-
ప్లే ఆఫ్కు సన్ రైజర్స్ : థాంక్యూ హైదారబాద్ (ఫొటోలు)
-
SRH Vs PBKS Highlights Photos: సన్ రైజర్స్ vs పంజాబ్..తారలతో నిండిన ఉప్పల్ స్టేడియం (ఫోటోలు)
-
ఫ్యాన్స్లో నిరాశ నింపిన వర్షం.. తడిసిన ఉప్పల్ స్డేడియం (ఫోటోలు)
-
ఉప్పల్ స్టేడియంలో ఫుల్ జోష్లో SRH, GT ప్లేయర్ల ప్రాక్టీస్ (ఫొటోలు)
-
SRH Vs LSG Photos: సన్రైజర్స్ విధ్వంసం..లక్నోపై 10 వికెట్లతో ఘనవిజయం (ఫొటోలు)
-
Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
-
Anchor Sreemukhi: ఉప్పల్ స్టేడియంలో యాంకర్ శ్రీముఖి సందడి (ఫోటోలు)
-
హైదరాబాద్ vs రాజస్థాన్ రాయల్స్.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)
-
ఉప్పల్లో ఉల్లాసంగా SRH,RR ప్లేయర్ల ప్రాక్టీస్ (ఫొటోలు)
-
SRH Vs RCB Photos: నిన్న హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్కు వెళ్ళలేదా అయితే ఈ ఫోటోలు చూడాల్సిందే
-
SRH Vs RCB: ఐపీఎల్ ఫీవర్... హోటల్ రెంట్లు డబుల్!
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫీవర్తో హైదరాబాద్లోని స్టార్ హోటళ్ల గదుల అద్దెలకు రెక్కలు వచ్చాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు అన్ని స్టార్ హోటళ్లు బుక్ అయిపోయాయి. దీనికితోడు రేట్లు కూడా సాధారణం కంటే రెట్టింపు అంతకంటే ఎక్కువయ్యాయి. హోటల్ గదులు బుక్ చేసుకోవడానికి ఉపకరించే ప్రముఖ వెబ్సైట్లు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఉప్పల్ స్టేడియంలో గురువారం సన్ రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్)–రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్ల మధ్య ఫేవరేట్ మ్యాచ్ జరుగనుండటంతో పాటు పెళ్లి ముహూర్తాలు కూడా ఉండటం ఇందుకు కారణంగా తెలుస్తోంది. అత్యధిక స్కోర్లతో హాట్ ఫేవరేట్లుగా... ప్రసుత్తం ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్–ఆర్సీబీ జట్లు హాట్ ఫేవరెట్స్గా మారిపోయాయి. ఈ రెండింటి మధ్య ఈ నెల 15న బెంగళూరు చిన్నస్వామి స్టేడియం కేంద్రంగా ఓ మ్యాచ్ జరిగింది. అందులో ఎస్ఆర్హెచ్ 287, ఆర్సీబీ 262 పరుగులు చేసి రికార్డు సృష్టించాయి. ఐపీఎల్ చరిత్రలోనే ఇవి అత్యధిక స్కోర్లు కావడంతో ఈ రెండు జట్ల పైనా ఐపీఎల్ ప్రియులకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. గురువారం ఉప్పల్ స్టేడియంలోనూ ఈ రెండు జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే ఆయా జట్లు హైదరాబాద్ చేరుకున్నాయి. వీరి కోసం రెండు స్టార్ హోటళ్లలో చాలా భాగం నిర్వాహకులు బుక్ చేశారు. దీంతో పాటు ఈ మ్యాచ్ను తిలకించేందుకు దేశవిదేశాల నుంచి అనేక మంది క్రికెట్ అభిమానులు వస్తున్నారు. వీళ్లు సైతం ఆన్లైన్లో, ప్రముఖ వెబ్సైట్లు, యాప్ల ద్వారా స్టార్ హోటళ్లలో గదులు బుక్ చేసుకుంటున్నారు. ఈ కారణంగానే హైదరాబాద్లోని అనేక స్టార్ హోటళ్లలో శుక్రవారం వరకు గదులు ఖాళీ లేవని ఆయా వెబ్సైట్లు చూపిస్తున్నాయి. సరాసరిని మించిన బుకింగ్... హోటళ్లల్లో గదులు బుక్ కావడం, అందులో అతిథులు బస చేయడాన్ని ఆక్యుపెన్సీగా పిలుస్తారు. స్టాటిస్టా సంస్థ అధ్యయనం ప్రకారం హైదరాబాద్లోని స్టార్ హోటళ్లల్లో ఆక్యుపెన్సీ రేటు సరాసరి గరిష్టంగా 50 నుంచి 60 శాతం మాత్రమే ఉంటోంది. 2021–22 ఆరి్థక సంవత్సరంలో ఇది 51 శాతంగా, 2022–23 ఆరి్థక సంవత్సరంలో 73 శాతంగా నమోదైంది. అయితే ఐపీఎల్ మ్యాచ్తో పాటు పెళ్లి ముహుర్తాలు కూడా ఉండటంతో ప్రస్తుతం అనేక స్టార్ హోటళ్లు ‘నో రూమ్’గా మారిపోయాయి. ఉన్న వాటిలోనూ అద్దెలు సాధారణ సమయం కంటే రెట్టింపు, అంతకంటే ఎక్కువగా ఉన్నట్లు ప్రముఖ వెబ్సైట్లు, యాప్స్ సూచిస్తున్నాయి. గురువారం రాత్రి క్రికెట్ మ్యాచ్ ఉండటంతో మంగళవారం నుంచి శుక్రవారం వరకు ఇవే రేట్లు కనిపిస్తున్నాయి. సాధారణంగా మామూలు రోజుల్లో కంటే వీకెండ్స్లో హోటల్ రూముల అద్దెలు ఎక్కువగా ఉంటాయి. ఈ లెక్కన చూసినా శని–ఆదివారాల్లో ఆయా హోటళ్ల అద్దెల కంటే మంగళవారం నుంచి శుక్రవారం వరకు ఎక్కువగా ఉన్నాయి. సైబరాబాద్ పరిధిలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఉన్న షెరిటన్ హోటల్లో ప్రెసిడెన్షియల్ స్వీట్ అద్దె మంగళ–బుధవారాల్లో రూ.1.28 లక్షలుగా ఉండగా... శుక్రవారం నుంచి ఇది రూ.64 వేల నుంచి రూ.67 వేల వరకు మాత్రమే ఉన్నట్లు ఆయా వెబ్సైట్లు చూపిస్తున్నాయి. ఇదే హోటల్లో సాధారణ గది అద్దె మంగళ–బుధవారాల్లో రూ.21,500గా, శని–ఆదివారాల్లో రూ.11,250గా ఉంది. హైటెక్ సిటీలోని ఐటీసీ కోహినూర్ హోటల్లో మంగళ–బుధవారాలకు అద్దె రూ.32 వేలుగా చూపిస్తోంది. శని–ఆదివారాలకు ఈ మొత్తం రూ.9,800గా ఉంది. వెస్టిన్ హోటల్లో మంగళ–బుధవారాలకు రూ.22,500గా, శని–ఆదివారాలకు రూ.10 వేలుగా కనిపిస్తోంది. సోమాజీగూడలోని ది పార్క్ హోటల్లో గది అద్దె మంగళ–బుధవారాలకు రూ.11,587గా, శని–ఆదివారాలకు రూ.5,071గా ఉంది. గురు–శుక్రవారాల్లో ఆయా హోటళ్లలో నో రూమ్ అని కనిపిస్తోంది. (అద్దె మొదటి రోజు చెక్ ఇన్ సమయం నుంచి రెండో రోజు చెక్ ఔట్ సమయం వరకు... పన్నులు దీనికి అదనం) -
ఉప్పల్ మ్యాచ్ టికెట్లు నిమిషాల్లో సోల్డ్ అవుట్.. అభిమానులకు మరోసారి నిరాశే
-
ఉప్పల్ స్టేడియంలో హెచ్సీఏ మీడియా సమావేశం
ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో ఇవాళ (ఏప్రిల్ 10) హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మీడియా సమావేశం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు, ఉపాధ్యక్షుడు దల్జిత్ సింగ్, సెక్రెటరీ దేవ్ రాజ్, జాయింట్ సెక్రెటరీ బసవరాజు, ట్రెజరర్ సీజే శ్రీనివాస్, కౌన్సిలర్ సునీల్ అగర్వాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు మాట్లాడుతూ.. ఇటీవల సన్రైజర్స్ ఐపీఎల్ మ్యాచ్కు ముందు తలెత్తిన పవర్ కట్ సమస్య, బ్లాక్లో ఐపీఎల్ టికెట్ల విక్రయం తదితర విషయాలపై వివరణ ఇచ్చారు. స్టేడియంకు విద్యుత్ సరఫరా నిలిపివేయడంపై మాట్లాడుతూ..ఈ సమస్య ఇప్పటిది కాదని, 2015 నుంచి ఉందని తెలిపారు. తమ ప్యానెల్ బాధ్యతలు చేపట్టాక ప్రభుత్వంతో మాట్లాడి విద్యుత్ బకాయిల విడతల వారీగా కడుతున్నామని, ఇప్పటికే మొదటి ఇన్స్టాల్మెంట్ కూడా చెల్లించామని చెప్పారు. బ్లాక్లో ఐపీఎల్ టికెట్ల విక్రయంపై మాట్లాడుతూ.. టికెట్ల విక్రయం అనేది పూర్తిగా సన్రైజర్స్కి సంబంధించిందని, ఈ విషయంలో తమకెలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చారు. ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్కు రెండు లక్షల టికెట్ల డిమాండ్ ఉందని.. స్టేడియం కెపాసిటీ కేవలం 38 వేలు మాత్రమేనని తెలిపారు. ఇదే సందర్భంగా జగన్మోహన్ రావు మాట్లాడుతూ.. తమ ప్యానెల్ వచ్చాక టెస్ట్ మ్యాచ్ విజయవంతంగా నిర్వహించామని, ఐపీఎల్ మ్యాచ్లు కూడా సజావుగా నిర్వహిస్తున్నామని తెలిపారు.స్టేడియంలో కొత్తగా టీవీలు, ఏసీలు పెడుతున్నామని.. వాష్ రూమ్లు, లిఫ్ట్లు, లాంజ్లు రేనోవేట్ చేసామని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఐపీఎల్ మ్యాచ్కు సీఎంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు రావడంతో పార్కింగ్ సమస్య తలెత్తిన మాట వాస్తవమేనని తెలిపారు. జిల్లాల్లో క్రికెట్ అభివృద్ధి తమ ద్యేయమని.. ఏప్రిల్ 20 నుంచి అన్ని ఉమ్మడి జిల్లాలతో పాటు హైదరాబాద్లో సమ్మర్ క్యాంప్స్ నిర్వహించబోతున్నామని వెల్లడించారు. భవిషత్లో లక్ష సీటింగ్ కెపాసిటీ గల స్టేడియం నిర్మిస్తామని.. ఇందుకు తెలంగాణ ప్రభుత్వం కూడా మద్దతు తెలిపిందని అన్నారు. స్టేడియం లీజ్ అంశంపై రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడామని.. అందుకు సీఎం కూడా సానుకూలంగా స్పందించారని తెలిపారు. -
Uppal Stadium: టికెట్ ఉన్నా సీటే లేదు!
ఉప్పల్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) నిర్లక్షం ఒక్కొక్కటిగా వెలుగు చూస్తోంది. శుక్రవారం ఉప్పల్ స్డేడియంలో సన్రైజర్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మద్య జరిగిన మ్యాచ్లో ఓ అభిమానికి విచిత్ర అనుభవం ఎదురైంది. అతడికి టికెట్ ఉన్నా స్టేడియంలో సీటు లభించలేదు. నగరానికి చెందిన జునైద్ అహ్మద్ రూ.4,500 వెచి్చంచి టికెట్ కొన్నాడు. టికెట్లో జే– 66 సీట్ నంబర్ అలాట్ చేశారు. తీరా స్టేడియంలోకి వెళ్లగా జే–65 తర్వాత 67 సీటు ఉండటంతో షాక్ తిన్నాడు. జే–66 సీట్ ఎంత వెతికినా లభించలేదు. ఎవరిని ఆరా తీసినా ఫలితం లేకుండాపోయింది. చేసేదేమీలేక మ్యాచ్ ఆసాంతం నిలబడే చూడాల్సి వచ్చిందని బాధితుడు ఆవేదన వ్యక్తంచేశాడు. హెచ్సీఏ, ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్, నిర్లక్ష్యం కారణంగానే తాను 4 గంటల పాటు నిలబడాల్సి వచి్చందని జునైద్ ఆరోపించాడు. ఈ విషయాన్ని న్యాయస్థానం, వినియోగదారుల ఫోరం దృష్టికి తీసుకెళ్తానన్నాడు. -
SRH Vs CSK Highlights Pics: సన్రైజర్స్ను చీర్ చేసిన సెలబ్రిటీ ఫ్యాన్స్.. ఫొటోలు
-
IPL 2024 SRH vs CSK : ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ అభిమానులు సందడి (ఫొటోలు)
-
IPL 2024: క్రికెట్ ఫ్యాన్స్ ఆగ్రహం.. ఉప్పల్ స్టేడియం వద్ద ఉద్రిక్తత
-
IPL 2024: క్రికెట్ ఫ్యాన్స్ ఆగ్రహం.. ఉప్పల్ స్టేడియం వద్ద ఉద్రిక్తత
సాక్షి,హైదరాబాద్: ఐపీఎల్ మ్యాచ్ జరుగుతున్న ఉప్పల్ స్టేడియం వద్ద క్రికెట్ ఫ్యాన్స్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మ్యాచ్ టికెట్లున్నా లోపలికి అనుమతించడం లేదంటూ స్టేడియం వద్ద క్రికెట్ అభిమానులు ఆందోళనకు దిగారు. స్టేడియం ఎంట్రీ గేట్ 4 వద్ద ఉన్న బారికేడ్లను తోసేశారు. ఈ సందర్భంగా పోలీసులకు, క్రికెట్ ఫ్యాన్స్కు మధ్య తోపులాట జరిగడంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు టికెట్లున్నవారందరినీ క్యూలో ఉంచి ఒక్కొక్కరినీ లోపలికి పంపించడంతో గొడవ సద్దుమణిగింది. టాటా ఐపీఎల్ 2024లో భాగంగా హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో సన్రైజర్స్ హైదరాబాద్(ఎస్ఆర్హెచ్), చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) మధ్య రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఉప్పల్ స్టేడియానికి క్రికెట్ ఫ్యాన్స్ భారీగా తరలివచ్చారు. చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ కావడంతో ధోనీ అభిమానులు పెద్ద ఎత్తున స్టేడియంకు వచ్చినట్లు చెబుతున్నారు. ఇదీ చదవండి.. క్రికెట్ అభిమానులకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ గుడ్న్యూస్ -
IPL 2024: క్రికెట్ అభిమానులకు ఆర్టీసి ఎండీ సజ్జనార్ గుడ్ న్యూస్..
ఐపీఎల్-2024 సందర్భంగా హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో ఈరోజు (05-04-2024) సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ని వీక్షించడానికి భారీగా అభిమానులు వెళ్లనున్నారు. దీంతో స్టేడియం పరసర ప్రంతాల్లో సాధారణ ప్రయాణీకులకు ఎదురయ్యే ఇబ్బందులను గురించి ట్విట్టర్ లో ఆర్టీసి ఎండీ సజ్జనార్ "ఇవాళ ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో సన్ రైజర్స్ #Hyderbad వర్సెస్ #Chennai సూపర్ కింగ్స్ మధ్య జరగబోయే #IPL మ్యాచ్ కు మీ సొంత వాహనాల్లో వెళ్లి ట్రాఫిక్ అంతరాయానికి కారణం కాకండి. ప్రజా రవాణా వ్యవస్థను వినియోగించుకుని సాధారణ వాహనదారులకు అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టండి. ఈ మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు వెళ్లే క్రికెట్ అభిమానుల కోసమే హైదరాబాద్ లోని ప్రధాన ప్రాంతాల నుంచి 60 ప్రత్యేక బస్సులను ఉప్పల్ స్టేడియానికి #TSRTC నడుపుతోంది. ఈ బస్సులు సాయంత్రం 6 గంటలకు ప్రారంభమై.. తిరిగి రాత్రి 11:30 గంటలకు స్టేడియం నుంచి బయలుదేరుతాయి. వీటిని ఉపయోగించుకుని క్షేమంగా స్టేడియానికి వెళ్లి క్రికెట్ మ్యాచ్ ని వీక్షించాలని #TSRTC యాజమాన్యం కోరుతోందని తెలిపారు". క్రికెట్ అభిమానులకు విజ్ఞప్తి!? ఇవాళ ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో సన్ రైజర్స్ #Hyderbad వర్సెస్ #Chennai సూపర్ కింగ్స్ మధ్య జరగబోయే #IPL మ్యాచ్ కు మీ సొంత వాహనాల్లో వెళ్లి ట్రాఫిక్ అంతరాయానికి కారణం కాకండి. ప్రజా రవాణా వ్యవస్థను వినియోగించుకుని సాధారణ వాహనదారులకు అసౌకర్యం కలగకుండా… pic.twitter.com/FxQT9joKAl — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) April 5, 2024 -
IPL 2024: సన్రైజర్స్, సీఎస్కే మ్యాచ్కు తొలగిన కరెంటు కష్టం
ఐపీఎల్ 2024లో భాగంగా హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా ఇవాళ (ఏప్రిల్ 5) సన్రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య బిగ్ ఫైట్ జరగాల్సి ఉంది. అయితే మ్యాచ్కు ముందు రోజు బిల్లులు చెల్లించని కారణంగా ఉప్పల్ స్టేడియానికి పవర్ కట్ చేశారు అధికారులు. స్టేడియం నిర్వహకులు రూ. 1.67 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని, అందుకే విద్యుత్ సరఫరా నిలిపివేశామని సంబంధిత అధికారులు వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో నేటి మ్యాచ్ సాధ్యాసాధ్యాలపై అభిమానులు ఆందోళన చెందుతుండగా అధికారులు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు విద్యుత్ అధికారులతో సంప్రదింపులు జరిపిన అనంతరం విద్యుత్ పునరుద్దరణ జరిగింది. ఐపీఎల్ మ్యాచ్ దృష్ట్యా బిల్లులు చెల్లించేందుకు ఒక రోజు గడువు ఇచ్చినట్లు తెలుస్తుంది. విద్యుత్ అధికారులు వెసులుబాటును ఇవ్వడంతో సన్రైజర్స్, సీఎస్కే మ్యాచ్కు లైన్ క్లియర్ అయ్యింది. -
IPL 2024: ఉప్పల్లో నేడు బిగ్ ఫైట్.. సీఎస్కేతో తలపడనున్న సన్రైజర్స్
ఐపీఎల్ 2024లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 5) బిగ్ ఫైట్ జరుగనుంది. హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, సన్రైజర్స్ హైదరాబాద్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సన్రైజర్స్ బ్యాటర్ల విధ్వంసం చూసేందుకు అభిమానులు ఆరాటపడిపోతున్నారు. ఈ సీజన్లో సన్రైజర్స్ ఆడిన మూడు మ్యాచ్ల్లో రెండు మ్యాచ్ల్లో ఓడినప్పటికీ ఆ జట్టు బ్యాటింగ్ విన్యాసాలు ఫ్యాన్స్ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ట్రవిస్ హెడ్, అబిషేక్ శర్మ, క్లాసెన్ ఊచకోతను మరో సారి చూసేందుకు హైదరాబాద్ అభిమానులు తహతమలాడిపోతున్నారు. సన్రైజర్స్ చివరిసారి ఉప్పల్లో ఆడిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో సన్రైజర్స్ చేసిన స్కోర్ ఐపీఎల్ చరిత్రలోనే భారీ స్కోర్గా రిజిస్టర్ అయ్యింది. ఇదే మ్యాచ్ భారీ లక్ష్యాన్ని ఛేదిస్తూ ముంబై ఇండియన్స్ కూడా తీవ్రంగా ప్రతిఘటించింది. ముంబై ఇండియన్స్ కూడా సన్రైజర్స్ తరహాలోనే మెరుపులు మెరిపించింది. అయితే లక్ష్యం పెద్దది కావడంతో ముంబైకి ఓటమి తప్పలేదు. ఉప్పల్ పిచ్ బ్యాటర్లకు స్వర్గధామంగా ఉండటంతో నేటి మ్యాచ్లో మరోసారి భారీ స్కోర్లు నమోదు కావడం ఖాయమని తెలుస్తుంది. సన్రైజర్స్తో పోలిస్తే సీఎస్కే బ్యాటింగ్ లైనప్లో పెద్ద స్టార్లు లేనప్పటికీ మూకుమ్మడిగా రాణించడమే ఆ జట్టు స్పెషల్. ఈ సీజన్లో కొత్త కెప్టెన్ రుతురాజ్ నేతృత్వంలో ఆ జట్టు మూడు మ్యాచ్ల్లో రెండు విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతుంది. సీఎస్కే బ్యాటింగ్లో వ్యక్తిగతమై భారీ ప్రదర్శనలు లేనప్పటికీ రుతురాజ్, రచిన్, రహానే, డారిల్ మిచెల్, శివమ్ దూబే తలో చేయి వేస్తూ మ్యాచ్లను గెలిపిస్తున్నారు. వైజాగ్లో ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో ధోని పాత రోజులను గుర్తు చేయడం సీఎస్కేకు అదనపు బలంగా మారనుంది. అయితే ధోని నేటి మ్యాచ్కు అందుబాటులో ఉంటాడా లేదా అన్నది సందిగ్దంగా మారింది. ధోని ప్రాక్టీస్ సెషన్లో ఎక్కడా కనిపించకపోవడంతో అతను నేటి మ్యాచ్కు దూరంగా ఉంటాడని ప్రచారం జరుగతుంది. ధోని విషయం ఏమో కాని నేటి మ్యాచ్కు ఫామ్లో ఉన్న పేసర్ ముస్తాపిజుర్ రెహ్మాన్ దూరం కానున్నాడు. వరల్డ్కప్ వీసా కోసం అతను యూఎస్ఏకు వెళ్లాడు. బలాబలాల విషయంలో ఇరు జట్లు సమతూకంగా ఉన్నాయని చెప్పలేం కాని.. కలిసికట్టుగా ఆడితే సీఎస్కేకే విజయావకాశాలు అధికంగా ఉంటాయి. ఒకవేళ సన్రైజర్స్ బ్యాటర్లు గత మ్యాచ్ తరహాలో పట్టపగ్గాల్లేకుండా విరుచుకుపడితే ఆ జట్టుకే గెలిచే ఛాన్స్లు అధికంగా ఉంటాయి. ఏదిఏమైనా హైదరాబాద్ అభిమానులకు నేటి మ్యాచ్ కనువిందు చేయడం ఖాయం. హెడ్ టు హెడ్ రికార్డులను పరిశీలిస్తే.. ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు 20 మ్యాచ్లు జరగ్గా సీఎస్కే స్పష్టమైన ఆధిక్యత ప్రదర్శించింది. ఈ జట్టు 15 మ్యాచ్ల్లో గెలిస్తే.. సన్రైజర్స్ కేవలం 5 మ్యాచ్ల్లో విజయం సాధించింది. తుది జట్లు (అంచనా).. సీఎస్కే: రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్, అజింక్యా రహానే, శివమ్ దూబే, డారిల్ మిచెల్, మొయిన్ అలీ, సమీర్ రిజ్వీ, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ/ అరవెల్లి అవనీశ్, దీపక్ చాహర్, మతీషా పతిరణ సన్రైజర్స్: మయాంక్ అగర్వాల్, ట్రవిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఎయిడెన్ మార్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, జయదేవ్ ఉనద్కత్ -
ఉప్పల్ దంగల్ : హైదరాబాద్ Vs చెన్నై మ్యాచ్కు సర్వం సిద్ధం (ఫొటోలు)
-
ఉప్పల్ స్టేడియానికి కరెంట్ కట్
సాక్షి, హైదరాబాద్: కొన్ని నెలల నుంచి బిల్లులు చెల్లించకపోవడంతో ఉప్పల్ స్టేడియానికి విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపివేశారు. రేపు(శుక్రవారం) ఉప్పల్ స్టేడియం వేదికగా హైదరాబాద్, చెన్నై మధ్య మ్యాచ్ జరగనుంది. ఆ జట్లు ప్రాక్టీస్ చేస్తుండగా పవర్ కట్ అయ్యింది. కీలక మ్యాచ్కు ముందు బిల్లులు చెల్లించకపోవడంతో విద్యుత్ అధికారులు పవర్ కట్ చేశారు. ఉప్పల్ స్టేడియం నిర్వాహకులు విద్యుత్ బిల్లులు చెల్లించకుండా రూ.1.67 కోట్లు విద్యుత్ వాడుకున్నారని విద్యుత్ శాఖ వెల్లడించింది. పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలని పలుమార్లు నోటీసులు ఇచ్చిన కానీ హెచ్సీఏ పట్టించుకోలేదని, నోటీసులకు స్పందించకపోవడంతోనే విద్యుత్ సరఫరాను కట్ చేసినట్లు విద్యుత్ అధికారులు పేర్కొన్నారు. ఉప్పల్ స్టేడియం నిర్వాహకులపై విద్యుత్ చౌర్యం కేసు నమోదైంది. బిల్లులు చెల్లించకుండా విద్యుత్ వాడుకున్నారన్న విద్యుత్ శాఖ.. 15 రోజుల క్రితం నోటీసులు పంపించామని హబ్సిగూడ ఎస్ఈ రాముడు వెల్లడించారు. ప్రస్తుతం ఉప్పల్ స్టేడియంలో జనరేటర్తో పవర్ను సరఫరా చేస్తున్నారు. -
IPL టికెట్లు ఆన్లైన్లో బుక్ చేస్తున్నారా?.. పోలీసుల హెచ్చరిక ఇదే
సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్ టికెట్లు విక్రయిస్తామంటూ సైబర్ ముఠా మోసాలకు తెర తీసింది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా ఏప్రిల్ 5న జరగనున్న మ్యాచ్ నేపథ్యంలో హైదరాబాద్ వర్సెస్ చెన్నై మ్యాచ్ టికెట్లు ఇస్తామంటూ సోషల్ మీడియాలో పోస్ట్లు పెట్టి, క్యూఆర్ కోడ్లు పంపి కేటుగాళ్లు డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇప్పటికే చెన్నై-హైదరాబాద్ మ్యాచ్కి టికెట్లు మొత్తం అమ్ముడుపోగా, ఆన్లైన్లో అమ్మకాలను పేటీఎం నిలిపివేసింది. సోషల్ మీడియా వేదికగా టికెట్లు ఆన్లైన్లో అమ్ముతున్నామంటూ మోసాలకు పాల్పడుతున్నారు. క్యూఆర్ కోడ్స్ పంపించి డబ్బులు గుంజుతున్నారు. టికెట్లపై డిస్కౌంట్ సైతం ఇస్తామంటూ మోసాలకు పాల్పడుతున్నారు. క్రికెట్ అభిమానుల అప్రమతంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. -
IPL 2024 SRH Vs MI Photos: సొంతగడ్డపై సన్రైజర్స్ విజయగర్జన (ఫొటోలు)
Pagination
T20 World Cup 2024: భారత్ చేతిలో ఓటమి.. వెక్కి వెక్కి ఏడ్చిన పాక్ ప్లేయర్
మళ్లీ 2014 నాటి అరాచక పాలన రిపీట్ అవుతుందా?
ఏపీ రాజధానిగా అమరావతి: చంద్రబాబు
సెన్సేషన్ సోఫియా.. తండ్రిపై అవినీతి కేసు, ఇంట్రెస్టింగ్ బ్యాక్గ్రౌండ్
ఏపీలో కుప్పకూలిన రాజ్యాంగ వ్యవస్థలు: వైఎస్ జగన్
యానిమల్ బ్యూటీ కొత్త బంగ్లా.. ధరెంతో తెలుసా?
భూకంపాన్ని తట్టుకునే ఇల్లు.. ఇది కదా అసలైన టెక్నాలజీ అంటే!
పాయే.. మళ్లీ చైనా పరువు పాయే!
12 ఏళ్లు పూర్తి.. మెగా కోడలు ఉపాసన పోస్ట్ వైరల్
మియాపూర్లో సందడి చేసిన డింపుల్ హయాతి (ఫొటోలు)
విజయనగరం టీడీపీలో మంత్రి పదవుల చిచ్చు
వారెవ్వా అభిషేక్.. క్రికెట్ చరిత్రలోనే సూపర్ క్యాచ్! వీడియో
ప్రభాస్ 'కల్కి'తో దగ్గర పోలిక.. ఓటీటీలో ఈ మూవీ చూశారా?
క్రాష్ టెస్ట్లో తడాఖా.. ప్రముఖ ఈవీలకు 5 స్టార్ రేటింగ్
రామసేతు రహస్యం పార్ట్1: రామసేతు గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు
ట్రైనీ ఐఏఎస్గా పోలీస్ అకాడమీకి కుమార్తె.. సెల్యూట్ చేసిన ఐపీఎస్ తండ్రి
Nidhi Agarwal: కడపలో సినీ నటి నిధి అగర్వాల్ సందడి (ఫొటోలు)
భారత్-కెనడా మ్యాచ్ వర్షార్పణం..
Advertisement