పనిచేసింది. తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ ఎక్కువ కాలం నిలవలేకపోయింది. ఎంత త్వరగా అయితే ఫేమ్ తెచ్చుకుందో.. అంతే వేగంగా కెరీర్ నాశనం చేసుకుంది. ఇంతకీ ఆ స్టార్ హీరోయిన్ తెలుసుకోవాలనుందా? అయితే ఓ లుక్కేయండి.కెరీర్ నాశనం.. 1990వ దశకంలో సూపర్ స్టార్గా పేరు తెచ్చుకున్న బ్యూటీ మనీషా కొయిరాలా.'గుప్త్', 'దిల్ సే', 'కచ్చే ధాగే' 'మన్'లాంటి కమర్షియల్ హిట్స్ సాధించింది. తక్కువ కాలంలోనే భారీ హిట్ సినిమాలు రావడంతో ఒక్కసారిగా బాలీవుడ్లో ఆమె పేరు మార్మోగిపోయింది. అయితే ఆ తర్వాత తన చేజేతులా కెరీర్ నాశనం చేసుకుంది. మద్యానికి బానిసై తన అవకాశాలను దెబ్బతీసుకుంది. మంచి ఆఫర్లు వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలు కావడంతో కెరీర్ ముగింపు దశకు చేరుకుంది. కొద్ది కాలంలోనే ఆమె 50 చిత్రాలు ఫ్లాఫ్గా నిలిచాయి. అంతే కాకుండా 2012లో మనీషాకు క్యాన్సర్ రావడం ఆమెను కోలుకోలేని దెబ్బతీసింది. దాదాపు పదేళ్ల పాటు ఆ మహమ్మారితో పోరాడింది.పలువురితో ఎఫైర్స్మనీషా తన నటనా జీవితంలో రిలేషన్ పరంగా కూడా ఎక్కువగా వార్తల్లో నిలిచింది. మొదట ఆమె 'సౌదాగర్'లో హీరో వివేక్తో డేటింగ్లో ఉన్నట్లు వార్తలొచ్చాయి. ఆ తర్వాత నానా పటేకర్, డీజే హుస్సేన్ లాంటి వారితో ఎఫైర్తో వార్తల్లో నిలిచింది. అంతే కాకుంజా సెసిల్ ఆంథోనీ, ప్రశాంత్ చౌదరి, ఆస్ట్రేలియా రాయబారి క్రిస్పిన్ కాన్రాయ్, అజీజ్ ప్రేమ్జీ కుమారుడు తారిక్ ప్రేమ్జీ, రాజీవ్ ముల్చందానీ, సందీప్ చౌతా, క్రిస్టోఫర్ డెరిస్ ఇలా దాదాపు 12 మంది వ్యక్తులతో సంబంధాలు కొనసాగించినట్లు రూమర్స్ వచ్చాయి. కానీ చివరికీ మనీషా కొయిరాలా కూడా నేపాల్కు చెందిన సామ్రాట్ దహల్ను 2010లో వివాహం చేసుకుంది. వీరికి పెళ్లయిన రెండేళ్లకే విడిపోయారు. సినీ జీవితంతో పాటు నిజ జీవితంలో ఇబ్బందులు పడిన మనీషా ఇటీవల ఘనంగా రీ ఎంట్రీ ఇచ్చింది.సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇటీవలే నెట్ఫ్లిక్స్లో రిలీజైన హీరామండి: ది డైమండ్ బజార్ వెబ్ సిరీస్ విశేష అదరణ దక్కించుకుంది. -
బ్రేకప్కు అదే కారణమన్న నటుడు.. అబద్ధమన్న నటి
కలిసున్నప్పుడు ఎక్కడలేని ప్రేమ చూపించుకుంటారు. విడిపోయాక ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోస్తారు. ఇక్కడ చెప్పుకునే జంట విషయంలో ఇదే నిజమైంది. బాలీవుడ్ జంట వీజే అనుష దండేకర్- జేసన్ షా విడిపోయి చాలా రోజులవుతోంది. జేసన్ షా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బ్రేకప్ గురించి మాట్లాడుతూ.. అవతలి వ్యక్తి తనను పూర్తిగా అర్థం చేసుకోలేదన్నాడు. వారికి నచ్చినట్లు ఉండేలా మలుచుకోవాలని చూశారని ఆరోపించాడు. అది అబద్ధంతాజాగా ఈ వ్యాఖ్యలపై అతడి మాజీ ప్రేయసి అనుష స్పందించింది. నా పేరును గూగుల్లో సెర్చ్ చేస్తే.. మొదట కనిపించే వార్త ఏంటంటే.. నేను ఎవరినో నాకు నచ్చినట్లు ఉండాలని ఆంక్షలు పెట్టానట! అది పూర్తిగా అబద్ధం. ఇప్పుడేమో బిగ్బాస్ ఓటీటీ మూడో సీజన్లో పార్టిసిపేట్ చేయబోతున్నట్లు మరో ప్రచారం జరుగుతోంది. నా ఆన్సరేంటో వారికి బాగా తెలుసుఇందులో కూడా ఏమాత్రం నిజం లేదు. అసలు ఆ షో నిర్వాహకుల నుంచి నాకు ఎటువంటి ఫోన్ కాల్ రాలేదు. ఎందుకంటే నా సమాధానమేంటో వారిక్కూడా స్పష్టంగా తెలుసు. నేను ఎప్పటికీ బిగ్బాస్ షోలో పాల్గొనను. ఏంటో, అందరూ నా పేరు వాడుకుంటున్నారు.. అందుకు పొంగిపోతున్నాను అని వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ఇకపోతే అనుష.. ఇటీవల రిలీజైన 'జూనా ఫర్నీచర్' సినిమాలో కనిపించగా జేసన్.. 'హీరామండి' వెబ్ సిరీస్లో విలన్గా మెప్పించాడు.చదవండి: రజనీకాంత్ ఇంట్లో శరత్కుమార్ కుటుంబం.. పెళ్లికి రమ్మని ఆహ్వానం -
పనిమనిషిగా నటించి చిరాకొచ్చింది.. అందుకే!: నటి
ఒక్కసారి ఏదైనా పాత్రతో గుర్తింపు వచ్చిందంటే పదేపదే అలాంటి రోల్సే ఆఫర్ చేస్తుంటారు. బాలీవుడ్ నటి సునీత రాజ్వార్కు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన గోడు వెల్లబోసుకుంది. చదువైపోయిన వెంటనే నాకు సినిమా అవకాశాలు వచ్చాయి. అయితే ఎప్పుడూ ఒకేరకమైన రోల్స్ ఆఫర్ చేసేవారు. ఎక్కువగా పనిమనిషి పాత్రలే వచ్చేవి. అవి చేసీచేసీ బోర్ కొట్టింది. సరైన రోల్స్ రాకపోవడంతో యాక్టింగ్ నుంచి బ్రేక్ తీసుకున్నాను.పనిమనిషిగా బోర్..పనిమనిషిగా నటించొద్దని ఫిక్సయ్యాను. అలాంటి పాత్రలు ఆఫర్ చేస్తే నిర్దాక్షిణ్యంగా నో చెప్పాను. అలా బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. దానివల్ల మంచే జరిగింది. ఇప్పుడు నాకు భిన్న రకాల పాత్రలు వస్తున్నాయి. విభిన్నమైన పాత్రల్లో నన్ను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. నచ్చిన రోల్స్ చేస్తూ జనాలను నవ్వించగలుగుతున్నాను. చిన్నదానికి కూడా విమర్శించడమే పనిగా పెట్టుకున్న ఈ రోజుల్లో జనాల ప్రేమను పొందడం చాలా కష్టం. ఇంతకంటే ఏం కావాలి?కానీ నాపై ఇంత ప్రేమాభిమానాలు కురిపిస్తుంటే సంతోషంగా ఉంది. ఇండస్ట్రీలో కూడా నన్ను చూసే పద్ధతి మారింది. ఇప్పుడు నా కెరీర్తో నేను సంతోషంగా ఉన్నాను. ఏదో సాధించేసినంత హ్యాపీగా ఉంది. ఇంతకంటే నాకు ఇంకేం కావాలి? అని సునీత రాజ్వార్ చెప్పుకొచ్చింది. కాగా సునీత.. హిస్, బుద్ధ మర్ గయా, స్త్రీ, బాలా, శుభ్ మంగళ్ జ్యాద సావధాన్ వంటి పలు చిత్రాల్లో నటించింది. పంచాయత్ 2, పంచాయత్ 3, గుల్లక్ అనే వెబ్ సిరీస్లతో ఎక్కువ పాపులారిటీ సంపాదించుకుంది.చదవండి: కుటుంబ సభ్యులు వద్దని చెప్పినా ఆ పాటలో నటించాను: సమంత -
కంగనకు కానిస్టేబుల్ చెంపదెబ్బ
న్యూఢిల్లీ: ఢిల్లీకి వెళ్లేందుకు గురువారం చండీగఢ్ విమానాశ్రయానికి వచ్చిన బాలీవుడ్ నటి, మండీ నియోజకవర్గ బీజేపీ ఎంపీ కంగనా రనౌత్కు చేదు అనుభవం ఎదురైంది. కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం(సీఐఎస్ఎఫ్) మహిళా కానిస్టేబుల్ కుల్వీందర్ కౌర్ ఆమెను చెంపదెబ్బ కొట్టారు. ఈ అనూహ్య ఘటనపై కంగనా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ‘‘ఎయిర్పోర్ట్లో సెక్యూరిటీ చెక్ను పూర్తిచేసుకుని లోపలికి వెళ్తుంటే మహిళా కానిస్టేబుల్ హఠాత్తుగా ఎదురొచ్చి చెంప చెళ్లుమనిపించింది. తర్వాత దూషించింది. ఎందుకని అడిగితే రైతులకు మద్దతుగా ఆ పని చేశా అని చెప్పింది. పంజాబ్లో ఉగ్ర, హింసాత్మక ఘటనలు పెచ్చరిల్లుతున్నాయి’’ అని కంగనా అన్నారు. ఢిల్లీకి చేరుకున్నాక సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ను కలిసి జరిగింది వివరించారు.కానిస్టేబుల్ వాదనేంటి?చెంపదెబ్బ కొట్టాక అక్కడే కొద్దిసేపు ఉన్న కానిస్టేబుల్ అక్కడ వారితో.. ‘‘ నాలుగేళ్ల క్రితం వివాదాస్పద మూడు సాగు చట్టాలను రద్దుచేయాలంటూ ఆందోళన బాటపట్టిన వేలాది మంది రైతులను కించపరుస్తూ వ్యాఖ్యలు, పోస్ట్లు చేసినందుకే కంగనను కొట్టా. ఆనాడు ఢిల్లీలో బైఠాయించిన మహిళా రైతులను చూపిస్తూ వీళ్లంతా కేవలం రూ.100 కోసం ధర్నాలో పాల్గొన్నారు అని కంగనా కించపరిచారు. ఆనాడు ధర్నా చేస్తున్న వాళ్లలో మా అమ్మ కూడా ఉంది. మాది రైతు కుటుంబం. మా అన్న కూడా రైతు. కంగనా అలాగే రోడ్డుపై కూర్చొని ధర్నా చేయగలదా?’’ అని ఆవేశంగా మాట్లాడారు. -
ఎయిర్పోర్ట్లో కంగనాపై దాడి.. స్పందించిన నటి!
బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రనౌత్పై సీఐఎస్ఎఫ్ మహిళ కానిస్టేబుల్ దాడికి పాల్పడింది. చండీఘర్ ఎయిర్పోర్ట్కు వస్తున్న ఆమెపై సెక్యూరిటీ చెకప్ సమయంలో కంగనాను చెంపదెబ్బ కొట్టింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరల్గా మారింది. రైతుల ధర్నాపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకే కంగనాపై చేయి చేసుకున్నట్లు తెలుస్తోంది.అయితే తాజాగా ఈ సంఘటనపై కంగనా స్పందించింది. తనపై దాడి నిజంగానే జరిగినట్లు వెల్లడించింది. దీనిపై మీడియాతో పాటు చాలామంది నుంచి నాకు ఫోన్ కాల్స్ వస్తున్నాయని పేర్కొంది. అయితే ప్రస్తుతం తాను సేఫ్గానే ఉన్నట్లు తెలిపింది. చండీఘర్ విమానాశ్రయంలో సెక్యూరిటీ స్టాఫ్ నాపై చేయి చేసుకున్నారు. నా లగేజీ చెకప్ తర్వాత లోపలికి వెళ్తుండగా.. అక్కడే ఉన్న ఇద్దరు మహిళా సెక్యూరిటీ సిబ్బందిలో ఒకరు నా చెంపపై కొట్టడంతో పాటు అసభ్యంగా మాట్లాడారు. దీనిపై వారిని ప్రశ్నించగా.. రైతుల ధర్నాకు మద్దతుగానే తనపై దాడి చేసినట్లు చెప్పారని కంగనా తెలిపింది. అయితే ప్రస్తుతానికి తాను సురక్షితంగానే ఉన్నానని.. కానీ పంజాబ్లో ఉగ్రవాదం పెద్దఎత్తున పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేసింది.కాగా.. కంగనాపై చెయ్యి చేసుకున్న సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ను కుల్వీందర్ కౌర్గా గుర్తించారు. ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్ మండి స్థానం నుంచి కంగనా గెలుపొందిన సంగతి తెలిసిందే. తాజా దాడి ఘటనపై బీజేపీ నేతలు, సానుభూతి పరులు సోషల్ మీడియా వేదికగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.Shocking rise in terror and violence in Punjab…. pic.twitter.com/7aefpp4blQ— Kangana Ranaut (Modi Ka Parivar) (@KanganaTeam) June 6, 2024 -
గుర్తు పట్టలేని విధంగా మారిపోయిన బిగ్బాస్ బ్యూటీ.. అసలేం జరిగింది?
సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఫేమస్ అయిన బ్యూటీ ఉర్ఫీ జావెద్. ఈ బాలీవుడ్ భామకు బిగ్బాస్తోనే గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత బోల్డ్ ఫ్యాషన్ దుస్తులతో సోషల్ మీడియాలో సెన్సేషన్గా మారింది. విచిత్రమైన ఫ్యాషన్ డ్రెస్సులు ధరించి ఎప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఇదిలా ఉండగా.. తాజాగా తన ఇన్స్టాలో ఫోటోలు షేర్ చేసింది ముద్దుగుమ్మ. గుర్తు పట్టలేని విధంగా ఉన్న ఫోటోలు పంచుకున్న భామ.. తనకెదురైన సమస్యను ఫ్యాన్స్తో పంచుకుంది. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం.తాను అధికంగా ఫిల్లర్స్ వాడినందు వల్లే మొహం ఇలా మారిపోయిందంటూ ఉర్ఫీ రాసుకొచ్చింది. వాటి వల్లే అలర్జీ బారిన పడినట్లు తెలిపింది. ప్రతి రోజు ఇదే సమస్యతో నిద్ర లేస్తానంటూ ఆవేదన వ్యక్తం చేసింది. వీటితో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నట్లు పేర్కొంది. ఉర్ఫీ తన ఇన్స్టాలో రాస్తూ.. 'అధికస్థాయిలో ఫిల్లర్స్ వల్ల నా ముఖంలో ఇలా మారిపోయింది. నాకు అలెర్జీలు ఉన్నాయి. అంతే కాదు నా ముఖం చాలాచోట్ల ఉబ్బినట్లు కనిపిస్తుంది. నేను ప్రతి రోజు ఇలానే నిద్రలేస్తాను. నా ముఖం ఎప్పుడూ వాచి ఉంటుంది. ఎప్పుడూ తీవ్రమైన అసౌకర్యంగా ఉంటా. ఇవేమీ ఫిల్లర్స్ కాదు అబ్బాయిలు.. అలెర్జీ వల్లే ఏర్పడిందే. ఇమ్యునోథెరపీ తర్వాత ఇలా వాచిపోయిన ముఖంతో చూస్తే.. నేను అలర్జీతో బాధపడుతున్నా. నాకు 18 ఏళ్ల వయస్సు నుంచి ఉపయోగిస్తున్న సాధారణ ఫిల్లర్లు, బొటాక్స్ వల్ల ఏం కాలేదు. కానీ మీకు నా ముఖం ఉబ్బినట్లు కనిపిస్తే, ఎక్కువ ఫిల్లర్స్ తీసుకోమని మాత్రం సలహా ఇవ్వకండి. కాస్తా దయ చూపండి చాలు' అంటూ పోస్ట్ చేసింది. ఇది చూసిన ఫ్యాన్స్ గెట్ వెల్ సూన్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. View this post on Instagram A post shared by Uorfi (@urf7i) -
అలాంటి వాళ్లు పనికిమాలిన పని చేసిన తప్పులేదు: బాలకృష్ణపై నటి ఫైర్
టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ వివాదాస్పద ఎపిసోడ్ ఇప్పట్లో ముగిసిపోయేలా లేదు. ఇప్పటికే ఆయన తీరును పలువురు సినీతారలు సైతం తప్పుబడుతున్నారు. ప్రముఖ సింగర్ చిన్మయి, బాలీవుడ్ డైరెక్టర్ హన్సల్ మెహతా సోషల్ మీడియా వేదికగా బాలయ్యపై విమర్శలు చేశారు. హన్సల్ ఏకంగా ఈ చెత్తమనిషి ఎవరంటూ ట్విటర్లో రిప్లై ఇచ్చారు. తాజాగా మరో నటి సోషల్ మీడియా వేదికగా బాలకృష్ణ తీరుపై విరుచుకుపడింది. ఇంతకీ ఆమె ఏమన్నారో ఓ లుక్కేద్దాం.రిధి డోగ్రా తాజాగా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో బాలకృష్ణపై పోస్ట్ చేసింది. ఆ వీడియోను షేర్ చేస్తూ విమర్శలు చేసింది. అతను ఆ మహిళను కించపరిచేలా వ్యవహరించినప్పటికీ ఆమె నవ్వుతోంది. ఎందుకంటే బాగా డబ్బు, పేరున్న మగాళ్లు పనికిమాలిన పని చేసిన ఈ ప్రపంచం తప్పుపట్టదు. ఎందుకంటే అలాంటి పురుషులు ఏం చేసినా పర్వాలేదు అనే స్థాయికి తీసుకొచ్చారు. ఒకవేళ అదే సమయంలో అంజలి కఠినంగా వ్యవహరించి ఉంటే.. ఇప్పటికే విపరీతంగా ట్రోలింగ్కు గురయ్యేది అంటూ రిధి డోగ్రా రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియా వైరల్గా మారింది. -
ప్లీజ్.. నన్ను కొట్టొద్దు.. వేడుకున్న రవీనా టండన్
గతేడాది కేజీఎఫ్-2లో అలరించిన స్టార్ నటి రవీనా టాండన్. ఆ చిత్రంలో కీలక పాత్ర పోషించింది. చివరిసారిగా పట్నా శుక్లా అనే చిత్రంలో లాయర్గా కనిపించింది. ప్రస్తుతం రవీనా గుడ్ చాడి, వెల్కమ్ బ్యాక్ చిత్రాల్లో నటిస్తున్నారు. అయితే తాజాగా ఈ బాలీవుడ్ నటి వివాదంలో చిక్కుకుంది. తన కారు డ్రైవర్ చేసిన పనికి రవీనాపై దాడికి యత్నించారు. దీంతో తనను కొట్టవద్దంటూ వారిని వేడుకున్నారామె. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలుసుకుందాం. ముంబయిలో రవీనా టాండన్, తన డ్రైవర్లో కలిసి వెళ్తుండగా రోడ్డుపై వెళ్లున్న కొందరిని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో రోడ్డుపై వెళ్తున్న వారిలో ఒక్కరు గాయపడ్డారు. దీంతో వారి కుటుంబసభ్యులంతా కలిసి డ్రైవర్పై గొడవకు దిగారు. అ తర్వాత రవీనా టాండన్ కారు దిగి గాయపడిన వారిపై వాగ్వావాదానికి దిగింది. దీంతో వారంతా ఒక్కసారిగా రవీనా టాండన్పైకి దూసుకొచ్చారు. దీంతో ఆమె దయచేసి నన్ను కొట్టవద్దని వారిని వేడుకుంది. వీడియోలను రికార్డ్ చేయవద్దని అక్కడున్న వారిని కోరింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట విస్తృతంగా వైరలవుతోంది.అయితే మరోవైపు గాయపడిన కుటుంబసభ్యులు రవీనా టాండన్ తమపై దాడి చేసిందని ఆరోపిస్తున్నారు. తమపై అన్యాయంగా దాడి చేసిందని అన్నారు. పోలీసులు కూడా మాకు న్యాయం చేయలేదని..రవీనా టాండన్ మా అమ్మను కొట్టారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. మా అమ్మ తలకు తీవ్ర గాయాలయ్యాయని బాధితుడు పేర్కొన్నారు. చివరికీ ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్కు చేరింది. Actress Raveena Tandon's driver accused of rash driving & crashing into 3 women in Bandra, Mumbai. Injured's family claim Raveena in an inebriated state got off the car along with her driver & further assaulted the victims on the road. Crowds turned aggressive leading to heated… pic.twitter.com/PdbgLMueFz— Nabila Jamal (@nabilajamal_) June 2, 2024What's this #RaveenaTondon aunty!? pic.twitter.com/qA1IWAB1qf— 𝙍𝙎𝙆 (@RSKTheMonsters) June 2, 2024 -
ప్రియుడితో అలాంటి సీన్స్.. అదే కావాలంటోన్న మిల్కీ బ్యూటీ!
మిల్కీ బ్యూటీగా అభిమానుల్లో గుండెల్లో పేరు సంపాదించుకున్న భామ తమన్నా భాటియా. గతేడాది జైలర్ సినిమాలో స్పెషల్ సాంగ్తో అదరగొట్టేసింది. అంతే కాకుండా బాలీవుడ్లో వెబ్ సిరీస్లతో అలరించింది. లస్ట్ స్టోరీస్-2 వెబ్ సిరీస్లో మరి బోల్డ్గా నటించి తన గ్లామర్ను మరోసారి పరిచయం చేసింది. ఈ సిరీస్లో విజయ్ వర్మతో చేసిన రొమాన్స్ వేరే లెవెల్కు తీసుకెళ్లింది. తాజాగా ఈ సిరీస్లో అలా నటించడంపై తమన్నా ఆసక్తికర కామెంట్స్ చేసింది.లస్ట్ స్టోరీస్-2 ఫస్ట్ పార్ట్ చూశాక బోల్డ్ సీన్స్ పట్ల నా అభిప్రాయం పూర్తిగా మారిపోయిందని తమన్నా తెలిపింది. అలా నటిస్తే తప్పేముందని నాలో నేనే ప్రశ్నించికున్నానని పేర్కొంది. అయితే అలాంటి సీన్స్లో నటిస్తే చూడాలని చాలామంది ప్రేక్షకులు ఇష్టపడుతున్నారని వెల్లడించింది. అందుకే బోల్డ్ సీన్స్లో నటిస్తే తప్పేం లేదని అనిపించిందని తెలిపింది. అంతే కాదు.. ఒక నటిగా తాను అన్ని రకాల పాత్రలు చేయాల్సిన అవసరముందని చెప్పుకొచ్చింది. అందుకే ఒక నటిగా తాను ఏం చేయాలో అదే చేస్తానంటోంది మిల్కీ భామ. -
Shraddha Kapoor: బహు భాషిణి
నటిగా సుపరిచితమైన శ్రద్ధా కపూర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. తాజాగా లిప్స్టిక్కు సంబంధించిన ఒక అడ్వర్టైజ్మెంట్లో బ్రిటిష్, ఫ్రెంచ్, రష్యన్, అమెరికన్ యాక్సెంట్లతో మాట్లాడి ‘ఔరా’ అనిపించింది. శ్రద్ధా నాలుగు విభిన్న భాషలను అలవోకగా మాట్లాడుతున్న ఈ వీడియో వైరల్ అయింది. గతంలో ‘కపిల్ శర్మ షో’లో తన భాషా నైపుణ్యాన్ని ప్రదర్శించి ‘శభాష్’ అనిపించుకుంది శ్రద్ధ. ‘శ్రద్ధా కపూర్లో మంచి మిమిక్రీ ఆర్టిస్ట్ ఉంది’ అంటున్నారు ఆమె అభిమానులు. -
బిగ్బాస్ నటి బ్రేకప్.. నువ్వు ఇంకా ఎదగాలన్న మరో నటి!
బిగ్బాస్ బ్యూటీ ఇషా మాల్వియా ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. బాయ్ఫ్రెండ్ సమర్థ్ జురెల్తో బ్రేకప్ చేసుకున్న సంగతి తెలిసిందే. హౌస్లో ఉండగానే వీరిమధ్య విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో వీరిద్దరు విడిపోవడం మరో నటి, బిగ్బాస్ కంటెస్టెంట్ రింకూ ధావన్ విమర్శలు చేసింది. ఇషా మాల్వియా మరో ఆరు నెలల్లో కొత్త బాయ్ఫ్రెండ్తో కనిపిస్తుందని కామెంట్స్ చేసింది.అయితే రింకూ ధావన్ చేసిన కామెంట్స్పై ఇషా మాల్వియా గట్టిగానే రియాక్ట్ అయింది. ముందు నీ జీవితం ఎలా ఉందో చూస్కో అంటూ ఇచ్చిపడేసింది. ఈ టాపిక్ కాస్తా ఇద్దరి మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. ఇషా కామెంట్స్పై రింకూ ధావన్ స్పందించింది. మీరు నా వైవాహిక జీవితం, విడాకుల తీరు గురించి మాట్లాడిన తీరు మీ సున్నితత్వాన్ని తెలియజేస్తోందని అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. బిగ్ బాస్ తర్వాత ఇషాతో టచ్లో కూడా లేనని చెప్పింది.రింకూ తన ఇన్స్టాలో రాస్తూ..' నువ్వు తెలివిగలదానివి అని చెప్పా. అందులో తప్పేం లేదు. నీ జీవితం నీ ఇష్టం. నేను అందులో జోక్యం చేసుకోవడం లేదు. ఎందుకంటే మీరు ప్రతి విషయాన్ని సొంతంగా హ్యాండిల్ చేయగలరు. నా విడాకుల గురించి మీరు మాట్లాడిన విధానం చూస్తే మీ సున్నితత్వాన్ని తెలియజేసింది. జీవితంలో మీరు నిజంగా ఎదగాలని కోరుకుంటున్నా. అదే జరగకపోతే రాబోయే 8 నెలల్లో ఇలాంటి ప్రకటనలే వస్తాయి. విష్ యూ గుడ్ లక్' అంటూ పోస్ట్ చేసింది. View this post on Instagram A post shared by Rinku Dhawan (@rinku.dhawan15) -
జాన్వీ కపూర్ వీడియోపై కామెంట్.. ఇచ్చిపడేసిన హీరోయిన్!
బాలీవుడ్ భామ జాన్వీకపూర్ మిస్టర్ అండ్ మిసెస్ మహీ చిత్రంతో ప్రేక్షకులను పలకరించింది. క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సినిమా ఈ రోజే థియేటర్లలో రిలీజైంది. ఈ చిత్రంలో రాజ్కుమార్ రావుకు జంటగా నటించింది. ఈ సినిమాలో మహిమ పాత్రలో మెరిసింది. అయితే ఇటీవల ఈ మూవీ షూటింగ్కు సంబంధించిన ఓ వీడియోను షేర్ చేసిన సంగతి తెలిసిందే. అందులో తన భూజానికి గాయమైనట్లు కనిపించింది. ఇది చూసిన ఫ్యాన్స్ నటనపై తన అంకితభావాన్ని కొనియాడారు.అయితే ఈ వీడియో చూసిన ఓ నెటిజన్ జాన్వీ కపూర్ను ట్రోల్ చేశాడు. టెన్నిస్బాల్తో ఆడిన క్రికెట్లో కూడా మీకు గాయమైందా? అంటూ నవ్వుతున్న ఎమోజీలను పెట్టారు. అయితే ఇది చూసిన జాన్వీ కపూర్ సైతం అతనికి అదిరిపోయే రిప్లై ఇచ్చింది. తనకు సీజన్ బాల్తో ఆడుతుండగానే గాయమైందని.. అందుకే టెన్నిస్ బాల్తో ఆడాల్సి వచ్చింది. నా భుజాలకు ఉన్న బ్యాండేజ్లను చూస్తే ఆ విషయం మీకు అర్థమవుతుందంటూ రాసుకొచ్చింది. ఇలాంటి వాటిపై కామెంట్ చేసే ముందు ఒకసారి వీడియో మొత్తం చూడండి.. అప్పుడు మీ జోక్స్కు నేను కూడా నవ్వుతా అంటూ కౌంటర్ ఇచ్చిపడేసింది. దీంతో దెబ్బకు సారీ జాన్వీ మేడమ్.. అంటూ రిప్లై ఇచ్చాడు. కాగా.. 'మిస్టర్ అండ్ మిసెస్ మహి' చిత్రాన్ని కరణ్ శర్మ డైరెక్షన్లో తెరకెక్కించారు. అభిమానుల అంచనాల మధ్య మే 31 థియేటర్లలో విడుదలైంది. కాగా.. జాన్వీ కపూర్ టాలీవుడ్లో దేవర చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీతోనే టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) -
తండ్రి బర్త్ డే.. సర్ప్రైజ్ ఇచ్చిన బిగ్బాస్ బ్యూటీ!
బాలీవుడ్ భామ, బిగ్బాస్ బ్యూటీ ఇషా మాల్వియా సీజన్-17లో మెరిసింది. ఆమె చివరిసారిగా 'పావోన్ కి జుట్టి' అనే ఆల్బమ్ సాంగ్లో కనిపించింది. ఈ పాటకు ఆడియన్స్ నుంచి విపరీతమైన క్రేజ్ దక్కించుకుంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ తన తండ్రికి బిగ్ సర్ప్రైజ్ ఇచ్చింది. ఆయన పుట్టిన రోజు కావడంతో కారును బహుమతిగా ఇచ్చింది. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్స్టాలో పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.కాగా.. బిగ్బాస్- 17లో చివరిసారిగా కనిపించిన ఇషా మాల్వియా ప్రస్తుతం మాజీ బాయ్ఫ్రెండ్ సమర్థ్ జురెల్తో బ్రేకప్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరి విడిపోవడంపై తన తోటి కంటెస్టెంట్, మరో నటి రింకూ ధావన్ విమర్శలు చేసింది. ఇషాను మరో ఆరు నెలల్లో కొత్త బాయ్ఫ్రెండ్తో కనిపిస్తుందని అవహేళనగా మాట్లాడింది. తాజాగా రింకూ ధావన్ చేసిన కామెంట్స్పై ఇషా మాల్వియా ఘూటుగా స్పందించింది. ముందు నీ లైఫ్ ఎలా ఉందో చూసుకో అంటూ ఇచ్చిపడేసింది.
Pagination
T20 World Cup 2024: భారత్ చేతిలో ఓటమి.. వెక్కి వెక్కి ఏడ్చిన పాక్ ప్లేయర్
మళ్లీ 2014 నాటి అరాచక పాలన రిపీట్ అవుతుందా?
ఏపీ రాజధానిగా అమరావతి: చంద్రబాబు
సెన్సేషన్ సోఫియా.. తండ్రిపై అవినీతి కేసు, ఇంట్రెస్టింగ్ బ్యాక్గ్రౌండ్
ఏపీలో కుప్పకూలిన రాజ్యాంగ వ్యవస్థలు: వైఎస్ జగన్
యానిమల్ బ్యూటీ కొత్త బంగ్లా.. ధరెంతో తెలుసా?
భూకంపాన్ని తట్టుకునే ఇల్లు.. ఇది కదా అసలైన టెక్నాలజీ అంటే!
పాయే.. మళ్లీ చైనా పరువు పాయే!
ఆర్బీఐ కీలక నిర్ణయం: మరో బ్యాంక్ లైసెన్స్ రద్దు
మంత్రి దృష్టికి తీసుకెళ్తా.. సమస్యను పరిష్కరిస్తా: కేఎల్ఆర్
టీమిండియా హెడ్ కోచ్ రేసులో కొత్త పేరు
విద్యుత్ కమిషన్ విచారణ పారదర్శకంగా జరగడం లేదు: జగదీష్రెడ్డి
తప్పతాగి డ్రైవింగ్.. ప్రముఖ సింగర్ అరెస్ట్!
ఇదే కాంగ్రెస్ సంస్కృతి : కార్యకర్తతో కాళ్లు కడిగించుకొని..ఆపై..
'కల్కి 2898 AD' కథ అన్నింటికీ క్లైమాక్స్: నాగ్ అశ్విన్
దర్శన్ మేనేజర్ సూసైడ్
ఆ సినిమాలను తీసుకోని ఓటీటీలు.. అదే కారణమా?
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (18-06-2024)
Advertisement