Biden
-
భవిష్యత్తు బంగారమేనా?
అనుకున్నదే అయింది. అమెరికా నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తూనే డొనాల్డ్ ట్రంప్ తన మాటలు, చేతలు, చేష్టల ద్వారా సంచలనాలు సృష్టించారు. గతంలో దేశానికి 45వ అధ్యక్షుడిగా పనిచేసి, తాజాగా 47వ అధ్యక్షుడిగా సోమవారం పదవీ ప్రమాణ స్వీకారం చేసిన ట్రంప్ తన తొలి ప్రసంగంలోనే ‘ఇక నుంచి అమెరికాకు స్వర్ణయుగం’ అంటూ అమెరికన్లలో ఆశలు, ఆకాంక్షలు పెంచారు. అయితే, ‘అమెరికాను మళ్ళీ ఘనమైన దేశంగా తీర్చిదిద్దాల’ని (మాగా) నినదిస్తూ ఆయన ప్రకటించిన కొన్ని చర్యలు ఆధిపత్య, విస్తరణవాదానికి ప్రతీకగానూ ప్రతిధ్వనించాయి. వర్తమాన ప్రపంచ అధికార క్రమాన్ని మార్చివేసే పలు చర్యలకు నడుం బిగి స్తున్న తీరు, అలాగే కోవిడ్, చైనాలను సాకుగా చూపుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి, అలాగే పర్యావరణ రక్షణపై ప్యారిస్ ఒప్పందం నుంచి పక్కకు తప్పుకుంటున్నట్లు ప్రకటించడం ప్రపంచాన్ని నివ్వెరపరుస్తోంది. ట్రంప్ పదవీ ప్రమాణ స్వీకారం పైకి సాదాసీదా అధికార మార్పిడిగా అనిపించవచ్చు. రాజకీయ ప్రత్యర్థులు సైతం చిరునవ్వులు చిందిస్తూ సౌహార్దం చూపుకుంటున్నట్టు కనిపించవచ్చు. అంతమాత్రాన అంతా మామూలే అనుకొంటే పొరపాటు. పదవీ ప్రమాణ స్వీకారోత్సవంలో దర్శనమిచ్చిన ఐక్యతకు భిన్నంగా ప్రత్యర్థులపై తుపాకులు ఎక్కుపెట్టిన తీరు ఆయన ప్రసంగంలో స్పష్టంగా వినిపించింది. కునారిల్లిన దేశాన్ని తాను మాత్రమే మళ్ళీ పునరుత్తేజితం చేయగలనన్న భావన కలిగించడంతో పాటు ఆయన ఒకటికి రెండు జాతీయ ఎమర్జెన్సీలు ప్రకటించడం పెను పర్యవసానమే. అలాగే, చైనా నుంచి పనామా కాలువను వెనక్కి తీసుకోవాలని పిలుపునివ్వడమూ వివాదాస్పదమే. బలప్రయోగం ద్వారా మాత్రమే సాధ్యమయ్యే అలాంటి పనుల ప్రస్తావన నిప్పుతో చెలగాటానికి సిద్ధమని స్పష్టం చేయడమే. ఇక, గద్దెనెక్కిన తొలిరోజునే ‘గల్ఫ్ ఆఫ్ మెక్సికో’ను ‘గల్ఫ్ ఆఫ్ అమెరికా’గా ట్రంప్ ప్రకటించడంతో రానున్న రోజుల్లో అంతర్జాతీయంగా మరెన్ని ఆశ్చర్యకర పరిణామాలు చోటుచేసుకుంటాయనే ఉద్విగ్నత నెలకొంది. పదవి చేపడుతూనే ట్రంప్ చకచకా సంతకాలు చేసిన పదుల సంఖ్యలోని కార్యనిర్వాహక ఆదేశాలు ఆసక్తికరం. పర్యావరణ పరిరక్షణను గాలికొదిలేయడం, జన్మహక్కుగా సంక్రమించే పౌర సత్వంపై అమెరికా రాజ్యాంగాన్ని సైతం తోసిపుచ్చడం లాంటివి ఇట్టే మింగుడుపడే అంశాలు కావు. జాతీయతతో సంబంధం లేకుండా దేశంలో చట్టవిరుద్ధంగా నివసిస్తున్నవారికి పుట్టినబిడ్డలకు సైతం 150 ఏళ్ళ పైచిలుకుగా అమెరికా పౌరసత్వం దక్కుతూ వచ్చింది. కానీ, నెల రోజుల్లో అమలులోకి రానున్న తాజా ఆదేశం ఫలితంగా ఇప్పుడిక అలాంటి పిల్లలకు పౌరసత్వ పత్రాలివ్వరు. అదేమంటే, 1868లో చేసిన 14వ సవరణ కింద అమెరికా గడ్డపై పుడితేచాలు ఆ పిల్లలకు మారుమాట లేకుండా పౌరసత్వమివ్వాలనేమీ లేదనీ, సవరణను తప్పుగా వ్యాఖ్యానించారనీ ట్రంప్ వాదన. తాత్కాలిక వీసాలతో అమెరికాలో నివసిస్తూ, ఉద్యోగాధారిత గ్రీన్కార్డ్కై దీర్ఘ కాలంగా నిరీక్షిస్తున్న 10 లక్షల పైచిలుకు మంది భారతీయులకు ఈ కొత్త నిర్ణయం అశనిపాతమే. ఇప్పటికే కొన్నిచోట్ల ఇమ్మిగ్రేషన్ లాయర్లు కోర్టుకెక్కిన ఈ ఆదేశం గనక అమలైతే, తాత్కాలిక వర్క్ వీసాలు, టూరిస్ట్ వీసాలపై అగ్రరాజ్యంలో ఉంటున్నవారి సంతానానికి అక్కడి పౌరసత్వ ఆశలు అడుగంటినట్లే. 2022 నాటి అమెరికా జనాభా లెక్కలపై ప్యూ రిసెర్చ్ విశ్లేషణ ప్రకారం అమెరికాలో 48 లక్షల మంది భారతీయ అమెరికన్లుంటే, వారిలో మూడింట రెండొంతుల మంది వలసజీవులే. కేవలం 34 శాతం, మరో మాటలో 16 లక్షల మంది మాత్రం అగ్రరాజ్యంలోనే పుట్టారు. ఇక, చట్టవిరుద్ధమైన వలసల్ని అడ్డుకుంటాననీ, సరైన పత్రాలు లేని లక్షలాది వలస జీవుల్ని దేశం నుంచి పంపివేస్తాననీ ట్రంప్ చేసిన గర్జన కూడా లక్షలమందికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఆ జాబితాలో మెక్సికో (40 లక్షలు), ఎల్ సాల్వడార్ (7.5 లక్షలు) తర్వాత 7.25 లక్షల మంది భారతీయులదే మూడో స్థానం. ఫలితంగా, ట్రంప్ ప్రతి మాట, ప్రతి అడుగు మనవాళ్ళలో ఆదుర్దా పెంచుతోంది. ఈ పరిస్థితుల్లో ట్రంప్ కొత్త ఏలుబడిలో భారత్తో బంధం ఎలా ఉంటుందన్నది ఆసక్తికరం. మరోపక్క డెమోక్రాట్లను జనం బాధలు పట్టని కులీనులుగా చిత్రించి, సామాన్య పౌరుల సంరక్ష కుడిగా ఎన్నికల్లో తనను తాను చూపుకొన్న ట్రంప్ను అతిగా నమ్మి మోసపోయామనే భావన రేకెత్తడం సహజమే. చేతిలోని నియంత్రణ నిర్ణయాలే అండగా ఇటీవలే ఓ బ్రాండెడ్ క్రిప్టో టోకెన్ ద్వారా ఆయన వందల కోట్ల డాలర్ల లబ్ధి పొందాడనే విమర్శలూ గుప్పుమంటున్నాయి. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన 80 ఏళ్ళ తర్వాత కీలక సమయంలో పగ్గాలు చేపట్టిన ట్రంప్ తన మద్దతుదారులకై ఏమైనా చేసేలా ఉన్నారు. 2021లో అమెరికా అధ్యక్ష భవనంపై దాడి చేసిన దాదాపు 1500 మంది దుండగులకూ ఆయన తక్షణం సామూహిక క్షమాభిక్ష ప్రసాదించడమే అందుకు తార్కాణం. నాలుగేళ్ళు విచారించి, శిక్షలు వేసిన న్యాయవ్యవస్థను అలా నూతన అధ్యక్షుడు పరిహసించినట్టయింది. ఆశ్రితులు, ఆర్థిక దాతలు, బంధు మిత్రులకై క్షమాభిక్ష వ్యవస్థను దుర్వినియోగం చేయడంలో నిన్నటి బైడెన్ నుంచి నేటి ట్రంప్ దాకా అందరూ ఒకే తాను గుడ్డలన్న మాట. కాలు మోపిననాడే కాపురం చేసే లక్షణం తెలిసిందన్నట్టు ట్రంప్ 2.0 హయాం ఆరంభమవు తూనే రోజులు ఎలా ఉండనున్నాయో తేటతెల్లమైంది. బహుళ ధ్రువ ప్రపంచం వైపు అంతర్జాతీయ అధికార క్రమం అడుగులేస్తున్న కాలంలో ‘అమెరికా ఫస్ట్’ నినాదంతో సామాజిక, ఆర్థిక రంగాల్లో ట్రంప్ ఆధిపత్యభావ నిర్ణయాలు రానున్న నాలుగేళ్ళలో ప్రపంచాన్ని కుదిపేయడం ఖాయం. -
USA:ట్రక్కు దాడి.. ఎఫ్బీఐ కీలక ప్రకటన
వాషింగ్టన్:న్యూ ఓర్లీన్స్ ట్రక్కు దాడిలో విదేశీ శక్తుల కుట్ర లేదని అమెరికా అత్యున్నత దర్యాప్తు ఏజెన్సీ ఫెడరల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్(ఎఫ్బీఐ) తేల్చింది. దాడికి పాల్పడ్డ జబ్బార్ ఒంటరిగానే ఈ దుశ్చర్యకు ఒడిగట్టాడని తెలిపింది. దాడికి ముందు జబ్బార్ ఫేస్బుక్లో ఐదు వీడియోలు పోస్ట్ చేసినట్లు పేర్కొంది.దాడి దర్యాప్తు పురోగతిని అధ్యక్షుడు బైడెన్కు ఎఫ్బీఐ వివరించింది. సుమారు గంట సేపు అధికారులతో చర్చించి దర్యాప్తు వివరాలను బైడెన్ తెలుసుకున్నారు. దాడిపై స్వదేశీ,విదేశీ కుట్ర కోణంలో దర్యాప్తు కొనసాగుతోందని వైట్హౌజ్ వర్గాలు తెలిపాయి. ఈ దాడి కోసం జబ్బార్ విదేశీ సంస్థలతో కలిసి పనిచేయలేదు. అయితే అతను ఐసిస్ నుంచి స్ఫూర్తి పొందాడు. ఇది వంద శాతం ఉగ్రవాద చర్యనే’అని ఎఫ్బీఐ కౌంటర్ టెర్రరిజం విభాగానికి చెందిన అధికారి క్రిస్టఫర్ తెలిపారు. ఐసిస్ మళ్లీ పుంజుకోకుండా సిరియాలోని అమెరికా బలగాలు ఉగ్రవాద సంస్థ నేతలపై వైమానిక దాడులు నిర్వహిస్తున్నాయని ఓ సీనియర్ అధికారి తెలిపారు. నూతన ఏడాది వేడుకల వేళ న్యూఓర్లీన్స్లో అమెరికా ఆర్మీ మాజీ ఉద్యోగి జబ్బార్ పికప్ ట్రక్కుతో జనంపైకి దూసుకొచ్చిన ఘటనలో 15 మంది మరణించిన విషయం తెలిసిందే. అనంతరం పోలీసుల కాల్పుల్లో జబ్బర్ మృతి చెందాడు. -
బైడెన్ గుడ్ న్యూస్.. ట్రంప్ బ్యాడ్ న్యూస్
-
బైడెన్ పుత్రవాత్సల్యం
చేసిన వాగ్దానానికి కట్టుబడి ఉండటం, తలకెత్తుకున్న విలువలను చివరివరకూ శిరోధార్యంగా భావించటం అంత తేలిక కాదు. అధికార వైభోగాల్లో మునిగితేలేవారికి అది ప్రాణాంతకం కూడా. ఇందుకు మినహాయింపు ఎవరని జల్లెడ పడితే ప్రపంచవ్యాప్తంగా వేళ్లమీద లెక్కబెట్టేంత మంది మిగులుతారేమో! అధికార పీఠం నుంచి మరో నెలన్నరలో తప్పుకోబోతున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన కుమారుడు హంటర్ బైడెన్కు క్రిమినల్ కేసుల నుంచి విముక్తి కలిగించే ఉత్తర్వులపై ఆదివారం సంతకం చేసిన ఉదంతం ఇప్పుడు అమెరికాలో పెద్ద చర్చనీయాంశమైంది. అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డోనాల్డ్ ట్రంప్ అధికార పీఠం అధిష్ఠించాక ఒక్కొక్కరి సంగతీ చూస్తానంటూ వీలైనప్పుడల్లా హూంకరిస్తున్నారు. ప్రత్యేకించి హంటర్ బైడెన్ గురించి కూడా చెప్పారు. మన అధమస్థాయి నేతల్లా ‘రెడ్ బుక్’ అని పేరేమీ పెట్టుకోలేదుగానీ వేధించదల్చుకున్నవారి పేర్లన్నిటినీ ఒక చిట్టాలో రాసుకున్నట్టే కనబడుతోంది. కత్తికి పదును పెట్టుకుంటున్న వైనం కళ్ల ముందే కనబడుతోంది. 2021 జనవరి 6న వాషింగ్టన్లో కీలక వ్యవస్థలన్నీ కొలువుదీరిన కాపిటల్ హిల్లోకి చొరబడి కనీవినీ ఎరుగని విధ్వంసం సృష్టించిన మూకకు క్షమాభిక్ష పెట్టడం ఆయన తొలి ప్రాధాన్యం. ఆ కేసుల్ని దర్యాప్తు చేసినవారినీ, కేసులు దాఖలు చేసిన న్యాయవాదులనూ, వీరి వెనకున్న డెమాక్రటిక్ నేతలనూ జైళ్లపాలు చేయటం ట్రంప్ ఎజెండా. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో అయితేనేమి... ఇతర సందర్భాల్లో అయితేనేమి తాను విలువలకు మారు పేరని బైడెన్ ఒకటికి పదిసార్లు చెప్పుకున్నారు. క్రిమినల్ కేసుల్లో ఇరుక్కుని విచారణ ఎదుర్కొంటున్న తన కుమారుడు హంటర్ బైడెన్కు అధ్యక్షుడిగా విశేషాధికారాలను వినియోగించి క్షమాభిక్ష పెట్టే యోచన లేదని చెప్పారు. నిరుడు హంటర్ను వివిధ అభియోగాల్లో నేరస్తుడని ప్రకటించి, శిక్షాకాలాన్ని తర్వాత ప్రకటిస్తామని న్యాయస్థానం చెప్పినప్పుడు ‘తుది నిర్ణయం ఏదైనా శిరసావహిస్తాను. న్యాయవిచారణ ప్రక్రియను గౌరవిస్తాను’ అని బైడెన్ ప్రకటించారు. ఆర్నెల్ల క్రితం ఇటలీలో జీ–7 సమావేశాల సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో సైతం ఆయన దీన్నే చెప్పారు. మరేమైంది? తన మాటల్ని తానే ఎందుకు మింగేశారు? సరిగ్గా 82 ఏళ్ల వయసులో పదవి నుంచి నిష్క్రమించే వేళ తన డెమాక్రటిక్ పార్టీని ఎందుకని ఇరుకున పడేశారు? తమది పురాతన పరిణత ప్రజాస్వామ్యమని అమెరికన్లు గొప్పలు పోతారు. ఎవరైనా– సామాన్య పౌరులైనా, ఉన్నతస్థాయి నేతలైనా–తమ దేశంలో చట్టం ముందు సమానులేనని చెప్పుకుంటారు. అయితే అదంతా నిజం కాదని అడపా దడపా రుజువవుతూనే ఉంటుంది. పైపైన చూస్తే ఇప్పుడు బైడెన్ చర్య కూడా ఆ తానులో ముక్కేనని అందరూ భావిస్తారు. కానీ ఆయన అందర్నీ మించిపోయాడన్నది డెమాక్రాట్లలోనే వినిపిస్తున్న విమర్శల సారాంశం. ఎందుకంటే ఇంతక్రితం అధ్యక్షులు తమ సన్నిహితులకు క్షమాభిక్ష పెట్టారు తప్ప సంతానానికి ఇలాంటి వెసులుబాటు కల్పించే స్థితి ఏర్పడలేదు. గతంలో జార్జి డబ్లు్య బుష్ అమెరికా రక్షణ మంత్రిగా పనిచేసిన కాస్పర్ వీన్బెర్గర్నూ, మరికొంతమంది అధికారులనూ ఇరాన్–కాంట్రా వ్యవహారంలో నేరారోపణల నుంచి విముక్తం చేశారు. బిల్ క్లింటన్ తన సవతి సోదరుడిని మాదకద్రవ్యాల కేసు నుంచి తప్పించారు. ట్రంప్ మాత్రం 2016–20 మధ్య ఎడాపెడా క్షమాభిక్షలు ప్రకటించారు. అందులో తన అల్లుడు జేర్డ్ కుష్నెర్ తండ్రి చార్లెస్ కుష్నెర్ ఒకరు. ఆయనకు పన్ను ఎగవేత కేసులో రెండేళ్ల శిక్షపడగా క్షమాభిక్ష పెట్టారు. అతన్నిప్పుడు ఫ్రాన్స్ రాయబారిగా కూడా ప్రకటించారు. హంటర్కు క్షమాభిక్ష పెట్టాక విడుదల చేసిన ప్రకటనలో బైడెన్ తన కుమారుణ్ణి కావాలని అన్యాయంగా ఇరికించి విచారణ తంతు సాగించారని ఆరోపించారు. అతణ్ణి జైలుపాలుచేసి మానసికంగా తనను ఛిద్రం చేయాలని చూస్తున్నట్టు అర్థమవుతోందన్నారు. ‘ఇది ఇక్కడితో ఆగుతుందనుకోవటానికి లేద’ని ప్రకటించారు. హంటర్ కేసుల్ని గమనిస్తే జో బైడెన్ది పుత్ర ప్రేమ తప్ప మరేం కాదని సులభంగా తెలుస్తుంది. ఆయన మాదకద్రవ్యాల వినియోగంలో ఒకప్పుడు మునిగి తేలేవాడు. దశాబ్దం క్రితం ఆయనది చీకటి జీవితం. ఒబామా హయాంలో తన తండ్రి ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయానికి హంటర్ కుటుంబాన్ని పట్టించుకునేవాడు కాదు. అతని ప్రవర్తన బైడెన్కు చాలా తలనొప్పులు తెచ్చిపెట్టింది. తుపాకీ కొనుగోలు చేశాక దాన్ని తన దగ్గర కేవలం 11 రోజులే ఉంచుకుని తిరిగి అధికారులకు అప్పగించి ఉండొచ్చు. కానీ దరఖాస్తు చేసినప్పుడు తన నేర చరిత్ర దాచిపెట్టాడు. మాదక ద్రవ్యాలు వాడుతున్న సంగతిని చెప్పలేదు. పన్ను ఎగవేత కేసు సరేసరి. మొత్తానికి రెండు రకాల న్యాయం అమలవుతున్న వైనం కళ్ల ముందు కనబడుతుండగా అనవసర స్వోత్కర్షలకు పోరాదని ఇకనైనా అమెరికన్లు గుర్తించాల్సివుంది. నిజానికి ఇలాంటి అసమ వ్యవస్థే ట్రంప్ వంటివారి ఆవిర్భావానికి దారితీసింది. ఏదేమైనా విలువల గురించి మాట్లాడే నైతికార్హత డెమాక్రాట్లు కోల్పోయారు. ట్రంప్ మున్ముందు ఏం చేయబోతారో ఎఫ్బీఐ డైరెక్టర్గా కాష్ పటేల్ నియామకమే చెబుతోంది. దాన్ని చూపించి బైడెన్ చర్య హేతుబద్ధమైనదని డెమాక్రాట్లు చెప్పలేరు. పైపెచ్చు వచ్చే నాలుగేళ్లలో తాను చేసే ప్రతి అక్రమాన్నీ సమర్థించుకోవటానికి డోనాల్డ్ ట్రంప్ బైడెన్ను ఉదాహరిస్తుంటే వారు మౌనంగా మిగిలిపోక తప్పదు. -
రష్యాపై భీకర దాడులకు బైడెన్ పచ్చజెండా
బ్రెజీలియా: ఉక్రెయిన్–రష్యా మధ్య యుద్ధం మరింత ముదిరే సూచనలు కనిపిస్తున్నాయి. ఉత్తర కొరియా నుంచి వేలాది మంది సైనికులను రష్యా దిగుమతి చేసుకుంటోంది. వారిని ఉక్రెయిన్ సరిహద్దుల్లో మోహరిస్తోంది. ఉక్రెయిన్పై భీకర దాడులకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీనికి విరుగుడుగా ఉక్రెయిన్, దాని మిత్రపక్షాలు కొత్త వ్యూహానికి తెరతీశాయి. ఉక్రెయిన్కు అందజేసిన లాంగ్రేంజ్ మిస్సైళ్ల వాడకంపై ఇప్పటిదాకా ఉన్న పరిమితులను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సడలించారు. రష్యా భూభాగంలోకి మరింత ముందుకు చొచ్చుకెళ్లి దాడులు చేసేందుకు తాజాగా అనుమతి ఇచ్చారు.అమెరికా అధికార వర్గాలు ఈ విషయం వెల్లడించాయి. బైడెన్ నుంచి అనుమతి రావడంతో ఆర్మీ టాక్టికల్ మిస్సైల్ సిస్టమ్(ఏటీఏసీఎం)ను రష్యాపై ప్రయోగించేందుకు ఆస్కారం ఏర్పడింది. దీనివల్ల రష్యాకు భారీగా నష్టం వాటిల్లే్ల అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఉక్రెయిన్–రష్యా యుద్ధానికి ముగింపు పలుకుతానని అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ట్రంప్ ప్రత్యర్థి అయిన జో బైడెన్ యుద్ధాన్ని మరింత ఉధృతం చేసే దిశగా నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆదివారం దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. శత్రుదేశంపై కేవలం మాటలతో దాడులు చేయలేమంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. కొన్ని విషయాలు నోటితో చెప్పలేమని, క్షిపణులే మాట్లాడుతాయని పేర్కొన్నారు. అమెరికా సహా పశ్చిమదేశాలు ఇచ్చిన కీలక ఆయుధాలను రష్యాపై ప్రయోగించడానికి అనుమతి ఇవ్వాలంటూ జో బైడెన్పై కొన్ని నెలలుగా ఒత్తిడి వచ్చింది. ఆ ఒత్తిడికి తలొగ్గి ఆయన అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. అదే సమయంలో డొనాల్డ్ ట్రంప్ను ఇరుకున పెట్టాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం.అగ్నికి బైడెన్ ఆజ్యం పోస్తున్నారు: రష్యాఅమెరికా సరఫరా చేసిన దీర్ఘశ్రేణి క్షిపణులను రష్యాపై ప్రయోగించడానికి అధ్యక్షుడు జో బైడెన్ గ్రీన్సిగ్నల్ ఇవ్వడంపై రష్యా అధికార వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అగ్నికి ఆజ్యం పోస్తున్నారంటూ బైడెన్పై మండిపడ్డాయి. తమను రెచ్చగొట్టే చర్యలు మానుకో వాలని హెచ్చరించాయి. అయితే, ఈ వ్యవహారంపై రష్యా అధినేత పుతిన్ ఇంకా స్పందించలేదు. -
ట్రంప్ విజయంపై కమలా హారిస్, జోబైడెన్ తొలి స్పందన..
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ చారిత్రాత్మక విజయాన్ని సాధించారు. డొనాల్డ్ ట్రంప్ తన ప్రత్యర్థి, డెమొక్రాట్ పార్టీ అభ్యర్థి, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ను ఓడించారు.డొనాల్డ్ ట్రంప్ గెలుపుపై వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్, ప్రెసిడెంట్ జో బైడెన్ల తొలి ప్రకటనలు మీడియాకు అందాయి. దానిలో కమలా హారిస్.. ఓటర్లు తనపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల ఫలితం మనం కోరుకున్నది కాదని అమె అన్నారు. మనం నిరంతరం పోరాడుతూనే ఉందాం. ఈ ఎన్నికల ఫలితాలను మనం అంగీకరించాల్సిందేనన్నారు. అమెరికా అధ్యక్షునిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ను తాను కలుసుకుని, అభినందనలు తెలిపానని కమలా హారిస్ పేర్కొన్నారు.అధికార మార్పిడిలో ట్రంప్కు, ఆయన బృందానికి సహకరిస్తామని, ఇదంతా శాంతియుతంగా జరిగేలా చూస్తామని కమలా హారిస్ పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ఒక ప్రకటనలో కమలా హారిస్ చిత్తశుద్ధి మెచ్చుకోదగినదని అన్నారు. ఆమె అమెరికన్లకు ఛాంపియన్గా కొనసాగుతారన్నారు. జో బైడెన్.. డొనాల్డ్ ట్రంప్కు ఫోన్ చేసి, అభినందనలు తెలిపారు. కాగా ట్రంప్ ప్రచార ప్రతినిధి స్టీవెన్ చియుంగ్ మాట్లాడుతూ డొనాల్డ్ ట్రంప్.. బైడెన్ అభినందనలను అందుకున్నారని, త్వరలోనే బైడెన్ను కలుసుకోవాలని అనుకుంటున్నారని తెలిపారు.ఇది కూడా చదవండి: USA Presidential Election Results 2024: మహిళలకు మళ్లీ మొండిచెయ్యే -
ట్రంప్-బైడెన్.. ఎవరి హయాంలో భారత్ వృద్ధి ఎంత?
అమెరికా ఎన్నికలు ముగిశాయి. అగ్రరాజ్యం అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ ఫలితాల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విజయం దాదాపు ఖరారైంది. దీంతో ఆయన రెండోసారి అమెరికా అధ్యక్ష పీఠం ఎక్కేందుకు సిద్ధమయ్యారు. గతంలో పాలించిన జోబైడన్, అంతకుముందు పాలించిన డొనాల్డ్ ట్రంప్ హయాంలో భారత్తో వాణిజ్య సంబంధాలు మెరుగ్గానే ఉన్నాయి. అయితే ఎవరి హయాంలో ఎంత వృద్ధి చెందిందో తెలుసుకుందాం.92 శాతం పెరిగిన వాణిజ్యంయునైటెడ్ స్టేట్స్కు సరుకులు ఎగుమతి చేస్తున్న దేశాల్లో చైనా తర్వాత భారత్ రెండో స్థానంలో ఉంది. గత దశాబ్ద కాలంలో భారత్-అమెరికా ఆర్థిక వ్యవస్థల మధ్య వాణిజ్య సంబంధాలు గణనీయంగా పెరిగాయి. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ(సీఎంఐఈ) వద్ద అందుబాటులో ఉన్న డేటా ప్రకారం పదేళ్లలో యూఎస్తో భారత వాణిజ్యం 92 శాతం పెరిగింది. 2014లో ఇది 61.5 బిలియన్ డాలర్లు(రూ.5.13 లక్షల కోట్లు)గా ఉండేది. 2024 ఆర్థిక సంవత్సరంలో ఇరు దేశాల మధ్య వాణిజ్యం ఏకంగా 118.3 బిలియన్ల(రూ.9.87 లక్షల కోట్లు)కు చేరుకుంది. ఈ నేపథ్యంలో అమెరికా కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ను ఎన్నుకోనుండడంతో రానున్న రోజుల్లో ద్వైపాక్షిక వాణిజ్యం ఆసక్తికరంగా మారనుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.గరిష్ఠ ఎగుమతులుండే విభాగాలు..యూఎస్కు 2023-24లో భారత ఎగుమతులు 77.53 బిలియన్లుగా(రూ.6.47 లక్షల కోట్లు) ఉన్నాయి. ఇది అంతకుముందు సంవత్సరం గరిష్టంగా ఉన్న 78.40 బిలియన్లుగా(రూ.6.54 లక్షల కోట్లు) నమోదయ్యాయి. గత పదేళ్లలో భారత్ ఎగుమతులు 2014లో 39.1 బిలియన్ల(రూ.3.26 లక్షల కోట్లు) నుంచి 2024 వరకు 98 శాతం పెరిగి 77.5 బిలియన్ల(రూ.6.48 లక్షల కోట్లు)కు చేరుకున్నాయి. ఇంజినీరింగ్ ఉత్పత్తులు, రసాయనాలు, ఎలక్ట్రానిక్స్తో సహా భారతీయ వస్తువులకు అమెరికాలో భారీ గిరాకీ ఉంది.డొనాల్డ్ ట్రంప్-జోబైడెన్ హయాంలో ఇలా..డొనాల్డ్ ట్రంప్ హయాంలో జనవరి 2017 నుంచి జనవరి 2021 వరకు అమెరికాకు భారతదేశ ఎగుమతులు నాలుగేళ్లలో 22 శాతం పెరిగాయి. జోబైడెన్ హయాంలో అమెరికాకు దేశ ఎగుమతులు కేవలం మూడు సంవత్సరాల్లో(2025 ఆర్థిక సంవత్సరం డేటా ఇంకా అందుబాటులో లేదు) 51 శాతం అధికమయ్యాయి. ట్రంప్ హయాంలో నాలుగేళ్ల(2018-21)లో అమెరికా నుంచి భారత్ దిగుమతులు 29% పెరిగాయి. మరోవైపు జోబైడెన్ హయాంలో మూడేళ్లలో భారత్ దిగుమతులు 42% అధికమయ్యాయి.ఇదీ చదవండి: ఆఫీస్కు రండి.. లేదా కంపెనీ మారండి!విభాగాల వారీగా ఎగుమతుల విలువఇంజినీరింగ్ వస్తువులు 16.3 బిలియన్ డాలర్లు(రూ.1.36 లక్షల కోట్లు)రసాయనాలు, సంబంధిత ఉత్పత్తులు 12.8 బిలియన్ డాలర్లు(రూ.1.07 లక్షల కోట్లు)ఎలక్ట్రానిక్ వస్తువులు 10.5 బిలియన్ డాలర్లు(రూ.88000 కోట్లు)రత్నాలు, ఆభరణాలు 9.9 బిలియన్ డాలర్లు (రూ.83 వేలకోట్లు)పెట్రోలియం ఉత్పత్తులు 5.8 బిలియన్ డాలర్లు (రూ.48,760 కోట్లు)ఇతర ఉత్పత్తులు సంయుక్తంగా 22.2 బిలియన్ డాలర్లు(రూ.1.86 లక్షల కోట్లు) -
కమలా హ్యారీస్ స్ఫూర్తిదాయక నాయకురాలు: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తమ పార్టీ నాయకురాలు, అధ్యక్ష ఎన్నికల అభ్యర్థి కమలా హ్యారీస్ను ప్రశంసలతో ముంచెత్తారు. ఆమె పౌర హక్కులకు మద్దతుపలికే స్ఫూర్తిదాయక నాయకురాలని అన్నారు. టెక్సాస్లోని ఆస్టిన్లోని లిండాల్ బి. జాన్సన్ ప్రెసిడెన్షియల్ లైబ్రరీలో ప్రసంగించిన ఆయన తనకు పాలనలో కమలా హ్యారీస్ అద్భుత భాగస్వామ్యం అందించారని పేర్కొన్నారు.కమలా హ్యారీస్ పౌర హక్కుల విషయంలో తన గొంతును సమర్థవంతంగా వినిపిస్తూ, స్ఫూర్తిదాయక నాయకురాలుగా కొనసాగుతున్నారన్నారు. అమెరికా వైఖరిలో అందరూ సమానులే అని, తాము ఈ ఆలోచనకు ఎప్పుడూ దూరంగా వెళ్లలేదన్నారు. ఇప్పుడు కమలా కూడా ఈ స్ఫూర్తిని కొనసాగిస్తారని భావిస్తున్నానన్నారు. 81 ఏళ్ల జో బైడెన్ తాను ఎన్నికల రేసు నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అదేసమయంలో ఆయన కమలా హ్యారీస్కు(59)కు తన మద్దతును ప్రకటించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా కమలా హ్యారీస్కు మద్దతు పలికారు. -
క్వాడ్ సదస్సు కోసం భారత్కు బైడెన్
వాషింగ్టన్: భారత్ నేతృత్వంలో ఈ ఏడాది జరగనున్న క్వాడ్ దేశాధినేతల సదస్సుకు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ హాజరవుతారని వైట్హౌజ్ ప్రకటించింది. ఈ ఏడాది క్వాడ్ నేతల సదస్సుకు హాజరయ్యేందుకు తాము కట్టుబడి ఉన్నామని వైట్హౌజ్ నేషనల్ సెక్యూరిటీ కమ్యూనికేషన్ సలహాదారు జాన్ కిర్బీ తెలిపారు.బైడెన్ ఈసారి అధ్యక్ష ఎన్నికల బరిలో నుంచి తప్పుకోవడంతో ఆయన షెడ్యూల్లో చాలా సమయం ఉందని చెప్పారు. 2020 నుంచి క్వాడ్ సదస్సులు వర్చువల్ విధానంలో జరుగుతున్నాయి. ఈ ఏడాది మాత్రం భారత్లో ప్రత్యక్షంగా నిర్వహించనున్నారు. ఈ ఏడాది జనవరి చివరివారంలో జరగాల్సిన క్వాడ్ సదస్సును భారత్ వాయిదా వేసింది. మళ్లీ ఎప్పుడు నిర్వహించేది ప్రకటించాల్సి ఉంది. -
అమెరికా రాజకీయంలో హింసాపర్వం
అమెరికా రాజకీయ జీవితంలో హింస ఒక భాగమైందన్నది వాస్తవం. తుపాకుల లభ్యత, వాటి యాజమాన్యంపై నియంత్రణలను సడలించారు.ట్రంప్ను లక్ష్యంగా చేసుకోవడానికి ఉపయోగించిన కోల్ట్ ఏఆర్–15 వంటి ఆయుధాలను నిషేధించే ప్రయత్నం పదేళ్లే కొనసాగింది. ఇది కోర్టులో పదేపదే సవాళ్లను ఎదుర్కొంది. ఎక్కువగా ఇటువంటి ఆయుధాలతోనే సామూహిక కాల్పులు జరుపుతారు. 2023లో, 604 కాల్పులు జరగగా 754 మంది మరణించారు. ఇక ట్రంప్ మీద జరిగిన హత్యాయత్నం ఆయనకు రాజకీయంగా లాభిస్తుందనేది సుస్పష్టం. అలాగే ట్రంప్ వాచాలత్వం పెను మంటలు రగిలించేలా ఉందన్నదీ రహస్యం కాదు. ఆయన ఎలా వ్యవహరిస్తారనే దానిపై ప్రస్తుత పరిస్థితి చాలావరకు ఆధారపడి ఉంటుంది.అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్పై హత్యాయత్నానికి సంబంధించిన రాజకీయ పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి. అవి ఆయనకు ఎంతగానో ప్రయోజనం చేకూరుస్తాయి. తనపై జరిగిన దాడి పట్ల ట్రంప్ సహజమైన, పోరాట ప్రతిస్పందనలకు గొప్ప ప్రాముఖ్యత ఉంది. ఆయనను సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు చుట్టుముట్టినప్పుడు, తన ముఖం మీద రక్తపు చారలతో, తన కుడి పిడికిలిని పైకెత్తి, ‘ఫైట్, ఫైట్, ఫైట్’(పోరాడు) అంటూ గర్జించారు. రక్తసిక్తమైన, ఆగ్రహోదగ్రుడైన ట్రంప్ పిడికిలి బిగించి ఉండగా, ఆయన వెనుక ఒక అమెరికన్ జెండా రెపరెపలాడుతున్న చిత్రాలు వైరల్గా మారాయి. రెండు వారాల క్రితం అధ్యక్ష అభ్యర్థుల మధ్య జరిగిన చర్చలో జో బైడెన్ ప్రదర్శన, సమర్థ వంతమైన ప్రచారాన్ని నిర్వహించగల ఆయన సామర్థ్యం వల్ల అధ్యక్ష పోటీ ఇప్పటికే గందరగోళంలో పడింది.తనపై ఉన్న కేసుల కారణంగా తనను తాను అమర వీరుడు గానూ, హింసకు గురైన వ్యక్తిగానూ ప్రదర్శించుకోవడం ట్రంప్ విధానం. కాల్పుల ద్వారా మృత్యువుకు సమీపంగా వెళ్లడం అనేది ఆయనకు అమరత్వ భావనను ఆపాదిస్తుంది. అధ్యక్షుల చర్చలో పరాజయం తరువాత డెమోక్రాటిక్ అభ్యర్థిగా బైడెన్ను తొలగించా లనే ప్రచారంపై ట్రంప్ మీద హత్యాయత్నం తప్పక ప్రభావం చూపు తుంది. ట్రంప్ వర్గానికి అంతకంటే కావాల్సింది లేదు.ట్రంప్పై కాల్పుల ఘటన బైడెన్ ప్రచారాన్ని క్లిష్టతరం చేస్తుంది. ఇప్పుడు నేరుగా ట్రంప్పై దృష్టి సారిస్తానని అమెరికా అధ్యక్షుడు గత వారంలో అన్నారు. ట్రంప్ను ఓడించడానికి తానే ఉత్తమ అభ్యర్థిగా ఉన్నానని ఆయన అభిప్రాయం. ‘లక్ష్యానికి సంబంధించిన కేంద్ర స్థానంలో ట్రంప్ను ఉంచే సమయం వచ్చింది’ అన్న బైడెన్ మాటల్ని, తమ అధ్యక్ష అభ్యర్థిపై హింసకు పిలుపుగా ఇప్పుడు కొంతమంది రిపబ్లికన్లు ఆపాదిస్తున్నారు. ఇది ఒక విడి ఘటన కాదనీ, ట్రంప్ ‘ఏ రకంగానైనా అడ్డుకోవలసిన నిరంకుశ ఫాసిస్ట్’ అనే డెమోక్రాటిక్ పార్టీ వాచాలత్వపు అనివార్య పరిణామమనీ రిపబ్లికన్ల ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ పోస్ట్ చేశారు.అమెరికా రాజకీయ జీవితంలో హింస ఒక భాగమైందన్నది వాస్తవం. తుపాకుల లభ్యత, వాటి యాజమాన్యంపై నియంత్రణ లను సడలించడం వంటి నిర్ణయాలతో కోర్టులేమీ మేలు చేయలేదు. ట్రంప్ను లక్ష్యంగా చేసుకోవడానికి ఉపయోగించిన కోల్ట్ ఏఆర్–15 వంటి దాడి ఆయుధాలను నిషేధించే ప్రయత్నం కేవలం పదేళ్లపాటు కొనసాగింది. ఇది కోర్టులో పదేపదే సవాళ్లను ఎదుర్కొంది. ప్రస్తుతం, కొన్ని రాష్ట్రాలు తమ సొంత చట్టాల ద్వారా అటువంటి ఆయుధాలను నిషేధించాయి. కాల్పుల ఘటన జరిగిన పెన్సిల్వే నియా వాటిలో లేదు. ఎక్కువగా ఇటువంటి ఆయుధాలతోనే సామూహిక కాల్పులు జరుపుతారు. జూలైలో ఇప్పటికే మరొక కాల్పుల ఘటన, అయిదు మంది మరణాలకు దారితీసింది. 2023లో, 604 కాల్పులు జరగగా 754 మంది మరణించారు, దాదాపు 2,500 మంది గాయపడ్డారు. అమెరికన్ సుప్రీంకోర్ట్ సహాయకారిగా లేదని చెప్పడం చిన్న మాటే అవుతుంది.బైడెన్ గెలుపొందిన ఎన్నికల ఫలితాలను ట్రంప్ మద్దతుదారులు 2021 జనవరి 6న తారుమారు చేయడానికి ప్రయత్నించిన కాపిటల్ అల్లర్ల నుండి, అమెరికా ఎన్నికల ప్రక్రియ హింసకు దారితీసింది. తిరుగుబాటును అణిచివేసేందుకు ముందు రేగిన అల్లకల్లోలంలో తొమ్మిది మంది మరణించారు. దీనివల్లనే ట్రంప్ ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ప్రస్తుత అమెరికన్ రాజకీయాలు లోతుగా విభజనకు గుర య్యాయి. ‘ప్యూ రీసెర్చ్ సెంటర్’ పోల్ ప్రకారం, ప్రతి రాజకీయ పక్షంలోనూ దాదాపు మూడింట రెండు వంతుల మంది... ఇతర పార్టీలలోని వారు అనైతికులనీ, నిజాయితీ లేనివారనీ, సంకు చిత మనస్తత్వం గలవారనీ నమ్ముతున్నారు.ట్రంప్ వాచాలత్వం పెను మంటలు రగిలించేలా ఉందన్నది రహస్యం కాదు. తాను వచ్చే నవంబర్ అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోతే ‘రక్తపాతం’ ఉంటుందని మార్చ్ నెలలో ఒక ఇంటర్వ్యూలో ప్రకటించారు. తరువాత ఒక ర్యాలీలో, ‘ఇప్పుడు నేను ఎన్నిక కాకపోతే... అది దేశానికి రక్తపాత కారకం అవుతుంది’ అని పునరావృతం చేశారు. 2023 మార్చిలో, ట్రంప్ దోషిగా నిర్ధారించబడిన కేసులో మాన్ హట్టన్ జిల్లా ప్రభుత్వ న్యాయవాది తనపై అభియోగాలు మోపినట్లయితే ‘సంభావ్య మరణం, విధ్వంసం’ జరగొచ్చని మాజీ అధ్యక్షుడు హెచ్చరించారు. తనకు అన్యాయం జరిగితే ‘వీధుల్లో అల్లర్లు జరుగు తాయి’, ‘దేశంలో అల్లర్లు జరుగుతాయి’ అని బెదిరించిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆయన అనుచరులు మరోవైపున వలసదారులు, విదేశీయులు, శ్వేతజాతీయేతర జాతుల ప్రజలపై హింస గురించి మాట్లాడారు. నిజానికి, వ్యాపార లావాదేవీల్లో 34 నేరాలకు ట్రంప్ పాల్పడ్డారని మే నెలలో న్యాయస్థానం ఆయనను దోషిగా ప్రకటించిన తర్వాత, ట్రంప్ అనుకూల వెబ్సైట్లు అల్లర్లు, విప్లవం, హింసాత్మక ప్రతీకారం అనే పిలుపులతో నిండిపోయాయి.ఇటీవలి సంవత్సరాలలోని హింసలో రాజకీయ నమూనా ఉంది. 2017లో, బేస్బాల్ గేమ్లో రిపబ్లికన్ హౌస్ మెజారిటీ విప్ అయిన స్టీవ్ స్కలైస్ మీద రిపబ్లికన్ వ్యతిరేక గన్ మ్యాన్ కాల్పులు జరిపాడు (ఆ గన్మ్యాన్ను అప్పుడే కాల్చి చంపారు). 2018లో, ఫ్లోరిడాకుచెందిన ఒక వ్యక్తి నాటి అధ్యక్షుడు ట్రంప్ విమర్శకులకు పైపు బాంబు లను మెయిల్ చేశాడు. అతడు లక్ష్యంగా చేసుకున్నవారిలో బరాక్ ఒబామా, హిల్లరీ క్లింటన్, కమలా హారిస్ ఉన్నారు. 2020 ఎన్నికలకు ముందు, మిషిగన్ గవర్నర్ గ్రెట్చెన్ విట్మెర్ను కిడ్నాప్ చేసి, రాజ ద్రోహ నేరం కింద ఆమెను ‘విచారణ’లో నిలబెట్టడానికి ఆరు గురు వ్యక్తులు కుట్ర పన్నారు. 2022లో, మాజీ స్పీకర్ నాన్సీ పెలోసీని లక్ష్యంగా చేసుకున్నారు; దాడిలో ఆమె భర్త తీవ్రంగా గాయపడ్డారు. దుండగుడు పెలోసీని బందీగా తీసుకోవాలని పథకం వేశాడు.ఈ పరిస్థితులలో, సగటు అమెరికన్ నిరుత్సాహానికీ, నిరాశకూ గురవుతాడు. రెండు పార్టీలలోని అతివాద శక్తులు అధికారం చేజిక్కించుకుని ఉన్నాయనీ, గతంలో అమెరికన్ రాజకీయాలకు ప్రతీకగా నిలిచిన ద్వైపాక్షికతకు పెద్దగా చోటు లేకుండా చేశాయనీ సగటు అమెరికన్లు భావిస్తున్నారు.రాబోయే రోజులూ, వారాల్లో బైడెన్ చర్చ వైఫల్యం, దానిపై పొరలుగా, ట్రంప్పై హత్యాయత్నం వంటి ఇటీవలి సంఘటనలకు చెందిన పరిణామాల పెరుగుదలను మనం చూస్తాం. చాలామంది సరైన ఆలోచనాపరులు ట్రంప్పై కాల్పుల దాడి కలిగించిన షాక్ ప్రభావం ఎంతో కొంత ప్రశాంతతను తెస్తుందని ఆశిస్తున్నప్పటికీ, అలా జరుగుతుందనడానికి ఎటువంటి హామీ లేదు. రష్యన్లు, చైనీయులు తమ వంతు పాత్రను జోడించడంతో ఇప్పటికే తప్పుడు సమాచారం, అతిశయోక్తి, తీవ్రవాదం, జాత్యహంకారం, విభజన, అపనమ్మకం లాంటివి సైబర్ ప్రపంచంలో చెడతిరుగుతున్నాయి.ట్రంప్ ఎలా వ్యవహరిస్తారనే దానిపై ప్రస్తుత పరిస్థితి చాలావరకు ఆధారపడి ఉంటుంది. తనపై హత్యాయత్నాన్ని ఆయన డెమో క్రాట్లపై దాడి చేయడానికి, విభజనలను మరింతగా పెంచడానికి ఉపయోగించవచ్చు లేదా నైతికంగా అత్యున్నత మార్గాన్ని చేపట్టి, పక్షపాత చీలికలను నయం చేయడానికి ఎంచుకోవచ్చు. కానీ ఫిర్యా దులు, ప్రతీకారం చాలాకాలంగా ట్రంప్ ఇతివృతాలుగా ఉన్నాయి. ఆయన తక్షణ ప్రతిస్పందన నెమ్మదిగానూ, తెలివిగానూ ఉన్నప్పటికీ, రాబోయే రోజుల్లో ట్రంప్ ఏ దిశలో వెళ్లగలరనే దానిపై అంచనాలు ఊహకందడం లేదు.- వ్యాసకర్త న్యూఢిల్లీలోని అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్లోడిస్టింగ్విష్డ్ ఫెలో (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)- మనోజ్ జోషి -
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్కు కరోనా
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్కు కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ ఎక్స్లో తెలియజేశారు. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్ పియర్ కూడా బైడెన్ ఆరోగ్య వివరాలను తెలియజేశారు. జో బైడెన్ తన సోషల్ మీడియా ఖాతాలోలో ఇలా రాశారు. ‘ఈ రోజు మధ్యాహ్నం నేను కోవిడ్ -19 టెస్టులు చేయించుకున్నాను. ప్రస్తుతం నేను బాగానే ఉన్నాను. నా శ్రేయస్సు కోరుకునేవారందరికీ ధన్యవాదాలు. నేను అనారోగ్యం నుంచి కోలుకునేవరకూ అందరికీ దూరంగా ఉంటాను. ఈ సమయంలోనూ అమెరికా ప్రజల కోసం పని చేస్తూనే ఉంటాను’అని పేర్కొన్నారు. I tested positive for COVID-19 this afternoon, but I am feeling good and thank everyone for the well wishes. I will be isolating as I recover, and during this time I will continue to work to get the job done for the American people.— President Biden (@POTUS) July 17, 2024 బైడెన్కు చికిత్స అందిస్తున్న వైద్యుడు కెవిన్ ఓ కానర్ మాట్లాడుతూ బైడెన్ ప్రస్తుతం ముక్కు కారటం, దగ్గు వంటి తేలికపాటి లక్షణాలతో బాధపడుతున్నారన్నారు. అలసిపోయినట్లు కనిపిస్తున్నారని కూడా తెలిపారు. కరోనా పాజిటివ్ రిపోర్ట్ వచ్చిన దరిమిలా బైడెన్కు యాంటీ వైరల్ డ్రగ్ పాక్స్లోవిడ్ మొదటి డోస్ అందించాం. బైడెన్ ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు మీడియాకు సమాచారం ఇస్తూనే ఉంటామని తెలిపారు. లాస్ వెగాస్లో జరిగిన ఒక సదస్సులో ప్రసంగానికి ముందు బైడెన్కు కరోనా టెస్ట్ చేశారు. ఈ రిపోర్టుల ఆధారంగా ఆయనకు కరోనా సోకినట్లు వైద్యులు గుర్తించారు. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్ పియర్ మీడియాతో మాట్లాడుతూ జో బైడెన్ ప్రస్తుతం కరోనాలోని తేలికపాటి లక్షణాలతో బాధపడుతున్నారు. ఆయన డెలావేర్కు చేరుకుని కరోనా తగ్గేవరకూ ఒంటరిగా ఉంటారన్నారు.Earlier today following his first event in Las Vegas, President Biden tested positive for COVID-19. He is vaccinated and boosted and he is experiencing mild symptoms. He will be returning to Delaware where he will self-isolate and will continue to carry out all of his duties… pic.twitter.com/ka5hiBavTC— ANI (@ANI) July 17, 2024 -
Us Elections: ట్రంప్కు మస్క్ భారీ విరాళం!
న్యూయార్క్: పాపులర్ బిలియనీర్, టెస్లా అధినేత ఈలాన్ మస్క్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్కు భారీ విరాళమిచ్చినట్లు తెలుస్తోంది. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపు కోసం పనిచేస్తున్న అమెరికా పొలిటికల్ యాక్షన్ కమిటీ(ఎ ప్యాక్)కు మస్క్ డొనేట్ చేసినట్లు బ్లూమ్బర్గ్ ఒక కథనం ప్రచురించింది.అయితే సరిగ్గా ఎంత మొత్తం మస్క్ విరాళంగా ఇచ్చారనేది తెలియరాలేదు. ఎ ప్యాక్ తమ గ్రూపునకు విరాళమిచ్చిన వారి జాబితాను జులై 15న అధికారికంగా వెల్లడించనుంది. ఈ ఎన్నికల్లో తాను బైడెన్, ట్రంప్లలో ఎవరి తరపున ఖర్చు పెట్టబోనని మస్క్ గతంలో ప్రకటించారు. అయితే తాజాగా మస్క్ ట్రంప్నకు విరాళమివ్వడం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల కోసం ధనవంతుల నుంచి ప్రచార నిధుల సేకరణలో బైడెన్ కంటే ట్రంప్ ముందున్నారు. ఈ పరిస్థితుల్లో మస్క్ కూడా ట్రంప్నకు విరాళమివ్వడం గమనార్హం.ఈ అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్, ట్రంప్లలో మస్క్ ఇప్పటివరకు ఎవరికీ అధికారికంగా మద్దతు ప్రకటించలేదు. -
బైడెన్కు తగ్గిన భారతీయ- అమెరికన్ల మద్దతు
ఈ ఏడాది నవంబర్లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. ఇంతలో బైడెన్కు మద్దతునిచ్చే విషయంలో భారతీయ-అమెరికన్లు కాస్త వెనక్కు తగ్గినట్లు తెలుస్తోంది. ప్రతి రెండేళ్లకోసారి నిర్వహించే ఆసియన్-అమెరికన్ ఓటర్ సర్వే (ఏఏవీఎస్) తెలిపిన వివరాల ప్రకారం 2020 ఎన్నికలు- 2024 ఎన్నికల మధ్యకాలంలో జో బైడెన్కు మద్దతునిచ్చే భారతీయ-అమెరికన్ మద్దతుదారులలో 19 శాతం క్షీణత కనిపించింది.ఆసియా అండ్ పసిఫిక్ ఐలాండర్ అమెరికన్ వోట్ ఆసియన్ అమెరికన్స్ అడ్వాన్సింగ్ జస్టిస్ల సర్వే ప్రకారం 49 శాతం మంది భారతీయ-అమెరికన్ పౌరులు ఈ ఏడాది జో బైడెన్కు ఓటు వేసే అవకాశం ఉంది. 2020లో ఇది 65 శాతంగా ఉంది. 30 శాతం మంది భారతీయ-అమెరికన్ పౌరులు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఓటు వేసే అవకాశాలున్నాయని సర్వే వెల్లడించింది.డొనాల్డ్ ట్రంప్కు రెండు పాయింట్ల మేరకు ప్రయోజనం ఉండబోతోందని ఈ సర్వే తెలిపింది. గత రెండు దశాబ్దాలుగా అమెరికాలో ఆసియా అమెరికన్ ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గత నాలుగేళ్లలో 15 శాతం వృద్ధి నమోదైంది. భారతీయ-అమెరికన్ ఓటర్ల సంఖ్య తగ్గడం బైడెన్కు ఆందోళన కలిగించే అంశంగా మారింది.ఈ సర్వే ప్రకారం 55 శాతం భారతీయ-అమెరికన్ ఓటర్లు బైడెన్కు మద్దతు నివ్వగా, 38 శాతం మంది మాత్రమే ట్రంప్కు మద్దతు పలికారు. కాగా దక్షిణ కాలిఫోర్నియా గవర్నర్, అమెరికా రాయబారి నిక్కీ హేలీని 33 శాతం మంది భారతీయ-అమెరికన్లు ఇష్టపడుతున్నారు. అయితే హేలీ పేరు వినని వారు 11 శాతం మంది ఉండటం విశేషం. -
బిగ్ డిబేట్కు ముందు ట్రంప్కు ఊరట
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల క్యాంపెయిన్లో భాగంగా నిర్వహిస్తున్న బిగ్ డిబేట్కు కొద్ది గంటగల ముందు రిపబ్లికన్ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు ఊరట లభించింది. హష్ మనీ కేసులో భాగంగా న్యూయార్క్లోని మన్హట్టన్ కోర్టు గతంలో ట్రంప్పై విధించిన గ్యాగ్(సైలెన్స్) ఆంక్షలను కొద్దిగా సడలించింది.సవరించిన ఆర్డర్ ప్రకారం హష్ మనీ కేసులో సాక్షులపై మాట్లాడడానికి ట్రంప్నకు అనుమతి లభించింది. అయితే కేసులో ప్రాసిక్యూటర్లు, ఇతర వ్యక్తులపై కామెంట్ చేయడానికి మాత్రం కోర్టు అనుమతివ్వలేదు. త్వరలో జరగబోయే డిబేట్లో డెమొక్రాట్ అభ్యర్థి, ప్రస్తుత దేశ అధ్యక్షుడు జో బైడెన్ మాటల దాడిని ఎదుర్కొని ధీటుగా సమాధానం చెప్పేందుకు కోర్టు విధించిన ఆంక్షలు అడ్డొస్తున్నాయని ట్రంప్ లాయర్లు వాదించారు. ట్రంప్ లాయర్ల అభ్యర్థనకు ప్రాసిక్యూటర్లు కూడా వ్యతిరేకించకపోవడంతో కోర్టు ఆంక్షలను కొంత మేర సడలించింది.హష్ మనీ కేసులో ట్రంప్ దోషి అని కోర్టు ఈ ఏడాది మే30న తేల్చింది. ఈ కేసులో కోర్టు జ్యూరీ తుది తీర్పు వెలువరించడంతో పాటు శిక్షను ఖరారు చేయాల్సి ఉంది. తనను లైంగికంగా వాడుకొని ఆ విషయం బయటికి చెప్పకుండా ఉండేందుకు డబ్బులు చెల్లించాడని పోర్న్స్టార్ స్టార్మీ డేనియల్స్ ట్రంప్పై హష్ మనీ కేసు పెట్టింది. కాగా, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలక ఘట్టంగా చెబుతున్న ట్రంప్, జో బైడెన్ల బిగ్ డిబేట్ గురువారం(జూన్27)న జార్జియాలో జరగనుంది. పలు అంశాలపై 90 నిమిషాల పాటు జరగనున్న ఈ డిబేట్లో జో బైడెన్, ట్రంప్ పలు కీలక అంశాలపై ముఖాముఖి చర్చించనున్నారు. -
బైడెన్ వర్సెస్ ట్రంప్.. ‘బిగ్ డిబేట్’ వైపే అందరి చూపు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచారంలో భాగంగా వారిద్దరి మధ్య జూన్ 27న తొలి పబ్లిక్ డిబేట్(చర్చ) జరగనుంది. జార్జియాలోని అట్లాంటాలో 90 నిమిషాల పాటు ఈ డిబేట్ జరగనుంది. డిబేట్లో పలు కీలక అంశాలపై తమ వైఖరిని వారిద్దరు చెప్పనున్నారు. డిబేట్లో బైడెన్,ట్రంప్ ఇద్దరు కఠిన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఈ ఎన్నికల్లో బైడెన్, ట్రంప్ వయసు కూడా ప్రధాన ప్రచారాస్త్రంగా మారింది. ముఖ్యంగా బైడెన్ ఇటీవల తన మతిమరుపును పదే పదే బయటపెట్టుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బైడెన్ ట్రంప్ దూకుడు తట్టుకోగలరా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఇద్దరు వృద్ధనేతల మధ్య జరగనున్న డిబేట్ ఆసక్తికరంగా మారింది. ఇప్పటివరకు అన్ని ఒపినీయన్ పోల్ సర్వేలు ఇద్దరూ నువ్వానేనా అన్నట్లు పోటీపడుతున్నారనే చెబుతున్నాయి. ఈ డిబేట్ తర్వాత ప్రజాభిప్రాయం ఎవరో ఒకరివైపు కొంత మేర షిఫ్ట్ అవ్వొచ్చన్న వాదన వినిపిస్తోంది. ఈ ఏడాది నవంబర్లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. -
ట్రంప్ కోర్టు పోలింగ్ బూతేనా?
అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ను న్యాయస్థానం దోషిగా తేల్చిన తర్వాత ఆ దేశ రాజకీయాలు మరింత విభజనకు గురయ్యాయి. వాస్తవానికి, ఈ న్యాయవిచారణ ట్రంప్ బలహీనతను, అస్థిర ప్రవర్తనను నొక్కిచెప్పింది. పాత అమెరికాలో, ఒక అభ్యర్థిపై నేర నిర్ధారణ జరిగితే అది ఆయన విజయావకాశాలపై తీవ్ర ప్రభావం చూపేది. కానీ ఇప్పుడు ఇది ట్రంప్ అమెరికా. విషయాలు అక్కడ భిన్నంగా జరుగుతున్నాయి. ఒకవేళ ఆయన తిరిగి అధ్యక్షుడిగా ఎన్నికైతే తన దేశానికే కాదు, ప్రపంచానికి కూడా తీవ్రమైన పరిణామాలు ఎదురవుతాయి. ట్రంప్తో భారతదేశ సంబంధాలు బాగానే ఉన్నప్పటికీ, గత మూడేళ్లలో జరుగుతున్నట్టుగా ద్వైపాక్షిక సంబంధాలను నిర్మించడంలో క్రమబద్ధమైన కృషి మాత్రం ఆయన హయాంలో జరగలేదు.అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత అధ్యక్ష అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ను తప్పుడు వ్యాపార రికార్డులపై 34 అంశాల్లో న్యాయస్థానం దోషిగా నిర్ధారించిన తర్వాత అమెరికా మరింతగా విభజనకు గురయింది. స్వభావ రీత్యా, ఈ కేసు చిన్నదే. కానీ న్యాయప్రక్రియను అపహాస్యం చేయడం ద్వారా, ప్రాసిక్యూటర్లపై, న్యాయమూర్తిపై కూడా ఎదురుదాడికి దిగుతూ కేసును ఎదుర్కొనాలని ట్రంప్ బృందం తీసుకున్న నిర్ణయం ఈ కేసును విషపూరితం చేసింది. ట్రంప్ ఇప్పుడు దీనిపై అప్పీల్ చేయనున్నారు. అయితే దీనిపై విచారణ జరగడానికి సంవత్సరాలు కాకపోయినా, నెలల సమయం పడుతుంది. ఒకవేళ తాను ఓడిపోయి, ఆ తర్వాత కేసు తారుమారైతే, అది అమెరికా న్యాయ వ్యవస్థ విచ్ఛిన్నమైనదనే ట్రంప్ మద్దతుదారుల అభిప్రాయాలను ధ్రువీకరిస్తుంది. మరోవైపు, ఇవన్నీ ఉన్నప్పటికీ ట్రంప్ గెలిచినట్లయితే, ఆ వ్యవస్థ ఎంత అధ్వాన్నంగా ఉందో అది వెల్లడిస్తుంది. ట్రంప్ న్యాయ ప్రక్రియను కొట్టిపడేస్తూ, ‘మనం ఫాసిస్ట్ రాజ్యంలో జీవిస్తున్నాం’ అని వ్యాఖ్యానించారు. ట్రంప్ తనను తాను అభివర్ణించుకున్నట్లుగా ‘ఎంతో అమాయకపు వ్యక్తి’పై జరుగుతున్న ఈ విచారణ ఒక బూటకమని ఆయన మద్దతుదారులు అంటున్నారు. ఆయన తనను ’రాజకీయ ఖైదీ’గా చెప్పుకొంటున్నారు. పైగా అవకాశం వచ్చినప్పుడు తన ప్రత్యర్థులందరూ కూడా నేరారోపణలను ఎదుర్కొనే దశలోకి అమెరికా ప్రవేశిస్తోందని ట్రంప్ పార్టీ(రిపబ్లికన్) హెచ్చరించింది.ప్రత్యేకించి ఓటర్లలో ఆదరణ లేని ఇద్దరు ప్రధాన అభ్యర్థుల మధ్య జరుగుతున్న విచిత్రమైన రేసులో ఈ తీర్పు ఒక అస్థిరమైన, నాటకీయమైన అంశాన్ని ప్రవేశపెట్టింది. పాత అమెరికాలో, ఒక అభ్యర్థిపై నేర నిర్ధారణ అతని లేదా ఆమె అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపేది. కానీ ఇప్పుడు ఇది ట్రంప్ అమెరికా. ఇక్కడ విషయాలు భిన్నంగా జరుగుతున్నాయి. ఈ తీర్పు నిజానికి ఆయనకు రిపబ్లికన్ పార్టీ మద్దతును మరింతగా బలపరిచింది. తీర్పు వెలువడిన వెంటనే ట్రంప్ ప్రచారానికి వచ్చిన 52.8 మిలియన్ అమెరికన్ డాలర్ల రూపంలో ఇది వ్యక్తమయింది.మరోవైపు డెమోక్రాట్లు తమ ప్రత్యర్థిని, ప్రస్తుతం అగ్రగామిగా ఉన్న వ్యక్తిని న్యాయస్థ్ధానం దోషిగా నిర్ధారించినందుకు సంబరాలు చేసుకుంటున్నారు. అధ్యక్షుడు జో బైడెన్ ఈ అంశంపై వ్యాఖ్యానించడంలో జాగ్రత్తగా ఉన్నారు. కానీ ఆయన న్యాయవ్యవస్థను సమర్థించారు. పైగా, తీర్పు తమకు ఇష్టం లేదు కాబట్టి దాన్ని ఎవరైనా ప్రశ్నించడం అనేది ‘నిర్లక్ష్యపూరితమైనది, ప్రమాదకరమైనది, బాధ్యతారాహిత్యంతో కూడుకున్నది’ అని అన్నారు.ఈ కేసుకి సంబంధించిన అంశాలు చిన్నవిగానే ఉన్నప్పటికీ, ఇది బూటకపు విచారణ కాదు. సమర్పించిన సాక్ష్యాలు చేసిన నేరాలను నిర్ధారిస్తాయి. అవి ట్రంప్ జీవించే నీచమైన ప్రపంచానికి చెందిన సంగ్రహావలోకనాన్ని కూడా అందించాయి. ఆయన మద్దతుదారులు ఏం చెప్పినా సరే... జ్యూరీ ఆయన్ని ఏకగ్రీవంగానూ చాలా త్వరితంగానూ మొత్తం 34 అంశాల్లో దోషిగా నిర్ధారించింది. పైగా ఇది ట్రంప్ ఎదుర్కొనే ఆరోపణలలో ఒకటి మాత్రమే; మరో మూడు తీవ్రమైన ఆరోపణలు కూడా ఉన్నాయి. కానీ రిపబ్లికన్ల మనస్సులో, ఈ కేసులు ‘న్యాయ వ్యవస్థ ఆయుధీకరణ’ ఫలితం మాత్రమే.వీటిలో రెండు కేసులు 2020 ఎన్నికల ప్రక్రియకు నష్టం గావించడంలో ట్రంప్ పాత్రకు సంబంధించినవి. ఇక మూడవ కేసు, వైట్ హౌస్ నుండి నిష్క్రమించిన తర్వాత ఉద్దేశపూర్వకంగా రహస్య పత్రాలను ట్రంప్ తన వద్ద ఉంచుకున్నట్లు చెబుతోంది. అమెరికా న్యాయ వ్యవస్థలో ఒక భాగం ఇప్పటికీ సమర్థంగా పనిచేస్తున్నప్పటికీ, అమెరికా సుప్రీంకోర్టుతో సహా ఇతర విభాగాల పక్షపాత దృష్టి కారణంగా ట్రంప్పై ఇతర కేసులను అధ్యక్ష ఎన్నికలకు ముందుగా విచారించలేరని న్యూయార్క్ కోర్టు తీర్పు సూచించింది. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ముఖ్యమైన ‘న్యాయస్థానం’ పోలింగ్ బూత్ మాత్రమే.ట్రంప్నకు ఉన్మాదపూరితమైన ఓటర్ బలం ఉంది. ఇది ఈ తీర్పు ద్వారా మరింత పెరిగింది. కానీ అది మాత్రమే ఆయనకు ఎన్నికల్లో గెలుపును ఇవ్వలేదు. తక్కువ ఉత్సాహవంతులైన, నేరారోపణలను బట్టి దూరం జరిగే వ్యక్తుల మద్దతు ఆయనకు అవసరం. వాస్తవానికి, ఈ న్యాయవిచారణ ట్రంప్ బలహీనతను, అస్థిర ప్రవర్తనను, కుంభకోణాలతోపాటు ఆయన అసభ్య ప్రవర్తనను నొక్కిచెప్పింది.ఈ తీర్పు వెలువడిన వెంటనే నిర్వహించిన ‘యూ–గవ్’ పోల్లో 27 శాతం మంది ట్రంప్నకు ఓటు వేసే అవకాశం తక్కువగా ఉందనీ, 26 శాతం మంది అలా వేసే అవకాశం ఎక్కువగా ఉందనీ, 39 శాతం మంది తీర్పు తమ ఓటు విధానాన్ని ప్రభావితం చేయదనీ చెప్పారు. ఇవి పూర్తిగా విభజనకు గురైన అమెరికన్ రాజకీయ వ్యవస్థ క్షీణత లోతును పట్టి చూపే భయంకరమైన సంకేతాలు. దేశంలోని సగం మంది మరొకరి అభిప్రాయాలను సహించటానికి ఇష్టపడకపోవటంతో, పెద్ద సంఖ్యలో అమెరికన్లు మూడవ పార్టీలకు ఓటు వేయడం లేదా ఎన్నికలకు దూరంగా ఉండడం కూడా మనం చూడవచ్చు.ట్రంప్ పదవికి పూర్తిగా అనర్హుడన్న విషయం ఈపాటికే స్పష్టం అయింది. అయినా సరే... ఆయన తిరిగి ఎన్నికైతే, తన దేశానికే కాదు, ప్రపంచానికి, భారతదేశానికి కూడా తీవ్రమైన పరిణామాలు ఎదురవుతాయి. ఉక్రెయిన్, గాజాలో జరుగుతున్న యుద్ధాల వల్ల ప్రపంచం అతలాకుతలం అవుతోంది. పైగా తైవాన్ లో ఒక ప్రమాదం పొంచి ఉన్నందున, అమెరికా నాయకత్వ పాత్ర చాలా ముఖ్యమైనది. చైనాతో తలపడుతున్న భారత్ భద్రతకు అమెరికా భాగస్వామ్యం ముఖ్యం.అధ్యక్షుడు బైడెన్ హయాంలో... దక్షిణ కొరియా, జపాన్లతో మాత్రమే కాకుండా ఫిలిప్పీన్స్, భారతదేశంతో కూడా పొత్తులు పెట్టుకోవడం ద్వారా అమెరికా తన ఇండో–పసిఫిక్ ముఖచిత్రాన్ని భారీగా బలోపేతం చేసింది. ఈశాన్య ఆసియాలో బైడెన్ ముఖ్యంగా అమెరికా, జపాన్, దక్షిణ కొరియాతో కూడిన త్రైపాక్షిక సంబంధాన్ని ఏర్పరచుకున్నారు. ట్రంప్ హయాంలో అమెరికా, ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు తీవ్ర ఒత్తిడికి లోనయ్యాయి.ముఖ్యంగా, ఆయన ‘ఆకస్’(ఏయూకేయూఎస్–ఆస్ట్రేలియా, యూకే, యూఎస్) సైనిక కూటమిని రూపొందించడానికి కూడా చొరవ తీసుకున్నారు. ఇది భారత్ సభ్యురాలిగా ఉన్న క్వాడ్ సంస్థకు భిన్నం. ఇది ఇప్పుడు ప్రధానంగా ఆరోగ్య భద్రత, సరఫరా గొలుసు స్థితిస్థాపకత, వాతావరణ మార్పులు, క్లిష్టమైన, అభివృద్ధి చెందుతున్న సాంకేతికత, సైబర్ భద్రత, సముద్ర భద్రత వంటివాటిపై దృష్టి సారిస్తోంది. 2023 జూన్లో, బైడెన్ ఇండో–పసిఫిక్ ప్రాంతం మరొక అంచులో యూఎస్–ఇండియా రక్షణ, భద్రతా సంబంధాలను మరింత ఎత్తుకు తీసుకుపోయే ప్రయత్నంలో ప్రధాని నరేంద్ర మోదీతో కలిశారు. ట్రంప్తో భారతదేశ సంబంధాలు బాగానే ఉన్నాయి. కానీ గత మూడేళ్లలో జరిగినట్టుగా ద్వైపాక్షిక సంబంధాలను నిర్మించడంలో క్రమబద్ధమైన కృషి జరగలేదు.మనోజ్ జోషివ్యాసకర్త న్యూఢిల్లీలోని అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్లో డిస్టింగ్విష్డ్ ఫెలో (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
ఇజ్రాయెల్పై అడ్డుకట్టకు ఖతార్తో జోబైడెన్ భేటీ
గత ఆరు నెలలుగా హమాస్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతోంది. హమాస్ను నిర్మూలించాలనే ఇజ్రాయెల్ లక్ష్యం.. గాజా స్ట్రిప్లోని ప్రజలను కష్టాలపాలు చేస్తోంది. గాజాలో తలెత్తుతున్న విధ్వంసకర పరిస్థితులపై ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది.అమెరికాలో ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా పెద్దఎత్తున ఆందోళనలు చెలరేగుతున్నాయి. ఇది అధ్యక్షుడు జో బైడెన్కు కొత్త సమస్యలను తెచ్చిపెట్టేదిగా మారింది. దీంతో బైడెన్ గాజాలో యుద్ధాన్ని నివారించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. గాజాలో కాల్పుల విరమణ, బందీల విడుదల కోసం ఇజ్రాయెల్ ప్రతిపాదనను బైడెన్ ఇటీవలే ప్రకటించాడు.తాజాగా అమెరికా అధ్యక్షుడు బైడెన్ మరోసారి ఈ ఒప్పందానికి సంబంధించి ఖతార్ ఎమిరేట్స్తో మాట్లాడారు. కాల్పుల విరమణ ప్రతిపాదనను ఆమోదించేలా హమాస్పై ఒత్తిడి తేవాలని కోరారు. గాజాలో సంక్షోభాన్ని అంతం చేయడానికి, కాల్పుల విరమణ, బందీ ఒప్పందాన్ని అమలు చేయడంపై ఖతార్ ఎమిర్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీతో చర్చించారు.‘నేను ఈ రోజు ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీతో మాట్లాడాను’ అని బైడెన్ తన ట్విట్టర్ ఖాతాలో తెలిపారు. కాల్పుల విరమణ, బందీ ఒప్పందానికి సంబంధించిన ప్రణాళికను ఎలా రూపొందించాలనే దానిపై చర్చించానన్నారు. హమాస్ ఒప్పందాన్ని ఆమోదించేలా అన్ని తగిన చర్యలను తీసుకోవాలని తాను అమీర్ తమీమ్ను కోరానన్నారు. గాజాలో బందీలుగా ఉన్న వారిని విడుదల చేయడానికి కృషి చేసినందుకు ధన్యవాదాలు తెలిపానన్నారు. ఈ ఒప్పందం అమలుకు ఈజిప్ట్, ఖతార్లతో కలిసి యునైటెడ్ స్టేట్స్ పని చేస్తుందని బైడెన్ పేర్కొన్నారు.ఐదు వేలకు పైగా రాకెట్లను ప్రయోగిస్తూ హమాస్ అక్టోబర్ 7న ఇజ్రాయెల్ నగరాలపై దాడి మొదలుపెట్టింది. అనంతరం హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్లోకి ప్రవేశించి అక్కడి ప్రజలపై దాడులు జరిపారు. దీనికి ప్రతిగా గాజాలోని హమాస్ ఉగ్రవాదులపై ఇజ్రాయెల్ ఆపరేషన్ ప్రారంభించింది. ఈ ఆపరేషన్లో గాజాలోని హమాస్ స్థావరాలపై భారీ బాంబు దాడులు జరిగాయి. ఫలితంగా గాజాలోని పలు ప్రాంతాలు శిథిలమయ్యాయి. ఇజ్రాయెల్,గాజాలలో ఇప్పటివరకు మొత్తం 34,622 మంది మృతి చెందారు. The United States has worked relentlessly to support Israelis’ security, to get humanitarian supplies into Gaza, and to get a ceasefire and a hostage deal to bring this war to an end. pic.twitter.com/eGXgV3KSbV— President Biden (@POTUS) June 1, 2024 -
రూ.2.8 కోట్ల విరాళాలు నిలిపేసిన బైడెన్ పార్టీ
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్కు చెందిన డెమోక్రటిక్ పార్టీ ఇండో అమెరికన్ వ్యాపారవేత్త ఇచ్చిన మొత్తం సుమారు 3.4 లక్షల డాలర్లు(రూ.2.8 కోట్లు) విరాళాలను నిలిపేసినట్లు మీడియా కథనాల ద్వారా తెలిసింది. పొలిటికో కథనం ప్రకారం.. బిడెన్ విక్టరీ ఫండ్(బీవీఎఫ్) కోసం తాజాగా ఇండో అమెరికన్ వ్యాపారవేత్త గౌరవ్ శ్రీవాస్తవ 50,000 డాలర్లు(రూ.41 లక్షలు) విరాళాన్ని అందించాలని నిర్ణయించుకున్నారు. అయితే అమెరికా చట్టాల ప్రకారం అది సాధ్యంకాదని, ఆ విరాళాన్ని నిలిపివేస్తున్నట్లు జో బైడెన్ ప్రచార అధికారి తెలిపారు. గతంలోనూ డెమోక్రాటిక్ కాంగ్రెషనల్ ప్రచార కమిటీ (డీసీసీసీ)కు తాను ఇచ్చిన 2.9లక్షల డాలర్లను హోల్డ్లో పెడుతున్నట్లు చెప్పారు. లాస్ ఏంజిల్స్కు చెందిన శ్రీవాస్తవ తన భార్య గౌరవ్ షారన్ పేరుతో, శ్రీవాస్తవ ఫ్యామిలీ ఫౌండేషన్ పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థను నడుపుతున్నారు. తనకు ఇతర కంపెనీలు ఉన్నాయి. అయితే ఆ సంస్థలు నిత్యం చట్టపరమైన వివాదాల్లో చిక్కుకుంటున్నాయి. అవి ఎలాంటి వివాదాలో మాత్రం తెలియరాలేదు. 2022లో బాలిలో జరిగిన ప్రపంచ ఆహార భద్రతా ఫోరమ్కు తన ఫ్యామిలీ 1 మిలియన్ డాలర్లు విరాళం ప్రకటించింది. అనంతరం అతడి సంస్థల్లో వివాదాలు నెలకొన్నాయి. ఆ అంశాలు కోర్టు వరకు వెళ్లడంతో థింక్ ట్యాంక్ అట్లాంటిక్ కౌన్సిల్ అతనితో సంబంధాలు తెంచుకుంది. అమెరికా ఎన్నికల చట్టాల ప్రకారం..ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థికి ఒక వ్యక్తి 3,300 డాలర్లకు మించి విరాళం ఇవ్వకూడదనే నిబంధన ఉంది. అయితే నిర్దిష్ట అవసరాలను తీర్చే ప్రచార కమిటీలకు మాత్రం విరాళాలు ఇవ్వడానికి అనుమతులున్నాయి. దాంతో డీసీసీసీకు శ్రీవాస్తవ భారీగా విరాళం ఇచ్చారు. ఆ విరాళాలను బీవీఎఫ్ బైడెన్ ప్రచారానికి, డెమోక్రటిక్ నేషనల్ కమిటీకి, స్టేట్ పార్టీ యూనిట్లకు విభజించింది. ప్రస్తుతం తెరపైకి వస్తున్న వివాదాలతో ఆ విరాళాలను స్వచ్ఛంద సంస్థలకు బదిలీచేస్తున్నట్లు డెమోక్రాట్ల ప్రతినిధి చెప్పారు. డీసీసీసీకు విరాళం ఇచ్చిన సమయంలో గౌరవ్ తాను యూనిటీ రిసోర్స్ గ్రూప్ (యూఆర్జీ) ఛైర్మన్ను అంటూ చెప్పుకున్నారని కథనం ద్వారా తెలిసింది. ప్రతికూల వాతావరణంలో విజయాన్ని సాధించే వ్యాపారాలు, ప్రభుత్వాలు, సంస్థల సమస్యలకు సమర్థవంతమైన పరిష్కారాలను అందించే ప్రముఖ సంస్థ యూఆర్జీ అంటూ తన వెబ్సైట్లో పేర్కొంది. ఇదీ చదవండి: వాట్సప్ స్టేటస్ పెడుతున్నారా..? అదిరిపోయే అప్డేట్ మీ కోసమే! బైడెన్ సెనేటర్గా ఉన్న సమయంలో అతడికి సహాయకుడిగా పనిచేసిన అంకిత్ దేశాయ్ నిర్వహించిన లాబీయింగ్ సంస్థ ఏర్పాటులో యూనిటీ రిసోర్స్ గ్రూప్ భాగమైందని పొలిటికో నివేదించింది. నాటో మిత్రపక్ష కమాండర్గా పనిచేసి, డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని చేజార్చుకున్న రిటైర్డ్ జనరల్ వెస్లీ క్లార్క్ను గౌరవ్ శ్రీవాస్తవ కన్సల్టెంట్గా నియమించుకున్నారు. కొన్ని కారణాల వల్ల విడిపోయారని పొలిటికో తెలిపింది. గౌరవ్ శ్రీవాస్తవకు వ్యక్తిగతంగా ఒక వెబ్సైట్ ఉంది. అందులోకి ‘హాయ్.. నేనో ఫిలాంథ్రోఫిస్ట్(పరోపకారిని)’ అంటూ రావడం విశేషం. -
USA: ‘నేను మళ్లీ గెలిస్తే’.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
వాషింగ్టన్: ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే తాను తొలుత చేసే పనులేంటో దేశ మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. 2021లో వాషింగ్టన్ క్యాపిటల్ హిల్ భవనంపై దాడి ఘటనలో అరెస్టయి జైళ్లలో ఉన్నవారిని వెంటనే విడుదల చేస్తానని, మెక్సికోతో సరిహద్దును మూసేసి అక్రమ వలసదారులకు అడ్డకట్ట వేస్తామని తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో ట్రంప్ తాజాగా ఒక పోస్టు పెట్టారు. 2020లో జరిగిన అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడ్డ తర్వాత జో బైడెన్ గెలుపు అక్రమమని ట్రంప్ ఒక ప్రసంగం చేశారు. దీంతో రెచ్చిపోయిన ఆయన మద్దతుదారులు 2021, జనవరి 6న వాషింగ్టన్లోని చారిత్రాత్మక క్యాపిటల్ హిల్ భవనంపై దాడి చేశారు. ఈ కేసులో వందల మంది అరెస్టయి జైళ్లలో శిక్ష అనుభవిస్తున్నారు. క్యాపిటల్ హిల్ తిరుగుబాటు కేసులో అధ్యక్షునికి రాజ్యాంగ రక్షణ ఉంటుందా లేదా అనే కేసులో ట్రంప్పై వచ్చే ఏప్రిల్ 25న అమెరికా సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించనుంది. ఈ తీర్పుపైనే ట్రంప్నకు రెండోసారి అధ్యక్ష పదవి చేపట్టే అర్హత ఉందా లేదా అనేది తేలిపోనుంది. కాగా, ఈ ఏడాది నవంబర్ 5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ట్రంప్, ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ మళ్లీ తలపడనున్నారు. అధ్యక్ష అభ్యర్థిని నిర్ణయించే రిపబ్లికన్ ప్రైమరీల్లో ట్రంప్ ఇప్పటికే ఘన విజయం సాధించారు. ఇదీ చదవండి.. అమెరికాలో టిక్టాక్ పాలిటిక్స్.. ట్విస్ట్ ఇచ్చిన ట్రంప్ -
సరైన కార్యాచరణ ఎక్కడ?!
నటన ఒక స్థాయికి మించితే బెడిసికొడుతుంది. తెరపై అతిగా నటిస్తే ఓవరాక్షన్ అంటారు. ఆ పనే నిజజీవితంలో చేస్తే వంచన అంటారు. గాజాపై ఇజ్రాయెల్ సాగిస్తున్న మారణకాండ 157 రోజులుగా అంతూ దరీ లేకుండా సాగుతోంది. ముస్లింలు ఎంతో పవిత్రంగా పరిగణించే రంజాన్ మాసం మొదలైనా మారణకాండ, విధ్వంసం ఆగటంలేదు. ఆకలితో అల్లాడుతున్న ప్రజానీకం అడపాదడపా వచ్చిపడుతున్న క్షిపణులకూ, బాంబులకూ పిట్టల్లా రాలుతున్నారు. ఇప్పటికి 31,000 మంది పౌరులు ఈ దాడుల్లో మరణించారని పాలస్తీనా అధికారులు, స్వచ్ఛంద సంస్థలు చెబుతుండగా అందులో 13,000 మంది ఉగ్రవాదులున్నారని ఇజ్రాయెల్ ప్రకటిస్తోంది. ‘సంపూర్ణ విజయం’ సాధించేవరకూ విశ్రమించబోమని ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ చెబుతున్నారు. నిరుడు అక్టోబర్ 7న ఇజ్రాయెల్ భూభాగంలోకి ప్రవేశించిన హమాస్ మిలిటెంట్లు 1,200 మంది ఇజ్రాయెల్ పౌరులను హతమార్చి, 250 మంది పౌరులను అపహరించినప్పటినుంచీ గాజాపై దాడులు సాగుతూనేవున్నాయి. కిడ్నాప్ చేసినవారిలో 150 మందిని హమాస్ విడుదలచేసింది. ఇంకా 100 మంది వారి చెరలోనేవున్నారు. ఈ మానవ హననాన్ని నిలువరించటానికి తన పలుకుబడిని వినియోగించాల్సిన అగ్రరాజ్యం అమెరికా అందుకు భిన్నంగా ద్విపాత్రాభినయం చేస్తూ తన నటనావైదుష్యాన్ని ప్రదర్శిస్తోంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దేశ ప్రజలనుద్దేశించి చేసిన ప్రసంగంలో గాజాపై దాడులు నిలపాలనీ, కనీసం రంజాన్ మాసంలోనైనా కాల్పుల విరమణకు అంగీ కరించాలనీ నెతన్యాహూను కోరారు. మంచిదే. కానీ ఆయన లక్ష్యపెట్టిందెక్కడ? తన మాటకు విలువీయని దేశానికి బైడెన్ ఆయుధ సరఫరా ఎలా కొనసాగిస్తున్నారు? అమెరికాయే కాదు... దాని మిత్రదేశాలు కూడా ఈ ద్విపాత్రాభినయాన్ని అలవాటు చేసు కున్నాయి. ఇదే సమయంలో యుద్ధం ఆపాలంటూ వర్ధమాన దేశాలు తీసుకొస్తున్న తీర్మానాలకు భద్రతామండలిలో అమెరికా తన వీటో అధికారంతో గండికొడుతోంది. నెతన్యాహూపై బైడెన్ తరచు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రఫాపై దాడికి పూనుకుంటే లక్ష్మణరేఖ దాటినట్టేనని హెచ్చరిస్తున్నారు. ఎవరిని వంచించటానికి ఈ హెచ్చరికలు? గాజా ప్రజల క్షేమంపై ఆయనకు నిజంగా ఆందోళనవుంటే దాని పొరుగు దేశమైన ఈజిప్టును ఒప్పించి గాజా పౌరులు సరిహద్దుదాటి తలదాచుకునేందుకు అనుమతించమని అడగొచ్చు. కానీ ఆయన ఆ పని చేయటం లేదు. ఈజిప్టుకు ఏటా అమెరికా 103 కోట్ల డాలర్ల విలువైన సైనిక సాయాన్ని అందిస్తోంది. ఆ దేశాధ్యక్షుడు అబ్దెల్ ఫతా అల్ సిసితో బైడెన్కు మంచి సంబంధాలున్నాయి. అయినా ఈ ప్రతిపాదన చేయరు. ఇందుకు బదులు ఆహార పొట్లాలు అందించటం మొదలెట్టారు. ఆ ఉద్దేశం వెనకున్న ఆంతర్యాన్ని కూడా అనేకులు తప్పుబడుతున్నారు. దేశప్రజలనుద్దేశించి చేసిన ప్రసంగంలో గాజాలో పోర్టు నిర్మాణాన్ని మొదలుపెడతామని బైడెన్ ప్రకటించారు. ఇది ఆహార సరఫరా సులభం చేయటం కోసమని ఆయన చెబుతున్నా ఆ వంకన అక్కడ తిష్టవేయటమే అమెరికా లక్ష్యమన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇజ్రా యెల్కు ఆత్మరక్షణ చేసుకునే హక్కుందని బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ మాట్లాడే మాటలు 31,000 మంది మరణించాక కూడా చెల్లుబాటవుతాయా? అయిదు నెలలు గడిచాక కూడా ఇంకా హమాస్ను అంతం చేయటమే లక్ష్యమంటూ ఇజ్రాయెల్ సాగిస్తున్న నరమేథాన్ని అమెరికా చూసీ చూడనట్టు వదిలేయటం సరైందేనా? హమాస్ తన దుందుడుకు చర్యలతో గాజా ప్రజలకు తీరని నష్టం చేసింది. దానిపై దాడి పేరుతో అదే పని ఇజ్రాయెల్ కూడా కొనసాగిస్తోంది. కానీ ఒకరి దాడిని ఉగ్రవాదంగా చిత్రీకరిస్తూ మరొకరిని అనునయిస్తూ, వేడుకుంటూ అదే సమయంలో వారికి కావల సిన ఆయుధ సామగ్రి అందిస్తూ కాలం గడపటం సరైందేనా? గాజాలో నాగరిక సమాజాలు ఏమాత్రం అంగీకరించటం సాధ్యంకాని ఉదంతాలు చోటుచేసు కుంటున్నాయి. గాజా పౌరులు ఆకలికి తట్టుకోలేక ఆకులు అలములు తింటున్నారు. కడుపు నింపు కోవటానికి పశుదాణా సైతం వినియోగిస్తున్నారు. నెలలు నిండకమునుపే గర్భిణులకు ప్రసవాలవు తున్నాయి. ఆ నవజాత శిశువులకు అవసరమైన సంరక్షణ కూడా సాధ్యం కావటం లేదు. అధిక రక్తస్రావంతో తల్లులు కన్నుమూస్తున్నారు. సకాలంలో మేల్కొని ఆపకపోతే ఇజ్రాయెల్తోపాటు అమెరికా కూడా దోషిగా నిలబడాల్సివస్తుంది. రష్యా సాగిస్తున్న దురాక్రమణ యుద్ధంలో దినదిన గండంగా బతుకుతున్న ఉక్రెయిన్కు ఇంతవరకూ అమెరికా ఒక్కటే 7,500 కోట్ల డాలర్ల సాయం అందించింది. నాటో సభ్య దేశాలు తమ వంతుగా మరింత సాయం అందిస్తున్నాయి. ఇందువల్ల రష్యా ఎక్కడా తగ్గిన దాఖలా లేదు. అటు ఉక్రెయిన్కు కూడా ఒరిగేదేమీ వుండటం లేదు. లాభపడేది అమెరికా రక్షణ ఉత్పత్తుల కంపెనీలే. సాయం పేరుతో అందించేదంతా తిరిగి ఆ కంపెనీలకు చేరుతోంది. ఉక్రెయిన్ ఆ డబ్బుతో అమెరికా ఆయుధాలు, క్షిపణులు వగైరాలు కొంటున్నది. అటు ఉక్రెయిన్, ఇటు గాజా ఏకకాలంలో శ్మశానాలను మరపిస్తుండగా... రక్షణ ఉత్పత్తుల కంపెనీలు మాత్రం పచ్చగా వెలుగుతున్నాయి. పోనీ అమెరికా అయినా ప్రశాంతంగా వుంటున్నదా? కొన్ని దశాబ్దాలక్రితం పౌరహక్కుల కోసం చేతులు కలిపిన నల్లజాతీయులు, యూదులు ఇప్పుడు పరస్పరం దూషించుకుంటున్నారు. యూదులపై అక్కడక్కడ దాడులు కూడా జరుగుతున్నాయి. దీన్నంతటినీ ఆపాలంటే గాజాతోపాటు ఉక్రెయిన్లోనూ ప్రశాంతత నెలకొనాలి. అది అమెరికా అధ్యక్షుడు బైడెన్ చేతుల్లోనేవుంది. ఇప్పుడు కావాల్సింది నటన కాదు... సరైన కార్యాచరణ. -
న్యూయార్క్ కోర్టు జడ్జిగా భారతీయుడు
అమెరికాలోని న్యూయార్క్లో గల తూర్పు జిల్లా కోర్టుకు భారత సంతతికి చెందిన సంకేత్ జయసుఖ్ బల్సరా న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ న్యూయార్క్లోని తూర్పు జిల్లా కోర్టుకు భారత సంతతి న్యాయమూర్తిని నామినేట్ చేశారు. న్యూయార్క్లోని డిస్ట్రిక్ట్ కోర్టులో పనిచేస్తున్న బల్సరా.. సెక్యూరిటీలు, కాంట్రాక్టులు, దివాలా, నియంత్రణ విషయాలలో తన నైపుణ్యాన్ని నిరూపించుకున్నారు. అతని తల్లిదండ్రులు భారతదేశం నుంచి ఇక్కడకు వలస వచ్చారు. 46 ఏళ్ల బల్సరా 2017 నుంచి న్యూయార్క్లోని ఈస్టర్న్ డిస్ట్రిక్ట్లో యూఎస్ మేజిస్ట్రేట్ జడ్జిగా పనిచేస్తున్నారు. యూఎస్ కోర్టుకు నియమితులైన మొట్టమొదటి దక్షిణాసియా అమెరికన్ ఫెడరల్ న్యాయమూర్తిగా బల్సరా ఘనత సాధించారు. బల్సరా న్యూ రోషెల్లో జన్మించారు. అతని తల్లిదండ్రులు 50 సంవత్సరాల క్రితం ఇక్కడకు వలస వచ్చి స్థిరపడ్డారు. అతని తండ్రి ఇంజనీర్గా పనిచేశారు. తల్లి నర్సు. బల్సరా 2002లో హార్వర్డ్ లా స్కూల్ నుండి జేడీ, 1998లో హార్వర్డ్ కళాశాల నుండి ఏబీ పట్టా పొందాడు. ప్రస్తుతం బల్సరా తన భార్య క్రిస్టీన్ డెలోరెంజోతోపాటు లాంగ్ ఐలాండ్ సిటీలో ఉంటున్నారు. -
బైడెన్ మళ్లీ నెగ్గుతారా?.. సర్వేలో ఆసక్తికర ఫలితాలు
వాషింగ్టన్: ఈ ఏడాది నవంబర్లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలపై పలు సంస్థలు నిర్వహిస్తున్న సర్వేలు ఆసక్తి రేపుతున్నాయి. తాజాగా నిర్వహించిన గాల్లప్ పోల్లో సంచలన ఫలితాలు వెలువడ్డాయి. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ తిరిగి అధ్యక్ష పదవికి ఎన్నికయ్యేందుకు కేవలం 38 శాతం మాత్రమే అంగీకరిస్తున్నట్లు పోల్లో వెల్లడయ్యింది. ఇదే సమయంలో ట్రంప్ మళ్లీ అధ్యక్షుడయ్యేందుకు 50 శాతం మంది అమెరికన్లు మద్దతిస్తున్నారు. బైడెన్ అధిక వయసు వల్లే రెండోసారి ఆయన అధ్యక్షుడిగా ఎన్నికయ్యేందుకు చాలా మంది అంగీకరించకపోవడం గమనార్హం. వయసుతో పాటు మెక్సికోతో బోర్డర్ వివాదం, ద్రవ్యోల్బణం లాంటి అంశాలు బైడెన్కు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. మరోవైపు ట్రంప్ వయసుపై కూడా కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నప్పటికీ బైడెన్తో పోల్చినపుడు వయసు విషయంలో సర్వేల్లో ట్రంప్ ముందంజలో ఉన్నారు. అయితే గతంలో గాలప్ పోల్స్ అంచనాలు చాలాసార్లు మిస్సయ్యాయి. ఇదీచదవండి.. న్యూజిలాండ్లో భారత విద్యార్థి మృతి -
అమెరికాలో తగ్గని ట్రంప్ హవా?
అగ్రరాజ్యం అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడంపై చాలామందికి సందేహాలు ఉండవచ్చు. కానీ, ఆయనకు దేశంలో మద్దతుదారులు పెరుగుతున్నారనే చెప్పాలి. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, ట్రంప్కు రెండు రకాల ఇమేజ్లు ఉండటం. ఒకవైపేమో చట్టాలను కఠినంగా అమలు చేసే వ్యక్తిగా, సుస్థిర ఆర్థిక వ్యవస్థను అందించగలిగేవాడిగా, యుద్ధాలకు దూరంగా ఉండేవాడిగా చూస్తూంటే... ఇంకోవైపేమో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపేవాడిగా, వ్యవస్థలపై దాడి చేసేవాడిగా, దేశ ప్రాథమ్యాలను మార్చేసే వ్యక్తిగా చూస్తున్నారు. ఏమైనా ట్రంప్కు ఆదరణ పెరుగుతోంది. ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ మాత్రం సర్వేలను నమ్మొద్దనీ, తానే మళ్లీ అధికారంలోకి రానున్నాననీ ధీమాగా చెబుతున్నారు. అమెరికాలోని ఈశాన్య కారిడార్లో ఇటీవల జరిగిన పలు సంభాషణలు డోనాల్డ్ ట్రంప్కు ఆదరణ పెరిగిన విషయాన్ని నిరూపిస్తాయి. కేంబ్రిడ్జ్లోని మసాచూ సెట్స్లో తొలితరం అమెరికన్ , హైతీ సంతతి మహిళ తన రోజువారీ కష్టాలను వెళ్లగక్కుతోంది. రెండ్రెండు ఉద్యోగాలు చేస్తున్నా తన ముగ్గురు పిల్లలతో జీవనం దుర్భరమవుతోందని ఆమె వాపోయింది. అంతేకాదు... ఉక్రెయిన్ , ఇజ్రాయెల్ యుద్ధాలకు అమెరికా మద్దతుగా నిలవడాన్ని కూడా ప్రశ్నిస్తోంది. డబ్బులు ఎందుకు వృథా చేస్తున్నా మంటూ ఆక్షేపిస్తోంది. అదే సమయంలో దేశంలో అక్రమ చొరబాటు దారులు పెరిగిపోతూండటం కూడా ఆమెకు రుచించడం లేదు. చట్ట బద్ధంగా దేశంలోకి వస్తున్న వాళ్లు పౌరసత్వం పొందేందుకు ఏళ్ల తరబడి తంటాలు పడుతూంటే, అక్రమ వలసదారులు మాత్రంఎంచక్కా మంచి జీవితాన్ని అనుభవిస్తున్నారన్నది ఆమె ఆరోపణ. ఈ ఆర్థిక, వలసల సమస్యలకు బాధ్యుడు జో బైడెన్ అని ఆమె నిశ్చితా భిప్రాయం. అందుకే తాను ఈసారి ట్రంప్కు ఓటేస్తానని చెబుతోంది. ట్రంప్పై క్రిమినల్ కేసులున్న విషయాన్ని కూడా పట్టించుకోవడం లేదు. వ్యవస్థ తమలాంటి ప్రజల మాదిరే ట్రంప్ను కూడా హింసిస్తోందని అంటోంది. న్యూయార్క్లోని ఓ యువ ఊబర్ డ్రైవర్ ఏమంటున్నాడో చూడండి. డొమినికన్ రిపబ్లిక్ నుంచి వలస వచ్చిన ఈ యువకుడు 2016లో ట్రంప్కు ఓటేయవద్దని తన మిత్రులందరికీ చెప్పాడు. ఇప్పుడు మాత్రం తన ఆలోచనలు మారిపోయాయని అంటున్నాడు. బైడెన్ ఏలుబడిలో నేరాలు పెరిగిపోయాయని అతడి ఆరోపణ (నిజా నికి తగ్గాయి). అమెరికా యుద్ధాల్లో చిక్కుకుపోవడం కూడా ఇతడికి ఇష్టం లేదు. బైడెన్ వృద్ధుడు అయ్యాడని ఈ యువకుడి నమ్మకం (బైడెన్కు 81 ఏళ్లు. ట్రంప్కు 77). జనవరి 6 (2021) ఘటన (క్యాపి టల్పై ట్రంప్ అనుచరుల దాడి) మీద భిన్నాభిప్రాయాలు ఉన్నప్ప టికీ, వలసదారుల సమస్య అతడిని పీడిస్తోంది. 2022 నుంచి ఇప్పటి వరకూ న్యూయార్క్ నగరం దాదాపు 16,000 కాందిశీకుల నివాసానికి అనుమతులు జారీ చేసింది. ఇప్పటికే పనిభారంతో ఉన్న నగర పరి పాలన వ్యవస్థ మరో 68,000 మంది బాగోగులు చూసుకుంటోంది. ఈ చర్యలు కాస్తా అక్రమ వలసల విషయంలో ప్రజల్లోని వ్యతిరేక భావనలను మరింత పెంచుతున్నాయి. ఈ వ్యతిరేకత అటు డెమొక్రా ట్లతోపాటు ఇటు రిపబ్లికన్లలోనూ కొనసాగుతూండటం గమనార్హం. వాషింగ్టన్ డీసీలో ఉంటున్న సియెర్రా లియోన్ జాతీయుడి ఆలో చనలు ఎలా ఉన్నాయో చూడండి. 2008లో వలస వచ్చిన ఈ వ్యక్తి ఇప్పుడు అమెరికన్ పౌరుడు. ట్రంప్కు ఓటేసేందుకు ఎదురు చూస్తు న్నాడు. ఉక్రెయిన్ , ఇజ్రాయెల్లకు అమెరికా ఎందుకు మద్దతిస్తోందో ఇతడికి అర్థం కావడం లేదు. బైడెన్ చాలా యుద్ధాలు చేస్తున్నాడంటాడు. ట్రంప్ అధికారంలోకి వస్తే ఇజ్రాయెల్కు మద్దతు మరింత పెరుగుతుందన్న వాదనను తిప్పికొడుతున్నాడు. బైడెన్ ఏలుబడిలో రోజువారి వెచ్చాల ధరలు, అద్దెలు పెరిగిపోయాయనీ, ఆఫ్రికా దేశపు వ్యక్తిగా, ముస్లింగా జాతి వివక్ష విషయంలో డెమొక్రాట్లు, రిపబ్లికన్లలో తేడా ఏమీ లేదంటాడు. రిపబ్లికన్ల వైపు అనూహ్య మొగ్గు ఎక్కడైనా సరే, రాజకీయ వాతావరణం ఎలా ఉందో తెలుసు కోవాలంటే ఆయా పార్టీల మూలభూతమైన మద్దతుదారులు నమ్మ కంగా ఉన్నారా, లేదా? అన్నది ఒక ప్రామాణికమవుతుంది. తన ప్రాబ ల్యాన్ని విస్తరించుకోవడం ఇంకో కొలమానం. ఇప్పటివరకూ చెప్పు కున్న సంభాషణలన్నింటినీ ఒకసారి పరిశీలిస్తే ట్రంప్కు ప్రాథమిక స్థాయిలో ఉన్న ఆదరణ తగ్గలేదు సరికదా... ఎంతో కొంత పెరిగిందని స్పష్టమవుతుంది. హైతి, డొమినికన్ రిపబ్లిక్, సియెర్రా లియోన్ లకు చెందిన అమెరికన్ పౌరులు ట్రంప్ మద్దతుదారులుగా మారతారని ఎవరూ ఊహించరు. అయితే సర్వేలు, ఇతర అంశాలను పరిశీలిస్తే స్పానిష్, నల్లజాతీయుల్లో ఒక వర్గం కూడా నెమ్మదిగానైనా డెమొక్రాట్ల నుంచి రిపబ్లికన్ల వైపునకు మొగ్గుతున్నట్లు తెలుస్తుంది. జాతి ఆధారిత సమూహాలను కాసేపు పక్కనబెడితే... మిగిలిన వర్గాల్లో మాత్రం ట్రంప్ మాటలు బలమైన ముద్రే వేశాయని చెప్పాలి. కొంత తప్పుడు సమాచారం, ఎన్నికల సంవత్సరంలో జోబైడెన్ ప్రభుత్వ పోకడలపై నెలకొన్న అసంతృప్తి వీటికి ఆజ్యం పోస్తున్నాయి. వేర్వేరు వర్గాలు ట్రంప్ నుంచి వేర్వేరు రకాల సందేశాలు అందుకుంటున్నాయి. ఒక్కటైతే వాస్తవం. ట్రంప్ ఆదరణ పైపైకి పోతోంది. కాక పోతే ఇందుకు భిన్నమైన పార్శా్వలు ఉన్నాయి. బాగున్న బైడెన్ రికార్డ్ మొదటిది... ప్రస్తుతమున్న ప్రజల మూడ్ ఈ క్షణానికి సంబంధించింది మాత్రమే. ప్రచారం చేసేవారికి ఫీడ్బ్యాక్ లూప్గా ఉపయో గపడుతుంది కానీ విలువ తక్కువ. 2024 నవంబరులో ఏమవుతుందో ఎవరికీ తెలియదు. ట్రంప్ మళ్లీ ఈ స్థాయిలో పుంజుకుంటా డని గత ఏడాది ఎవరు ఊహించారు? రెండు... ట్రంప్ ఎదుర్కొంటున్న కేసులు పెద్ద సవాళ్లే విసర నున్నాయి. కొలరాడో, మైన్ లలో నమోదైన కేసుల్లో ఓటుపై నిషేధం పడటం ట్రంప్కు లాభిస్తోంది. బాధితుడిగా ప్రచారం చేసుకుంటు న్నారు. సుప్రీంకోర్టు ఈ తీర్పులను రద్దు చేయవచ్చు. కానీ ఓ పార్టీ తరఫున అధ్యక్ష స్థానానికి పోటీ పడుతున్న వ్యక్తి నాలుగు క్రిమినల్ శిక్షలు ఎదుర్కొంటున్నాడన్నా, పోలింగ్ రోజుకు ముందు మరిన్ని కేసులు ఎదుర్కునే అవకాశం ఉందన్నా దాని ప్రభావం ఓటింగ్పై కచ్చితంగా ఉంటుంది. మూడు... బైడెన్ స్థానిక ఎన్నికల ఏర్పాట్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. అయినప్పటికీ 1973లో తొలిసారి సెనేటర్గా ఎన్నికై అంచ లంచెలుగా ఎదిగిన బైడెన్ ఇలాంటి స్థితి నుంచి బయటపడటం చాలా సార్లు చూశాము. పాలన విషయంలో ఆయనపై ఎలాంటి మచ్చ లేకపోవడం, కోవిడ్ నుంచి సమర్థంగా బయటపడటం, ద్రవ్యోల్బణం, ఉపాధి అవకాశాలు, అభివృద్ధి వంటి అంశాల్లో చక్కటి సమ తౌల్యం కనిపిస్తూండటం బైడెన్ కు కలిసివచ్చే అంశాలు. ఈ చర్య లన్నింటి ఫలితం కూడా వడ్డీరేట్లు, ధరలు తగ్గడంలో ప్రతిఫలిస్తోంది. అదే సమయంలో మార్కెట్ కూడా పుంజుకుంటూండటం గమనార్హం. మౌలిక సదుపాయాలు, వాతావరణం, తయారీ రంగాలకు సంబంధించి బైడెన్ ఇప్పటికే విప్లవాత్మకమైన కొన్ని చట్టాలను ఆమోదింప జేసుకున్నారు. బైడెన్ కు ఇంకో రెండు సానుకూల అంశాలున్నాయి. అబార్షన్ పై వచ్చిన తీర్పు విషయంలో రిపబ్లికన్లపై బోలెడంత వ్యతిరేకత ఉంది. ట్రంప్ ఒంటెత్తు పోకడలపై కూడా ప్రజల్లో అభ్యంతరాలు ఉన్నాయి. ఇజ్రాయెల్ యుద్ధం కొంతమంది వామపక్ష, ముస్లింల ఉత్సాహాన్ని దెబ్బకొట్టినప్పటికీ, యూదుల మద్దతు బైడెన్ కు లభించేలా చేసింది. అందుకేనేమో బైడెన్ చైనా అధ్యక్షుడికి సైతం సర్వేలను నమ్మొద్దనీ, తానే మళ్లీ అధికారంలోకి రానున్నాననీ ధీమాగా చెప్పారు. చివరగా... అమెరికాలోని రెండు పార్టీలకూ దాదాపుగా సమ స్థాయిలో మద్దతు ఉంది. అందుకే అమెరికాను 47 శాతం– 47 శాతం దేశమంటారు. రాష్ట్రాలకు రాష్ట్రాలు అటు ఇటో మొగ్గి ఉంటాయి. అన్ని అధ్యక్ష ఎన్నికల ఫలితాలు అటు ఇటూ మారిపోయే ఆరు లేదా ఏడు స్వింగ్ స్టేట్స్పై ఆధారపడి ఉంటాయి. అరిజోనా, నెవడా, మిషిగన్ , విస్కాన్సిన్ , జార్జియా, పెన్సెల్వేనియాల్లోని కొన్ని వేలమంది ఓటర్లు ఎటు మొగ్గు చూపుతారన్న అంశంపై అధ్యక్షుడి ఎన్నిక ఆధారపడి ఉంటుంది. కాకపోతే ప్రస్తుతానికి మాత్రం పరిస్థితి డోనాల్డ్ ట్రంప్కు అనుకూలంగా ఉందని చెప్పకతప్పదు. వ్యాసకర్త వాషింగ్టన్ కేంద్రంగా పనిచేస్తున్న జర్నలిస్ట్ (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) - ప్రశాంత్ ఝా -
Hamas: అమెరికా బందీ మృతి.. బైడెన్ కీలక ప్రకటన
వాషింగ్టన్: హమాస్ చెరలో బందీగా ఉన్న తమ దేశ పౌరుడు గాడి హగ్గాయ్ మరణించాడన్న వార్తతో తన గుండె పగిలిపోయిందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. హగ్గాయ్ మరణంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు వైట్హౌజ్ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘హగ్గాయ్ గాజాలో హమాస్ చెరలోనే చనిపోయాడని తెలిసిన వెంటనే నా, నాభార్య జిల్ బైడెన్ హృదయాలు తీవ్ర విషాదంతో నిండిపోయాయి. హమాస్ వద్ద బందీగా ఉన్న హగ్గాయ్ భార్య క్షేమంగా తిరిగి రావాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూనే ఉంటాం’ అని జో బైడెన్ పేర్కొన్నారు. హగ్గాయ్ భార్య ఇప్పటికీ హమాస్ చెరలోనే బందీగా ఉందని ఇజ్రాయెల్ మీడియా తెలిపింది. గాజాలో హమాస్ చెరలో బందీలుగా ఉన్న వారి కుటుంబాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక గ్రూపు హగ్గాయ్ మరణాన్ని ధృవీకరించింది. అయితే ఆయన ఎందుకు చనిపోయాడన్న కారణాలు తెలియరాలేదు. ఈ ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై పాలస్తీనాకు చెందిన ఉగ్రవాద గ్రూపు హమాస్ మెరుపు దాడులు జరిపిన విషయం తెలిసిందే. బాంబు దాడులతో పాటు గాజా సరిహద్దులో ఉన్న ఇజ్రాయెల్లోని ప్రాంతం నుంచి కొంత మందిని హమాస్ ఉగ్రవాదులు తమ వెంట బందీలుగా తీసుకెళ్లారు. అప్పటి నుంచి హమాస్ లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ బాంబులతో విరుచుకుపడుతూనే ఉంది. ఇదీచదవండి..గుడి గోడలపై ఖలిస్తానీ నినాదాలు -
అమెరికా అధ్యక్ష ఎన్నికలు: మళ్లీ ఆయనే హాట్ ఫేవరెట్!
వాషింగ్టన్: వచ్చే ఏడాది జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలకు దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ ఫేవరెట్గా మారుతున్నారు. తాజాగా వాల్ స్ట్రీట్ జర్నల్ చేసిన సర్వేలో ప్రస్తుత అధ్యకక్షుడు జో బైడెన్కంటే 4 శాతం ఎక్కువ అప్రూవల్ రేటుతో ట్రంప్ ముందున్నారు. అమెరికా అధ్యక్షుడిగా జోబైడెన్ను 43 శాతం మంది ప్రజలు ఆమోదించగా ట్రంప్ను 47 శాతం మంది ఆమోదించడం విశేషం. అధ్యక్ష పదవి చేపట్టినప్పటి నుంచి జో బైడెన్ అప్రూవల్ రేటు 43 శాతానికి పడిపోవడం ఇదే తొలిసారి. 2024 అధ్యక్ష ఎన్నికలకు ఏడాది కంటే తక్కువ టైమ్ ఉండడంతో డెమొక్రాట్లకు ఈ విషయం ఆందోళన కలిగిస్తోంది. దీంతో డెమొక్రాట్లు రెండోసారి అధ్యక్షపదవికి జోబైడెన్ పోటీలో ఉండటాన్ని వ్యతిరేకిస్తున్నారు. బైడెన్ రెండోసారి పోటీచేయవద్దనేందుకు వాళ్లు మరో కారణం కూడా చూపుతున్నారు. ఎన్నికల నాటికి ఆయన వయసు 81కి చేరనుందని, ఈ వయసులో మళ్లీ పోటీ ఎందుకని కొందరు డెమొక్రాట్ నేతలు వాదిస్తున్నారు. మరోవైపు రిపబ్లికన్ల తరపున అధ్యక్ష పదవికి పోటీలో ట్రంప్కు తిరుగులేని మద్దతు లభిస్తోంది. పార్టీలో ట్రంప్ పోటీదారులెవరూ ఆయన దరిదాపుల్లో కూడా లేరు. అయితే ట్రంప్ మీదున్న క్రిమినల్ కేసులు, గతంలో క్యాపిటల్ భవనంపై ట్రంప్ మద్దతుదారుల దాడి వంటి అంశాలు ఆయన అభ్యర్థిత్వానికి ముప్పుగా పరిణమించే అవకాశాలు లేకపోలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇదీచదవండి..ఈ రెస్టారెంట్లో చెంపదెబ్బలు వడ్డిస్తారు! -
ఇజ్రాయెల్-హమాస్ సంధిపై బైడెన్ కీలక వ్యాఖ్యలు
న్యూయార్క్: హమాస్-ఇజ్రాయెల్ మధ్య సంధి కుదరడంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం అంగీకరించిన కాల్పుల విరమణను పొడిగిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. హమాస్ చెరలో ఉన్న బందీలు విడదల కావడంపై స్పందిస్తూ.. ఇది ప్రారంభం మాత్రమే అని అన్నారు. తమ చెరలో ఉన్న 24 మంది బందీలను హమాస్ విడిచిపెట్టింది. వీరిలో 13 మంది ఇజ్రాయెల్ పౌరులు, 10 మంది థాయ్లాండ్ పౌరులు, ఒకరు ఫిలిప్పైన్స్ పౌరుడు ఉన్నారు. విడుదలైన బందీలంతా ఆరోగ్యంగానే కనిపిస్తున్నారని ఇజ్రాయెల్ వైద్య శాఖ తెలియజేసింది. కాగా.. నేడు మరో దఫా బందీలను హమాస్ విడుదల చేయనున్నట్లు సమాచారం. హమాస్ డిమాండ్ను నెరవేరుస్తూ ఇజ్రాయెల్ కూడా మొదటి దశలో 39 పాలస్తీనా ఖైదీలను విడుదల చేసిందని సమాచారం. ఇజ్రాయెల్-హమాస్ మధ్య అక్టోబర్ 7న యుద్ధం ప్రారంభం అయింది. హమాస్ అంతమే ధ్యేయంగా ఇజ్రాయెల్ గాజాపై దూకుడుగా ప్రవర్తించింది. గాజాను ఖాలీ చేయించింది. స్వతంత్ర్య పాలస్తీనాను నినదిస్తూ పశ్చిమాసియా దేశాలు ఏకమయ్యాయి. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్ రంగంలోకి దిగారు. ఇరుదేశాలు కాల్పుల విరమణ అంగీకారానికి రావాలని కోరారు. ఈ డిమాండ్ల తర్వాత నాలుగు రోజుల కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ అంగీకరించింది. ఇందుకు బదులుగా హమాస్ తమ చెరలో ఉన్న 50 మందిని విడుదల చేయడానికి ఒప్పుకుంది. ఇజ్రాయెల్-హమాస్ మధ్య ఇప్పటివరకు జరిగిన యుద్ధంలో గాజా వైపు 15,000 మంది మరణించారు. ఇజ్రాయెల్ వైపు 1,200 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదీ చదవండి: Israel-Hamas war: 24 మంది బందీలకు స్వేచ్ఛ -
జిన్పింగ్ ఓ నియంత.. బైడెన్ నోట మళ్లీ అదే మాట!
వాషింగ్టన్: రెండు అగ్రరాజ్యాల అధ్యక్షులు జో బైడెన్, జిన్పింగ్ బుధవారం భేటీ అయ్యారు. ఆసియా–పసిఫిక్ ఆర్థిక సహకార మండలి(ఏపీఈసీ) శిఖరాగ్ర సదస్సులో భాగంగా దాదాపు ఏడేళ్ల తర్వాత ఇద్దరు నేతలు సమావేశమయ్యారు. ఈ మీటింగ్ అనంతరం బయటకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ని నియంతగానే విశ్వసిస్తున్నానని చెప్పారు. చైనా ప్రభుత్వం, తమ ప్రభుత్వానికి చాలా తేడా ఉంటుందని అన్నారు. జిన్పింగ్ను నియంతలాగే చూస్తున్నారా..? అని ఓ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు ఈ మేరకు సమాధానమిచ్చారు. ఇరుదేశాల మధ్య వాణిజ్య పోరు నడుస్తున్న నేపథ్యంలో బైడెన్ మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈ ఏడాది జూన్లోనూ బైడెన్ ఇదే మాట మాట్లాడారు. అప్పట్లోనే బైడెన్ తీరును చైనా ఖండించింది. మరోసారి అలాంటి వ్యాఖ్యలు చేయడం వివాదానికి దారి తీసేలా కనిపిస్తోంది. కాగా.. కాలిఫోర్నియాలోని ఒక విశాలమైన భవనంలో ఈ సమ్మిట్ ముగిసింది. రెండు దేశాల మధ్య విబేధాలు సమసిపోయేలా, దౌత్య సంబంధాలు తప్పదోవపట్టకుండా కృషి చేయడానికి అధ్యక్షులు అంగీకరించారు. ఈ సమావేశంలో ఇరువురు నేతలు ద్వైపాక్షిక సంబంధాలు, ఇరాన్, పశ్చిమాసియా, ఉక్రెయిన్, తైవాన్, ఇండో-పసిఫిక్, ఆర్థిక సమస్యలు, కృత్రిమ మేధస్సు, మాదక ద్రవ్యాల సరఫరా, వాతావరణం వంటి ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై చర్చించారు. అమెరికాలో అక్రమ మాదక ద్రవ్యాల వాణిజ్యం చేపడుతున్న చైనా సంస్థలపై చర్యలు తీసుకుంటానని జిన్పింగ్ హామీ ఇచ్చారు. అమెరికాను ఇరుకున పెట్టాలనే ఉద్దేశం లేదని జిన్పింగ్ స్పష్టంగా తెలియజేశారు. అలాగే.. అమెరికా కూడా చైనాను అణగదొక్కే చర్యలకు పాల్పడకూడదని పునరుద్ఘాటించారు. ఇరుదేశాల మధ్య ఉన్న ఉద్రిక్తతలు వివాదాలకు దారితీయకుండా చర్యలు తీసుకోవాలని ఇద్దరు అధ్యక్షులు అంగీకారానికి వచ్చారు. తైవాన్ అంశం ఇరుదేశాల మధ్య సంబంధాలకు చాలా సున్నితమైన అంశంగా మారిందని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ అన్నారు. తైవాన్ స్వాతంత్య్రానికి అమెరికా మద్దతు ఇవ్వకూడదని కోరుతూ.. ఆయుధ సరఫరాను నిలిపివేయాలని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: బైడెన్తో జిన్పింగ్ భేటీ -
ఉపన్యాసం వద్దు.. ట్రంప్పై న్యాయమూర్తి ఆగ్రహం
న్యూయార్క్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను న్యాయమూర్తి మందలించారు.కోర్టులో రాజకీయ ప్రసంగాలు ఇవ్వరాదని చివాట్లు పెట్టారు. విచారణ సందర్భంగా అడిగిన ప్రశ్నలకు మాత్రమే సమాధానం ఇవ్వాలని చెప్పారు. బ్యాంకులు, బీమా కంపెనీల నుంచి ఎక్కువ మొత్తంలో రుణాన్ని పొందడానికి ట్రంప్ తన రియల్ ఎస్టేట్ ఆస్తుల విలువను ఎక్కువ చూపించారనే ఆరోపణల కేసులో విచారణ జరిగింది. "ఇది రాజకీయ ర్యాలీ కాదు. ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి. ప్రసంగాలు వద్దు.' అని ట్రంప్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆర్థర్ ఎంగ్రోరోన్ హెచ్చరించారు. ట్రంప్ను ఎక్కువ మాట్లాడకుండా నియంత్రించాలని పిటిషనర్ తరుపు లాయర్పై న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని కోర్టు హాల్లో ట్రంప్ అన్నారు. కోర్టుల్లో కాలయాపన చేస్తూ తన సమయాన్ని వృథా చేస్తున్నారని ఆరోపించారు. విచారణ అసంబద్ధంగా జరుగుతోందని ఆరోపించారు. రియల్ ఎస్టేట్ ఆస్తుల్లో ట్రంప్ బ్రాండ్ విలువను కలపకుండానే ప్రకటించినట్లు పేర్కొన్నారు. కేవలం తన బ్రాండ్తోనే ఈ సారి ఎన్నికల్లో విజయం సాధిస్తానని అన్నారు. ట్రంప్ ప్రసంగంతో విసిగిన న్యాయమూర్తి మందలించారు. 2024 ఎన్నికల నేపథ్యంలో రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి తరుపున ట్రంప్ పోటీలో ఉన్నారు. ఇదీ చదవండి: 17 సార్లు పొడిచి భార్యపై కిరాతకం.. అమెరికాలో కేరళవాసికి జీవిత ఖైదు -
ఇండోనేషియా రాయబారిగా ఇండో-అమెరికన్.. బైడెన్ కీలక నిర్ణయం
న్యూయార్క్: అమెరికాలో భారత సంతతి మహిళకు మరో అరుదైన గౌరవం దక్కింది. ఇండోనేషియాలో అమెరికా రాయబారిగా భారత సంతతి మహిళ కమలా షిరిన్ లఖ్ధీర్ను అధ్యక్షుడు జో బైడెన్ నియమించారు. లఖ్ధీర్కు దాదాపు 30 సంవత్సరాలు విదేశాంగ శాఖలో పనిచేసిన అనుభవం ఉంది. ఇటీవల ఎగ్జిక్యూటివ్ సెక్రటరీగా కూడా పనిచేశారు. 2017 నుంచి 2021 వరకు మలేషియాలో అమెరికా అంబాసిడర్గా పనిచేయడానికి ముందు, ఆమె రాజకీయ వ్యవహారాల అండర్ సెక్రటరీకి ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్గా కొనసాగారు. 2009 నుంచి 2011 వరకు ఉత్తర ఐర్లాండ్లో అమెరికా కాన్సుల్ జనరల్గా ఆమె పనిచేశారు. 1991లో ఫారిన్ సర్వీస్లో చేరిన లఖ్దీర్.. సౌదీ అరేబియాలోని అమెరికా ఎంబసీలో మొదట పనిచేశారు. మారిటైమ్ ఆగ్నేయాసియా వ్యవహారాల కార్యాలయానికి డైరెక్టర్గా కూడా పనిచేశారు. ఆమె కెరీర్ ప్రారంభంలో, తూర్పు ఆసియా పసిఫిక్ వ్యవహారాల బ్యూరోలో తైవాన్ కోఆర్డినేషన్ స్టాఫ్కు డిప్యూటీ కోఆర్డినేటర్గా పనిచేశారు. భారతీయ తండ్రి, అమెరికన్ తల్లికి జన్మించిన లఖ్ధీర్.. హార్వర్డ్ కళాశాల నుంచి బీఏ, నేషనల్ వార్ కళాశాల నుంచి ఎమ్ఎస్ పట్టా పొందారు. చైనీస్, ఇండోనేషియాతో సహా పలు భాషలపై ఆమెకు పట్టు ఉంది. ఇదీ చదవండి: శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం.. భారత్తో సహా ఏడు దేశాలకు ఉచిత వీసాలు -
రష్యా, హమాస్ ఒక్కటే: బైడెన్
న్యూయార్క్: హమాస్, రష్యా ఒకటేనని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. ప్రపంచంలో ఉన్న ప్రజాస్వామ్య విధానాలను అంతం చేయాలని చూస్తున్నాయని ఆరోపించారు. యుద్ధంలో పోరాడుతున్న ఉక్రెయిన్, ఇజ్రాయెల్కు సహాయం చేయడానికి అమెరికా ముందుంటుందని చెప్పారు. హమాస్, పుతిన్ వేరువేరు బెదిరింపులకు పాల్పడుతారు.. కానీ వారిరువురి లక్ష్యం ఒకటేనని దుయ్యబట్టారు. ఈ మేరకు అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడారు. 'ప్రపంచ పెద్దగా విచ్చిన్నకర రాజకీయాలకు స్థానం ఇవ్వబోము. హమాస్, పుతిన్ వంటి ఉగ్రవాద సంబంధ శక్తులను గెలవనీయబోము. వారి లక్ష్యాలను ఎప్పటికీ నేను అంగీకరించను. ప్రపంచాన్ని అమెరికా ఐక్యంగా ఉంచుతుంది. మన భాగస్వాములే అమెరికాను సురక్షితంగా ఉంచుతారు. మన విలువలు ఇతర దేశాలతో కలిసి పనిచేసేలా ఉంటాయి.' అని బైడెన్ అన్నారు. ఉక్రెయిన్, ఇజ్రాయెల్కు సహాయం చేయడానికి నిధులను మంజూరు చేయాలని అమెరికా కాంగ్రెస్ను అభ్యర్థించారు. ప్రపంచ నాయకునిగా ఉండటానికి ఈ నిధులే పెట్టుబడులని అన్నారు. ప్రపంచానికి అమెరికానే దీపపు స్తంభం అని చెప్పారు. ఇజ్రాయెల్, పాలస్తీనాలో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పశ్చిమాసియాలో పర్యటించి వచ్చారు. కల్లోల పరిస్థితులను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. ప్రపంచ అగ్రనేతగా తన ప్రాబల్యాన్ని చూపుతూ అమెరికా ఎన్నికల్లో ప్రజల మనసుల్ని గెలుచుకునే ప్రయత్నంలో బైడెన్ ఉన్నారు. యుద్ధంలో పోరాడుతున్న ఉక్రెయిన్, ఇజ్రాయెల్లకు రూ.83,1,720 కోట్లు సహాయంగా ఇవ్వడానికి అమెరికా కాంగ్రెస్ను ఇప్పటికే అభ్యర్థించారు. హమాస్-ఇజ్రాయెల్ మధ్య భీకర పోరు నడుస్తోంది. ఇజ్రాయెల్లో నోవా పండుగ వేళ హమాస్ ఉగ్రవాదులు రాకెట్ దాడులు జరిపారు. ఇజ్రాయెల్ తిరగబడి ధీటుగా బదులిస్తోంది. గాజాను ఖాలీ చేయించాలనే లక్ష్యంతో ముందుకు వెళుతోంది. ఇరుపక్షాల వైపు దాడుల్లో ఇప్పటికే దాదాపు 5000 వేలకు పైగా మంది మరణించారు. యుద్ధంలో ఇజ్రాయెల్కు అమెరికా మద్దతునిస్తోంది. అటు.. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఏడాదిక్రితం నుంచి కొనసాగుతోంది. ఇదీ చదవండి: Israel-Hamas conflict: ఇజ్రాయెల్ ప్రతీకారేచ్ఛ -
అలా అయితే.. ఇజ్రాయెల్పై దాడి జరిగుండేది కాదు: ట్రంప్
జెరూసలెం: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ను మాజీ ఆధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శించారు. ఇజ్రాయెల్పై హమాస్ ఉగ్రవాదుల దాడులకు బైడెన్ బాధ్యత వహించాలంటూ దుయ్యబట్టారు. తాను అధ్యక్షునిగా పనిచేసిన కాలంలో ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకున్నట్లు చెప్పారు. న్యూ హాంప్షైర్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ట్రంప్ ఈ మేరకు మాట్లాడారు. 'అమెరికాకు ఎందరో వస్తుంటారు.. పోతుంటారు. ఆ డేటా మనదగ్గర ఉండదు. చాలా కేసుల్లో ఇలా మనదగ్గర ఉండి వెళ్లినవారే వివిధ దేశాల్లో దాడులు చేస్తుంటారు. ఇజ్రాయెల్లోనూ ఇలాంటివారే దాడులకు పాల్పడుతున్నారు. బైడెన్ అమెరికాకు ఏమీ ప్రయోజనం చేకూర్చే పనులు చేయలేదు. నేను అధ్యక్షునిగా ఉంటే.. ఇజ్రాయెల్పై దాడి జరిగి ఉండేది కాదు.' అని ట్రంప్ అన్నారు. ఇజ్రాయెల్పై దాడులు చేస్తున్న హమాస్ దళాలు.. పిల్లలను, మహిళలను దారుణంగా హింసిస్తున్నారని ట్రంప్ తెలిపారు. తాను ప్రధానిగా ఉన్న కాలంలో స్థిరమైన శాంతిని నెలకొల్పినట్లు వెల్లడించారు. పెద్దన్నగా మారణోమాలకు అమెరికా అడ్డుకట్ట వేసేదని తెలిపారు. "హమాస్ దాడులు అవమానకరం. ఈ దాడులను ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్ ఎంతో పోరాడుతోంది. పాపం, అమెరికన్ పన్ను చెల్లింపుదారుల డాలర్లు ఈ దాడులకు నిధులు సమకూర్చాయి. బైడెన్ అడ్మినిస్ట్రేషన్ నుంచి వచ్చిన అనేక నివేదికలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి. అమెరికా బలహీనమవుతుందని చెప్పడానికి ప్రస్తుత ఘటనలే నిదర్శనం" అని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ప్రకటనలో తెలిపారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో మృతుల సంఖ్య 1,200 దాటింది. హమాస్ మిలిటెంట్ల దాడిలో ఇజ్రాయెల్లో 700 మందికిపైగా బలయ్యారు. ఇజ్రాయెల్ సైన్యం ఎదురుదాడిలో గాజాలో 500 మందికిపైగా మరణించారు. ఇరువైపులా వేలాది మంది క్షతగాత్రులుగా మారారు. ఇజ్రాయెల్లో 130 మందికిపైగా పౌరులను బందీలుగా పట్టుకున్నామని, వారంతా తమ ఆధీనంలో ఉన్నారని హమాస్ ప్రకటించింది. ఇదీ చదవండి Israel–Palestinian conflict: గాజాపై నిప్పుల వర్షం -
భారత్- కెనడా వివాదం: అమెరికా ఎవరి వైపు..?
న్యూయార్క్: కెనడా-భారత్ మధ్య ప్రస్తుతం దౌత్యపరమైన వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్ ప్రమేయాన్ని అంటగడుతూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య ప్రతిష్టంభణకు కారణమైంది. అయితే.. ఈ వ్వవహారంలో అమెరికా ఎవరి పక్షాన ఉంది.? భారత్కూ మినహాయింపు లేదు..? భారత-కెనడా ప్రతిష్టంభణపై స్పందించిన అమెరికా.. ఇలాంటి వ్యవహారంలో ఏ దేశానికైనా ప్రత్యేక మినహాయింపులు ఉండవని తెల్చి చెప్పింది. ఈ అంశంలో భారత్కైనా మినహాయింపు ఉండదని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్ స్పష్టం చేశారు. కెనడా ఆరోపణలపై భారత్తో సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు. కెనడాతో విబేధాలు లేవు.. భారత్తో బంధాలను బలోపేతం చేసుకునే దిశలో అమెరికా ఉన్నందున కెనడా వైపు బలంగా మాట్లాడటంలేదని ఆరోపణలు వచ్చాయి. దీనిపై స్పందించిన జేక్ సుల్లివన్.. ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. అమెరికా దాని నియమ నిబంధనలకు ఎల్లప్పుడు కట్టుబడి ఉంటుంది. కెనడా ఆరోపణలపై అత్యున్నత స్థాయిలో ఇరుదేశాలతో చర్చిస్తున్నాము. ఈ అంశంపై అమెరికా నిష్పక్షపాతంగా ఉందని అన్నారు. ఇలాంటి అంశాల్లో భారత్కైనా మినహాయింపు ఉండదని చెప్పారు. ఇండియా కెనడా మధ్య చెలరేగిన ఖిలిస్థానీ ఉగ్రవాది హత్యకేసు వివాదంలో.. అమెరికా-కెనడా మధ్య దూరం పెరిగిందనే ఆరోపణలు అవాస్తవని సుల్లివాన్ తెలిపారు. ఇలాంటి ఆరోపణలు ఆందోళనలు కలిగిస్తున్నాయని అన్నారు. ఈ వ్యవహారంలో నిష్పక్షపాతంగా దర్యాప్తు జరగాలని అమెరికా కోరుకుంటున్నట్లు చెప్పారు. నేరస్థులు ఎవరైనా శిక్ష పాడాలని పేర్కొన్నారు. ఇదీ చదవండి: ప్రెసిడెన్షియల్ సూట్ వద్దన్నాడు.. విమానాన్ని కాదన్నాడు! -
అమెరికా అధ్యక్షులపై స్మార్ట్ గాడ్జెట్ల నిషేధం ఎందుకు?
అమెరికా అధ్యక్షులను ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వ్యక్తులుగా పరిగణిస్తారు. అటువంటిప్పుడు వారు తమకు నచ్చిన ఏదైనా గాడ్జెట్ను ఉపయోగించగలుగుతారని మనం అనుకుంటాం. కానీ ఇది నిజం కాదు. వారు నూతన సాంకేతికత పరికరాలకు దూరంగా ఉంటారు. వారు తమకు నచ్చిన ప్రతి గాడ్జెట్ను ఉపయోగించలేరు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హ్యాకర్లకు అధునాతన ఎలక్ట్రానిక్ పరికరాలే కీలక టార్గెట్ అని అమెరికన్ సెక్యూరిటీ ఏజెన్సీలు గాఢంగా నమ్ముతాయి. ఈ నేపధ్యంలోనే అమెరికా అధ్యక్షులు పరిమిత గాడ్జెట్లను మాత్రమే ఉపయోగించగలుగుతారు. ఒక అధికారి తెలిపిన వివరాల ప్రకారం బరాక్ ఒబామా అమెరికా అధ్యక్షుడైన తర్వాత తాను బ్లాక్బెర్రీని ఉపయోగించడానికి భద్రతా సలహాదారులతో చాలా కాలం పోరాడారు. చివరికి భద్రతా సలహాదారులు అధ్యక్షుడు ఒబామా బ్లాక్బెర్రీని వినియోగించేందుకు ఆమోదించారు. అయితే సీనియర్ ఉద్యోగులు, దగ్గరి స్నేహితులతో టచ్లో ఉండేందుకు మాత్రమే ఒబామా దీనిని వినియోగించాలనే షరతు విధించారు. 2010లో ఐప్యాడ్ మార్కెట్లోకి వచ్చినప్పుడు అధ్యక్షుడు బరాక్ ఒబామా దానిని తన వద్ద ఉంచుకోవాలని భావించారు. ఒబామా కోరిక మేరకు అమెరికా జాతీయ భద్రతా సలహాదారులు మరింత సురక్షితమైన ఐప్యాడ్ ‘ఒబామాప్యాడ్’ని రూపొందించారు. ఒబామాప్యాడ్ను అధ్యక్షుని వ్యక్తిగత సిబ్బందికి కూడా ఇచ్చారని సమాచారం. గతంలో వైట్ హౌస్లో వైఫై ఉండేది కాదు. దీంతో అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్హౌస్లో వైఫై ఇన్స్టాల్ చేయడం గురించి చర్చించారు. అయితే భద్రతా సలహాదారులు వైఫైని ఇన్స్టాల్ చేయడం భద్రతా ఉల్లంఘనను దారితీస్తుందని ఒబామాకు తెలిపారు. చివరకు అధికారులు బరాక్ ఒబామా పట్టుదలకు తలొగ్గవలసి వచ్చింది. ఎట్టకేలకు ఒబామా నివాసంలో వైఫైని ఏర్పాటు చేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పదవీకాలంలో ట్విట్టర్ను విరివిగా ఉపయోగించారు. అతను వ్యక్తిగత పనుల కోసం బర్నర్ ఫోన్లు వాడినట్లు సమాచారం. తర్వాత భద్రతా కారణాల దృష్ట్యా వాటిని తొలగించారు. ట్రంప్ కంప్యూటర్లు, ఈమెయిల్ వాడకంపై సందేహించేవారు. దీంతో ట్రంప్ కమ్యూనికేషన్ కోసం పేపర్ను వినియోగించేవారు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి చెందిన హెర్బర్ట్ లిన్ తెలిపిన వివరాల ప్రకారం హ్యాక్ చేయలేని స్మార్ట్ గాడ్జెలు చాలా అరుదుగా ఉన్నాయి. అయితే ఇవి కమ్యూనికేషన్లో సమస్యలను సృష్టిస్తుంటాయి. అమెరికా అధ్యక్షుని విషయానికొస్తే అతనికి రక్షణ అత్యంత అవసరం. అందుకే అతను ఏ స్మార్ట్ గాడ్జెట్ను ఉపయోగించకూడదు. అందుకే అమెరికా మాజీ అధ్యక్షులు అధ్యక్షులు బరాక్ ఒబామా, డొనాల్డ్ ట్రంప్ స్మార్ట్ గాడ్జెట్లకు దూరంగా ఉన్నారు. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ యాపిల్ న్యూస్ యాప్ వినియోగిస్తున్నారు. ఇది ఎప్పుడైనా సమస్యలను సృష్టించవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎవరికైనా స్మార్ట్ గాడ్జెట్లు అంత సురక్షితం కావని, వాటితో ఎప్పటికైనా ముప్పు తప్పదని నిపుణులు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: ‘హైదరాబాద్ హౌస్’ యజమాని ఎవరు? డబ్బును నీళ్లలా ఎందుకు ఖర్చు చేశారు? -
బైడెన్ డ్రైవర్ నిర్బంధం.. ఎందుకంటే..?
ఢిల్లీ: జీ20 సమావేశంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్ కారు డ్రైవర్ను సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. నిర్లక్ష్యంగా కారు డ్రైవింగ్ చేసినందుకు బైడెన్ కాన్వాయ్ నుంచి అతన్ని తొలగించారు. ప్రోటోకాల్కు విరుద్ధంగా కారును నడిపినందుకు సిబ్బంది అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అధ్యక్షుడు బైడెన్ కాన్వాయ్లో ఓ కారు డ్రైవర్ తన కారును యూఏఈ అధ్యక్షుడు నివాసముండే తాజ్ హోటల్కు తీసుకువెళ్లాడు. ఈ విషయాన్ని గమనించిన సెక్యూరిటీ విభాగం అధికారులకు సమాచారం అందించారు. ఆ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. తాను ఉదయం 9:30కి బైడెన్ నివాసముండే మౌర్య హోటల్కు వెళ్లాల్సి ఉందని డ్రైవర్ చెప్పాడు. ఈ క్రమంలో లోధి ఎస్టేట్ వద్ద నుంచి ఓ బిజినెస్ మ్యాన్ను తాజ్ వద్ద దించాల్సి వచ్చిందని చెప్పాడు. తనకు ప్రోటోకాల్స్ గురించి తెలియదని చెప్పాడు. దీంతో ఆ డ్రైవర్ను వదిలేశారు. జీ20 మీటింగ్కు హాజరవడానికి అమెరికా అధ్యక్షుడు బైడెన్ శుక్రవారం ఢిల్లీ వచ్చారు. శనివారం ఉదయం నుంచి ప్రారంభమైన సమావేశాల్లో పాల్గొన్నారు. అనంతరం శనివారం రాత్రి డిన్నర్ మీటింగ్కి హజరయ్యారు. ఈ రోజు ఉదయం రాజ్ఘాట్ వద్ద మహాత్మాగాంధీ సమాధి వద్ద నివాళులు అర్పించారు. కొద్ది క్షణాల ముందే ఢిల్లీ నుంచి తిరుగుప్రయాణమయ్యారు. ఇటు నుంచి నేరుగా వియత్నాంకు బయలుదేరారు. ఇదీ చదవండి: ఢిల్లీ డిక్లరేషన్ వెనక షేర్పాల కఠోర శ్రమ -
G20 Summit 2023: శిఖరాగ్ర భేటీకి శ్రీకారం
న్యూఢిల్లీ: అద్భుతమైన ప్రపంచ ఆర్థికాభివృద్ధి సాధనే పరమావధిగా సాగే జీ20 అగ్రరాజ్యాల కూటమి సమావేశానికి హస్తిన సర్వాంగ సుందరంగా ముస్తాబై సభ్య దేశాల అధినేతలకు సాదర స్వాగతం పలుకుతోంది. అమెరికా అధ్యక్షుడు బైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తదితర ప్రపంచ దేశాల ఆగమనంతో జీ20 శిఖరాగ్ర సదస్సు హడావిడి మరింత పెరిగింది. శనివారం సైతం మరికొందరు నేతలు విచ్చేస్తున్నారు. శుక్రవారం ఢిల్లీలో అడుగుపెట్టగానే బైడెన్తో మోదీ విస్తృతస్థాయి ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ప్రపంచ శ్రేయస్సుకు పాటుపడతామని ప్రకటించారు. మానవ కేంద్రిత, సమ్మిళిత అభివృద్ధి దిశగా సదస్సు కొత్త బాటలుపరుస్తుందని ప్రధాని మోదీ విశ్వాసం ప్రకటించారు. మరోవైపు ఢిల్లీ డిక్లరేషన్ దాదాపు సిద్ధమైందని, ఏకాభిప్రాయం సాధిస్తామని భారత్ ధీమా వ్యక్తంచేసింది. 9, 10 తేదీల్లో (శని, ఆదివారాల్లో) జరిగే సదస్సుకు హాజరయ్యే నేతల రాక, సాదర స్వాగతం, అతిథులకు ఆతిథ్యంతో ఢిల్లీలో కోలాహలం పెరిగింది. పసందైన వంటకాలు, భిన్న సంప్రదాయ వాయిద్యాలతో సంగీత విభావరి ఇలా పలు రకాల కార్యక్రమాలు, ప్రదర్శనలతో అధినేతలకు మరెప్పుడూ మరిచిపోలేని రీతిలో అద్భుతంగా అతిథ్యం ఇవ్వనున్నారు. వాతావరణ మార్పులు, ఉక్రెయిన్–రష్యా యుద్ధం, ఆర్థిక అనిశి్చతి, మాంద్యం భయాలు వంటి కీలక అంశాలతో చర్చలు శిఖరాగ్రానికి చేరుకోనున్నాయి. ఎలాగైనా సరే సదస్సు ముగిసేనాటికి అందరి ఏకాభిప్రాయంతో సంయుక్త ప్రకటన విడుదల చేసేందుకు భారత్ శాయశక్తులా కృషిచేస్తోంది. నేడు మొదలయ్యే ఈ చర్చా సమరంలో నేతలు చివరకు ఎలాంటి వాగ్దానాలు చేస్తారో, ఏమేం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూద్దాం..!! దుర్భేద్యమైన భద్రత ముఖ్యనేతలంతా ఢిల్లీకి వచ్చేస్తున్న నేపథ్యంలో కనీవినీ ఎరుగని రీతిలో ఢిల్లీలో భద్రతా బలగాలను మొహరించారు. చర్చలకు ప్రధాన వేదిక అయిన ‘భారత్ మండపం’ కాంప్లెక్స్ వద్ద భద్రతను పోలీసులు, పారామిలటరీ, నిఘా వర్గాలతో కట్టుదిట్టం చేశారు. తొలిసారిగా ఇండియా ఈ సదస్సును నిర్వహిస్తుండటంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా చేసేందుకు ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సదస్సు వివరాలను జీ20లో భారత షెర్పా అమితాబ్ కాంత్ శుక్రవారం ఢిల్లీలో వివరించారు. ‘ మన న్యూఢిల్లీ డిక్లరేషన్ దాదాపు సిద్ధం. దానిని ఇప్పుడు బహిర్గతం చేయలేం. ఎందుకంటే డిక్లరేషన్ తాలూకు ప్రతిపాదలను అధినేతలకు సమరి్పస్తాం. వారి సూచనలు, సవరణల తర్వాతే దానికి ఆమోదం లభిస్తుంది. ఆ తర్వాతే డిక్లరేషన్ ద్వారా సాధించబోయే విజయాలను వివరిస్తాం’ అని అమితాబ్ చెప్పారు. ‘ ఐక్యరాజ్యసమితి తర్వాత అత్యంత క్రియాశీలకమైన కూటమిగా ఉన్న ఆఫ్రికన్ యూనియన్ను జీ20లో చేర్చుకునేందుకు దాదాపు అందరినీ ఒప్పించడం భారతదేశ నిబద్ధతకు నిదర్శనం’ అని విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్ మోహన్ క్వాత్రా చెప్పారు. ఆఫ్రికన్ యూనియన్ ఆగమనం మాకు సంతోషదాయకమే అని యురోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు చార్లెస్ మైఖేల్ అన్నారు. ఆఫ్రికన్ యూనియన్లో మొత్తంగా 55 దేశాలు సభ్యులుగా ఉన్నాయి. నేటి ప్రపంచానికి సరిపోయే నినాదమిది మహా ఉపనిషత్తు నుంచి స్ఫూర్తి పొంది రూపొందించిన ‘ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు ఇతివృత్తం’ నేటి ప్రపంచానికి సరిపోయే నినాదమని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ అన్నారు. కాగా, చర్చల్లో రష్యా–ఉక్రెయిన్ యుద్ధాన్ని ప్రధానంగా ప్రస్తావించి చర్చించాలని బ్రిటన్ భావిస్తోంది. దీంతో ఈ చర్చలో భారత్ పాత్ర కీలకంగా మారనుంది. ‘ ఉక్రెయిన్లో రష్యా దురాక్రమణ, మానవ హక్కుల హననంపై ఇండియా తన నిర్ణయం వెలువరచాలని చర్చలో పట్టుబడతాం. మోదీతో, ఇతరులతో భేటీలను పుతిన్ దారుణ అకృత్యాలను ఆపేందుకు సాధనాలుగా వినియోగిస్తాం’ అని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ అధికార ప్రతినిధి చెప్పారు. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో కూటమి సభ్య దేశాల మధ్య భేదాభిప్రాయాలున్నా ఏకాభిప్రాయానికి ప్రయతి్నస్తామని యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు చార్లెస్ చెప్పారు. కాగా, భారత్ తమకు వ్యతిరేకంగా జీ20 వేదికగా ప్రకటన చేయాలని జీ7 దేశాలు ఒత్తిడి చేస్తున్నాయని రష్యా విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో ఆరోపించింది. డిజిటల్ మౌలిక వసతులు, వాతావరణ సంబంధ నిధులు, సుస్థిరాభివృద్ధి, శుద్ధ ఇంథనం వంటి అంశాల్లో జీ20 వేదికగా సానుకూల నిర్ణయాలు వెలువడతాయని అంతర్జాతీయ విశ్లేషకులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. గత ఏడాది డిసెంబర్ ఒకటో తేదీన కూటమి సారథ్య బాధ్యతల్ని భుజానికి ఎత్తుకున్న భారత్ అప్పట్నుంచీ దేశవ్యాప్తంగా భిన్న నగరాలు, వేదికలపై 200 సమావేశాలను నిర్వహించింది. ప్రపంచ జీడీపీలో 85 శాతం, ప్రపంచ వాణిజ్యంలో 75 శాతం, ప్రపంచ జనాభాలో మూడింట రెండు వంతుల జనసంఖ్య జీ20 దేశాల్లోనే ఉంది. అందుకే ఈ సదస్సులో తీసుకునే నిర్ణయాలు పెను ప్రభావం చూపిస్తాయి. సంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం జీ20 శిఖరాగ్రంలో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ తదితరులు శుక్రవారం ఢిల్లీకి చేరుకున్నారు. సంప్రదాయ నృత్యాల నడుమ వీరికి ఘనస్వాగతం లభించింది. ఈ సందర్భంగా అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) చీఫ్ క్రిస్టలినా జార్జియెవా విమానాశ్రయంలో డ్యాన్స్ చేశారు. భారతీయ సంస్కృతిపై క్రిస్టలినా చూపిన మక్కువను ప్రధాని మోదీ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రశంసించారు. వచ్చే రెండు రోజుల్లో వివిధ దేశాల నేతలతో ఫలప్రదమైన చర్చలు జరిపేందుకు ఆసక్తితో ఉన్నట్లు ఆయన తెలిపారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ శుక్రవారం భారత్కు వచ్చారు. ఆయన సతీమణి జిల్ బైడెన్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. బైడెన్కు చేసిన రెండు పరీక్షల్లోనూ నెగెటివ్గా రావడం పర్యటనను ఖరారు చేసుకున్నారు. ఇటలీ ప్రధాని జియోర్జియా మెలోనీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాలకు విమానాశ్రయంలో కేంద్ర మంత్రులు శోభా కరంద్లాజే, దర్శనా జర్దోష్ స్వాగతం పలికారు. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్కు కేంద్ర మంత్రి అశ్వినీ చౌబే, అర్జెంటినా అధ్యక్షుడు అల్బెర్టో ఫెర్నాండెజ్కు కేంద్ర మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే స్వాగతం పలికారు. కొమరోస్ అధ్యక్షుడు, ఆఫ్రికన్ యూనియన్ చైర్ పర్సన్ కూడా అయిన అజలి అస్సౌమనీ, రష్యా విదేశాంగ మంత్రి లావ్రోవ్, ఒమన్ డిప్యూటీ ప్రధాని సయ్యిద్ ఫహద్, ఈజిప్టు అధ్యక్షుడు ఫతా ఎల్–సిసి, దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్, ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్, యూఏఈ ప్రెసిడెంట్ అల్ నహ్యాన్లకు కూడా ఘన స్వాగతం లభించింది. ఐరాస సెక్రటరీ జనరల్ గుటెర్రస్కు అధికారులు స్వాగతం పలికారు. జీ20(గ్రూఫ్ ఆఫ్ 20)లో అర్జెంటినా, ఆ్రస్టేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇండోనేసియా, ఇటలీ, జపాన్, దక్షిణ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, తుర్కియే, యూకే, అమెరికా, యూరోపియన్ యూనియన్(ఈయూ)సభ్యులన్న విషయం తెలిసిందే. బ్రిటిష్ కౌన్సిల్ విద్యార్థులతో సునాక్ ముఖాముఖి శుక్రవారం యూకే ప్రధాని రిషి సునాక్ ఢిల్లీలోని బ్రిటిష్ కౌన్సిల్కు వెళ్లి సిబ్బంది, విద్యార్థులతో ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఎక్స్లో పోస్ట్ చేశారు. -
రేపు ఢిల్లీకి అగ్ర దేశాల నేతలు..
ఢిల్లీ: జీ20 సమావేశానికి హాజరుకావడానికి అగ్ర దేశాల నేతలు రేపు ఢిల్లీకి చేరుకోనున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునక్, కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో తదితరులకు రెండు రోజుల పాటు దేశ రాజధానిలో అతిథ్యం ఇవ్వనున్నారు. భారత్ మండపం కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించే జీ20 కార్యక్రమంలో ఆర్థిక వ్యవస్థ, పర్యావరణం, సుస్థిర అభివృద్ధి వంటి కీలక అంశాలపై చర్చిస్తారు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గైర్హాజరు కానున్న విషయం తెలిసిందే. రిషి సునాక్.. బ్రిటన్కు చెందిన తొలి భారత సంతతి ప్రధానమంత్రి రిషి సునక్ సెప్టెంబర్ 8న శుక్రవారం మధ్యాహ్నం 1.40 గంటలకు ఢిల్లీకి చేరుకుంటారు. కేంద్ర సహాయ మంత్రి అశ్విని కుమార్ చౌబే ఆయనకు స్వాగతం పలుకుతారు. ఢిల్లీలోని షాంగ్రిలా హోటల్లో రిషి సునాక్కు బస ఏర్పాట్లు చేశారు. జో బైడెన్.. శుక్రవారం సాయంత్రం 6.55 గంటలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఢిల్లీ చేరుకుంటారు. ఆయనకు కేంద్ర సహాయ మంత్రి VK సింగ్ స్వాగతం పలుకుతారు. జో బైడెన్కు ఢిల్లీలోని ఐటీసీ మౌర్యలో బస ఏర్పాట్లు చేశారు. బైడెన్ భార్య జిల్ బైడెన్కు కరోనా పాజిటివ్ రావడంతో ఆయన జీ20 సమావేశాలకు హాజరవుతారా..? లేదా అనే అంశంపై సందిగ్ధం నెలకొంది. కానీ బైడెన్కు కరోనా నెగటివ్ రావడంతో ఆయన భారత్కు రానున్నారు. జస్టిన్ ట్రూడో.. కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో రేపు సాయంత్రం 7 గంటలకు భారత్కు చేరుకుంటారు. కేంద్ర సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఆయనకు ఆహ్వానం పలుకుతారు. ట్రూడో ఢిల్లీలోని లలిత్ హోటల్లో బస చేస్తారు. కెనడాలో ఈ మధ్య ఖలిస్థానీ ఉగ్రవాదం పెరిగిపోతున్న నేపథ్యంలో ఆయన భారత్కు రావడం ప్రధాన్యత సంతరించుకుంది. జపాన్ ప్రధాని జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా రేపు భారత్కు వస్తారు. మధ్యాహ్నం 2.15 గంటలకు పాలం ఎయిర్ఫోర్స్ స్టేషన్లో దిగుతారు. ఆయనకు కేంద్ర సహాయ మంత్రి అశ్విని కుమార్ చౌబే ఆహ్వానం పలుకుతారు. కిషిదా భారత్కు రావడం ఇది రెండోసారి. ఈ ఏడాది మార్చిలో భారత్లో రెండు రోజుల పర్యటనకు వచ్చిన ఆయన.. ప్రధాని మోదీతో సమావేశమై భారత్-జపాన్ సంబంధాలను బలోపేతం చేయడంపై చర్చించారు. ఇదీ చదవండి: Sanathana Dharma Row: అందుకే దేవాలయానికి వెళ్లలేదు.. సిద్ధరామయ్య వివాదాస్పద వ్యాఖ్యలు.. -
అమెరికా అధ్యక్షుని భార్యకు కరోనా.. బైడెన్ జీ20 పర్యటనపై సందిగ్ధత..
న్యూయార్క్: అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్కు కరోనా సోకింది. తేలిపాటి లక్షణాలు ఉన్నందున ఆమెకు సోమవారం కోవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు వైట్ హౌస్ తెలిపింది. దీంతో కొవిడ్ పాజిటివ్గా తేలినట్లు స్పష్టం చేసింది. ప్రెసిడెంట్ జో బైడెన్కు మాత్రం నెగెటివ్గా తేలినట్లు స్పష్టం చేసింది. 72 ఏళ్ల జిల్ బైడెన్కు తేలికపాటి లక్షణాలు మాత్రమే ఉన్నాయని, డెలావేర్లోని రెహోబోత్ బీచ్లో ఉన్న ఇంట్లోనే ఐసోలేషన్లో ఉంటారని అధికారులు తెలిపారు. జిల్ బైడెన్కు చివరిసారిగా ఏడాది క్రితం కరోనా సోకింది. US First Lady Jill Biden tests positive for COVID-19, Joe Biden tested negative Read @ANI Story | https://t.co/hCowKoUNam#US #JillBiden #JoeBiden #COVID19 pic.twitter.com/xyL5TXssUF — ANI Digital (@ani_digital) September 5, 2023 అధ్యక్షుడు బైడెన్(80)కు నిత్యం పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు వెల్లడించారు. అమెరికాలో ఇటీవల కరోనా కేసులు పెరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వ్యాపిస్తున్న కోవిడ్-19 BA 2.86 కొత్త వేరియంట్ అని వైద్యులు పేర్కొన్నారు. ఈ వేరియంట్ చాలా ఎక్కువ ప్రమాదాన్ని కలిగిస్తుందని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది. భారత్లో జీ 20 సమావేశాలుకు సెప్టెంబర్ 9న ప్రపంచ దేశాల నేతలు ఢిల్లీకి రానున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా ఈ సమావేశానికి హాజరుకావాల్సి ఉంది. కానీ ప్రస్తుతం ఆయన భార్య జిల్ బైడెన్కు కరోనా సోకడంతో పర్యటనపై అనుమానాలు నెలకొన్నాయి. అయితే.. బైడెన్ పర్యటన సందిగ్ధతపై వైట్ హౌజ్ మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటనను వెల్లడించలేదు. ఇదీ చదవండి: సర్ఫింగ్ ఆటలో ట్రంప్ కూతురు.. అలలపై ఇవాంక ఆటలు.. -
‘ఆరోపణలతో మరింత ఆదరణ’.. ట్రంప్ వింత వ్యాఖ్యానం!
వచ్చే ఏడాది(2024) నవంబర్లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనుండగా, ఇప్పటి నుంచే ఎన్నికల ప్రచార హోరు ఊపందుకుంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ గత ఫిబ్రవరిలో జరిగిన డెమొక్రాటిక్ పార్టీ సమావేశంలో రెండవసారి అధ్యక్షుడిగా తన అభ్యర్థిత్వానికి మద్దతునివ్వాలని పార్టీ సభ్యులను కోరారు. మరోవైపు, డొనాల్డ్ ట్రంప్ కూడా ప్రచార వేగం కొనసాగించాలని తన మద్దతుదారులకు సూచించారు. కాగా ట్రంప్ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి అవుతారని, రిపబ్లికన్ల తరపున పోటీచేస్తే ఎన్నికల్లో ఓడిపోతారని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. పెరుగుతున్న ఆరోపణలపై ట్రంప్ వ్యంగ్యం తనపై వస్తున్న ఆరోపణల సంఖ్య పెరుగుతుండడంతో అందుకు అనుగుణంగా తన పాపులారిటీ కూడా పెరుగుతోందని, ఇది ఎన్నికల ప్రచారానికి ఎంతగానో దోహదపడుతుందని డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. అతని మద్దతుదారులు కూడా ట్రంప్ వ్యాఖ్యలకు వంతపాడుతున్నారని సమాచారం. వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే తనకు కావాల్సింది ఒక్క ఆరోపణ మాత్రమేనని ట్రంప్ వ్యంగ్య ధోరణిలో వ్యాఖ్యానించారు. అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ల నుంచి అభ్యర్థిత్వానికి తాను ముందున్నానని, తనపై క్రిమినల్ కేసుల ఫలితం ఎలా ఉన్నా రేసులో ఉంటానని ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. ‘ఆరోపణలతో ప్రచారానికి ఉత్సాహం’ తనపై ఏవైనా ఆరోపణలు వచ్చినప్పుడు, తన ఎన్నికల ప్రచారం మరింత వేగంగా ముందుకు సాగుతుందని ట్రంప్ పేర్కొన్నారు. ఎన్నికల్లో గెలవాలంటే తనకు ఆరోపణలు అవసరమని సరదాగా అన్నారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలేవీ చెల్లవని, సరైనవి కాదని ట్రంప్ మరోమారు చెప్పారు. తనపై వచ్చిన ఆరోపణలు ప్రత్యర్థుల నిరాశ నుంచి వచ్చినవేనని అన్నారు. డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్లో ప్రత్యర్థులను ఉద్దేశిస్తూ.. ‘మీరు నన్ను వెంబడిస్తే.. నేను కూడా మిమ్మల్ని వెంబడిస్తాను’ అని వ్యాఖ్యానించారు. అమెరికాలో ప్రతి నాలుగేళ్లకు ఒకసారి అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతాయి. 2020లో జరిగిన ఎన్నికల్లో జో బైడెన్ విజేతగా నిలిచారు. అయితే ఈ ఎన్నికలు నిస్పక్షపాతంగా జరగలేదంటూ డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు పలు విమర్శలు చేశారు. అనంతరం అమెరికాలోని కాపిటల్ హిల్పై వారు దాడి చేశారు. ఇటువంటి ఎదురుదాడుల మధ్య 2020, జనవరి 20 న జో బైడెన్ నూతన అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇది కూడా చదవండి: ముస్లిం గాయకుడు భజన కీర్తన పాడాడని... ఇంతకన్నా ఘోరం ఎక్కడైనా ఉంటుందా? -
అమెరికా అధ్యక్షుడికి అతి పెద్ద కష్టం
కొంతకాలం క్రితం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ఎయిర్ ఫోర్స్ వన్ విమానం మెట్లు ఎక్కుతూ జారిపడ్డారు. ఈ విధంగా మూడుసార్లు పడిపోయారు. తరువాత రెయిలింగ్ను పట్టుకుని లేచి విమానంలోకి ఎలాగోలా ఎక్కేశారు. గత నెలలో జరిగిన గ్రాడ్యుయేషన్ వేడుకలోనూ ఇలానే జరిగింది. అయితే బైడెన్ ఇలా పడిపోవడం ఆయకు పలు సమస్యలు తెచ్చిపెడుతోంది. దీనిని నివారించేందుకు ఆయన షార్టర్ స్టెయిర్కేస్ వినియోగించడం రెండితలయ్యిందని ఒక నివేదిక వెల్లడించింది. బైడెన్కు వైట్ హౌస్ రాయితీలు? దీనిని చూస్తుంటే 80 ఏళ్ల బైడెన్కు వైట్ హౌస్ రాయితీలు కల్పిస్తున్నట్లున్నదనే విమర్శలు వస్తున్నాయి. బైడెన్ అధ్యక్ష ఎన్నికల్లో రెండవసారి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇటువంటి తడబాటు మరోమారు జరగకుండా వైట్హౌస్ అధికారులు జాగ్రత్తపడుతున్నట్లు సమాచారం. కొలరాడోలోని వైమానిక దళ అకాడమీ ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు బైడెన్ ఎయిర్ఫోర్స్ వన్లో ప్రవేశించడానికి షార్టర్ స్టెయిర్కేస్ మరోమారు ఉపయోగించారు. గత ఏడు వారాల్లో బైడెన్ 84 శాతం మేరకు షార్టర్ స్టెయిర్కేస్ వినియోగించారు. బైడెన్ విమానం ఎక్కినప్పుడు, దిగినప్పుడు 37 సార్లు షార్టర్ స్టెయిర్కేస్ ఉపయోగించారని నివేదిక పేర్కొంది. ఒక విశ్లేషణ ప్రకారం అధ్యక్షుడు బైడెన్ ఎయిర్ ఫోర్స్ వన్లో మరొకసారి స్లిప్ కాకుండా ఉండేందుకు తరచుగా షార్టర్ స్టెయిర్కేస్ ఉపయోగిస్తున్నారు. పరిస్థితులకు అనుగుణంగా.. గత జూన్లో జరిగిన వైమానిక దళ అకాడమీ ప్రారంభోత్సవ వేడుకలో పాల్గొన్న బైడెన్ బిడెన్ వేదికపై పడిపోయిన అనంతరం ఆయన షార్టర్ స్టెయిర్కేస్ వినియోగించడం మరింత పెరిగింది. గత ఏడు వారాల్లో బైడెన్ 84 శాతం మేరకు షార్టర్ స్టెయిర్కేస్ను ఉపయోగించారు. కాగా దీనిపై వ్యాఖ్యానించేందుకు వైట్ హౌస్ అధికారులు నిరాకరించారు. అయితే బైడెన్ సహాయకుడొకరు మాట్లాడుతూ ఈ నిర్ణయం పరిస్థితులకు అనుగుణంగా తీసుకున్నదన్నారు. హిల్లరీ క్లింటన్ మద్దతు మాజీ డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ క్లింటన్ కూడా 2024లో బైడెన్ ఎన్నికల్లో పాల్గొనేందుకు అతని వయస్సు ఒక సమస్య అని పేర్కొన్నారు. ఇది ఆందోళన కలిగించే అంశమేనని అన్నారు. అయితే అధ్యక్ష ఎన్నికల్లో పోటీకీ అతనే సరైనవాడని భావిస్తున్నానని తెలిపారు. బైడెన్కు వ్యతిరేకంగా కానీ ప్రత్యామ్నాయంగా గానీ ముందుకు వెళ్లాలనుకోవడంలేదని, తాను బైడెన్ శిబిరానికి చెందిన వ్యక్తినని హిల్లరీ క్లింటన్ అన్నారు. ఇది కూడా చదవండి: ఫోన్ ఎత్తుకెళ్లిన దొంగతో ప్రేమలో పడింది -
బైడెన్పై అభిశంసనకు సిద్ధమైన రిపబ్లికన్లు
అమెరికా అధ్యక్షుడు జోబైడెన్పై రిపబ్లికన్లు అభిశంసన తీర్మానానికి సిద్ధమయ్యారు. అంతర్జాతీయ లంచం కేసులో అతని ప్రమేయాన్ని వివరించే ఎఫ్బిఐ పత్రాలు బయటకు వచ్చిన నేపధ్యంలో బైడెన్పై అభిశంసనకు పూనుకున్నారు. ‘వైట్ హౌస్లో ఉంటున్న అవినీతి కుటుంబం’ సెనేటర్ చక్ గ్రాస్లీ ఎఫ్డీ-1023 ఫారమ్ను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దానిలో బైడెన్, అతని కుమారుడు హంటర్ తాము చేసిన సహాయానికి బదులుగా కైవ్కు చెందిన బురిస్మా హోల్డింగ్స్ సీఈఓను మిలియన్ల డాలర్లు చెల్లించాలని ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపించారు. ప్రతినిధి జిమ్ బ్యాంక్స్ ట్విట్టర్లో ఈ పత్రాలను తిరిగి పోస్ట్ చేస్తూ, వైట్ హౌస్లో ఉంటున్న అత్యంత అవినీతి కుటుంబం అని ఆరోపించారు. వీరి అవినీతి ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవాలంటే దీనిని చదివి తెలుసుకోండి. బైడెన్ను వెంటనే పదవి నుండి తొలగించాలని అతను కోరారు. ‘బైడెన్ నేరాలకు రుజువులున్నాయి’ గ్రాండ్ ఓల్డ్ పార్టీకి చెందిన ఇతర నాయకులు ఈ అభిశంసనకు వంతపాడారు. 80 ఏళ్ల అధ్యక్షుడిని గద్దె దించాలని డిమాండ్ చేశారు. బైడెన్ ఉక్రెయిన్లో జరుగుతున్న యుద్ధంలో అమెరికా తరపున పాల్గొన్నారు. బైడెన్ ఒక నేరస్తుడు. అతను మనల్ని డబ్బ్యుడబ్ల్యు3లోకి నడిపిస్తున్నాడు. ఎందుకంటే ఉక్రేనియన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో పాటు బైడెన్లు చేసిన నేరాలకు రుజువు ఉందంటూ ప్రతినిధి మార్జోరీ టేలర్ గ్రీన్ ఆరోపించారు. ఈ విషయంలో రిపబ్లికన్లు ఇక జాప్యం చేయలేరు. ఇందుకోసం మాకు 218 రిపబ్లికన్ ఓట్లు అవసరం. నేను మొదటి రోజు నుండి ఇదే మాటపై ఉన్నాను. అమెరికన్ ప్రజలు కూడా ఇదే అభిప్రాయంలో ఉన్నారని ఆమె పేర్కొన్నారు. మరో ప్రతినిధి ఆండీ బార్ ఇలా రాశారు.. బైడెన్ రాజీ పడ్డాడనడానికి ఇది అసలైన సాక్ష్యం. బైడెన్ కుటుంబం అవినీతిలో కూరుకుపోయిందని పేర్కొన్నారు. ‘అవి నిరాధార ఆరోపణలు’ వైట్ హౌస్ అధికారులు రిపబ్లికన్ పార్టీ సభ్యులు చేసిన ఆరోపణలను తప్పుబట్టారు. ఆ పత్రాలు నిజానిజాలతో సంబంధం లేకుండా ప్రచురితమయ్యాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ రిపబ్లికన్లు నిజానిజాలతో సంబంధం లేకుండా అధ్యక్షుడు బైడన్పై ఆరోపణలు చేయడం సరైనది కాదన్నారు. ఇది కూడా చదవండి: స్కూలుకు లేదు డుమ్మా.. 50 దేశాలు చుట్టొచ్చిందమ్మా..! 🚨BREAKING🚨 The FD-1023 form alleging then-Vice President JOE BIDEN was involved in a $5,000,000 bribery scheme with a Burisma executive has been released by @ChuckGrassley. Read 👇 pic.twitter.com/Mc6dVIwdsG — Oversight Committee (@GOPoversight) July 20, 2023 -
బయటకు కనిపించే బైడెన్ లోపల వేరు.. కేకలేస్తాడు
అగ్రరాజ్యం అమెరికాలో జరిగే పరిణామాల గురించి తెలుసుకోవాలని ప్రతీదేశానికి ఎంతో ఆసక్తి ఉంటుంది. అలాగే అధ్యక్షుడు బైడెన్ పనితీరు గురించి తెలుసుకోవాలని కూడా పలువురు అనుకుంటారు. అయితే బయటకు ఎంతో ప్రశాంతంగా కనిపించే బైడెన్ లోపల మరో విధంగా ఉంటారని అని సన్నిహితులు చెబుతుంటారు. బైడెన్ వైట్హౌస్లోని గది తలుపులు మూసివేసి, తన సహాయకులపై కోపాన్ని ప్రదర్శిస్తారని పలువురు చెబుతుంటారు. వైట్ హౌస్ సిబ్బందిని తిట్టడంలో బైడెన్ ముందుంటారని ఒక తాజా నివేదిక తెలియజేస్తోంది. ‘ఎవరూ సురక్షితంగా లేరు’: సీనియర్ అధికారి గతంలోనూ, ప్రస్తుతం బైడెన్కు సహాయకులుగా పనిచేస్తున్న ఒక సీనియర్ ‘ఆక్సియోస్’ సంస్థతో మాట్లాడుతూ తనను తరచూ బైడెన్ నిందిస్తుంటారని ఆరోపించారు. ఇక్కడున్న కొంతమంది అధ్యక్షుడి కోపానికి భయపడుతున్నారని, అతని భాషను భరించలేక, తమకు కవచంగా వారు సహోద్యోగులను సమావేశాలకు తీసుకువెళుతుంటారని చెప్పారు. ఇక్కడి ఉద్యోగులు ‘ఎవరూ సురక్షితంగా లేరు’ అని ఒక సీనియర్ అధికారి తెలిపారు. గతంలో ఒమిక్రాన్ వేరియంట్ కోసం టెస్టింగ్ కిట్ రోల్అవుట్ చేసే విషయంలో 2021 చివరిలో బైడెన్ అప్పటి కోవిడ్ నియంత్రణ అధికారి, ప్రస్తుత వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జెఫ్ జియంట్స్పై విపరీతమైన కోపం ప్రదర్శించారన్నారు. ఇతరులను సవాలు చేయడం ద్వారా.. బైడెన్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ టెడ్ కౌఫ్మన్ అవుట్లెట్ సంస్థతో మాట్లాడుతూ బైడెన్ తన సిబ్బంది ఇబ్బంది పెట్టడానికి ఇలా చేయరని, సరైన నిర్ణయం తీసుకునే దిశగా అలా ప్రవర్తిస్తారన్నారు. ఇతరులను సవాలు చేయడం ద్వారా మంచి నిర్ణయం తీసుకోవచ్చని బైడెన్ భావిస్తారని తెలిపారు. కాగా బైడెన్కు టెంపర్ ఉందనడంలో సందేహం లేదని ‘ది ఫైట్ ఆఫ్ హిజ్ లైఫ్: ఇన్సైడ్ జో బైడెన్స్ వైట్ హౌస్’ రచయిత క్రిస్ విప్ల్ పేర్కొన్నారు. అయితే ఇది బిల్ క్లింటన్ మాదిరిగా అగ్నిపర్వతం కాకపోవచ్చు, కానీ బైడెన్కు ఖచ్చితంగా టెంపర్ ఉందన్నారు. బైడెన్ ‘అహంకార నిరంకుశుడు’ కౌఫ్మన్ మాజీ చీఫ్ ఆఫ్ స్టాఫ్, బైడెన్ మాజీ ప్రచార సహాయకుడు జెఫ్ కన్నాటన్ మాట్లాడుతూ అధ్యక్షుడిని ‘అహంకార నిరంకుశుడు’గా అభివర్ణించారు. అతను తన 2012 నాటి పుస్తకం ‘ది పేఆఫ్: వై వాల్ స్ట్రీట్ విన్స్’ లో ‘భయంతో తన సిబ్బందిని అదుపులో ఉంచాలని బైడెన్ నిర్ణయించుకున్నాడు’ అని పేర్కొన్నారు. బైడెన్ తన 2008 అధ్యక్ష ఎన్నికల ప్రచారం సందర్భంగా ఒక సహాయకుడు నిధుల సేకరణ కాల్లు చేయడానికి సమయం ఆసన్నమైందని అనడంతో అతనితో ‘కారు నుండి బయటకు వెళ్లండి’ అని బైడెన్ అరిచారని కన్నాటన్ తన పుస్తకంలో పేర్కొన్నారు. దీనిపై వైట్హౌస్ తక్షణమే స్పందించలేదని తెలిపారు. ఇది కూడా చదవండి: పేదరికంపై భారత్ విజయం! ‘అది నాయకత్వం చిహ్నమా?’ బైడెన్ తన చివరి దశలో చిత్తవైకల్యంతో బాధపడుతున్నట్లుందని మాజీ అధ్యక్షుడు ట్రంప్ కుమారుడు జూనియర్ ట్రంప్ ట్విట్టర్లో స్నిప్ చేశారు. బైడెన్ మంచి వ్యక్తి అని పేర్కొనడం నిజంగా ఆశ్చర్యకరంగా ఉందని ప్రో-రాన్ డిసాంటిస్ సూపర్ పీఏసీ జాతీయ ప్రతినిధి స్టీవ్ కోర్టెస్ పేర్కొన్నారు. బైడెన్ అవినీతిపరుడు. అబద్ధాలకోరు. ప్రెస్లోని మూర్ఖులు ఈ విషయాన్ని కప్పిపుచ్చడాన్ని నమ్మలేకపోతున్నానని అన్నారు. ఎవరైనా సరే ఇతరుల తిట్టడం అనేది చాలా చెడ్డ విషయం. అయితే బైడెన్ దీనిని 'నాయకత్వానికి చిహ్నం' అని చెప్పుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ‘నేను ఏ వయసులో ఉన్నానో నాకు తెలుసు’ బైడెన్ గత సంవత్సరం తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించే ముందు ఒక పరిచయస్తుడితో తన వయస్సు గురించి చర్చ జరిగినప్పుడు ‘నేను ఏ వయసులో ఉన్నానో నాకు తెలియదని మీరు అనుకుంటున్నారా?’ అని ప్రశ్నించారు. అలాగే బైడెన్ తన కుమారుడి విదేశీ వ్యాపార వ్యవహారాల్లో అతని ప్రమేయం గురించి ప్రశ్నించినప్పుడు అధ్యక్షుడు ది పోస్ట్పై విరుచుకుపడ్డారు. మరోసారి హాట్ మైక్లో ఫాక్స్ న్యూస్ వైట్ హౌస్ రిపోర్టర్ పీటర్ డూసీని ‘బిచ్కు పుట్టిన తెలివితక్కువ కొడుకు’ అంటూ అవమానకరంగా సంబోధించారు. ప్రమాణానికి విరుద్దంగా బైడెన్ ప్రవర్తన? ప్రజలను ఇబ్బందులకు గురిచేసే తన సిబ్బందిని కాల్చివేస్తానంటూ గతంలో బైడెన్ చేసిన తొలి వాగ్దానంలోని నిజాయితీని ఈ నివేదిక ప్రశ్నించింది. గతంలో బైడెన్ ‘నేను ఈ విషయంలో జోక్ చేయడం లేదు, నాతోపాటు పని చేస్తున్నవారు.. మరొక సహోద్యోగితో అగౌరవంగా ప్రవర్తించడం లేదా ఎవరినైనా తక్కువ చేసి మాట్లాడటం అనేది నేను విన్నట్లయితే, అందుకు బాధులైనవారిని అక్కడికక్కడే విధుల నుంచి తొలగిస్తాను. అని బైడెన్ తన సిబ్బందితో జనవరి 20, 2021న ప్రమాణం చేస్తున్నప్పుడు చెప్పారు. అయితే ఇప్పుడు తాను చేసిన ప్రమాణానికి విరుద్దంగా బైడెన్ ప్రవర్తిస్తున్నారని అతని సన్నిహితులే విమర్శిస్తున్నారు. ఇది కూడా చదవండి: ఎంతటి సంపన్నుడైనా.. ఆడవాళ్ల చేతిలో కీలుబొమ్మేనా? నమ్మితే అంతే! -
Cocaine In White House: వైట్హౌస్లో కొకైన్ కలకలం.. అధికారులు అప్రమత్తం!
అమెరికాలోని వైట్హౌస్ (శ్వేత సౌధం)లో అధికారులు కొకైన్ (మాదకద్రవ్యం)ను గుర్తించారు. ఓ తెల్లటి పదార్ధాన్ని అధికారులు గుర్తించారు. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లకు ఆ పౌడర్ లభ్యమయ్యిందని సమాచారం. వైట్హౌజ్లోని వెస్ట్ వింగ్ ప్రాంతంలో దీనిని సీజ్ చేశారు. అనంతరం ఆ కాంప్లెక్స్లో ఉన్న వారిని మరో ప్రదేశానికి తరలించారు. అయితే కొకైన్ను గుర్తించిన సమయంలో వైట్హౌజ్లో అమెరికా అధ్యక్షుడు బైడెన్ లేరు. ప్రస్తుతం ఆయన తన వీకెండ్ను క్యాంప్ డేవిడ్ లో ఎంజాయ్ చేస్తున్నారు. ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసు సిబ్బంది ఆ తెల్లటి పౌడర్ను పలు విధాలుగా పరీక్షించారు. ప్రాథమిక పరీక్షలో అది పౌడర్ కొకైన్ అని గుర్తించారు. దర్యాప్తు ముమ్మరం ఆ తెల్లటి పౌడర్ ప్యాకెట్ గురించి మరింతగా తెలుసుకునేందుకు టెస్టింగ్ కోసం ల్యాబ్కు పంపించారు. మరోవైపు ఆ పౌడర్ వైట్హౌస్లోనికి ఎలా చేరిందనే దానిపై సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు దర్యాప్తు ముమ్మరం చేశారు. వైట్హౌజ్ వెస్ట్ వింగ్ అనేది అధ్యక్ష భవనానికి సమీపంలో ఉంటుంది. క్యాబినెట్ రూమ్, ఓవల్ ఆఫీస్, ప్రెస్ రూమ్లు కూడా అక్కడే ఉంటాయి. కాగా వెస్ట్ వింగ్ వద్దకు ప్రతి రోజూ వివిధ ప్రభుత్వ పనుల కోసం వందల సంఖ్యలో జనం వస్తుంటారు. ఇది కూడా చదవండి: ఉక్రెయిన్ డ్రోన్లను కూల్చివేశామన్న రష్యా! -
ఆస్ట్రేలియాకు అమెరికా సబ్మెరైన్లు
వాషింగ్టన్: ఆసియా పసిఫిక్ ప్రాంతంలో చైనా దూకుడుకు కళ్లెం వేసేందుకు అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియాల ‘ఆకస్’ కూటమి మరో అడుగు ముందుకేసింది. ఆసియా పసిఫిక్ ప్రాంత స్వేచ్ఛా, సంరక్షణ కోసం అణు జలాంతర్గాముల ప్రాజెక్ట్పై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు ఈ మూడు దేశాలు ప్రకటించాయి. ఇందుకు సోమవారం అమెరికాలోని శాన్ డీగోలో జరిగిన ఒక కార్యక్రమం వేదికైంది. ఈ కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, ఆ్రస్టేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్ పాల్గొన్నారు. ఆకస్ ఒప్పందంలో అంతర్భాగమైన అణు జలాంతర్గామి ప్రాజెక్టులో భాగంగా ఆ్రస్టేలియాకు అమెరికా 2030దశకం తొలినాళ్లలో దశలవారీగా మూడు అణుఇంథనంతో పనిచేసే జలాంతర్గాములను అందించనుంది. ‘వచ్చే ఐదేళ్లలో అమెరికా జలాంతర్గాముల నిర్మాణ సామర్థ్యం పెంపు, వర్జీనియా శ్రేణి సబ్మెరైన్ల నిర్వహణ కోసం మొత్తంగా 460 కోట్ల డాలర్లు వినియోగిస్తాం. ‘వర్జీనియా’ జలాంతర్గాములతో దశాబ్దకాలం ముందుగానే ఆస్ట్రేలియా జలాంతర సామర్థ్యం ద్విగుణీకృతం అవుతోంది’ అని సునాక్, అల్బనీస్ల సమక్షంలో బైడెన్ ప్రకటించారు. బ్రిటన్ జలాంతర్గామి టెక్నాలజీ, అమెరికా సాంకేతికతల మేలిమి కలయికగా అణుఇంధనంతో నడిచే సంప్రదాయక ఆయుధాలు అమర్చిన జలాంతర్గామి తయారుకాబోతోంది’ అని బైడెన్ చెప్పారు. మూడు దేశాల మైత్రిలో కొత్త అధ్యాయం మొదలైందని ఈ సందర్భంగా అల్బనీస్ వ్యాఖ్యానించారు. హిందూ మహాసముద్రం, పశ్చిమ, మధ్య పసిఫిక్ సముద్రం, దక్షిణ చైనా సముద్రాలు ఉన్న ఇండో–పసిఫిక్ ప్రాంతం భౌగోళికంగా, అంతర్జాతీయ జలరవాణాకు కీలకమైన ప్రాంతం. దక్షిణ చైనా సముద్ర జలాలపై హక్కులు తనకే చెందుతాయని చైనా వాదిస్తుండటంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం తెల్సిందే. -
Donald Trump: ట్రంప్ ఎస్టేట్లో ఎఫ్బీఐ సోదాలు.. రహస్య పత్రాల కోసమేనా?
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్నకు చెందిన ఫ్లోరిడాలోని మార్–ఎ–లాగో ఎస్టేట్లో ఎఫ్బీఐ అధికారులు ఆకస్మిక సోదాలు చేపట్టారు. ట్రంప్ హయాంలో మాయమైన కీలకమైన, రహస్య పత్రాల కోసం గాలింపు చేపట్టినట్లు సీఎన్ఎన్ పేర్కొంది. సోదాల సమయంలో ట్రంప్ న్యూయార్క్లో ఉన్నారు. దీనిని విచారణార్హమైన దుశ్చర్యగా ట్రంప్ సోమవారం ఒక ప్రకటనలో అభివర్ణించారు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో మరో దఫా పోటీ చేయకుండా అడ్డుకునేందుకే ఎఫ్బీఐని ఆయుధంగా వాడుకుంటున్నారంటూ బైడెన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ‘ఎస్టేట్ను ఎఫ్బీఐ ఏజెంట్లు ముట్టడించారు. నా లాకర్ను పగులగొట్టారు. సమాచారం ఇవ్వకుండా అనవసరంగా దాడులు జరపడం సరైన చర్య కాదు. అమెరికా అధ్యక్షులెవరికీ గతంలో ఎన్నడూ ఇలాంటి అనుభవం ఎదురు కాలేదు. ఇలాంటివి అస్థిర ప్రభుత్వాలుండే మూడో ప్రపంచ దేశాల్లోనే జరుగుతాయి’అని తీవ్ర ఆరోపణలు చేశారు. సోదాలపై వ్యాఖ్యానించేందుకు దేశ న్యాయశాఖ, ఎఫ్బీఐ నిరాకరించాయి. 2020లో అధ్యక్షభవనం వీడే సమయంలో రహస్య పత్రాలను ట్రంప్ తన ఫ్లోరిడా నివాసానికి తరలించి ఉంటారనే విషయమై న్యాయశాఖ దర్యాప్తు జరుపుతోంది. ట్రంప్ హయాంలో వైట్హౌస్లో రికార్డుల నిర్వహణపై దర్యాప్తు చేపట్టాల్సిందిగా నేషనల్ ఆర్కైవ్స్ విభాగం ఫిబ్రవరిలో న్యాయశాఖను కోరింది. మార్–ఎ–లాగో ఎస్టేట్ నుంచి గతంలో కొన్ని రహస్య పత్రాలు సహా వైట్హౌస్ రికార్డులున్న 15 బాక్సులను స్వాధీనం చేసుకున్నట్లు నేషనల్ ఆర్కైవ్స్ విభాగం తెలిపింది. కొందరు దర్యాప్తు అధికారులు జూన్లోనూ మార్–ఎ–లాగోకు వెళ్లి రహస్య పత్రాల గురించి వాకబు చేశారు. -
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్కు క్యాన్సర్! నిజామా? లేక..
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తనకు క్యాన్సర్ ఉందని మాట్లాడటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఈ వీడియో చూసి అమెరికన్లు షాక్ అయ్యారు. ఆయన చెప్పింది నిజమా, లేక ఎప్పటిలాగే పొరపాటుగా నోరుజారారా? అని తెగ చర్చించుకుంటున్నారు. అయితే దీనిపై శ్వేతసౌధం క్లారిటీ ఇచ్చింది. మసాచుసెట్స్లోని సోమర్సెట్లో పాత బొగ్గ గని ప్లాంట్ను సందర్శించేందుకు బుధవారం వెళ్లారు బైడెన్. వాతావరణ మార్పులపై పోరాటంలో భాగంగా ప్రభుత్వం జారీ చేసిన నూతన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై చర్చించారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ చమురు శుద్ధి కర్మాగారాల నుంచి వెలువడే ఉద్గారాల వల్ల ఎంత హాని జరుగుతుందో వివరించారు. చిన్నప్పుడు తల్లి తమను కారులో తీసుకెళ్లేదని, ఆ సమయంలో పరిశ్రమలనుంచి వెలువడే ఉద్గారాలు కారు లోపలికి రాకుండా విండ్షీల్డ్ వైపర్స్ ఎప్పుడూ ఆన్ చేసి ఉండేవని వివరించారు. ఈ పరిస్థితి వల్ల డెలావేర్లో తనతో పాటు పెరిగిన చాలా మంది క్యాన్సర్ బారినపడ్డారని వెల్లడించారు. క్యాన్సర్ రేటు డెలావేర్లోనే అత్యధికంగా ఉందని గుర్తు చేశారు. Did Joe Biden just announce he has cancer? “That’s why I — and so damn many other people I grew up with — have cancer.” pic.twitter.com/lkm7AHJATX — RNC Research (@RNCResearch) July 20, 2022 ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో కాసేపట్లోనే వైరల్ అయింది. బైడెన్కు క్యాన్సరా? ఆయనకు నయం కావాలని కోరుకుంటున్నాం అని నెటిజన్లు కామెంట్లు పెట్టారు. దీంతో శ్వేతసౌధం దీనిపై క్లారిటీ ఇచ్చింది. బైడెన్కు ప్రస్తుతం క్యాన్సర్ లేదని చెప్పింది. అధ్యక్షుడు కావడానికి ముందే ఆయన చర్మ క్యాన్సర్కు చికిత్స తీసుకున్నట్లు తెలిపింది. చదవండి: దొంగలముఠాను కత్తితో హడలెత్తించిన వ్యక్తి.. దెబ్బకు తోకముడిచిన గ్యాంగ్.. గన్ లైసెన్స్పై డిబేట్! -
బైడెన్పై మాజీ ఫిజీషియన్ సంచలన వ్యాఖ్యలు.. ‘బైడెన్ ఇక కష్టమే..’
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్పై సంచలన వ్యాఖ్యలు చేశారు వైట్హౌస్ మాజీ ఫిజీషియన్ రోనీ జాక్సన్. ఆయన వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారని ఆరోపించారు. బైడెన్ అధ్యక్ష కాలాన్ని పూర్తి చేసుకోలేక మధ్యలోనే వైదొలుగుతారని జోస్యం చెప్పారు. బైడెన్ మైండ్ ఎక్కడికో వెళ్లిపోయిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు రోనీ. ఆయన పదవీ కాలన్ని పూర్తి చేసుకోలేరని అందరికీ తెలుసని ట్విట్టర్లో రాసుకొచ్చారు. ఇంకా ఎక్కువ సమయం వేచి చూడకూడదని, బైడెన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పలువురు అమెరికా మాజీ అధ్యక్షులకు వ్యక్తిగత ఫిజీషియన్గా సేవలందించారు రోనీ. బరాక్ ఒబామా, డొనాల్డ్ ట్రంప్, జార్జ్ డబ్ల్యూ బుష్ వంటి ప్రముఖులు ఈ జాబితాలో ఉన్నారు. అయితే బైడెన్పై తాను చేసిన వ్యాఖ్యలు చూసి బరాక్ ఒబామా తనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని ఓ మీడియా ఛానల్కు రోని వెల్లడించారు. శ్వేతసౌధంలో గొప్ప బాధ్యతలు నిర్వహించి ఇలా అమర్యాదగా ప్రవర్తించడం సబబు కాదన్నారని చెప్పారు. రోనీ ప్రస్తుతం టెక్సాస్ నుంచి అమెరికా ప్రతినిధుల సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. చదవండి: ఎన్నో దేశాలను సాయం అడిగాం.. భారత్ మాత్రమే ఆదుకుంది -
షింజో అబే మృతి.. అమెరికా అధ్యక్షుడి ప్రగాఢ సంతాపం, భావోద్వేగ నోట్
వాషింగ్టన్: జపాన్ మాజీ ప్రధాని షింజో అబే దారుణ హత్యకు గురయ్యారు. వేదికపై ప్రసంగిస్తుండగా దుండగుడు కాల్పులకు జరపడంతో తీవ్ర గాయాలై చికిత్స పొందుతూ శుక్రవారం కన్నుమూశారు. ఈ క్రమంలో జపాన్ రాయబార కార్యాలయాన్ని సందర్శించి అబేకు సంతాపం తెలిపారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. ఈ విషాద సంఘటనపై తన సానుభూతిని వ్యక్తం చేస్తూ.. జపాన్ అంబాసిడర్ కోజి టొమితాకు భావోద్వేగ నోట్ను అందజేశారు. షింజో అబే అంటే శాంతి, తీర్పు అంటూ అందులో రాసుకొచ్చారు బైడెన్. 'షింజో అబే కుటుంబం, జపాన్ ప్రజలకు బైడన్ కుటుంబం, అమెరికా ప్రజల తరుపున ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం. గతంలో ఉపాధ్యక్షుడి నివాసంలో ఆథిత్యమిచ్చినప్పుడు, జపాన్ పర్యటనలో ఆయనను కలుసుకోవటం నాకు గర్వకారణం. షింజో మరణం ఆయన భార్య, కుటుంబం, జపాన్ ప్రజలకు మాత్రమే లోటు కాదు.. యావత్ ప్రపంచానికి తీరని లోటు. శాంతి, సామరస్యానికి అబే ప్రతిరూపం.' అని పేర్కొన్నారు జో బైడెన్. అంతకు ముందు.. దుండగుడి కాల్పుల్లో షింజో అబే మరణించారన్న వార్త తెలుసుకుని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు అధ్యక్షుడు బైడెన్. ఇది జపాన్ తోపాటు ఆయన గురించి తెలిసిన వారందరికీ ఓ విషాద సంఘటన అని పేర్కొన్నారు. స్వేచ్ఛాయుత ఇండోపసిఫిక్ కోసం ఆయన విజన్ కొనసాగుతుందన్నారు. ఆయన జీవితాన్ని జపాన్ ప్రజలకు సేవ చేసేందుకే అంకితం చేశారని గుర్తు చేసుకున్నారు. -
టెలీప్రామ్టర్లో ఏది కనిపిస్తే అది చెప్పడమే! దొరికిపోయిన బైడెన్
ప్రముఖ నేతలు వివిధ వేదికలపై ప్రసంగిస్తుంటే ఏకాగ్రతతో వింటుంటాం. వారు ఏకధాటిగా ఎలా మాట్లాడుతున్నారని ఆశ్చర్యపోతుంటాం. అయితే.. నేతలు ప్రసంగాలకు టెలీప్రామ్టర్లు వాడుతుంటారని చాలా మందికి తెలియదు. అలా టెలీప్రామ్టర్లో చూస్తూ ప్రసంగించిన అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దొరికిపోయారు. పొరపాటున టెలీప్రామ్టర్ సూచనను లైవ్లో చదివేశారు. ఈ సంఘటన శుక్రవారం టెలివిజన్ ప్రసంగం సందర్భంగా జరిగింది. 'ఎండ్ ఆఫ్ కోట్, రిపీట్ ది లైన్' అనే సూచనను లైవ్లో బిగ్గరగా చదివారు బైడెన్. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఆ తర్వాత టెలీప్రామ్టర్లో చూస్తూ చదివేందుకు బైడెన్ కాస్త ఇబ్బందిపడినట్లు కనిపించినా.. తన ప్రసంగాన్ని పూర్తి చేశారు. Joe Biden accidentally reads the part on the teleprompter that says "repeat the line" when they wanted him to say the line again lmfao pic.twitter.com/pS3GdXPe5N — Greg Price (@greg_price11) July 8, 2022 అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ లైవ్లో తడబడటం ఇదే మొదటిసారి కాదు. గతంలోనే పలుమార్లు తప్పుగా ఉచ్చరించి వార్తల్లో నిలిచారు. కొద్ది రోజుల క్రితం అమెరికా పేరును పలకడంలో తడబాటుకు గురయ్యారు. అంతకు ముందు సమాన వేతన దినోత్సవం సందర్భంగా వైట్హౌస్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో.. అమెరికా ఉపాధ్యాక్షురాలు కమలా హారిస్ను ఫస్ట్ లేడీ అంటూ పిలిచారు. ఇదిలాఉండగా.. అబార్షన్పై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో శుక్రవారం కీలక ఉత్తర్వులు జారీ చేశారు అధ్యక్షుడు బైడెన్. అబార్షన్ హక్కును కాపాడుతూ తీసుకొచ్చిన ఉత్తర్వులపై సంతకం చేశారు. ఈ హక్కును పరిరక్షించడానికి గట్టి చర్యలు తీసుకోవాలని డెమొక్రటిక్ పార్టీ సభ్యులు ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో బైడెన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. -
ఉక్రెయిన్లో ఆకస్మికంగా పర్యటించిన అమెరికా ప్రథమ మహిళ
కీవ్: అమెరికా ప్రథమ పౌరురాలు జిల్ బైడెన్ ఆదివారం పశ్చిమ ఉక్రెయిన్లో పర్యటించారు. ముందస్తు ప్రకటన లేకుండానే ఆమె ఇక్కడికి రావడం గమనార్హం. స్లొవేకియాలోని చిట్టచివరి గ్రామం వద్ద సరిహద్దును దాటి 10 నిమిషాలపాటు వాహనంలో ప్రయాణించి ఉక్రెయిన్లోని ఉజ్హొరోత్ పట్టణానికి చేరుకున్నారు. అక్కడ రెండు గంటలపాటు గడిపారు. ఉక్రెయిన్ ప్రథమ పౌరురాలు ఒలెనా జెలెన్స్కీతో సమావేశమయ్యారు. మాతృ దినోత్సవం సందర్భంగా అక్కడికి వచ్చినట్లు చెప్పారు. ఉక్రెయిన్పై రష్యా సాగిస్తున్న క్రూరమైన యుద్ధం తక్షణమే ఆగిపోవాలని ఆకాంక్షించారు. ఉక్రెయిన్ ప్రజలకు అమెరికా ప్రజలు ఎల్లప్పుడూ అండగా నిలుస్తూనే ఉంటారని పునరుద్ఘాటించారు. జిల్ బైడెన్, ఒలెనా జెలెన్స్కీ ఓ పాఠశాలలో కలుసుకున్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో సంభాషించారు. యుద్ధం వల్ల తాము ఎదుర్కొంటున్న కష్టనష్టాలు వివరిస్తూ విద్యార్థులు, తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. వారిని జిల్ బైడెన్ ఓదార్చారు. అనంతరం జిల్ బైడెన్, ఒలెనా మీడియాతో మాట్లాడారు. యుద్ధ సమయంలో జిల్ రాక సాహసోపేతమైన చర్య అని ఒలెనా కొనియాడారు. జర్మనీ పార్లమెంట్ స్పీకర్ బెయిర్బెల్ బాస్ కూడా ఆదివారం ఉక్రెయిన్ రాజధాని కీవ్లో పర్యటించారు. అధ్యక్షుడు జెలెన్స్కీతో సమావేశమై తాజా పరిణామాలపై చర్చించారు. కెనడా ప్రధాని కూడా... రష్యా దాడులతో విలవిల్లాడుతున్న ఉక్రెయిన్కు పశ్చిమ దేశాల అధినేతలు నైతిక మద్దతునిస్తున్నారు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆదివారం ఉక్రెయిన్లోని ఇర్పిన్ పట్టణాన్ని సందర్శించారు. స్థానికులతో మాట్లాడారు. రష్యా దాడుల్లో ఈ పట్టణం ఇప్పటికే చాలావరకు ధ్వంసమయ్యింది. జస్టిన్ ట్రూడో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో భేటీ కానున్నారు. -
రష్యన్ చమురు కంపెనీలు భారత్ కు భారీ బంపర్ ఆఫర్..!!
-
US ఎయిర్ పోర్ట్ లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం
-
H1-B, వీసాల తిరస్కరణ: భారీ ఊరట
వాషింగ్టన్: ముందస్తు నోటీసు ఇవ్వకుండా వీసాలను అధికారులు తిరస్కరించేందుకు వీలు కల్పించే ట్రంప్ పాలనా కాలపు విధాన నిర్ణయాన్ని తొలగించనున్నట్లు అమెరికా ఇమ్మిగ్రేషన్ ఏజెన్సీ (యూఎస్సీఐఎస్) వెల్లడించింది. ఈ నిబంధన తొలగింపుతో లీగల్ ఇమ్మిగ్రేషన్కు ఉన్న అడ్డంకులు మరింతగా తగ్గనున్నాయి. జోబైడెన్-హారిస్ నేతృత్వంలో తీసుకున్న విధాన చర్యలు దేశ చట్టపరమైన ఇమ్మిగ్రేషన్ వ్యవస్థకు అనవసరమైన అడ్డంకులను తొలగించడానికి ఉపయోగపడుతుందని యుఎస్సీఐఎస్ డైరెక్టర్ ట్రేసీ రెనాడ్ చెప్పారు. అలాగే ఇమ్మిగ్రేషన్ ప్రయోజనాలకు సంబంధించి వలసదారులపై భారాన్ని తగ్గించాలన్న లక్ష్యానికనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ట్రంప్ 2018లో తెచ్చిన ఈ నిబంధన హెచ్1బీతో సహా ఎల్1, హెచ్2బీ, జే1, జే2, ఎఫ్, ఓ తదితర వీసా అప్లికేషన్లపై పడింది. తాజాగా ఆర్ఈఎఫ్, ఎన్ఓఐడీ నిబంధనలను మారుస్తున్నట్లు, కొన్ని రకాల ఎంప్లాయ్ ఆధరైజేషన్ డాక్యుమెంట్ల కాలపరిమితిని పొడిగిస్తున్నట్లు ఏజెన్సీ తెలిపింది. 2013లో తీసుకువచ్చిన నిబంధనలనే తిరిగి అమలు చేస్తామని, 2018లోతెచ్చిన నిబంధనను తొలగిస్తామని తెలిపింది. తాజా నిర్ణయంతో అప్లికేషన్లలో తప్పులను సవరించుకునే వీలు వీసా దరఖాస్తుదారులకు కలగనుంది. 2018 నిబంధన ప్రకారం ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండా వీసాలు తిరస్కరించేందుకు ఏజెన్సీ అధికారులకుఅవకాశం ఉండేది. దీని ప్రభావం పలు ఐటీ కంపెనీల ఉద్యోగులపై పడింది. చట్టపరమైన ఇమ్మిగ్రేషన్ సజావుగా కొనసాగేందుకు తాము తగిన నిర్ణయాలు తీసుకుంటున్నామని హోమ్లాండ సెక్యూరిటీ కార్యదర్శి అలెజాండ్రో తెలిపారు. చదవండి : Petrol Price: రూ.102 దాటేసింది! -
అమెరికాతో మైత్రీబంధం
విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అయిదు రోజుల పర్యటన కోసం సోమవారం అమెరికా చేరుకున్నారు. డోనాల్డ్ ట్రంప్ హయాంలో ఇరు దేశాలమధ్య అత్యంత సాన్నిహిత్యం ఏర్పడిం దన్న అభిప్రాయం కలిగిన ప్రతిసారీ ఆయన భారత్ గురించో, ప్రధాని నరేంద్ర మోదీ గురించో ఏదో రకమైన దుర్వా్యఖ్య చేసి అయోమయం మిగిల్చేవారు. కేవలం మన విషయంలోనే కాదు...ప్రపంచ దేశాలన్నిటి పట్లా ఆయన ధోరణి అలాగే వుండేది. భారత్, అమెరికాలతో పాటు జపాన్, ఆస్ట్రేలియాలతో ఇండో–పసిఫిక్ ప్రత్యేక కూటమి ఉండాలని అమెరికా ప్రతిపా దించి చాన్నాళ్లయింది. బరాక్ ఒబామా అధ్యక్షుడిగా వున్నప్పుడే ఈ ఆలోచన అమెరికాలో మొగ్గతొడిగింది. అది ట్రంప్ హయాంలో ఇంకాస్త విస్తృతమైంది. మొదట్లో ఎన్నో అవరోధాలు ఏర్పడి, దాదాపు మూలనబడిందనుకున్న ఆ ప్రతిపాదన ఇప్పుడిప్పుడే పూర్తి స్థాయి రూపం సంతరించుకుంటోంది. ట్రంప్ తీరుతెన్నులెలావున్నా, ఆ విషయంలో ఎంత అసంతృప్తివున్నా చైనా దూకుడు చూసి...దానితో పడుతున్న సమస్యలు నానాటికీ పెరగడం గమనించి మనతో పాటు జపాన్, ఆస్ట్రేలియా కూడా ఇండో–పసిఫిక్ కూటమిపై ఆసక్తి ప్రదర్శించాయి. దక్షిణ కొరియా సైతం దీనిలో భాగస్వామిగా మారేందుకు ముందుకొస్తోంది. అయితే ఈ కూటమి గురించి పాటుపడుతూనే ట్రంప్ అప్పుడప్పుడు అంతర్జాతీయ కూటములపై నిరాసక్తత కనబరి చేవారు. ఏనాటినుంచో వున్న నాటో కూటమిపైనే ఆయన ఎన్నో షరతులు విధించడం మొదలె ట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో మిత్ర దేశాల్లో ఒకరకమైన అనిశ్చితి ఆవహించడంలో వింతేమీ లేదు. కానీ జో బైడెన్ అధికారంలోకొచ్చాక ఇంటా, బయటా ఆయన దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టారు. దాని పర్యవసానంగానే జైశంకర్ అయిదు రోజుల విస్తృత పర్యటన సాధ్య మైంది. ట్రంప్ వల్ల ఎన్ని సమస్యలొచ్చినా ఆయనైతేనే ఇరుదేశాల సంబంధాలూ సవ్యంగా సాగుతాయన్న అభిప్రాయం మోదీతో సహా అందరికీ వుంది. అయితే బైడెన్ రావడం కూడా మంచి పరిణామమేనని ఇప్పుడు ప్రభుత్వంలోని వారంతా భావిస్తున్నారు. ఎందుకంటే ఆయన టీంలో వున్నవారిలో మెజారిటీ సభ్యులు గతంలో మనదేశంతో మంచి సంబంధాలున్న వారు. అందువల్లే కావొచ్చు... బైడెన్ వచ్చిన వెంటనే భారత్తో మరింత మైత్రీబంధం ఏర్పడ టానికి అవసరమైన చర్యలు ప్రారంభించారు. ద్వైపాక్షిక రంగంలోనే కాక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాల్లో కలిసి పనిచేయడానికి ఏమేం చేయాలో ఖరారు చేసుకున్నారు. జైశంకర్ చర్చించబోయే అంశాల్లో కేవలం ఇండో–పసిఫిక్ కూటమి ఒక్కటే కాదు...చాలా వున్నాయి. అందులో కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కొనడానికి అవసరమైన సహకారం ఒకటి. రెండో దశ కరోనా విరుచుకుపడిన మొదట్లో అమెరికా కొంత నిర్లిప్త ధోరణి ప్రదర్శిం చింది. అమెరికాలో వున్న ట్రంప్ అనుకూల భారత సంతతి పౌరుల నుంచి తీవ్ర విమర్శలు వచ్చిపడటంతో వెనువెంటనే సరిదిద్దుకుంది. ఈమధ్య మన దేశంలో ఆక్సిజన్కు తీవ్ర కొరత ఎదురై అనేకమంది మృత్యువాతపడినప్పుడు భారీ ఆక్సిజన్ ప్లాంట్ల నిర్మాణానికి అవసర మైన ఉపకరణాలనూ, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లనూ అందజేసింది. జైశంకర్ తన పర్యటన సంద ర్భంగా కరోనా వ్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తున్న ఫైజర్, మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ లతో కూడా మాట్లాడతారు. ఈ వ్యాక్సిన్లు మన దేశానికి అందించడానికి పాటించదల్చుకున్న విధివిధానాలేమిటో ఆయన ప్రభుత్వంతో కూడా చర్చిస్తారు. తన దగ్గరున్న 8 కోట్ల డోసుల వ్యాక్సిన్లను అవసరమైన దేశాలకు అందజేస్తామని ఈమధ్యే అమెరికా ప్రకటించింది. మన దేశం రెండో దశ కరోనాలో భారీ జన నష్టాన్ని చవిచూసినందువల్ల ఆ వ్యాక్సిన్లను భారత్లోనే తయారుచేయడానికి గల సాధ్యాసాధ్యాలను కూడా జైశంకర్ చర్చిస్తారు. వ్యాక్సిన్ తయారీ విధానంపై వున్న పేటెంట్ హక్కుల్ని తాత్కాలికంగా సడలించి, వెనకబడిన దేశాలు సైతం వాటిని స్వేచ్ఛగా ఉత్పత్తి చేసుకోవడానికి అనుమతించాలని ప్రపంచ వాణిజ్య సంస్థలో గత అక్టోబర్లో దక్షిణాఫ్రికాతోపాటు మన దేశం కోరినప్పుడు అమెరికా సుముఖత వ్యక్తం చేసింది. ప్రపంచ జనాభా మొత్తం సాధ్యమైనంత త్వరగా కరోనా నియంత్రణ టీకాలు వేసుకుంటేనే అన్ని దేశాలూ సురక్షితంగా వుండగలవని, ఈ విషయంలో ఎవరు వెనకబడినా అందరికీ ప్రమాదమేనని మన దేశం వాదించింది. ఈ అంశాలన్నీ మరోసారి చర్చల్లోకొస్తాయి. పేటెంట్ల సడలింపులో యూరప్ దేశాలను ఒప్పించమని జైశంకర్ కోరే అవకాశం వుంది. ట్రంప్ ఏలుబడిలో అమెరికా నిరాసక్తత వల్ల బహుళ ధ్రువ ప్రపంచ వ్యవస్థ తప్పదన్న అభిప్రాయం కలగడంతో మన దేశం యూరప్ దేశాల చొరవకు అనుకూలంగా స్పందించింది. అలాగే చైనాతో సంబంధాలు పెంచుకోవటానికి, రష్యాతో వున్న మైత్రీబంధాన్ని మరింత విస్తరించుకోవటానికి ప్రయత్నించింది. కానీ జమ్మూ–కశ్మీర్ ప్రతిపత్తి మార్చిన తర్వాత చైనా మన దేశం పట్ల వ్యతిరేకతను ప్రదర్శించటం, దానికి ముందూ తర్వాత కూడా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు సృష్టించటం వగైరా పరిణామాలు...ఈలోగా బైడెన్ ఆగమనం తర్వాత అమెరికా మళ్లీ అంతర్జాతీయంగా చురుకైన పాత్ర పోషించటం మొదలుపెట్టడంతో ఇరు దేశాలూ దగ్గరయ్యాయి. ఈ నేపథ్యంలో సాగుతున్న జైశంకర్ తాజా పర్యటనతో ఈ బంధం మరింత చిక్కబడుతుందని భావించాలి. -
కరోనా కల్లోలం: భారత్కు అమెరికా తీపికబురు..
వాషింగ్టన్: కరోనా ప్రపంచ వ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తోంది. ఇప్పటికే అనేక దేశాలు ఈ మహమ్మారి బారినపడ్డాయి. చాలా మంది ఈ వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. కాగా, ఈ విపత్తు సమయంలో అనేక దేశాలు పరస్పరం సహకారం అందించుకుంటూ తమ స్నేహభావాన్ని చాటుతున్నాయి. అయితే, కరోనా మొదటి దశలో అమెరికాలో భారీ సంఖ్యలో కేసులు వెలుగుచూసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో భారత్, అమెరికాకు అండగా నిలిచింది. కోవిడ్ను ఎదుర్కోవడానికి కావాలసిన మందులను సరఫరా చేసింది. ఆపద సమయంలో మేమున్నామని అమెరికాకు స్నేహ హస్తాన్ని అందించింది. కాగా, కరోనా సెకండ్ వేవ్లో భారత్ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో భారత్లో వ్యాక్సిన్ తయారీ ముడిసరుకుల ఎగుమతిపై అమెరికా ఇటీవల నిషేధం విధించిన విషయం తెలిసిందే. దీంతో ఆపత్కాలంలో ఇండియాకు అండగా నిలవాలంటూ అగ్రరాజ్య అధ్యక్షుడు జో బైడెన్కు విజ్ఞప్తులు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ఎట్టకేలకు సానుకూలంగా స్పందించిన జో బైడెన్ భారత్కు సాయం అందిస్తామని తెలిపారు. భారత్లో కరోనా కేసులు పెరగటం పట్ల ఆందోళన వ్యక్తం చేసిన ఆయన, అన్నివిధాలుగా చేయుతనివ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు ట్వీట్ చేశారు. అదే విధంగా, భారత్లో వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా, పీపీఈ కిట్లు, ముడిసరుకు, అమిడ్ వ్యాక్సిన్లు , వెంటిలేటర్లు పంపనున్నట్లు పేర్కొన్నారు. కాగా, అమెరికా ఉపాధ్యాక్షురాలు కమలా హారిస్కూడా భారత్కు తమ సహకారం ఉంటుందని ట్వీట్ చేసింది. ఇక ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో పరస్పర సహకారం చేసుకోవడం, ఇరుదేశాల మధ్య మైత్రిని మరింత బలోపేతానికి తోడ్పడుతుందంటూ, జో బైడెన్ నిర్ణయం పట్ల అమెరికా, భారత్ కు చెందిన పలువురు నాయకులు ట్వీటర్ వేదికగా ధన్యవాదాలు తెలుపుతున్నారు. కాగా, ప్రపంచ దేశాలన్ని ఈ మహమ్మారిపై కలిసి కట్టుగా పోరాడాలని పిలుపు నిచ్చారు. Just as India sent assistance to the United States as our hospitals were strained early in the pandemic, we are determined to help India in its time of need. https://t.co/SzWRj0eP3y — President Biden (@POTUS) April 25, 2021 -
మరికొన్ని గంటల్లో వైట్హౌజ్కు ట్రంప్ బైబై
వాషింగ్టన్: ఎన్నికల్లో ఓడిపోయినా కూడా అధికారాన్ని బదిలీ చేయకుండా అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎట్టకేలకు మెట్టు దిగారు. నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్న నూతన పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. తన వీడ్కోలు సమావేశంలో మంగళవారం ట్రంప్ మాట్లాడారు. శ్వేతసౌధంలో నిర్వహించిన చివరి కార్యక్రమంలో ఆయన తన పదవీకాలంలో చేపట్టిన కార్యక్రమాలతో పాటు కొత్తగా రాబోయే అధ్యక్షుడికి కొన్ని సూచనలు చేశారు. నాలుగేళ్ల కిందట దేశాన్ని పునర్నించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశామని.. కొత్త ఉత్సాహం, ఉత్తేజంతో పౌరులకు ప్రభుత్వం చేరువ చేయాలనే ఉద్దేశంతో పని చేశామని ట్రంప్ పేర్కొన్నారు. ‘‘అధ్యక్షుడిగా పని చేయడం గౌరవంగా భావిస్తున్నా. ఈ అద్భుత అవకాశం ఇచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు. కొత్తగా వచ్చే అధికార యంత్రాంగం అమెరికాను సురక్షితంగా తీర్చిదిద్దడంలో విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నా. వారికి మా శుభాకాంక్షలు’’ అంటూ ట్రంప్ శ్వేతసౌధం వీడుతూ బైడెన్కు స్వాగతం పలికారు. తాను ఈ అద్భుతమైన ప్రాంతం నుంచి నమ్మకం, సంతోషకరమైన హృదయంతో, ఆశావాద దృక్పథంతో వెళ్తున్నానని చెప్పారు. ఎన్నికల సమయంలో జరిగిన పరిణామాలపై విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సమావేశంలో తన పరిపాలనలో తీసుకున్న నిర్ణయాలను కొన్ని ప్రస్తావించారు. చైనాతో వైఖరి, తనపై సోషల్ మీడియా నిషేధం తదితర అంశాలపై మాట్లాడారు. అయితే సమావేశంలో ఎక్కడ కూడా జో బైడెన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడని అంగీకరించకపోవడం గమనార్హం. అనంతరం అమెరికా ప్రథమ మహిళ, ట్రంప్ సతీమణి మెలానియా ట్రంప్ కూడా మాట్లాడారు. కొత్త అధ్యక్షుడి ప్రమాణస్వీకార కార్యక్రమంలో ట్రంప్ పాల్గొనడం లేదు. ఆ సంప్రదాయాన్ని పాటించకుండా శ్వేతసౌధం వదిలేసి ఫ్లోరిడాలోని తన ఇంటికి వెళ్తున్నారు. అయితే బైడెన్ అమెరికా 46వ అధ్యక్షుడిగా ఈరోజు రాత్రి 10.30 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. -
బైడెన్ బృందంలో మరో భారతీయురాలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష స్థానాన్ని అధిరోహించనున్న జో బైడెన్ తన టీమ్ను సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే తన బృందంలో భారత సంతతికి చెందిన వారికి పెద్దపీట వేస్తున్న బైడెన్ ఇప్పుడు మరొకరికి కూడా కీలక బాధ్యతలు అప్పగిస్తూ శుక్రవారం నిర్ణయం తీసుకున్నారు. శ్వేత భవనంలో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారీస్కు డిప్యూటీ ప్రెస్ సెక్రటరీగా 32 ఏళ్ల భారత సంతతికి చెందిన సబ్రినా సింగ్ను నియమించారు. ఎన్నికల సమయంలో బైడెన్, కమలా హ్యారీస్కు మీడియా కార్యదర్శిగా సబ్రినా సింగ్ పని చేశారు. ఎన్నికల ప్రచారంలో ఆమె కీలక పాత్ర పోషించారు. అంతకుముందు అమెరికాలో డెమొక్రటిక్ నేషనల్ కమిటీలో కమ్యూనికేషన్ విభాగం డిప్యూటీ డైరెక్టర్గా విధులు నిర్వహించారు. గతంలో సబ్రినా మైక్ బ్లూంబర్గ్ అధ్యక్ష ప్రచార సీనియర్ ప్రతినిధిగా, కోరీ బుకర్ అధ్యక్ష ప్రచారానికి నేషనల్ ప్రెస్ సెక్రెటరీగా పని చేసింది. అమెరికన్ బ్రిడ్జ్ ట్రంప్ వార్ రూమ్ ప్రతినిధి, హిల్లరీ క్లింటన్ 2016 అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ప్రాంతీయ కమ్యూనికేషన్స్ డైరెక్టర్గానూ సేవలందించారు. ఆమె ఎస్కేడీకే నికర్ బాకర్ కన్సల్టింగ్ సంస్థ, రిపబ్లిక్ జాన్ షాకోవ్స్కీకి కమ్యూనికేషన్ డైరెక్టర్గా, వివిధ డెమొక్రాటిక్ కమిటీల్లోనూ పని చేశారు. ఎంతో గౌరవం: సబ్రినా సింగ్ డిప్యూటీ ప్రెస్ కార్యదర్శిగా నియమితులవడంపై సబ్రినా సింగ్ సంతోషం వ్యక్తం చేసింది. వైట్హౌస్ బృదంలో చేరడం ఎంతో గొప్ప విషయమని, గౌరవంగా భావిస్తున్నట్లు ట్విట్టర్లో పేర్కొన్నారు. కమలా హ్యారీస్కు పని చేయడం గౌరవంగా భావిస్తున్నట్లు ట్వీట్ చేశారు. -
అమెరికా: ట్రంప్, బైడెన్ ముఖాముఖి
వాషింగ్టన్: అమెరికా ఎన్నికల్లో అత్యంత కీలక ఘట్టమైన అధ్యక్ష అభ్యర్థుల ముఖాముఖి ప్రారంభమైంది. రాబోయే ఎన్నికల అభ్యర్థులుగా ఉన్న డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి బైడెన్, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ముఖాముఖిలో పాల్గొన్నారు. ట్రంప్, బైడెన్ మధ్య అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా ఇది మొదటి ప్రత్యక్ష చర్చ. ఈ చర్చలో మొదటి అంశంగా అమెరికా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ఎంపికలో వచ్చిన ఆరోపణలు, విమర్శలపై మొదటి ప్రశ్నతో ముఖాముఖి ప్రారంభమైంది. అమెరికాలో ఎన్నికలు ఇప్పటికే ప్రారంభమయ్యాయని బైడెన్ అన్నారు. ఇప్పటికే వేల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని వ్యాఖ్యానించారు. ఒబామా కేర్ పాలసీని ట్రంప్ నాశనం చేశారని మండిపడ్డారు. బైడెన్ వ్యాఖ్యలను ట్రంప్ ఖండిస్తూ.. గత ఎన్నికల్లో గెలిచాం కాబట్టే సుప్రీంకోర్టు నియామకాల్లో తమ ప్రభుత్వానికి పూర్తి స్వేచ్ఛ ఉందని స్పష్టం చేశారు. తనను మూడేళ్ల కోసం ఎన్నుకోలేదని ధీటుగా సమాధానం ఇచ్చారు. అధ్యక్ష అభ్యర్థుల చర్చ వాడివేడిగా కొనసాగుతోంది. ట్రంప్ తెచ్చిన హెల్త్స్కీమ్పై ఇరువురి మధ్య చర్చ జరుగుతోంది. ఒబామా కేర్కు ప్రత్యామ్నాయం ఎందుకు తీసుకురాలేక పోయారని బైడెన్ సూటిగా ప్రశ్నించారు. ఒబామా కేర్ను రద్దు చేయడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారని ఆయన విమర్శించారు. దానికి బదులుగా.. తమ ప్రభుత్వం ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తోందని ట్రంప్ తెలిపారు. మందుల ధరలు గణనీయంగా తగ్గాయని గుర్తు చేశారు. బైడెన్, ట్రంప్ ఎన్నికల చర్చపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి చూపుతున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం 90 నిమిషాల పాటు సాగనున్నది. కరోనాపై ప్రజలను అప్రమత్తం చేయడంలో ట్రంప్ విఫలమయ్యారని బైడెన్ తీవ్రంగా విమర్శించారు. కోవిడ్ నియంత్రణలో ట్రంప్ విఫలమయ్యారని, వైద్య, ఆరోగ్య విధానంపై ట్రంప్కు సమగ్ర ప్రణాళిక లేదని తెలిపారు. దీంతో ట్రంప్ మాట్లాడుతూ.. డెమొక్రటిక్ పార్టీ 47 ఏళ్ల పాలనలో అమెరికాకు చేసిందేమీ లేదన్నారు. భారత్ సహా ఇతర దేశాల్లో కరోనాతో ఎంతమంది చనిపోయారో బైడెన్కు తెలియదా అని సూటిగా ప్రశ్నించారు. ట్రంప్ హయాంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందని బైడెన్ అన్నారు. ట్రంప్ మట్లాడుతూ.. అమెరికా ఆర్థిక వ్యవస్థ పురోగతి సాధిస్తోందని తెలిపారు. తాము అన్ని పారదర్శక విధానాలే అవలంబిస్తున్నామని చెప్పారు. తాము ప్రజలకు కరోనా విషయంలో మెరుగైన వైద్యం అందించామని ఆయన స్పష్టం చేశారు. -
బరిలో కమలా హారిస్ : ట్రంప్ స్పందన
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాలిఫోర్నియా సెనేటర్ కమలా హారిస్పై మరోసారి నోరు పారేసుకున్నారు. ఉపాధ్యక్ష అభ్యర్థిగా హారిస్ను జో బిడెన్ ప్రకటించిన కొద్ది నిమిషాల తరువాత, హారిస్ను "ఫోనీ" గా ముద్ర వేస్తూ ఒక ప్రచార వీడియోను ట్రంప్ ట్వీట్ చేశారు. (చరిత్ర సృష్టించిన జో బిడెన్) డెమొక్రాటిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థిగా తొలి నల్లజాతి మహిళగా బరిలో నిలిచిన ఆమెపై అనుచిత వ్యాఖ్యలు చేశారు ట్రంప్. జో బిడెన్ వైస్ ప్రెసిడెంట్ గా ఆమెను ఎన్నుకోవడం తనకు కొంచెం ఆశ్చర్యం కలిగించిందని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అమెరికా సెనేట్లో ఆమె అత్యంత నీచమైన, అత్యంత భయంకరమైన, ఏమాత్రం మర్యాదలేని వ్యక్తిగా తాను భావిస్తున్నానంటూ హారిస్పై దాడిచేశారు. అలాగే "జాత్యహంకార విధానాలకు" బిడెన్ మద్దతు ఇస్తున్నారంటూ విమర్శించారు. కాగా కాలిఫోర్నియాకు మూడుసార్లు ఎంపికైన కమలా హారిస్ తాజాగా అమెరికా ఉపాధ్యక్ష పదవి పోటీలో సంగతి తెలిసిందే. ప్రస్తుత అమెరికా అధ్యక్ష ఎన్నికల పోటీలో దూకుడు ప్రచారకురాలిగా ఆమె పేరు తెచ్చుకున్నారు. -
హెచ్–1బీపై నిషేధం ఎత్తివేస్తా
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవికి పోటీలో ఉన్న డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బిడెన్ భారతీయ ఐటీ ఉద్యోగులపై హామీల వర్షం కురిపించారు. అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే అమెరికా సహజ భాగస్వామి భారత్తో వ్యూహాత్మక సంబంధాలను మరింత దృఢతరం చేసుకునేందుకు ప్రాధాన్యమిస్తానని ప్రకటించారు. ఇంకా, హెచ్–1బీ వీసాలపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయడంతోపాటు ఇమిగ్రేషన్ వ్యవస్థను ఆధునీకరిస్తానని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆన్లైన్ పద్ధతిలో జరిగిన ఒక టౌన్హాల్ సమావేశంలో బిడెన్ ఆసియన్ అమెరికన్ అండ్ పసిఫిక్ ఐలాండర్లతో పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘ట్రంప్ హెచ్–1బీ వీసాలను ఈ ఏడాది మొత్తానికి రద్దు చేశారు. నా ప్రభుత్వంలో మాత్రం ఇలా జరగదు’’అని వ్యాఖ్యానించారు. ప్రైవేట్ కంపెనీల వీసాలపై అమెరికా వచ్చిన నిపుణులు దేశ నిర్మాణంలో కీలకపాత్ర పోషించారని ఎన్నికల్లో విజయం సాధించి అధ్యక్ష పగ్గాలు చేపడితే వంద రోజుల్లో వీసాలపై నిషేధాన్ని ఎత్తివేస్తామని అన్నారు. ‘‘తొలిరోజే (అధికారం చేపట్టిన తరువాత) ఇమిగ్రేషన్ చట్టాల్లో మార్పులకు సంబంధించిన బిల్లును కాంగ్రెస్కు పంపిస్తా. దేశంలో తగిన పత్రాలు లేని కోటీ పదిలక్షల మంది వలసదారులకు పౌరసత్వం ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని కోరతా. ఇందులో 17 లక్షల మంది ఏసియన్ అమెరికన్లు, పసిఫిక్ ఐలాండర్లు ఉంటారు’’అని బిడెన్ వివరించారు. ముస్లింల ప్రయాణాలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయడంతోపాటు సుదీర్ఘమైన అమెరికా విలువల పునరుద్ధరణలో భాగంగా దేశంలోకి మళ్లీ శరణార్థులను తీసుకుంటామని చెప్పారు. గ్రీన్కార్డుల పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. అమెరికా, భారత్లు సహజ భాగస్వాములు అమెరికా భారత్ల మధ్య వ్యూహాత్మక సంబంధాలు బలంగా ఉండటం అమెరికన్ల భద్రతకు చాలా ముఖ్యమని జో బిడెన్ వ్యాఖ్యానించారు. అమెరికా ఉపాధ్యక్షుడి హోదాలో తాను గతంలో భారత్తో వ్యూహాత్మక సంబంధాలకు అధిక ప్రాధాన్యమిచ్చామని అధ్యక్షుడిగా ఎన్నికైతే అదే పంథా కొనసాగిస్తానని చెప్పారు. కరోనా వైరస్ వ్యవహారంలో ట్రంప్ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని విమర్శించారు. -
బిడెన్కు ప్రెసిడెన్షియల్ మెడల్
ప్రదానం చేసిన అధ్యక్షుడు ఒబామా వాషింగ్టన్: బిడెన్ను అధ్యక్షుడు ఒబామా.. అమెరికా అత్యున్నత పౌర పురస్కారం ‘ది ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడం’తో శ్వేతసౌధంలో సత్కరించారు. బిడెనే అమెరికాకు ఇప్పటి వరకు ఉత్తమ ఉపాధ్యక్షుడు అని, దేశ చరిత్రలో ఆయన సింహం అని ఒబామా కొనియాడారు. ప్రాంతీయ ఘర్షణలను సాకుగా చూపి పాకిస్తాన్ వ్యవహరిస్తున్న తీరు అణ్వాయుధాల వినియోగ ప్రమాదాన్ని సూచిస్తోందని ఈ సందర్భంగా బిడెన్ అన్నారు. ‘ఉత్తర కొరియా ఒక్కటే కాదు. రష్యా, పాక్, పలు దేశాలు తీసుకుంటున్న చర్యలు యూరప్, దక్షిణాసియా, తూర్పు ఆసియాల్లో నెలకొంటున్న ప్రాంతీయ ఘర్షణల్లో అణ్వాయుధాల వినియోగానికి సిద్ధమనే సంకేతాలను పంపిస్తున్నాయి. ఇది చాలా ప్రమాదకర ఆలోచన.’ అని బిడెన్ సూచించారు. ఉగ్రవాదాన్ని తొలగించండి అమెరికా కొత్త రక్షణ మంత్రిగా బాధ్యతలు తీసుకోనున్న జేమ్స్ మాటిస్.. పాక్కు కఠినమైన హెచ్చరికలు పంపించారు. పాకిస్తాన్.. తన భూభాగంపై పాతుకుపోయిన ఉగ్రవాదాన్ని బయటకు పంపించటం లేదా నిర్మూలించటంపై దృష్టిపెట్టాల్సిందేనని మాటిస్ అన్నారు.