ప్రధాన వార్తలు

ఉడత ఊపులకు భయపడేది లేదు.. పోరాటం ఆగదు: సాక్షి మీడియా
సాక్షి, విజయవాడ: తిరుమల తిరుపతి దేవస్థానం కథనాలల వ్యహారంలో లీగల్ నోటీసుల అంశంపై సాక్షి మీడియా సంస్థ స్పందించింది. టీవీ5 లీగల్ నోటీసుల ఉడత ఊపులకు భయపడేది లేదని, పుణ్యక్షేత్రంలో జరుగుతున్న అరాచకాలపై పోరాటం ఆగదని స్పష్టం చేసింది. మీ నిర్లక్ష్యంతో తొక్కిసలాటలో భక్తులు చనిపోయారు.. అది నిజంకాదా?. క్షమాపణ చెప్తే చనిపోయిన వారు బతికొస్తారా? అని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అన్నది నిజం కాదా?. బీఆర్నాయుడి హయాంలో.. తిరుమలలో దళారుల దందా పెరిగిపోయిన మాట వాస్తవం కాదా?. మీ చేతకానితనంలో సామాన్యులకు ఇబ్బందులు వాస్తవం కాదా?. రోజుల తరబడి క్యూలైన్లో ఇబ్బంది పడుతోంది నిజం కాదా?. ఏఐ టెక్నాలజీతో దర్శనాలు సాధ్యం కాదని మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం వెంకన్న సాక్షిగా చెప్పింది నిజం కాదా?. డిప్యూటీ సీఎం పవన్ దర్శనానికి వెళ్లారనే అక్కసుతో పూజారికే మోమో ఇచ్చింది నిజం కాదా?.. అని సాక్షి మీడియా సంస్థ నిలదీసింది.భక్తులకు సరైన సదుపాయలు కల్పించాలన్నదే మా తాపత్రయం. టీడీపీని రాజకీయాలకు అతీతంగా ఉంచాలన్నదే సాక్షి ఆకాంక్ష. సామాన్య భక్తుడికి మెరుగైన సేవలు అందించాలన్నదే మా డిమాండ్. శ్రీవారిని కేవలం వీఐపీలకు పరిమితం చేయడంపై ప్రశ్నించడం ఆగదు. తిరుమల పుణ్యక్షేత్రంలో జరుగుతున్న అరాచకాలపై మా పోరాటం ఆగదు అని సాక్షి మీడియా సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది.

‘‘రాహుల్ గాంధీ మా బాస్ కాదు..’’ ఉపరాష్ట్రపతి ఎన్నికపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ మద్దతు.. ఎన్డీయే అభ్యర్థికా? ఇండియా కూటమి అభ్యర్థికా? అనే ఉత్కంఠ కొనసాగుతున్నవేళ.. ఉపరాష్ట్రపతి ఎన్నికపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.ఉపరాషష్ట్రపతి ఎన్నికపై జరిగేదంతా డ్రామా. బీసీలపై ప్రేమ నోటిపైనేనా.. చేతల్లో ఉండవా. తెలంగాణ నుంచి బీసీ అభ్యర్థిని ఎందుకు నిలబెట్టలేదో రేవంత్రెడ్డి సమాధానం చెప్పాలి. మేం ఏ కూటమిలో లేం. ఉపరాష్ట్రపతి ఎన్నికపై ఎవరూ మమ్మల్ని సంప్రదించలేదు. కానీ, రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన వ్యక్తిని కచ్చితంగా వ్యతిరేకిస్తాం..రాహుల్ గాంధీ మా బాస్ కాదు.. మోదీ మా బాస్ కాదు. ఢిల్లీలో మాకు ఏ బాస్ లేరు. మమ్మల్ని నడిపించేవారెవరూ లేరు. తెలంగాణ ప్రజలే మా బాస్. అందుకే మేం కూర్చుని మాట్లాడుకుని నిర్ణయం తీసుకుంటాం. తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణం మా నిర్ణయం ఉంటుంది. బీజేపీ, కాంగ్రెస్.. రెండూ దౌర్భాగ్యమైన పార్టీలే. కానీ, తెలంగాణకు 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఎవరు తెస్తారో.. వారికే మా మద్దతు ఉంటుంది. సెప్టెంబర్ 9 లోపు ఎవరు ఎరువులు ఇస్తామంటే వారికి మద్దతిస్తాం’’ అని కేటీఆర్ అన్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్కు లోక్సభలో ప్రాతినిధ్యం లేదు. అయితే.. రాజ్యసభలో నలుగురు సభ్యులు ఉన్నారు.

రోహిత్, కోహ్లికి ఊహించని షాకిచ్చిన ఐసీసీ.. ఆకస్మికంగా తొలగింపు
ఐసీసీ తాజాగా (ఆగస్ట్ 20) ప్రకటించిన వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్ టీమిండియా దిగ్గజ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలను భారీ షాక్కు గురి చేశాయి. గత వారం ర్యాంకింగ్స్లో రెండు, నాలుగు స్థానాల్లో ఉన్న ఈ ఇద్దరు.. వారం తిరిగేలోపే ర్యాంకింగ్స్ నుంచి పూర్తిగా మాయమైపోయారు. ఇవాళ (ఆగస్ట్ 20) ప్రకటించిన ర్యాంకింగ్స్లో రోహిత్, కోహ్లి పేర్లు కనిపించలేదు. ఇది చూసి రోహిత్, కోహ్లితో పాటు వారి అభిమానులు కూడా షాక్కు గురవుతున్నారు. ఇంత సడెన్గా తమ ఆరాధ్య ఆటగాళ్ల పేర్లు ఎలా మాయమైపోయాయని ఆశ్చర్యపోతున్నారు. ఇలా జరగడంలో ఐసీసీ తప్పిదమేమైనా ఉందా అని ఆరా తీస్తున్నారు. కొందరేమో రోహిత్, కోహ్లి టీ20, టెస్ట్ తరహాలో వన్డే రిటైర్మెంట్ కూడా సడెన్గా ప్లాన్ చేశారేమోనన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.ఐసీసీ రూల్స్ ఇలా..!ఐసీసీ ర్యాంకింగ్ రూల్స్ ప్రకారం.. ఓ ఆటగాడు 9-12 నెలల కాలంలో సంబంధింత ఫార్మాట్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోతే ర్యాంకింగ్స్ నుంచి తొలగిస్తారు. అయితే తాజా ఉదంతంలో రోహిత్, కోహ్లి విషయంలో అలా జరగలేదు. వీరిద్దరు మార్చి 9న, అంటే ఐదు నెలల కిందట ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడారు. ఈ లెక్కన రోహిత్, కోహ్లి పేర్లు సడెన్గా వన్డే ర్యాంకింగ్స్ నుంచి తొలగించడానికి వీల్లేదు.మరి ఏం జరిగి ఉంటుంది..?రోహిత్, కోహ్లి పేర్లు వన్డే ర్యాంకింగ్స్ నుంచి ఆకస్మికంగా తొలగించడం వెనుక ఏదైనా కుట్ర (బీసీసీఐ) దాగి ఉందా అని వారి అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. టీ20, టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన ఈ ఇద్దరు 2027 వన్డే వరల్డ్కప్ వరకు ఈ ఫార్మాట్లో కొనసాగుతామని పరోక్షంగా చెప్పారు. అయితే ఈ విషయంలో బీసీసీఐ సానుకూలంగా లేదని తెలుస్తుంది.రోహిత్, కోహ్లి రెండు ఫార్మాట్లలో లేకపోయినా యువ ఆటగాళ్లతో టీమిండియా పటిష్టంగా ఉందని వారి భావన. వీరిద్దరు వన్డేల నుంచి తప్పుకున్నా జట్టుపై పెద్ద ప్రభావముండదని వారి అభిప్రాయం. ఇప్పటి నుంచే వన్డేల్లో రోహిత్, కోహ్లి ప్రత్యామ్నాయాలకు తగినన్ని అవకాశాలిస్తే 2027 వరల్డ్కప్ సమయానికి రాటుదేలతారని వారి అంచనా. ఇవన్ని దృష్టిలో పెట్టుకొని బీసీసీయే రోహిత్, కోహ్లిలను బలవంతంగా వన్డేల నుంచి తప్పుకునేలా చేస్తుందన్న వాదన వినిపిస్తుంది. ఇందులో భాగంగానే వారి పేర్లను వన్డే ర్యాంకింగ్స్ నుంచి తొలగించేలా ఐసీసీకి లేఖ రాసి ఉంటుందని ప్రచారం జరుగుతుంది. దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేనప్పటికీ.. ఇదే జరిగి ఉంటుందని రోహిత్, కోహ్లి అభిమానులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.ఇదిలా ఉంటే, వన్డే ర్యాంకింగ్స్ నుంచి రోహిత్, కోహ్లి పేర్లు తొలగింపు తర్వాత కూడా శుభ్మన్ గిల్ టాప్ ర్యాంక్లో కొనసాగుతున్నాడు. బాబర్ ఆజమ్ రెండో స్థానానికి ఎగబాకాడు. టీమిండియా నుంచి శ్రేయస్ అయ్యర్ ఆరో స్థానంలో ఉన్నాడు.

మరో అద్భుతం భారతీయ రైల్వే ఖాతాలో..
ఈ మధ్యకాలంలో ఇండియన్ రైల్వేస్ ఎన్నో అద్భుత ఘట్టాలను సాధించింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఆర్చ్ బ్రిడ్జ్, పొడవైన రైల్వే టన్నెల్, చారిత్రక పాంబన్ బ్రిడ్జ్.. ఇలాంటి నిర్మాణాల తర్వాత ఇప్పుడు మరో ‘వావ్’ ఫీట్ను సాధించింది. అదే.. దేశంలోనే అత్యంత పొడవైన గ్రేడ్ సెపరేటర్ బ్రిడ్జ్ పూర్తి చేయడం. కట్నీ జంక్షన్లో ఇంజినీరింగ్ అద్భుతం.. మధ్యప్రదేశ్లోని కట్నీ జంక్షన్ వద్ద ఈ గ్రేడ్ సెపరేటర్ బ్రిడ్జి ఉంది. ఈ బ్రిడ్జ్ మొత్తం 33.40 కిలోమీటర్లు పొడవు. ఇందులో ఒకటి "అప్" ట్రైన్ల కోసం (ఇప్పటికే పూర్తయింది). మరొకటి "డౌన్" ట్రైన్ల కోసం.. ఇది 17.52 కిలోమీటర్ల పొడవుతో ఇంకా నిర్మాణంలో ఉంది. అప్ బ్రిడ్జ్ను రైల్వే భద్రతా కమిషనర్ (CRS) ఆమోదించారు. దీంతో అతిత్వరలోనే ఇది ప్రారంభం అయ్యే అవకాశం కనిపిస్తోంది. మొత్తం.. 15.85 కిలోమీటర్ల పొడవుతో, ఫిల్లర్లపైనే నిర్మించిన ఈ ఎలివేటెడ్ ట్రాక్ నగరాన్ని పూర్తిగా మళ్లించి ట్రాఫిక్ను గణనీయంగా తగ్గిస్తుంది.గ్రేడ్ సెపరేటర్ బ్రిడ్జ్ అంటే.. రవాణా మార్గాలు (రోడ్లు, రైల్వేలు) ఒకే స్థాయిలో కాకుండా, వేర్వేరు ఎత్తుల్లో నిర్మించడమన్నమాట. తద్వారా వాటి మధ్య రాకపోకలలో అంతరాయం లేకుండా చేయొచ్చు. అంటే.. సిగ్నల్స్ లేకుండా ప్రయాణించగలవు. తద్వారా ప్రమాదాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. అధిక ట్రాఫిక్ ఉన్న ప్రాంతాల్లో ఇది అత్యంత ఉపయోగకరంగా ఉంటుంది.2020లో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ ఈ ఏడాదిలో పూర్తి కావాలనే టార్గెట్ ఉంది. గతి శక్తి పథకంలో భాగంగా.. ఈ ప్రాజెక్ట్ ప్రధానమంత్రి గతి శక్తి పథకంలో భాగంగా చేపట్టబడింది. "అప్ లైన్" సెపరేటర్ నిర్మాణ ఖర్చు ₹580 కోట్లు కాగా, రెండు సెపరేటర్ల మొత్తం ఖర్చు రూ.1,247.68 కోట్లుగా అంచనా.ట్రాఫిక్ తగ్గింపు, సమయపాలన మెరుగుదల.. దేశంలోనే అతిపెద్ద రైల్వే జెంక్షన్ యార్డ్గా న్యూ కట్నీకి పేరుంది. గూడ్స్ & ప్యాసింజర్ ట్రైన్ల అధిక రాకపోకల వల్ల నిత్యం ఇక్కడ తీవ్ర రద్దీ నెలకొంటోంది. తద్వారా రైళ్ల రాకపోకలపై ఇది తీవ్ర ప్రభావం చూపెడుతోంది. అయితే.. తాజా గ్రేడ్ సెపరేటర్ బ్రిడ్జ్ వాడకంలోకి వస్తే ఈ సమస్య తొలిగిపోనుంది. అదెలాగంటే.. సింగ్రౌలి, బిలాస్పూర్ నుంచి వచ్చే ట్రైన్లు ఇక న్యూ కట్నీ జంక్షన్(కట్నీ ముద్వారా) వద్ద ఆగాల్సిన అవసరం లేదు. కోటా, బీనా వైపు వెళ్లే ట్రైన్లకు ఇది ఎంతో ప్రయోజనం కలిగిస్తుంది. అంటే.. వెస్ట్ సెంట్రల్, సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేజోన్ల నుంచి వచ్చే రైళ్ల రాకపోకలు సునాయసంగా కొనసాగే అవకాశం ఉంటుంది. ప్రయాణ సౌలభ్యం, సరుకు రవాణా మెరుగుదల.. కట్నీని మళ్లించే ట్రైన్లు ఇక నాన్ స్టాప్గా ప్రయాణించగలవు. ధన్బాద్, గయా, ముజఫర్పూర్ వంటి నగరాలకు వెళ్లే ప్రత్యేక ట్రైన్లు కూడా హాల్టింగ్ లేకుండా ముందుకు వెళ్తాయి. అదనంగా.. పవర్ ప్లాంట్లకు బొగ్గు సరఫరా కూడా సకాలంలో జరిగేందుకు వీలు కల్పించనుంది. నిర్మాణంలో వినియోగించిన వనరులు15,000 టన్నుల స్టీల్1.50 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్1.90 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టినాలుగు Rail Over Rail (ROR) బ్రిడ్జ్లు, వాటిలో పొడవైనది 91.40 మీటర్లుఈ అద్భుతమైన నిర్మాణం భారత రైల్వేలు సాధించిన మరో ఘనతగా నిలిచింది. దేశ రవాణా వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చే దిశగా ఇది కీలక అడుగుగా నిపుణులు భావిస్తున్నారు.

‘నేను అరెస్టయితే పదవికి రాజీనామా చేశా’..ప్రతులు చించి హోమంత్రిపై విసిరేసి
సాక్షి న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా లోక్సభలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా లోక్సభలో 130వ రాజ్యాంగ సవరణ బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాల సవరణ బిల్లు, జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ సవరణ ఈ మూడు కీలక బిల్లులను లోక్సభలో ప్రవేశపెట్టారు. అనంతరం, ఆ బిల్లులను జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాల ఆందోళనలతో లోక్సభ అట్టుడికి పోయింది. 30 రోజుల పాటు జైలు శిక్షను అనుభవించిన నేతల పదవులు రద్దయ్యేలా కేంద్ర హోంమంత్రి అమిత్షా ప్రవేశపెట్టిన బిల్లుపై ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. ఈ బిల్లుతో రాజకీయ దుర్వినియోగం జరిగే ప్రమాదం ఉందంటూ బిల్లు ప్రతుల్ని చించివేస్తూ ప్రతిపక్ష ఎంపీలు ఆందోళన చేశారు. దీంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 3గంటల వరకు వాయిదా వేశారు.వాయిదాకి ముందు తీవ్రమైన క్రిమినల్ కేసుల్లో అరెస్టయి జైలుకు వెళ్లే ప్రజాప్రతినిధుల పదవులకు చెక్ పెట్టేలా హోమంత్రి అమిత్షా బిల్లును ప్రవేశ పెట్టారు. ఆ సమయంలో ప్రతిపక్ష ఎంపీలు బిల్లు ప్రతుల్ని చించి అమిత్షాపై విసిరేశారు. ఈ బిల్లు దేశ సమాఖ్య విధానానికి పూర్తి విరుద్దం అంటూ నినాదాలు చేశారు. గుజరాత్ హోమంత్రిగా ఉన్నప్పుడు అమిత్షా అరెస్ట్ అయ్యారంటూ ప్రతిపక్ష ఎంపీలు చేసిన ఆరోపల్ని అమిత్షా ఖండించారు.‘అవును ..నన్ను తప్పుడు ఆరోపణలతో అరెస్ట్ చేశారు. నేను అరెస్ట్ అయినప్పుడు చేసినా నైతికంగా పదవికి రాజీనామా చేశాను’ అంటూ ప్రతిపక్ష ఎంపీలను అమిత్షా వారించారు.

టీవీ5 అబద్ధాలకు పరువు నష్టం నోటీసులు ఇవ్వాలి: భూమన
సాక్షి, తిరుపతి: తిరుమలలో బీఆర్ నాయుడు అనేక అరాచకాలు చేస్తున్నారని ఆరోపించారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. బీఆర్ నాయడు బాధ్యతలు చేపట్టిన తర్వాత టీటీడీ ప్రతిష్ట దిగజారుతూ వస్తోందన్నారు. టీటీడీ తప్పులను ప్రశ్నించే వారిని పనిగట్టుకుని వేధిస్తున్నారు అంటూ మండిపడ్డారు. బీఆర్ నాయుడును చూసి వైఎస్సార్సీపీ భయపడదు అంటూ హెచ్చరించారు.టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తాజాగా తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ..‘బొల్లినేని రాజగోపాల్ నాయుడు(బీఆర్ నాయుడు) ఆధ్వర్యంలో టీటీడీ ప్రతిష్ట దిగజారుతోంది. బీఆర్ నాయడు బాధ్యతలు చేపట్టిన తర్వాత టీటీడీ ప్రతిష్ట దిగజారుతూ వస్తోంది. భక్తుల అవస్థలను బీఆర్ నాయుడు పట్టించుకోవడం లేదు. టీటీడీ తప్పులను ప్రశ్నించే వారిని పనిగట్టుకుని వేధిస్తున్నారు. టీవీ-5 ప్రసారం చేసే అబద్ధాలకు వేల సంఖ్యలో పరువు నష్టం నోటీసులు ఇవ్వాలి. బీఆర్ నాయుడు రూ.10వేల కోట్ల పరువు నష్టం ఇవ్వాల్సి ఉంటుంది.బీఆర్ నాయుడు, చంద్రబాబు ప్రజస్వామ్య ద్రోహం చేస్తున్నారు. తిరుమలలో బీఆర్ నాయుడు అనేక అరాచకాలు చేస్తున్నారు. ఆయన అరాచకాలు ప్రజలందరికీ తెలుసు. వైకుంఠ ఏకాదశి రోజున భక్తులను వైకుంఠం పంపించారు. టీటీడీ చైర్మన్ నిర్లక్ష్యంతో అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఆయన నిర్లక్ష్య వైఖరి కారణంగా తొక్కిసలాట జరిగింది. ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. 60 మంది గాయపడ్డారు. తొక్కిసలాట ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. టీటీడీ చైర్మన్ క్షమాపణ చెప్పాలని అంటే మీకు అహం అడ్డు వచ్చింది. బాలాజీ నగర్ కాలనీలో బెల్ట్ షాప్ ఏర్పాటు చేశారు. మద్యం అమ్మకాలు చేయలేదా?. ఢిల్లీలో ఉన్న శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో నాగ ప్రతిష్ఠలపై విజిలెన్స్ విచారణ జరగలేదా?. ఏ నీళ్లతో చేస్తే పాప పరిహారం అవుతుంది అనుకుంటామో.. పాప వినాశనంలో బోట్లు షికారు చేయించారు. మీ హయంలో వైకుంఠ ఏకాదశికి టికెట్ల జారీ కేంద్రం వద్ద తొక్కిసలాట జరిగింది. టీవీ5 చానల్ ద్వారా ఈ వ్యక్తిత్వ హననం చేస్తున్నారు. ఇష్టం వచ్చినట్లుగా వైఎస్సార్సీపీ నాయకులపై మీ చానెల్లో చూపిస్తున్నారు. దీనికి మీపై పదికోట్ల రూపాయలు పరువు నష్టం వేయాలి. ప్రజాస్వామ్యం ఖూనీ చేస్తున్నది మీరు కాదా?. మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటమా?. మీ చానెల్ ప్రతినిధిని పెట్టుకుని మొత్తం వ్యవహారాలు నడిపిస్తున్నారు. కాంట్రాక్టర్లకు ఎవరు బిల్లులు ఇవ్వాలో మీరే చెప్తున్నారు. టీటీడీ చైర్మన్ను చూసి అందరూ నవ్వుకుంటున్నారు. రెండు గంటల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా దర్శనం అన్నారు.. అది ఏమైంది?. మీ సిఫార్సులతో అడిషనల్ ఈవో కార్యాలయంలో టికెట్స్ పొందడం లేదా?. వీఐపీ తగ్గిస్తామని చెప్పి అత్యధికంగా టికెట్లు ఇస్తూ ఉన్నారు. శ్రీవాణి రద్దు చేస్తాము అని చెప్పి, ఈరోజు ఎక్కువ టిక్కెట్లు ఇస్తున్నారు. రద్దు చేసే దమ్ము మీకు ఉందా?. మాపై తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోవాలి. ఒక సాధారణ వ్యక్తి బీఆర్ నాయుడు.. ఇన్ని లక్షల కోట్లకు ఎలా అధిపతి అయ్యాడు?. టీవీ5 చానెల్ ఎలా పెట్టాడు’ అని ప్రశ్నించారు. బీఆర్ నాయుడు ఉడత బెదిరింపులకు ఎవరూ భయపడరు. బీఆర్ నాయుడును చూసి వైఎస్సార్సీపీ భయపడదు. హిందూ ధర్మాన్ని రక్షించడంలో సాక్షి మీడియా ముందుంది’ అని చెప్పారు.

జోరు జోరుగా జోగ్.. క్యూ కడుతున్న టూరిస్టులు
కర్ణాటకలోని మల్నాడ్ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు జోగ్ జలపాతం అద్భుత దృశ్యంతో అలరారుతోంది. భారీ వర్షాల తర్వాత జోగ్ జలపాతం అద్భుతంగా పర్యాటకులను ఆకర్షిస్తోంది. కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలోని సాగర్ తాలూకాలోని షరావతి నదిపై నిర్మించిన లింగనమక్కి ఆనకట్ట గేట్లను ఆగస్టు 19న తెరిచారు. కర్ణాటక పశ్చిమ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాల తర్వాత అదనపు నీటిని విడుదల చేశారు.ఈ ఉత్కంఠభరితమైన దృశ్యాలను చూడటానికి చుట్టు పక్కల గ్రామాలనుంచి ప్రజలు క్యూ కట్టారు. సోషల్ మీడియాలో జోగ్ అందాల వీడియోలు తెగ సందడి చేస్తున్నాయి.JOG Falls, India's 2nd highest , 830 ft Mega water fall, is at its peak now.Near Shivamogga, #Karnataka.pic.twitter.com/sMd2mBT8nq— Mahesh.BR (@Maheshbr4U) August 20, 2025 కర్ణాటకలోని జోగ్ జలపాతాన్ని పర్యాటకులు తరలివస్తున్నారు. పొగమంచులా కనిపిస్తున్న జలదృశ్యాన్ని చూసి ఉప్పొంగిపోతున్నారు. రిజర్వాయర్,ఆనకట్టను నిర్వహించే కర్ణాటక పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (కెపిసిఎల్) అధికారులు ఉదయం 10 గంటల ప్రాంతంలో గేట్లను తెరవడం ప్రారంభించారు. Time to visit #JogFalls !As linganamakki dam is filled & all crest gates are opened on Aug-19thVC: Madhu gowda pic.twitter.com/espIGjmQqY— Karnataka Development Index (@IndexKarnataka) August 20, 2025 మొత్తం 11 గేట్లను తెరిచారు. ఆనకట్టలో నీటి మట్టం ఇన్ఫ్లో పెరగడంతో పాటు 15,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఆగస్టు 19 ఉదయం నాటికి, జలాశయం పూర్తి స్థాయి 1,819 అడుగుల నీటి మట్టం ఉండగా, నీటి మట్టం 1,816.2 అడుగులుగా ఉంది.

పక్కనే ఉంటూ పవన్ స్థాయిని తగ్గించే పనిలో!
ఆంధ్రప్రదేశ్లోని అధికార కూటమిలో ఇటీవలి పరిణామాలను గమనించారా? మంత్రి లోకేశ్ను ఆకాశానికి ఎత్తేస్తున్న వైనం.. ఇంకోపక్క ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ను తక్కువ చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను గమనిస్తే.. రాష్ట్ర భవిష్యత్తు రాజకీయ ముఖచిత్రం ఏమిటన్నది స్పష్టమవుతుంది. ప్రభుత్వ ప్రకటనలన్నింటిలో పవన్ కల్యాణ్ పక్కనే లోకేశ్ ఫొటో కూడా ముద్రిస్తున్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం.. కేంద్ర స్థాయిలో ప్రధాని, రాష్ట్రస్థాయిలో ముఖ్యమంత్రి ఫొటోలను మాత్రమే ప్రచురించాలి. అయితే చాలా రాష్ట్రాలు వీటిని విస్మరిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వ ప్రకటనలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఫొటో కూడా వేస్తున్నారు. ఏపీ పరిస్థితి కూడా ఇదే అయినప్పటికీ ఇటీవలి కాలంలో పవన్తోపాటు లోకేశ్ ఫొటో కూడా వేయడం ఆసక్తికరంగా ఉంది. ఇలాంటి పని ఏదైనా వైస్సార్సీపీ హయాంలో చేసి ఉంటే చంద్రబాబు, టీడీపీ నేతలు ఇల్లెక్కి గగ్గోలు పెట్టేవారు. సుప్రీంకోర్టునే ధిక్కరిస్తారా? అని ప్రశ్నించేవారు. రాజ్యాంగ ఉల్లంఘన కింద పిక్చర్ ఇచ్చేవారు. టీడీపీ మీడియా నానా యాగీ చేసి ఉండేది. కాని ఇప్పుడు లోకేశ్ ఫొటో వేస్తున్నా నోరు మెదపడం లేదు. కూటమి ప్రభుత్వానికి, ఎల్లో మీడియాకు ఉన్న ఆర్థిక, రాజకీయ బంధం అంత బలీయమన్నమాట. విశేషం ఏమిటంటే లోకేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి మాత్రమే. వీటికి సంబంధించిన ప్రకటనల్లో మంత్రి ఫొటో వేస్తే ఫర్వాలేదేమో కానీ.. ఇతర మంత్రిత్వ శాఖల కార్యక్రమాలకు కూడా ఆయా మంత్రులవి కాకుండా లోకేశ్ ఫొటో ముద్రిస్తూండటంతోనే వస్తోంది తేడా. ఏ హోదాలో అలా చేస్తున్నారని ఎవరూ అడగడం లేదు. అధికారులు కూడా అభ్యంతరం చెప్పడం లేదు. లోకేశ్ డిఫాక్టో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలకు ఇలాంటి ఘటనలు మరింత బలం చేకూరుస్తాయి. ప్రస్తుతం చంద్రబాబుకన్నా లోకేశే పవర్ పుల్ అని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబు కూడా తన కుమారుడు లోకేశ్ గురించి పొగుడుతున్నారు. తద్వారా టీడీపీలోను, కూటమి భాగస్వాములైన జనసేన, బీజేపీలకు ఒక సంకేతం పంపుతున్నారన్నమాట. లోకేశ్ను సాధ్యమైనంత త్వరగా సీఎంను చేయాలన్న డిమాండ్ ఆయన అనుచరుల్లో కాని, కుటుంబ సభ్యులు కొందరి నుంచి గట్టిగానే ఉందని చెబుతారు. దానికి పవన్ కళ్యాణ్ వైపు నుంచి ఇబ్బంది వస్తుందని చంద్రబాబు చెప్పి ఉండవచ్చని, పవన్తోసహా, వివిధ వర్గాల వారిని మానసికంగా సిద్దం చేసిన తర్వాత లోకేశ్ను సీఎం పదవిలోకి తీసుకురావచ్చని నచ్చ చెప్పి ఉండవచ్చన్నది టీడీపీ వర్గాలలో ఉన్న భావన. అందుకు తగినట్లుగానే చంద్రబాబు నాయకత్వంలో కూటమి 15 ఏళ్లు అధికారంలో ఉండాలన్న రాగాన్ని పవన్ కల్యాణ్ ఎత్తుకున్నారు. అంటే.. లోకేశ్ను సీఎంగా ఇప్పటికిప్పుడు చేయడానికి ఆయన సుముఖంగా లేరన్నమాట. దాంతో లోకేశ్ను ఉప ముఖ్యమంత్రి చేయాలన్న తలంపును తెచ్చారు. ఇందుకు చంద్రబాబు కూడా రెడీ అయినప్పటికీ, జనసేన నుంచి నిరసన రావడం ఆరంభమైంది. తమ అధినేత పవన్ స్థాయిని తగ్గిస్తారా? అని ప్రశ్నించసాగారు. ఎన్నికల సమయంలో పవన్ ఒక్కరే ఉప ముఖ్యమంత్రిగా ఉంటారన్న అవగాహన ఉందన్నది వారి వాదన. వాస్తవానికి ఈ విషయంలో లోకేశ్ అప్పట్లో క్లారిటీతో మాట్లాడారు. సీఎం పదవిని పవన్కు షేర్ చేయడానికి గాని, ఉప ముఖ్యమంత్రి పదవిని పవన్ ఒక్కరికే కట్టబెట్టడానికిగాని ఆయన సానుకూలంగా మాట్లాడలేదు. ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చే విషయాన్ని సైతం తమ పాలిట్ బ్యూరో చర్చిస్తుందని అన్నారు. అయినా రాజకీయ వ్యూహాల రీత్యా పవన్ ఒక్కరికే చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి ఊరుకున్నారు. లోకేశ్కు డిప్యూటి సీఎం పదవి ఇవ్వడానికి జనసేన వైపు అంత సుముఖత కనిపించకపోవడంతో వ్యూహాత్మకంగా లోకేశ్కు ప్రస్తుతం ఎలివేషన్ ఇచ్చే దిశగా చర్యలు చేపడుతున్నట్లు అనిపిస్తుంది. అందులో భాగంగానే ఇతర శాఖల ప్రచార ప్రకటనలలో కూడా పవన్తోపాటు లోకేశ్ ఫొటో వేయడం ఆరంభించారు. దీనివల్ల లోకేశ్ స్థాయిని పెంచేసినట్లయింది. పవన్ కళ్యాణ్, లోకేశ్లు ఒకటే స్థాయి అని ప్రపంచానికి తెలియ చేసినట్లయింది. పవన్ కళ్యాణ్ కూడా తొలుత కొంత అసౌకర్యంగా ఫీలై ఉండవచ్చు కానీ పదవిని అనుభవించడానికి అలవాటు పడ్డాక, అలాంటి వాటిని పక్కన పెట్టి సర్దుకుపోతున్నారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. పవన్ను ‘అన్నా..’ అని సంబోధిస్తూనే లోకేశ్ తెలివిగా తనమాటే చెల్లుబడి అయ్యేలా చక్రం తిప్పుతున్నారని చెబుతున్నారు.అన్నదాత సుఖీభవ స్కీమ్ కింద తొలి విడత రైతులకు ప్రభుత్వం తరపున రూ.ఐదు వేలు ఇస్తున్న సందర్భంలో వ్యవసాయ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ఫోటో వేయకుండా పవన్ కల్యాణ్ లోకేశ్ ఫోటోలనే వేశారు. అలాగే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం స్కీమ్ అమలు ప్రచార ప్రకటనలో సైతం రవాణాశాఖ మంత్రి రామ ప్రసాదరెడ్డికి బదులు లోకేశ్ ఫొటో వేశారు. తద్వారా ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టకపోయినా, పవన్, లోకేశ్లది ఒకటే స్థాయి అన్న సంకేతాన్ని ప్రజలకు ఇవ్వగలిగారన్న విశ్లేషణలు వస్తున్నాయి.అంతకుముందు లోకేశ్కు డిప్యూటి సీఎం పదవి ఎలా ఇస్తారని గొణిగిన జనసేన వర్గాలు కూడా నోరు మెదపలేకపోతున్నాయి. దీనివల్ల తమ నేత స్థాయి తగ్గిందని జనసేన క్యాడర్ భావిస్తున్నప్పటికి, పవన్ కి లేని బాధ తమకు ఎందుకులే అని సరిపెట్టుకుంటున్నారట. టీడీపీలో కాబోయే సీఎం లోకేశ్ అన్న సంగతేమి రహస్యం కాదు. అయితే ఎప్పుడు అవుతారన్నదే చర్చగా ఉంది. ఈ టర్మ్లోనే కావచ్చని కొందరు, వచ్చే ఎన్నికల సమయంలో అభ్యర్ధిగా ప్రకటించవచ్చని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఆ పదవిని వెంటనే తన కొడుక్కు ఇవ్వదలిస్తే చంద్రబాబు ఒక్కరోజులో చేయవచ్చు. కాని ఆయన ఇప్పటికిప్పుడు ముఖ్యమంత్రి పదవిని వదలి ఒక రకంగా రాజకీయ సన్యాసం తీసుకోవడానికి, సిద్దపడకపోవచ్చు. కాకపోతే పార్లమెంటుకు వెళ్లాలని అనుకుంటే అనుకోవచ్చేమో! ఆయనకు ఆరోగ్యరీత్యా కూడా పెద్ద ఇబ్బందులు లేవు. లోకేశ్కు సీఎం పదవి ఇస్తే పార్టీ గట్టిగానే ఉంటుందా? లేదా? అన్న మీమాంస ఆయనకు ఉండవచ్చు.అలాగే ప్రభుత్వాన్ని సమర్థంగా నడిపి అందరిని కలుపుకుని వెళ్లగలరా? లేదా?అన్నదానిపై కూడా ఆలోచన చేస్తుండవచ్చు. మానసికంగా తయారు చేయకుండా లోకేశ్ కు ప్రమోషన్ ఇస్తే సమస్యలు వస్తాయని ఆయన భావిస్తుండవచ్చు. అయితే ఏ పని చేసినా దాన్ని సమర్థించే దశకు పవన్ కల్యాణ్ను తీసుకు రాగలిగారు. పవన్ కల్యాణ్ అవసరాలు తీరుస్తూ ఆయనకు ప్రత్యేక విమానాలు, హెలికాఫ్టర్లులు సమకూర్చడం ద్వారా గౌరవిస్తున్నట్లు కనిపిస్తే సరిపోతుందన్న అభిప్రాయం కూటమి నేతలలో ఉందట. అందువల్లే టీడీపీ నేతలకన్నా పవనే ఎక్కువ విధేయతను కనబరచుతున్నారని ఆ పార్టీ వారు అభిప్రాయపడుతున్నారు. జనసేన వైపు నుంచి ఎవరూ టీడీపీని ప్రశ్నించరాదని పవన్ సోదరుడు నాగబాబు స్పష్టంగా చెప్పడం, అలా ప్రశ్నించే వారు ఎవరైనా ఉంటే పార్టీని వదలి వెళ్లవచ్చని ఒక ఎమ్మెల్యేకే పవన్ హెచ్చరిక చేయడం వంటివాటిని ఉదాహరణలుగా చూపుతున్నారు. దీంతో లోకేశ్ను సీఎంగా చేసినా పవన్ కల్యాణ్ పెద్దగా అభ్యంతరం పెట్టకవచ్చన్న భావన ఇటీవలి కాలంలో బలపడుతోందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో.. లోకేశ్కు ఎలివేషన్ ఇవ్వడానికి చంద్రబాబు, టీడీపీ నేతలు యత్నిస్తున్నారు. ప్రచార ప్రకటనలలో ఫోటోలు వేయడం, తల్లికి వందనం స్కీమ్ లోకేశే కనిపెట్టారని ప్రకటించడం, అలాగే ఆయా ప్రసంగాలలో లోకేశ్ చేసిన వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయాలు చేస్తామని చంద్రబాబు చెప్పడం ఒక వ్యూహం ప్రకారమే జరుగుతున్నాయి. లోకేశ్ కుటుంబ సమేతంగా ప్రధాని మోడీతో ప్రత్యేకంగా భేటీ అవడం, ఢిల్లీ వెళ్లిన సందర్భాలలో ఆయా కేంద్ర మంత్రులను కలవడం, వాటికి సంబంధించిన వార్తలు ప్రముఖంగా వచ్చేలా చేయడం వంటివి చేస్తున్నారు. తప్పు కాదు కానీ... లోకేశ్ రాజకీయ అపరిపక్వత, కక్షపూరిత ధోరణి, రెడ్బుక్ అంటూ ప్రజల దృష్టిలో ముఖ్యంగా ప్రత్యర్ధి రాజకీయ పార్టీల దృష్టిలో విలన్గా కనిపిస్తుండడం వంటివి ఆయనకు నష్టం చేయవచ్చన్న ఆందోళన తెలుగుదేశం వర్గాలలో ఉంది.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

మొబైళ్లను 5% జీఎస్టీ శ్లాబ్లో చేర్చాలి
మొబైల్ ఫోన్లు, పరికరాలను, నిత్యావసర ఉత్పత్తుల కోసం ఉద్దేశించిన 5 శాతం జీఎస్టీ శ్లాబ్లో చేర్చాలని కేంద్రానికి ఇండియా సెల్యూలార్ అండ్ ఎల్రక్టానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం అమలు చేస్తున్న 18 శాతం జీఎస్టీ తిరోగమన విధానమని పేర్కొంది. నాలుగు శ్లాబులుగా ఉన్న జీఎస్టీ రేట్లను రెండింటికి తగ్గించేలా కేంద్రం ప్రతిపాదనలు చేసిన నేపథ్యంలో ఐసీఈఏ విజ్ఞప్తి ప్రాధాన్యం సంతరించుకుంది.ప్రస్తుతం మొబైల్ ఫోన్లనేవి విలాస వస్తువులుగా గాకుండా విద్య, వైద్యం, ఆర్థిక సమ్మిళితత్వం, గవర్నెన్స్కి సంబంధించి అత్యవసర డిజిటల్ మౌలిక సదుపాయాలకు కీలకంగా మారాయని ఐసీఈఏ చైర్మన్ పంకజ్ మహీంద్రు తెలిపారు. ఈ నేపథ్యంలో ఎలక్ట్రానిక్స్ వ్యవస్థను 500 బిలియన్ డాలర్లకు పెంచుకోవాలన్న లక్ష్యానికి అనుగుణంగా మొబైల్స్ను అయిదు శాతం జీఎస్టీలో చేర్చాలని కోరారు. జీఎస్టీ ప్రవేశపెట్టడానికి ముందు చాలా రాష్ట్రాలు మొబైల్ ఫోన్లను నిత్యావసర ఉత్పత్తులుగా గుర్తించి, వాటిపై 5 శాతం వ్యాట్ (విలువ ఆధారిత పన్ను) మాత్రమే విధించాయని మహీంద్రూ చెప్పారు.ఇదీ చదవండి: అల్ట్రాటెక్ 200 ఎంటీపీఏ సామర్థ్యంఅయితే, జీఎస్టీని ప్రవేశపెట్టాక ముందు 12 శాతం శ్లాబ్లో ఉంచి ఆ తర్వాత 2020లో 18 శాతానికి మార్చారని మహీంద్రూ గుర్తు చేశారు. దీనితో అందుబాటు ధరల్లో మొబైల్స్ లభ్యతపైనా, అమ్మకాల పరిమాణంపైనా ప్రతికూల ప్రభావం పడిందని చెప్పారు. మొబైల్స్ వార్షిక వినియోగం 30 కోట్ల యూనిట్ల నుంచి 22 కోట్లకు తగ్గిపోయిందని వివరించారు. కాబట్టి వీటిని అయిదు శాతం శ్లాబ్లోకి చేర్చడాన్ని మినహాయింపుగా భావించరాదని, కరెక్షన్గా పరిగణించాలని మహీంద్రూ చెప్పారు. 2015 ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా రూ. 18,900 కోట్లుగా ఉన్న మొబైల్ ఫోన్ల ఉత్పత్తి 2025 ఆర్థిక సంవత్సరంలో రూ. 5.45 లక్షల కోట్లకు చేరింది.

టాప్ కంపెనీలో 2,800 ఉద్యోగాలు కట్
కృత్రిమ మేధ (ఏఐ) మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులను వేగవంతం చేయడానికి ఉద్దేశించిన పునర్నిర్మాణ వ్యూహంలో భాగంగా ఒరాకిల్ కార్పొరేషన్ భారతదేశంలోని శ్రామిక శక్తిని తగ్గిస్తుంది. దేశంలోని కంపెనీ ఉద్యోగుల్లో దాదాపు 10% మందిని తొలగించాలని నిర్ణయించింది. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, ముంబై, పుణె, నోయిడా, కోల్కతా వంటి కీలక ప్రాంత్రాల్లో సుమారు 28,824 మంది ఉద్యోగులు ఒరాకిల్లో పని చేస్తున్నారు. వీరిపై ప్రభావంపడే అవకాశం ఉంది.కంపెనీ ప్రకటించిన లేఆఫ్స్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, క్లౌడ్ సేవలు, కస్టమర్ బేస్పై నిమగ్నమైన బృందాలను తీవ్రంగా దెబ్బతీస్తాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. కొన్ని క్యాంపస్ల్లో ఈ తొలగింపులు ఆకస్మికంగా ఉన్నాయని, తొలగింపు ప్యాకేజీలు లేదా అంతర్గత పునర్విభజన ఎంపికల ఊసే లేదని చెబుతున్నారు. యాజమాన్యం నుంచి ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండానే ఊహించని విధంగా నోటీసులు రావడంతో ఆందోళన చెందుతున్నారు. పునర్నిర్మాణ వ్యూహంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఒరాకిల్ ఒక ప్రకటనలో ధ్రువీకరించింది.ఇదీ చదవండి: ఈ-కామర్స్, టెక్ స్టార్టప్ల్లో ఫ్రెషర్లకు అవకాశాలుగత నెలలో అమెరికాలో 4.5 గిగావాట్ల డేటా సెంటర్ పవర్ కోసం ఓపెన్ఏఐ ఓరాకిల్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఒరాకిల్ డేటా సెంటర్ల నుంచి భారీ మొత్తంలో కంప్యూటింగ్ పవర్ను అద్దెకు తీసుకునేందుకు ఓపెన్ఏఐ అంగీకరించింది. తర్వాత ఒరాకిల్ స్టాక్ ఆల్టైమ్ గరిష్టానికి దగ్గరగా చేరింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మౌలిక సదుపాయాల్లో 500 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టడానికి ఒరాకిల్ సాఫ్ట్బ్యాంక్ గ్రూప్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ లేఆఫ్స్ తరుణంలో ఉద్యోగులు తమ నైపుణ్యాలు మెరుగుపరుచుకుని, మెరుగైన పనితీరు కనబరచాలని నిపుణులు చెబుతున్నారు. భవిష్యత్తు ఏఐపై ఆధారపడబోతోందని స్పష్టమైన సంకేతాలు వస్తున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన స్కిల్స్పై ఎక్కువ దృష్టి సారించాలని చెబుతున్నారు.
ప్రపంచ నంబర్ వన్ బౌలర్గా కేశవ్ మహారాజ్.. పడిపోయిన కుల్దీప్ యాదవ్
టీడీపీ ఎమ్మెల్యే బహిరంగ క్షమాపణ చెప్పాలి: ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిమాండ్
నిశ్చితార్థం తర్వాత రాహుల్ సిప్లిగంజ్ ప్రత్యేక పూజలు
ప్రభాస్ ఈ రేంజ్కు వెళ్తాడని అస్సలు ఊహించలేదు: హీరోయిన్
రిసెప్షన్లో డ్యాన్స్ చేస్తూనే ప్రాణాలొదిలేసింది: వైరల్ వీడియో
లాభాల్లో స్టాక్మార్కెట్లు.. నిఫ్టీ మళ్లీ 25000 మార్క్
సచిన్ కంటే వినోద్ కాంబ్లీ బెటర్?.. నేనెప్పుడూ వినలేదు.. ఇద్దరూ సమానమే
‘‘రాహుల్ గాంధీ మా బాస్ కాదు..’’ ఉపరాష్ట్రపతి ఎన్నికపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
రోహిత్, కోహ్లికి ఊహించని షాకిచ్చిన ఐసీసీ.. ఆకస్మికంగా తొలగింపు
సలాం సఫురా..! నెటిజన్ల మనసు గెలుచుకున్న మహిళా డ్రైవర్..
కోట శ్రీనివాసరావు ఇంట మరో విషాదం
సడెన్గా సింగర్ 'రాహుల్ సిప్లిగంజ్' నిశ్చితార్థం
AP: మాకు ఉచితం లేదా
ఊపిరి పీల్చుకున్న పసిడి ప్రియులు.. తులం ఎంతంటే..
నందమూరి కుటుంబంలో విషాదం
నిలిపేసిన పాలసీల పునరుద్ధరణ
కొత్తింట్లో గృహప్రవేశం చేసిన బిగ్బాస్ మానస్
ఈ రాశి వారికి ఆర్థికాభివృద్ధి.. వ్యాపారాలలో పురోభివృద్ధి
ఈ రాశి వారికి ధన, వస్తులాభాలు.. సంఘంలో పేరుప్రతిష్ఠలు
ఎన్ని ప్రోత్సాహకాలు ప్రకటించినా మన జనం పిల్లల్ని కనడంలేదని మంచి పని చేస్తున్నార్సార్!!
బెడిసికొట్టినా సరే.. ఏపీలో మొదలైన ఉచిత బస్సు కష్టాలు! (చిత్రాలు)
అందుకే శ్రేయస్ అయ్యర్ను సెలక్ట్ చేయలేదు: కుండబద్దలు కొట్టిన అగార్కర్
అదే మన సమాధానం అని చెప్పండి!
ఈ రాశి వారికి భూలాభం.. శుభవార్తలు
‘ఆసియా కప్- 2025: టీమిండియా ఓపెనర్గా వైభవ్ సూర్యవంశీ!’
కంగారు పడక్కర్లేద్సార్! అది అమెరికాలో!!
సారాకు సానియా సలహా.. అర్జున్ టెండుల్కర్ రియాక్షన్ వైరల్!
వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం
వన్డే క్రికెట్లో సరికొత్త సంచలనం.. రికార్డు స్కోర్లతో దూసుకుపోతున్న సౌతాఫ్రికా బ్యాటర్
ఏదయినా ఫలితం దక్కుతుందేమోనని ఇక్కడికొచ్చి అదే మాటను చెబుతున్నాడు!
ప్రపంచ నంబర్ వన్ బౌలర్గా కేశవ్ మహారాజ్.. పడిపోయిన కుల్దీప్ యాదవ్
టీడీపీ ఎమ్మెల్యే బహిరంగ క్షమాపణ చెప్పాలి: ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిమాండ్
నిశ్చితార్థం తర్వాత రాహుల్ సిప్లిగంజ్ ప్రత్యేక పూజలు
ప్రభాస్ ఈ రేంజ్కు వెళ్తాడని అస్సలు ఊహించలేదు: హీరోయిన్
రిసెప్షన్లో డ్యాన్స్ చేస్తూనే ప్రాణాలొదిలేసింది: వైరల్ వీడియో
లాభాల్లో స్టాక్మార్కెట్లు.. నిఫ్టీ మళ్లీ 25000 మార్క్
సచిన్ కంటే వినోద్ కాంబ్లీ బెటర్?.. నేనెప్పుడూ వినలేదు.. ఇద్దరూ సమానమే
‘‘రాహుల్ గాంధీ మా బాస్ కాదు..’’ ఉపరాష్ట్రపతి ఎన్నికపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
రోహిత్, కోహ్లికి ఊహించని షాకిచ్చిన ఐసీసీ.. ఆకస్మికంగా తొలగింపు
సలాం సఫురా..! నెటిజన్ల మనసు గెలుచుకున్న మహిళా డ్రైవర్..
కోట శ్రీనివాసరావు ఇంట మరో విషాదం
సడెన్గా సింగర్ 'రాహుల్ సిప్లిగంజ్' నిశ్చితార్థం
AP: మాకు ఉచితం లేదా
నందమూరి కుటుంబంలో విషాదం
ఊపిరి పీల్చుకున్న పసిడి ప్రియులు.. తులం ఎంతంటే..
నిలిపేసిన పాలసీల పునరుద్ధరణ
కొత్తింట్లో గృహప్రవేశం చేసిన బిగ్బాస్ మానస్
ఈ రాశి వారికి ఆర్థికాభివృద్ధి.. వ్యాపారాలలో పురోభివృద్ధి
ఈ రాశి వారికి ధన, వస్తులాభాలు.. సంఘంలో పేరుప్రతిష్ఠలు
ఎన్ని ప్రోత్సాహకాలు ప్రకటించినా మన జనం పిల్లల్ని కనడంలేదని మంచి పని చేస్తున్నార్సార్!!
అందుకే శ్రేయస్ అయ్యర్ను సెలక్ట్ చేయలేదు: కుండబద్దలు కొట్టిన అగార్కర్
అదే మన సమాధానం అని చెప్పండి!
ఈ రాశి వారికి భూలాభం.. శుభవార్తలు
‘ఆసియా కప్- 2025: టీమిండియా ఓపెనర్గా వైభవ్ సూర్యవంశీ!’
కంగారు పడక్కర్లేద్సార్! అది అమెరికాలో!!
సారాకు సానియా సలహా.. అర్జున్ టెండుల్కర్ రియాక్షన్ వైరల్!
వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం
వన్డే క్రికెట్లో సరికొత్త సంచలనం.. రికార్డు స్కోర్లతో దూసుకుపోతున్న సౌతాఫ్రికా బ్యాటర్
ఏదయినా ఫలితం దక్కుతుందేమోనని ఇక్కడికొచ్చి అదే మాటను చెబుతున్నాడు!
సాక్షి కార్టూన్ 19-08-2025
సినిమా

సినీకార్మికుల సమ్మె.. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: సినీకార్మికుల సమ్మె (Tollywood Cinema Workers Strike) విషయంలో తెలంగాణ సర్కార్ జోక్యం చేసుకుంది. 17 రోజులుగా సాగుతున్న కార్మికుల సమ్మె ప్రభావం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సినిమా పాలసీపై పడుతుందని ప్రభుత్వ అభిప్రాయపడుతోంది. ఈ క్రమంలో ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్ నాయకులతో చర్చించి సమస్య పరిష్కరించాలని ప్రభుత్వ ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆదేశించారు.సమ్మె ఎఫెక్ట్హైదరాబాద్ను సినిమా హబ్గా చేయాలనే తెలంగాణ సర్కార్ ఆలోచనకు సినీ కార్మికుల సమ్మె అడ్డంకిగా మారింది. నగరంలో జరుగుతున్న తెలుగు సినిమాలతో పాటు ఇతర భాషల సినిమా షూటింగ్స్ నిలిచిపోవడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఫిలిం ఛాంబర్ ప్రతినిధులతో ఇప్పటికే చర్చించిన ఉన్నతాధికారులు ఈరోజు ఫెడరేషన్ నాయకులతో చర్చలు జరపనున్నారు. కాసేపట్లో ఫెడరేషన్ నాయకులతో డీజీపీ సమావేశం కానున్నారు. మరోవైపు ఈరోజు సాయంత్రం మూడు గంటలకు నిర్మాతలతో, నాలుగు గంటలకు ఫెడరేషన్ నాయకులతో ఫిల్మ్ ఛాంబర్ కీలక చర్చలు జరపనుంది.చదవండి: ‘గుంజి గుంజి’ సాంగ్ రిలీజ్.. అదిరిపోయే స్టెప్పులేసిన ఆటిట్యూడ్ స్టార్

'వార్ 2' ఎఫెక్ట్.. నాగవంశీకి బిగ్ ఆఫర్?
రెండు పెద్ద సినిమాలు ఒకేరోజు విడుదల కావడంతో బాక్సాఫీస్ దగ్గర పెద్ద యుద్ధమే జరిగింది. హిందీ బెల్ట్లో ‘వార్ 2’ హవా కనిపించగా.. దక్షిణాదిలో రజనీ ‘కూలీ’ జోరు కనిపించింది. హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన "వార్ 2" తెలుగు చిత్ర పరిశ్రమలో అనుకున్నంత రేంజ్లో కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. కానీ, హిందీ బెల్ట్లో దుమ్మురేపుతుంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ. 400 కోట్లకు దగ్గరగా వార్2 కలెక్షన్స్ ఉన్నాయి. అయితే, వార్ 2 తెలుగు హక్కులను నిర్మాత నాగవంశీ సుమారు రూ. 80 కోట్ల వరకు కొనుగోలు చేసినట్లు వార్తలు వచ్చాయి. టాలీవుడ్లో అనుకున్నంతగా వార్2 కలెక్షన్స్ రాకపోవడంతో యశ్రాజ్ ఫిల్మ్స్ సంస్థ కొంత రిటర్న్ ఇచ్చేందుకు సిద్ధం అవుతుందని వార్తలు వస్తున్నాయి.టాలీవుడ్లో 'సితార ఎంటర్టైన్మెంట్స్' బ్యానర్పై 'వార్ 2' చిత్రాన్ని నిర్మాత నాగవంశీ విడుదల చేశారు. సుమారు రూ. 80 కోట్లకు కొనుగోలు చేసిన ఆయన సులువుగా రూ. రూ. 100 కోట్లకు పైగానే రాబడుతుందని అంచనా వేశారు. కానీ, ఈ చిత్రం విడుదలైన మొదటిరోజు నుంచే కొందరు కావాలనే ట్రోలింగ్ చేయడం ప్రారంభించారు. ముఖ్యంగా ఏపీలో తెలుగు దేశం పార్టీ క్యాడర్ జూనియర్ ఎన్టీఆర్ సినిమాకు మద్దతు ఇవ్వడం మానేసింది. వారు కూలీ సినిమా చూడాలని పెద్ద ఎత్తున సోషల్మీడియాలో సూచించారు. అదే సమయంలో వార్2 చిత్రంపై తీవ్రమైన ట్రోలింగ్కు దిగారు. దీంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్పై ప్రభావం పడింది.బాలీవుడ్ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ చాలా ప్రొఫెషనల్గానే ఢీల్ సెట్ చేసుకుంటుంది. ఈ సినిమాను కొనుగొలు చేసిన నాగవంశీకి కొంత ఉపశమనం అందించడానికి ఆ సంస్థ ముందుకు వచ్చిందని సమాచారం. నాగ వంశీతో పాటు అతని భాగస్వాములకు రూ. 22 కోట్లు తిరిగి ఇవ్వడానికి యష్ రాజ్ సంస్థ అంగీకరించినట్లు బాలీవుడ్ సమాచారం. నైజాంకు రూ. 10 కోట్లు, ఏపీకి రూ.7 కోట్లు, సీడెడ్కు రూ. 5 కోట్ల వరకు ఇచ్చేందుకు గ్రీన్ లభించిందట. అయితే, హిందీలో ఈ చిత్రానికి ఎలాంటి నష్టం లేదని తెలుస్తోంది.

నాగచైతన్యపై సెటైర్లు వేసిన ఈ బుడ్డొడు..ఇలా మారిపోయాడేంటి?
‘100% లవ్’ సినిమాలో బొద్దుగా ఉండే ఓ బుడ్డొడు గుర్తున్నాడా..? చదువు.. చదువు అంటూ బాలు(నాగచైతన్య) పెట్టే టార్చర్ భరించలేక మహాలక్ష్మీ(తమన్నా)తో చేతులు కలుపుతాడు. మహాలక్ష్మీకి ఫస్ట్ ర్యాంక్ వచ్చిన తర్వాత బాలు ముద్దే చికెన్ తింటూ..‘ఎవడ్రా చికెన్ తింటే బ్రెయిన్ పని చేయదని చెప్పింది?’ అంటూ నాగచైతన్యపై సెటైర్లు వేసి అందరిని కడుపుబ్బా నవ్వించాడు. ఆ బుడ్డొడు ఇప్పుడు చాలా పెద్దవాడైపోయాడు. గడ్డం, మీసాలు పెంచి హీరోలా మారిపోయాడు. అతని పేరు నిఖిల్ అబ్బూరి. #90s సిరీస్ ఫేమ్ మౌళి హీరోగా తెరకెక్కుతున్న లిటిల్ హార్ట్స్ సినిమాలో కీలక పాత్ర పోషించాడు. తాజాగా ఈ చిత్రం టీజర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హీరో మౌళి.. నిఖిల్ని పరిచయం చేశాడు. 100% సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా చేశాడంటూ మౌళి చెప్పేవరకు ఆ బుడ్డోడే ఈ నిఖిల్ అని ఎవరూ గుర్తుపట్టలేదు. ఆ సినిమా నిర్మాత బన్నీవాసు సైతం నిఖిల్ని గుర్తుపట్టలేకపోయాడు. అంతలా మారిపోయాడు మనోడు. టీజర్ ఈవెంట్కి గెస్ట్గా వచ్చిన అనిల్ రావిపూడి సైతం నిఖిల్ని చూసి ఆశ్చర్యపోయాడు. ‘100% లవ్ సినిమాలో చికెన్ తిన్నది నువ్వేనా? గుర్తుపట్టలేకపోయాను నాన్న.. ’ అంటూ నిఖిల్ని స్టేజ్పైకి పిలిచి అభినందించాడు. ప్రభాస్ ‘మిర్చి’, రామ్ ‘గణేశ్’తో పాటు పలు సినిమాల్లోనూ చైల్డ్ ఆర్టిస్ట్గా నటించిన నిఖిల్..ఇప్పుడు హీరోగా ట్రై చేస్తున్నాడు. లిటిల్ హార్ట్స్ సినిమాలో హీరో ఫ్రెండ్ పాత్రని పోషించాడు. ఈ చిత్రం ఆగస్ట్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. #100%Love లో చికెన్ తిన్నది నువ్వేనా? గుర్తుపట్టలేదు నాన్న నిన్ను.... pic.twitter.com/AzUhCTxHCh— Rajesh Manne (@rajeshmanne1) August 19, 2025

ఎన్టీఆర్ కోసం జపాన్ నుంచి వచ్చిన అభిమాని.. వీడియో వైరల్
జూనియర్ ఎన్టీఆర్ పేరు చెబితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన అభిమానులు కాలర్ ఎగరేస్తారు.. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఆయనకు అంతర్జాతీయ స్థాయిలో ఫ్యాన్స్ ఉన్నారు. జపాన్లో ఎన్టీఆర్ ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి భారత సినీ ఇండస్ట్రీనే ఆశ్చర్యపోయింది. ఏకంగా ఆయన పేరుతో అక్కడ ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఏర్పాటు అయ్యాయి అంటే ఎవరికైనా అర్థం అయిపోతుంది. తారక్ నటించిన పలు సినిమాల్లోని పాటలకు జపాన్లోని హీరో మునిరు, అశాహి ససాకీలతో పాటు అభిమానులు డ్యాన్సులు చేశారు. వాటికి మిలియన్ల కొద్ది వ్యూస్ వచ్చాయి. అయితే, ఇప్పుడు వార్2 సినిమా చూసేందుకు జపాన్ నుంచి తారక్ అభిమాని ఇండియాకు వచ్చింది. ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.జపాన్కు చెందిన 'క్రిసో' వార్2 చిత్రాన్ని చూసేందుకు భారత్ వచ్చింది. ఢిల్లీ ఎయిపోర్ట్లో తారక్ ఫోటోతో ఉన్న టీ షర్ట్ ధరించి ఆమె కనిపించింది. ఈ క్రమంలోనే ఒక నెటిజన్ ఆమెను పలకరించారు. ఇండియా ఎందుకు వచ్చారని ప్రశ్నిస్తే.. ఆమె ఇలా చెప్పింది. ' నేను ఎన్టీఆర్కు చాలా పెద్ద అభిమానిని, ఆయన సినిమా చూసేందుకే ఇండియా వచ్చాను. ఆయన నటించిన సినిమా ఏదైనా సరే భారత్లో చూడాలని ఇక్కడికి వస్తుంటాను. గతంలో కూడా వచ్చాను.' అని పంచుకుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.జపాన్లో జూనియర్ ఎన్టీఆర్కు మంచి ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా ఆయన ఎనర్జిటిక్ డ్యాన్స్లు, యాక్షన్ సీన్స్కి అక్కడి ప్రేక్షకులు బాగా ఆకర్షితులవుతున్నారు. ‘బాద్షా’ సినిమాకే జపాన్లో ఫ్యాన్స్ ఉండగా.. ‘ఆర్ఆర్ఆర్’తో ఆయనకు గ్లోబల్ రేంజ్లో గుర్తింపు వచ్చింది. దేవర సినిమా విడుదల సమయంలో ఎన్టీఆర్ కూడా జపాన్ వెళ్లి తన అభిమానులను కలుసుకున్నారు. View this post on Instagram A post shared by ARS CineVerse | ARS ప్రయాణ ప్రపంచం (@arflyerar)
న్యూస్ పాడ్కాస్ట్

దివ్యాంగుల జీవితాల్లో పింఛను చిచ్చు... అనర్హులని పేర్కొంటూ పింఛను నిలిపివేస్తున్నట్టు ఏపీలో కూటమి ప్రభుత్వం నోటీసులు

మాతోనే బేరసారాలా?. మద్యం కేసులో ప్రాసిక్యూషన్ తీరుపై ఏసీబీ ప్రత్యేక కోర్టు తీవ్ర ఆక్షేపణ

ఆంధ్రప్రదేశ్లో కారుచౌకగా భూముల విక్రయాలు.. ఎంత భూమైనా 99 పైసలకే.. ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్ హబ్స్..

ఏపీలో విద్యుత్ కొనుగోలులో మరో కనికట్టు... అధిక ధరకు సోలార్ విద్యుత్ ఒప్పందాలు కుదుర్చుకుంటున్న కూటమి ప్రభుత్వం

ఎర్రకోట సాక్షిగా పాకిస్తాన్కు ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరిక

రిగ్గింగ్ ఎన్నికల్లో సిగ్గుపడే గెలుపు.. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అడ్డదారిలో టీడీపీ విజయం

చంద్రబాబు మోసకారి... పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పట్టపగలు ప్రజాస్వామ్యం ఖూనీ...

ఎన్నికలకే కళంకం!. అత్యంత దుర్మార్గంగా పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నిక పోలింగ్. పిండారీలు, థగ్గులు, బందిపోట్లు తమ ముందు దిగదుడుపేనని చాటిన టీడీపీ కాలకేయులు

పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో సీఎం చంద్రబాబు కుతంత్రం...

అప్రజాస్వామిక, అరాచకవాది చంద్రబాబు నాయుడు... వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపాటు
క్రీడలు

Asia Cup: అద్భుతమైన ఎంపిక: సెలక్టర్లపై గావస్కర్ ప్రశంసలు
టీమిండియా సెలక్టర్లపై భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ (Sunil Gavaskar) ప్రశంసలు కురిపించాడు. టెస్టు కెప్టెన్ శుబ్మన్ గిల్ (Shubman Gill)ను తిరిగి టీ20 జట్టులోకి పిలిపించి గొప్ప పనిచేశారని కొనియాడాడు. టీమిండియా టీ20 భవిష్యత్ కెప్టెన్గా గిల్ చుట్టూ ఇప్పటి నుంచే జట్టును తయారు చేయాలని సూచించాడు.అక్షర్ను తప్పించి గిల్కు వైస్ కెప్టెన్సీఆసియా కప్-2025 టోర్నమెంట్కు బీసీసీఐ మంగళవారం తమ జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. సూర్యకుమార్ యాదవ్ను కెప్టెన్గా కొనసాగించిన యాజమాన్యం.. అక్షర్ పటేల్ (Axar Patel)ను మాత్రం వైస్ కెప్టెన్సీ నుంచి తప్పించింది. అంతర్జాతీయ టీ20లకు ఏడాది కాలంగా దూరంగా ఉన్న టెస్టు కెప్టెన్ శుబ్మన్ గిల్తో అక్షర్ స్థానాన్ని భర్తీ చేసింది.గొప్ప, అద్భుతమైన ఎంపికఈ నేపథ్యంలో గిల్ను వైస్ కెప్టెన్ చేయడంపై బీసీసీఐ తీరుపై విమర్శలు వస్తుండగా.. సునిల్ గావస్కర్ మాత్రం భిన్నంగా స్పందించాడు. ‘‘దాదాపు రెండు వారాల క్రితం.. ఇంగ్లండ్ గడ్డ మీద అతడు 750కి పైగా పరుగులు సాధించాడు.అద్భుతమైన ఫామ్లో ఉన్న అలాంటి ఆటగాడిని ఎలా విస్మరించగలరు. అంతేకాదు.. అతడికి వైస్ కెప్టెన్సీ కూడా ఇచ్చారు. దీనిని బట్టి అతడే భవిష్యత్తులో టీ20 జట్టుకు కెప్టెన్ అవుతాడని స్పష్టం చేశారు. నా దృష్టిలో ఇది చాలా చాలా గొప్ప, అద్భుతమైన ఎంపిక’’ అంటూ సెలక్టర్లపై ప్రశంసల జల్లు కురిపించాడు గావస్కర్.టీ20 భవిష్యత్ సారథిఈ సందర్భంగా జింబాబ్వే పర్యటనలో గిల్ టీ20 జట్టును ముందుకు నడిపించిన తీరును గావస్కర్ ప్రస్తావించాడు. ‘‘టీమిండియా 2024లో టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత జింబాబ్వే పర్యటనలో గిల్ కెప్టెన్గా రాణించాడు. ఇక ఇటీవల ఇంగ్లండ్లోనూ టెస్టు కెప్టెన్గా ఆకట్టుకున్నాడు.బ్యాటర్గానూ అత్యుత్తమ ప్రదర్శనతో టాప్ రన్ స్కోరర్గా నిలిచాడు. దీనిని బట్టి అతడు ఒత్తిడిని అధిగమిస్తూ.. ఆటగాడిగానూ ఎలా రాణించగలడో మనం అర్థం చేసుకోవచ్చు. టీ20లలోనూ అతడే కెప్టెన్ అవుతాడు’’ అని గావస్కర్ గిల్ను కొనియాడాడు. కాగా ఈసారి టీ20 ఫార్మాట్లో జరిగే ఆసియా కప్ టోర్నీకి సెప్టెంబరు 9- 28 వరకు షెడ్యూల్ ఖరారైంది.ఆసియా కప్ టీ20-2025 టోర్నమెంట్కు బీసీసీఐ ప్రకటించిన జట్టుసూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుబ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), హర్షిత్ రాణా, రింకూ సింగ్.రిజర్వు ప్లేయర్లు: ప్రసిద్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, యశస్వి జైస్వాల్.చదవండి: ‘ఆసియా కప్ ఆడకపోయినా.. వరల్డ్కప్ జట్టులో శ్రేయస్ తప్పక ఉంటాడు’

ఇదే ఫైనల్ స్క్వాడ్ కాదు.. వారికి మరో ఛాన్స్: అగార్కర్
ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నమెంట్లో పాల్గొనే టీమిండియా గురించి భారత క్రికెట్ వర్గాల్లో ప్రధానంగా చర్చ నడుస్తోంది. శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer)ను పక్కనపెట్టడంతో సెలక్టర్లపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.విమర్శలకు కారణం?అదే విధంగా.. యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal), వాషింగ్టన్ సుందర్లను స్టాండ్ బై ప్లేయర్లుగా ఎంపిక చేయడం.. రీఎంట్రీలో వైస్ కెప్టెన్ శుబ్మన్ గిల్ (Shubman Gill)కు ప్రమోషన్ ఇవ్వడం చర్చకు దారితీశాయి. అంతేకాదు.. ఇటీవలి కాలంలో పెద్దగా ఆకట్టుకోని హర్షిత్ రాణా, రింకూ సింగ్, శివం దూబేలను ఆసియా కప్ జుట్టుకు ఎంపిక చేయడం కూడా విమర్శలకు తావిచ్చాయి.ఈ జట్టునే గనుక టీ20 ప్రపంచకప్ వరకు కొనసాగిస్తే టీమిండియా టైటిల్ గెలవలేదంటూ మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ ఘాటు విమర్శలే చేశాడు. ఈ నేపథ్యంలో జట్టు ప్రకటన సందర్భంగా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.వరల్డ్కప్ టోర్నీకి ఇదే ఫైనల్ స్క్వాడ్ కాదువాషింగ్టన్ సుందర్ గురించి మీడియా సమావేశంలో ప్రస్తావన రాగా.. ‘‘మా ప్రణాళికల్లో సుందర్ ఎల్లప్పుడూ ఉంటాడు. అయినా.. వరల్డ్కప్ టోర్నీకి ఇదే ఫైనల్ స్క్వాడ్ కాదు. ప్రస్తుతం మా జట్టులో ముగ్గురు స్పిన్నర్లు ఉన్నారు. నలుగురు గనుక అవసరం ఉంటే.. సుందర్ కచ్చితంగా టీమ్లోకి వచ్చేవాడు.అయితే, ప్రస్తుత సమీకరణల దృష్ట్యా రింకూ సింగ్ను అదనపు బ్యాటర్గా ఎంపిక చేసుకున్నాం. జితేశ్, సంజూ వికెట్ కీపర్లుగా సేవలు అందిస్తారు. ప్రస్తుతం మాకు 15 మందిని మాత్రమే ఎంపిక చేసే అవకాశం ఉంది. ఒకవేళ 16 మందిని ఎంపిక చేయాలంటే సుందర్ ఉండేవాడు.వారికి తలుపులు తెరిచే ఉన్నాయిఇక ముందు.. వరల్డ్కప్ వరకు టీమిండియా 20 టీ20 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. కాబట్టి ఎవరు జట్టులో ఉంటారో.. ఎవరు వెళ్లిపోతారో వారి ప్రదర్శనలపై ఆధారపడి ఉంటుంది. ప్రపంచకప్ టోర్నీ ముగిసిన వెంటనే.. తదుపరి వరల్డ్కప్నకు జట్టును సిద్ధం చేసుకోవడం సహజం.గాయాలు, ఫామ్.. ప్రధానంగా జట్టు ఎంపికను ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఈ జట్టులో మార్పులు ఉండవచ్చు. జట్టులో ఎవరూ శాశ్వతం కాదు. 18 లేదంటే 20 మంది ఆటగాళ్లను ప్రధానంగా పరిగణనలోకి తీసుకుంటాం. వారి నుంచి అత్యుత్తమ, అవసరమైన జట్టునే ఎంపిక చేస్తాం’’ అని అగార్కర్ పేర్కొన్నాడు. తద్వారా ఆసియా కప్ టోర్నీకి ఎంపిక కాని ఆటగాళ్లకు కూడా ఇంకా తలుపులు తెరిచే ఉన్నాయని సంకేతాలు ఇచ్చాడు. ఎనిమిది జట్లుకాగా భారత్ ఆతిథ్యంలో యూఏఈ వేదికగా సెప్టెంబరు 9- 28 వరకు ఆసియా కప్ టోర్నీ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. టీ20 ప్రపంచకప్-2026 సన్నాహకంగా ఈసారి ఈ ఖండాంతర టోర్నీని టీ20 ఫార్మాట్లో నిర్వహిస్తున్నారు. భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, అఫ్గనిస్తాన్, యూఏఈ, ఒమన్, హాంకాంగ్ జట్లు ఇందులో పాల్గొంటున్నాయి.ఆసియా కప్ టీ20-2025 టోర్నీకి టీమిండియా సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), హర్షిత్ రాణా, రింకూ సింగ్.రిజర్వు ప్లేయర్లు: ప్రసిద్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, యశస్వి జైస్వాల్.చదవండి: నాకు ఎవరి సానుభూతి అక్కర్లేదు.. నేనేంటో నాకు తెలుసు: పృథ్వీ షా

చరిత్ర సృష్టించిన కేశవ్ మహరాజ్
ఆస్ట్రేలియాతో తొలి వన్డే సందర్భంగా సౌతాఫ్రికా బౌలర్ కేశవ్ మహరాజ్ (Keshav Maharaj) అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. ఈ మ్యాచ్లో మార్నస్ లబుషేన్ రూపంలో తొలి వికెట్ అందుకుని.. సౌతాఫ్రికా తరఫున 300 వికెట్లు పూర్తి చేసుకున్నాడు.కైర్న్స్ వేదికగా మంగళవారం జరిగిన ఈ మ్యాచ్లో కేశవ్ మహరాజ్ ఐదు వికెట్లతో చెలరేగి.. ఆసీస్ బ్యాటింగ్ ఆర్డర్ను కుదేలు చేశాడు. లబుషేన్ (1)తో పాటు.. కామెరాన్ గ్రీన్ (3), జోష్ ఇంగ్లిస్ (5), అలెక్స్ క్యారీ (0) రూపంలో నలుగురు కీలక బ్యాటర్లను అవుట్ చేశాడు.సరికొత్త చరిత్రఇక ఎడంచేతి వాటం స్పిన్నర్ అయిన కేశవ్ మహరాజ్ (5/33) తన వన్డే కెరీర్లో ఈ మేర తొలిసారి ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. ఈ క్రమంలో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియా గడ్డ మీద ఈ ఘనత సాధించిన సౌతాఫ్రికా తొలి స్పిన్నర్గా కేశవ్ మహరాజ్ చరిత్రపుటల్లో తన పేరు లిఖించుకున్నాడు.దిగ్గజాల సరసనకాగా అంతకుముందు పేసర్లు మఖయా ఎంతిని (6), లుంగి ఎంగిడి (6).. లాన్స్ క్లుసేనర్, షాన్ పొలాక్, మార్కో యాన్సెన్, మోర్నీ మోర్కెల్, నిక్కీ బోజే, రిచర్డ్ స్నెల్ తదితరులు ఆస్ట్రేలియా గడ్డపై ఈ ఫీట్ నమోదు చేశారు.ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా టీ20 సిరీస్ కోల్పోయిన దక్షిణాఫ్రికా జట్టు వన్డే సిరీస్లో గెలుపు బోణీ కొట్టిన విషయం తెలిసిందే. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచ్లో దక్షిణాఫ్రికా జట్టు 98 పరుగుల తేడాతో గెలిచి 1–0తో ముందంజ వేసింది. కేశవ్ మహరాజ్ దక్షిణాఫ్రికా విజయంలో కీలకపాత్ర పోషించి.. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కించుకున్నాడు.ప్రతీకారం తీర్చుకున్న సౌతాఫ్రికాకాగా.. 2023 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్ అనంతరం కంగారూ, సఫారీ జట్ల మధ్య ఇదే తొలి వన్డే కాగా... ఆ మ్యాచ్లో ఓడిన దక్షిణాఫ్రికా జట్టు... ఇప్పుడు విజయంతో బదులు తీర్చుకుంది. చాంపియన్స్ ట్రోఫీలో ఈ రెండు జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షంతో రద్దయింది. ఈ క్రమంలో తాజాగా మంగళవారం నాటి మ్యాచ్లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది.మార్క్రమ్ (81 బంతుల్లో 82; 9 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా... కెప్టెన్ తెంబా బవుమా (74 బంతుల్లో 65; 5 ఫోర్లు), మాథ్యూ బ్రీజ్కె (56 బంతుల్లో 57; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధశతకాలు సాధించారు. రికెల్టన్ (33; 3 ఫోర్లు), ముల్డర్ (26 బంతుల్లో 31 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించారు. ఆ్రస్టేలియా బౌలర్లలో ట్రావిస్ హెడ్ 9 ఓవర్లు వేసి 57 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు.కుదేలైన ఆసీస్ బ్యాటింగ్ ఆర్డర్అనంతరం లక్ష్యఛేదనలో ఆస్ట్రేలియా తడబడింది. 40.5 ఓవర్లలో 198 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ మిచెల్ మార్ష్ (96 బంతుల్లో 88; 10 ఫోర్లు) మినహా టాపార్డర్ విఫలమైంది. లబుషేన్ (1), కామెరూన్ గ్రీన్ (3), జోష్ ఇన్గ్లిస్ (5), అలెక్స్ కేరీ (0), ఆరోన్ హార్డీ (4) సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. తొలి వికెట్కు హెడ్ (24 బంతుల్లో 27; 6 ఫోర్లు)తో కలిసి 60 పరుగులు జోడించిన మార్ష్... ఏడో వికెట్కు డ్వార్షుయ్ (52 బంతుల్లో 33; 3 ఫోర్లు)తో కలిసి 71 పరుగులు జోడించాడు.‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కేశవ్ మహరాజ్ (5/33) మాయాజాలానికి ఆసీస్ టాపార్డర్ పెవిలియన్కు వరుస కట్టింది. వన్డేల్లో తొలిసారి ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన కేశవ్ వరుసగా... లబుషేన్, గ్రీన్, ఇన్గ్లిస్, కేరీ, హార్డీ వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. దీంతో ఒక దశలో 60/0తో పటిష్ట స్థితిలో ఉన్న ఆసీస్ జట్టు... 29 పరుగుల వ్యవధిలో 6 వికెట్లు కోల్పోయి 89/6తో నిలిచింది. మార్ష్ పోరాడినా ఫలితం లేకపోయింది. చదవండి: ఆ ముగ్గురు ఎందుకు?.. ఈ జట్టుతో వరల్డ్ కప్ గెలవలేరు: భారత మాజీ కెప్టెన్ ఫైర్

‘ఆసియా కప్ ఆడకపోయినా.. వరల్డ్కప్ జట్టులో తప్పక ఉంటాడు’
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తీరుపై మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా విమర్శలు చేశాడు. అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకున్న శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer)ను ఆసియా కప్-2025 టోర్నమెంట్కు ఎందుకు ఎంపిక చేయలేదని ప్రశ్నించాడు. అతడు చేసిన తప్పేంటో అర్థం కావడం లేదని.. ఓ ఆటగాడిగా ఏం చేయాలో అన్నీ చేసినా ఇలా పక్కకు పెట్టడం సరికాదని మండిపడ్డాడు.మరోసారి మొండిచేయిఈసారి పొట్టి ఫార్మాట్లో నిర్వహించే ఆసియా కప్ టోర్నీకి బీసీసీఐ మంగళవారం తమ జట్టును ప్రకటించింది. టీ20 ప్రపంచకప్-2026కు సన్నాహకంగా జరిగే ఈ ఖండాంతర ఈవెంట్లో పాల్గొనే భారత జట్టులో శ్రేయస్ అయ్యర్కు మాత్రం చోటు దక్కలేదు.దేశవాళీ క్రికెట్తో పాటు.. ఐపీఎల్-2025లో పరుగుల వరద పారించినా సెలక్టర్లు ఈ ముంబై బ్యాటర్కు మొండిచేయి చూపారు. కనీసం స్టాండ్ బై ప్లేయర్గానూ శ్రేయస్కు చోటివ్వలేదు. ఈ నేపథ్యంలో కామెంటేటర్ ఆకాశ్ చోప్రా బీసీసీఐ తీరును విమర్శించాడు.ఇంతకంటే ఇంకేం చేయగలడు?‘‘ఈ జట్టులో శ్రేయస్ అయ్యర్ లేకపోవడం అతి పెద్ద చర్చనీయాంశం. ఆటగాడిగా అతడు ఇంతకంటే ఇంకేం చేయగలడు? ఇప్పటికే తనను తాను ఎన్నోసార్లు నిరూపించుకున్నాడు. ఐపీఎల్లో ఈ ఏడాది 600కు పైగా పరుగులు సాధించాడు.కెప్టెన్గా తన జట్టు పంజాబ్ను ఫైనల్కు తీసుకువెళ్లాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, రంజీ ట్రోఫీలో పరుగుల వరద పారించాడు. టీమిండియా తరఫున చాంపియన్స్ ట్రోఫీలో సత్తా చాటాడు. ఒక ఆటగాడిగానే కాదు.. మనిషిగా తనకు ఏమేం సాధ్యమవుతాయో.. అవన్నీ చేశాడు’’ అంటూ శ్రేయస్కు మద్దతుగా నిలిచిన ఆకాశ్ చోప్రా.. సెలక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.టీ20 ప్రపంచకప్ జట్టులో తప్పక ఉంటాడుఅదే విధంగా.. ‘‘ఇది ఆసియా కప్ జట్టు మాత్రమే. దీనిని వరల్డ్కప్ టీమ్గా భావించడం తొందరపాటు చర్యే అవుతుంది. ఈ రెండు ఈవెంట్లకు మధ్య 15 అంతర్జాతీయ టీ20 మ్యాచ్లు జరుగబోతున్నాయి. మరి జట్టు మొత్తం తారుమారయ్యే అవకాశం ఉన్నట్లే కదా!వన్డేల్లో నిలకడగా పరుగులు సాధిస్తూ ముందుకు సాగితే.. అతడు టీ20లలోనూ రీఎంట్రీ ఇవ్వగలడు. శ్రేయస్ అయ్యర్ ఈసారి టీ20 వరల్డ్కప్ ఆడే భారత జట్టులో తప్పక ఉంటాడని నాకు గట్టి నమ్మకం’’ అంటూ ఆకాశ్ చోప్రా ఆశాభావం వ్యక్తం చేశాడు.చదవండి: ఆ ముగ్గురు ఎందుకు?.. ఈ జట్టుతో వరల్డ్ కప్ గెలవలేరు: భారత మాజీ కెప్టెన్ ఫైర్
బిజినెస్

ఆన్లైన్ గేమింగ్ బిల్లుపై కేంద్ర హోం మంత్రికి లేఖ
రియల్ మనీ గేమ్స్పై నిషేధం విధించే విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ భారత ఆన్లైన్ గేమింగ్ సంస్థలు కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశాయి. ఆన్లైన్ గేమింగ్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ బిల్లు-2025ను బుధవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్న తరుణంలో ఈమేరకు లేఖ రాయడం గమనార్హం. ఇప్పటికే ఈ బిల్లును కేంద్ర మంత్రివర్గం మంగళవారం ఆమోదించింది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న ఈ బిల్లులో ఆన్లైన్ గేమింగ్ రంగాన్ని నియంత్రించడానికి ఫ్రేమ్వర్క్ను ఏర్పాటు చేశారు.ఆల్ ఇండియా గేమింగ్ ఫెడరేషన్ (ఏఐజీఎఫ్), ఈ-గేమింగ్ ఫెడరేషన్ (ఈజీఎఫ్), ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఫాంటసీ స్పోర్ట్స్ (ఎఫ్ఐఎఫ్ఎస్) సంయుక్తంగా కేంద్రం హోం మంత్రికి ఇచ్చిన వినతిపత్రంలో ఆసక్తికర అంశాలు తెలిపారు. ఆన్లైన్ స్కిల్ గేమింగ్ విభాగం ఒక ట్రిలియన్ డాలర్ల డిజిటల్ ఎకానమీని సృష్టిస్తుందని చెప్పారు. ‘భారతదేశపు డిజిటల్ గేమింగ్ రంగంలో పనిచేస్తున్న లక్షలాది మంది యువ పారిశ్రామికవేత్తలు, డెవలపర్లు, నిపుణులు కొత్త ఆన్లైన్ గేమింగ్ బిల్లు వల్ల తీవ్రంగా ప్రభావితం చెందుతారు. ఇందులోని నిషేధ నియమాలు చట్టబద్ధమైన, ఉద్యోగాలను సృష్టించే పరిశ్రమను దెబ్బ తీస్తుంది’ అని తెలిపారు.ప్రస్తుతం ఈ పరిశ్రమ రూ.2 లక్షల కోట్లకు పైగా ఎంటర్ప్రైజ్ వాల్యుయేషన్ను, రూ.31,000 కోట్ల వార్షిక ఆదాయం, ప్రత్యక్ష, పరోక్ష పన్నుల రూపంలో రూ.20,000 కోట్లకు పైగా ఆదాయాన్ని సమకూరుస్తోందని సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. 20 శాతం సీఏజీఆర్తో వృద్ధి చెందుతున్న ఈ రంగం 2028 నాటికి రెట్టింపు అవుతుందని అంచనా. భారతదేశంలో ఆన్లైన్ గేమర్లు 2020లో 36 కోట్ల నుంచి 2024లో 50 కోట్లకు పెరిగారు. జూన్ 2022 వరకు రూ.25,000 కోట్లకు పైగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఆ రంగం ఆకర్షించింది. ఈ పరిశ్రమ ప్రత్యక్షంగా, పరోక్షంగా 2 లక్షల మందికి ఉపాధి కల్పిస్తోంది. గేమింగ్, టెక్నాలజీ, డిజిటల్ ఎంటర్టైన్మెంట్లో ప్రపంచానికి నాయకత్వం వహించే అవకాశం భారత్కు ఉందని, నిషేధానికి బదులు ప్రగతిశీల నియంత్రణను అవలంబించాలని లేఖలో ప్రభుత్వాన్ని కోరారు.ఇదీ చదవండి: బంగారం ధరలు యూటర్న్!ఈ-స్పోర్ట్స్, ఎడ్యుకేషనల్ గేమ్స్, సోషల్ గేమింగ్తో సహా ఆన్లైన్ గేమింగ్ రంగాన్ని ప్రోత్సహించడానికి, కొన్ని అంశాల్లో నియంత్రించడానికి, వ్యూహాత్మక అభివృద్ధి, నిరంతర పర్యవేక్షణ కోసం ఒక అథారిటీని ఏర్పాటు చేసేలా వీలు కల్పించే బిల్లును బుధవారం లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. ఆన్లైన్ గేమ్స్, ఈ-స్పోర్ట్స్ మధ్య స్పష్టమైన విభజన సూచించేలా బిల్లును రూపొందించారు. నిబంధనల్ని ఉల్లంఘించి ఆన్లైన్ గేమ్స్ అందిస్తున్నవారికి మూడేళ్ల వరకు జైలుశిక్ష, లేదా రూ.కోటి వరకు జరిమానా, లేదా ఆ రెండూ విధించాలని బిల్లులో ప్రతిపాదించారు. సంబంధిత అడ్వర్టయిజ్మెంట్లలో భాగం పంచుకున్నవారికి గరిష్ఠంగా రెండేళ్ల జైలుశిక్ష, రూ.50 లక్షల వరకు జరిమానా విధిస్తారు. వీటి ఆర్థిక లావాదేవీల్లో ప్రమేయం ఉన్నవారికీ గరిష్ఠంగా మూడేళ్ల శిక్ష, రూ.కోటి వరకు జరిమానా వేస్తారు.

బంగారం ధరలు యూటర్న్!
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఊగిసలాడుతున్నాయి. కొద్దికాలంగా పెరిగిన పసిడి ధరలు.. క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. మంగళవారంతో పోలిస్తే బుధవారం బంగారం ధరలు తగ్గాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

వరుస లాభాలకు బ్రేక్.. నష్టాల్లో సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే బుధవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. చాలా రోజులు నష్టాల తర్వాత గత రెండు రోజులుగా పుంజుకున్న మార్కెట్లు ఈ రోజు నష్టపోయాయి. ఉదయం 09:33 సమయానికి నిఫ్టీ(Nifty) 51 పాయింట్లు తగ్గి 24,933కు చేరింది. సెన్సెక్స్(Sensex) 130 ప్లాయింట్లు నష్టపోయి 81,510 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

ఎయిరిండియాకు ఐవోసీ హరిత ఇంధనం
విమానయాన దిగ్గజం ఎయిరిండియాకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) పర్యావరణహిత ఏవియేషన్ ఇంధనం (ఎస్ఏఎఫ్) సరఫరా చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. వాడేసిన వంట నూనె నుంచి ఎస్ఏఎఫ్ ఉత్పత్తి ఈ ఏడాది డిసెంబర్ నుంచి ప్రారంభించనున్నట్లు ఐవోసీ చైర్మన్ అరవిందర్ సింగ్ సాహ్ని తెలిపారు.ఇదీ చదవండి: భారత్పై టారిఫ్ల ప్రభావం అంతంతే!పానిపట్లోని రిఫైనరీలో ఏటా 35,000 టన్నుల హరిత ఇంధనాన్ని ఉత్పత్తి చేయనున్నట్లు వివరించారు. ఐటీసీ, హల్దీరామ్స్ లాంటి హోటళ్లు, రెస్టారెంట్ చెయిన్స్ నుంచి నూనెను సమీకరించనున్నట్లు పేర్కొన్నారు. విమాన రవాణా వల్ల వచ్చే ఉద్గారాలను తగ్గించేందుకు పెట్రోలియంయేతర ముడివనరుల నుంచి ప్రత్యామ్నాయ ఇంధనమైన ఎస్ఏఎఫ్ను తయారు చేస్తారు. లభ్యతను బట్టి సాధారణంగా వినియోగించే విమాన ఇంధనం (ఏటీఎఫ్)లో 50 శాతం వరకు దీన్ని కలపవచ్చు.
ఫ్యామిలీ

కెమెరా క్లిక్.. అదిరే పిక్..! ట్రెండింగ్గా మారుతున్న మొబైల్ ఫోటోగ్రఫీ
ఒక్క ఫొటో అనేక భావాలను, అర్థాలను ప్రతిబింబిస్తుంది. చరిత్రలోని అనే సంఘటనలను, మధురానుభూతులకు కళ్లకు కట్టేది ఈ చిత్రమే.. అయితే ఒకప్పుడు ఇది సామాన్యునికి బహుదూరం.. కానీ అందివచ్చిన సాంకేతిక పరిజ్ఞానం కారణంగా నేడు ప్రతి ఒక్కరికీ చేరువయ్యింది. ప్రతి ఒక్కరి జీవితంలోనూ అనేక మధురమైన జ్ఞాపకాలను పదిలపరుస్తోంది.. మరికొందరికి ప్రకృతిలోని ప్రతిదీ చిత్రీకరించే సాధనంగా మారుతోంది. మొబైల్ రాకతో ఇది మరింత చేరువయ్యింది.. ఈ నేపథ్యంలో మొబైల్ ఫొటోగ్రఫీ అనే హాబీ ట్రెండింగ్ అవుతోంది.. ప్రపంచ ఫొటో గ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని పలువురు ఔత్సాహికులు వారు తీసిన చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు.. ప్రస్తుతం ఇవి వైరల్ అవుతున్నాయి.సాధారణంగా సామాజిక మాధ్యమాల్లో రీల్, సినిమాలు, జోకులు, మీమ్స్ వైరల్ అవుతుంటాయి. దీనికి భిన్నంగా గత కొంతకాలంగా యువతకు సంబంధించిన క్రియేటివ్ వర్క్ కూడా వైరల్ అవుతున్నాయి. అయితే ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని మొబైల్స్లో ఫొటోలు తీయడం హాబీగా మారిన కొందరి ఫొటోలు ఫేస్బుక్, ఇన్స్టా వంటి సామాజిక మాధ్యమాల్లో మంగళవారం పోస్టులుగా తెగ వైరల్ అయ్యాయి. వీటికి షేర్లు, లైకులు కొడుతూ పలువురు కామెంట్లు చేశారు. ఫొటో గ్రఫీపట్ల తమకున్న ప్యాషన్ని, తమలోని క్రియేటివిటీని సామాజిక మాధ్యమాల్లో ప్రదర్శించారు. ఒక్కో ఫొటోకూ.. ఒక్కో కథ.. ఈ ఏడాది ఫొటోగ్రఫీ డే సందర్భంగా సోషల్ మీడియా వేదికలైన ఇన్స్టా, ఫేస్బుక్, ఎక్స్ (ట్విట్టర్), వాట్సాప్ వంటి వేదికలు విభిన్న, వినూత్న ఫొటోలతో నిండిపోయాయి. ప్రతి ఒక్కరు తమ కెమెరాలో బంధించిన ప్రత్యేక క్షణాలను షేర్ చేస్తూ ‘ఇదే నా స్టైల్, ఇదే నా ప్రత్యేకత’ అని తమ ప్రతిభను చాటుకున్నారు. కొందరు యువత ప్రకృతిని తమ కెమెరాలో బంధించగా, మరికొందరు నగర జీవన శైలిని, మరి కొందరు ట్రావెలింగ్, సంస్కృతి, ఆర్ట్, చరిత్ర, ఫుడ్ ఫొటోగ్రఫీ వంటి అంశాలను చిత్రాల రూపంలో ప్రదర్శించారు. ఫొటోగ్రఫీ డే అనేది కేవలం ఒక వేడుక కాదు, ఇది ప్రతి ఒక్కరూ తమ ప్రతిభను చాటుకునే ఓ వేదిక. ప్రతి ఫొటో ఒక కొత్త కథ చెబుతోంది. అందుకే ఈ ఫొటోగ్రఫీ దినోత్సవం కేవలం ఫొటోల పండుగ మాత్రమే కాదు.. ఒక లైఫ్ స్టైల్ ఫెస్టివల్ అని చెప్పకనే చెబుతోంది. సోషల్ మీడియా పాత్ర.. ఫొటోగ్రఫీకి సోషల్ మీడియా ఒక ప్రధాన వేదికగా మారింది. ఒకప్పుడు ఔత్సాహికులు తీసిన ఫొటోలను ఇంట్లో, ఆల్బమ్స్లో చూసేవాళ్లు. ఇప్పుడు అదే ఫొటోలు నిమిషాల్లోనే ప్రపంచానికి చేరుతున్నాయి. ఇన్స్టా ‘ఫోటోగ్రఫీ డే హాష్ట్యాగ్’తో పోస్ట్ చేస్తే, అది వేల మందికి చేరుతుంది. ఫేస్బుక్లో షేర్ చేస్తే స్నేహితులు, బంధువులు లైక్స్తో ప్రోత్సహిస్తారు. ఎక్స్లో పోస్ట్ చేస్తే వెంటనే ట్రెండింగ్ అవుతుంది. వాట్సాప్ స్టేటస్ ద్వారా మన స్నేహితుల సర్కిల్లో హైలైట్ అవుతాయి. అంటే ప్రతి ఒక్కరి చేతిలో ఒక చిన్నపాటి ప్రచార సాధనం ఉన్నట్లు. ఇది కేవలం వ్యక్తిగత ప్రతిభను చూపించడానికే కాకుండా, నెట్వర్కింగ్లో కూడా ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఒక్క ఫొటో ఆధారంగా అనేక మంది కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. కొంతమంది తమ ఫొటోలు పోస్టు చేయడం ద్వారా ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్ల దృష్టికి చేరుతున్నారు. మోడలింగ్, ఫొటో ఎగ్జిబిషన్, బ్రాండ్ ప్రమోషన్స్ వంటి అవకాశాలు పొందుతు న్నారు. జన్–జీ స్టైల్ అండ్ క్రియేటివిటీ.. ఫొటోగ్రఫీ డే నేపథ్యంలో సోషల్ మీడియాలో తమ ఫొటోలను కేవలం షేర్ చేయడమే కాదు.. వాటికి ప్రత్యేక ఎఫెక్ట్స్, ఫిల్టర్స్, క్రియేటివ్ క్యాప్షన్స్ జోడించడం ద్వారా కొత్త ట్రెండ్ సృష్టించారు. లైఫ్ స్టైల్ యాప్స్ ఫొటోగ్రఫీని కేవలం హాబీ స్థాయి నుంచి ప్రొఫెషనల్ స్థాయికి తీసుకెళ్లడంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఒక మంచి ఫొటోతీసి, దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తే, అది స్ఫూర్తిగా మారుతుంది. నగరంలోని యువత తమ ఫొటోగ్రాఫిక్ స్కిల్స్ను ప్రత్యేకంగా ప్రదర్శించారు. చారి్మనార్, హుస్సేన్ సాగర్, గోల్కొండ వంటి చారిత్రక కట్టడాలు కొత్త కోణంలో కెమెరా కంట పడగా, నగర ఆధునిక లైఫ్ స్టైల్ కూడా ఫ్రేమ్లో బంధీ అయ్యాయి. (చదవండి: లాస్ట్ మీల్ అంటే ఇదేనేమో..! పగోడికి కూడా ఇలాంటి అనుభవం వద్దు..)

మొక్కిన చోటే 'మొలకెత్తి'..!
మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్టించి గణేశ నవరాత్రి పూజలు చేయడం పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుందని అందరికీ తెలిసిందే. గ్రీన్ గణేశ పేరిటి రీ సస్టైనబిలిటీ, 92.7 బిగ్ ఎఫ్ఎమ్లు మరో ముందడుగు వేశాయి. పర్యావరణానికి ఎంతో మేలు చేసే సీడ్ గణేశ విగ్రహాల పంపిణీకి శ్రీకారం చుట్టాయి. రాయదుర్గంలోని నాలెడ్జీ సిటీలోని మై హోం భూజ గేటెడ్ కమ్యూనిటీలో సీడ్ గణేశ విగ్రహాల పంపిణీ వాహనాన్ని నటుడు, రచయిత తనికెళ్ల భరణి, నటి మధుషాలిని, రీ సస్టైనబిలిటీ ఎండీ మసూద్ మాలిక్ జెండా ఊపి మంగళవారం ప్రారంభించారు. నగరవ్యాప్తంగా మొత్తం 1500 ప్రతిమలను పంపిణీ చేయనున్నారు. పర్యావరణానికి మేలుచేసే ఆక్రీ యాప్ను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ఆక్రీ యాప్లో సంప్రదిస్తే శానిటరీ వేస్ట్, డైపర్స్, ప్లాస్టిక్, ఈ వేస్ట్, పేపర్ కార్డ్బోర్డ్, ఉడ్ అండ్ ఫర్నీచర్, క్లాత్స్, షూస్, మెటల్ స్క్రాప్ సేకరిస్తారని నిర్వాహకులు తెలిపారు. సేకరించే చెత్తకు కొంత డబ్బులు కూడా చెల్లించనున్నారు. ఈ కార్యక్రమంలో 92.7 ఎఫ్ఎం ఆర్జే శేఖర్ భాషా, ఆర్జే గ్రేస్, మై హోం భూజ అసొసియేషన్ ప్రతినిధులు రాజు మధనపల్లి, విద్యా రెడ్డి, డాక్టర్ కుమార్ పాల్గొన్నారు. (చదవండి: 82 ఏళ్ల వయసులోనూ ఫిట్గా అమితాబ్..! ఆ జాగ్రత్తలు తప్పనిసరి..)

జగదీశ్వర తత్త్వం
బ్రహ్మ మానస పుత్రుడు అత్రి మహర్షి. మహా సాధ్వి అనసూయ ఆయన భార్య. యోగ్యులూ, ముల్లోకాలకూ పూజనీయులూ స్తుతిపాత్రులూ అయిన మహనీయులు తమకు సంతానంగా కలగాలని అత్రి మహర్షి నూరేళ్ళు తపస్సు చేశాడు. ప్రాణాయామం చేత మనసును నియంత్రించి, గాలి మాత్రమే ఆహారంగా, ఒంటి కాలి మీద నిలబడి తపస్సు చేశాడు. ‘ఈ జగత్తు అంతటికీ ప్రభువైన భగవంతుడెవరో, ఆయన తనతో సమానమైన ఘనులను నాకు సంతానంగా ప్రసాదించు గాక!’ అని తపస్సు చేశాడు. నూరేళ్ల తరవాత, కళ్లు మిరుమిట్లు గొలిపే కాంతులతో, హంస, గరుడ, వృషభ వాహనాలను అధిష్ఠించి ఉన్న బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఏకకాలంలో ఆయన ముందు సాక్షాత్కరించారు. ‘‘త్రిమూర్తులారా! నేను తపస్సు చేసింది. జగదీశ్వరుడొక్కడి గురించి. ఆయన కాకుండా, నా తపఃఫలంగా, మీ ముగ్గురు మహనీయులూ నాముందు ప్రత్యక్షం కావటం, నా తపః సంకల్పానికి భిన్నంగా ఉంది!’’ అని. ‘‘సాటిలేని మహర్షివి నువ్వు తపస్సు చేస్తే, నీ సంకల్పమే సిద్ధిస్తుంది. అన్యదా జరగదు. ‘యథా కృతః తే సంకల్పః భావ్యం తేన ఏవ, న–అన్యధా!’ (భాగవతం) మా ముగ్గురి కలయికే నువ్వు ధ్యానించిన జగదీశ్వరుడు. కాబట్టి జగదీశ్వరుడిని నువ్వు ధ్యానించినప్పుడు, నువ్వు ధ్యానించింది మా ముగ్గురినీ! నువ్వు సంకల్పించినట్టే, మా ముగ్గురి అంశలతో, మాకు సములైన ముగ్గురు కుమారులు కలుగుతారు’’ అని వరమిచ్చి వెళ్ళారు. ఆ ప్రకారమే, అత్రి–అనసూయలకు బ్రహ్మ అంశతో చంద్రుడూ, విష్ణువు అంశతో దత్తాత్రేయుడూ, శివాంశతో దుర్వాసుడూ కుమారులుగా కలిగారు. అత్రి–అనసూయ పుణ్య దంపతుల గురించిన కథలు రామాయణ, భారత, భాగవతాలలోనూ, ఇతర పురాణాల్లోనూ కనిపిస్తాయి. జగదీశ్వర తత్త్వం గురించిన పై కథ భాగవతం నాలుగో స్కంధంలోనిది.– ఎం. మారుతి శాస్త్రి

మలేరియా తగ్గితే జీడీపీ పెరిగింది!
ప్రపంచ వ్యాప్తంగా దోమల నివారణ పెద్ద సమస్యగా మారింది. దోమల వల్ల వచ్చే ముఖ్యమైన వ్యాధి మలేరియా. దీని వల్ల ప్రపంచ వ్యాప్తంగా ప్రతి నిమిషానికి ఒక మరణం సంభవిస్తోంది. గత కొన్ని దశాబ్దాలుగా మలేరియా నియంత్రణలో కష్టించి సాధించిన ప్రగతి ఇప్పుడు ప్రమాదంలో పడి, ముందుకు సాగలేని పరి స్థితి వచ్చింది. వాతావరణం, సామాజిక సంఘర్షణలు, ఆర్థిక స్థితి గతులు, అత్యవసర పరిస్థితులు దీనికి అడ్డంకులుగా మారుతు న్నాయి. అందువలన మలేరియా నియంత్రణ ప్రాథమిక సూత్రాలైన గుర్తింపు, చికిత్స, నివారణ చర్యలు అందుబాటులో ఉండటం లేదు. నిరూపితమైన నివా రణ చర్యల కోసం తిరిగి పెట్టుబడి పెట్టడం, అడ్డంకులను తొలగించు వ్యూహా లను పన్నడం, కలసికట్టుగా తిరిగి అందరూ ఈ కొత్త ప్రయత్నాలను మొదలు పెట్టడం ద్వారా మలేరియాను అంతం చేయవచ్చు.2000 – 2017 మధ్య 180 దేశాల మలే రియా, స్థూల దేశీయోత్పత్తు (జీడీపీ)ల డేటాలను విశ్లేషించినప్పుడు... మలేరియా సంభవం 10% తగ్గినప్పుడు తలసరి జీడీపీలో సగటున 0.3% పెరుగుదల ఉందని తేలింది. ప్రతి దేశం మలేరి యాను నివారించడానికీ, గుర్తించడానికీ, చికిత్స చేయడానికీ ఒక కొంగొత్త సాంకేతికతను వాడుతున్నాయి. దోమల జీవిత కాలాన్నీ, అవి మలేరియాను వ్యాప్తి చేసే సామర్థ్యాన్నీ తగ్గించడానికి పురుగు మందులతో కూడిన దోమ తెరల సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. 2000లో ఈ సాంకేతికతను విస్తరించినప్పటి నుండి 68 శాతం మలేరియా కేసులను నివారించినట్లు అంచనా. ‘కాలానుగుణ మలేరియా చికిత్స’ పొందిన పిల్లలలో దాదాపు 75 శాతం మలేరియా బారి నుంచి బయటపడ్డారు. నేడు ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రవేత్తలు దీర్ఘకాలం ఉండే దోమ తెరలు, మోనోక్లోనల్ యాంటీ బాడీ చికిత్స, శక్తిమంతమైన కొత్త వాహక నియంత్రణ సాధనాలు, జన్యుపరంగా మార్పు చెందిన దోమలు, ప్రపంచంలోని మొట్టమొదటి మలేరియా వ్యాక్సిన్ వంటి విప్లవాత్మక ఆవిష్కరణలపై పనిచేస్తున్నారు. ఇదీ చదవండి: కేవలం రూ.3.5 లక్షలతో ఫ్యాషన్ బ్రాండ్..రూ. 500 కోట్ల దిశగాEven mosquitoes are worried! 🦟With clean surroundings, covered tanks, and repellents in every home, they have nowhere to hide. This World Mosquito Day, let’s keep our communities safe and mosquito-free.#WorldMosquitoDay #FightTheBite pic.twitter.com/ydoux9ZrwO— Ministry of Health (@MoHFW_INDIA) August 20, 2025 అందువలన గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ దేశాలు మలేరియా నిర్మూ లనకు దగ్గరగా ఉన్నాయి. మన దేశంలో గత సంవత్సరం 2,57,383 మలే రియా కేసులు, 62 మరణాలు నమోదయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా గిరిజన ఆవాసాలు, కొండ ప్రాంతాల్లో మలేరియా కేసులు ఎక్కువగా నమో దవుతూ ఉన్నాయి. అక్కడ జనాభా 20% మాత్రమే ఉన్నప్పటికీ, 80% కేసులు అక్కడే ఉన్నాయి. మనందరం కలిసి మలేరియాను సమూలంగా తొలగించేందుకు కంకణం కట్టుకుందాం. ఇది మన సమష్టి బాధ్యత.– తలతోటి రత్న జోసఫ్, మెడికల్ ఎంటమాలజిస్ట్
ఫొటోలు


ఏపీలో వెరీ స్పెషల్.. ఎంతో మహిమ గల అమ్మవారిని ఎప్పుడైనా దర్శించుకున్నారా (ఫొటోలు)


కుర్రాళ్ళ గుండెల్ని కొల్లగొడుతున్న హీరోయిన్ శివాని నాగరం (ఫొటోలు)


నా కెరీర్లోనే ది బెస్ట్ సినిమా.. ప్లీజ్ సపోర్ట్.. అనుపమ కన్నీళ్లు (ఫోటోలు)


కృష్ణమ్మ ఉగ్రరూపం : ప్రకాశం బ్యారేజ్ వద్ద పర్యాటకుల సందడి (ఫొటోలు)


గ్రాండ్గా హీరామండి నటి మనీషా కొయిరాలా బర్త్ డే వేడుక (ఫొటోలు)


తల్లి 84వ బర్త్ డే.. సుమ స్పెషల్ పోస్ట్ (ఫొటోలు)


వింటేజ్ రూట్స్.. మోడ్రన్ సోల్.. రెండూ..! (ఫొటోలు)


తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ ప్రముఖులు (ఫొటోలు)


జగన్ రాకతో దద్దరిల్లిన ఆకేపాడు.. నూతన వధూవరులకు ఆశీర్వాదం (చిత్రాలు)


ముంబైలో భారీ వర్షాలు.. స్తంభించిన జనజీవనం (ఫొటోలు)
అంతర్జాతీయం

ఉక్రెయిన్ యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన
ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెన్స్కీతో భేటీ అనంతరం.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. త్వరలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్, జెలెన్స్కీ ఇరువురు సమావేశమయ్యేందుకు అమెరికా ఏర్పాట్లు చేస్తోందంటూ పేర్కొన్నారు. సుమారు నాలుగేళ్ల యుద్ధాన్ని ముగించేందుకు ఇది కీలక అడుగుగా అభివర్ణించిన ఆయన.. దీర్ఘకాలికశాంతి కోసం ప్రయత్నిస్తామన్నారు.‘‘ వైట్హౌస్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్, ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, యూకే ప్రధాని కీర్ స్టార్మర్, జర్మనీ ఛాన్స్లర్ ఫ్రెడిరిక్ మెర్జ్, యూరోపియన్ కమిషన్ ఉర్సులా వాండెర్లెయన్, నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టెతో జరిగిన చర్చలు అద్భుతంగా ముగిశాయి. వాషింగ్టన్ సమన్వయంతో యూరోపియన్ దేశాలు ఉక్రెయిన్కు భద్రతా హామీలు అందించాలనే దానిపైనే చర్చలు ప్రధానంగా సాగాయి. రష్యా, ఉక్రెయిన్లతో శాంతి నెలకొనబోతుందనే విషయంపై నేతలందరూ సంతోషం వ్యక్తం చేశారు. చర్చల ముగింపులో రష్యా అధ్యక్షుడు పుతిన్తో నేను ఫోన్ కాల్లో మాట్లాడాను. జెలెన్స్కీ, పుతిన్ మధ్య భేటీ నిర్వహించేందుకు ఏర్పాట్లు మొదలయ్యాయి. వీరి భేటీ ఎక్కడ జరగాలనేదానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. వీరి సమావేశం ముగిసిన తర్వాత వారితో కలిసి నేను భేటీ అవుతాను. సుమారు నాలుగేళ్ల యుద్ధం ముగించేందుకు ఇదొక మంచి ముందడుగు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో, ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ సమన్వయంతో రష్యా, ఉక్రెయిన్ల మధ్య సమావేశం జరగనుంది’’ అని ట్రంప్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. అయితే భేటీ ఎప్పుడు.. ఎక్కడ నిర్వహిస్తారనేదానిపై మాత్రం ఆయన స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు.. వైట్హౌజ్లో ట్రంప్-జెలెన్స్కీ, ఈయూ నేతల భేటీపై రష్యా ఇంకా స్పందించాల్సి ఉంది.అంతకు ముందు.. భేటీ ముగిశాక ట్రంప్తో జరిగిన చర్చలపై జెలెన్స్కీ సంతోషం వ్యక్తం చేశారు. చాలా నిర్మాణాత్మకంగా భేటీ జరిగిందని.. భద్రతా హామీలతో సహా పలు సున్నిత విషయాలపై మాట్లాడినట్లు తెలిపారు. త్రైపాక్షిక భేటీకి తాము సిద్ధమేనంటూ పేర్కొన్నారాయన. అదే సమయంలో జెలెన్స్కీతో పాటు వచ్చిన యూరోపియన్ నేతలు ట్రంప్తో చాలా కీలక విషయాలపై చర్చించారు. ఎవరేమన్నారంటే.. రష్యా, ఉక్రెయిన్, అమెరికా మధ్య త్రైపాక్షిక సమావేశం, సెక్యూరిటీ గ్యారంటీలు చర్రితలో నిలిచిపోయే కీలక ముందడుగుగా బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ అభివర్ణించారు. రష్యాతో సమావేశానికి ముందే కాల్పుల విరమణ జరగాలని జర్మన్ ఛాన్స్లర్ ఫ్రెడరిక్ మెర్జ్ పేర్కొన్నారు. కాల్పుల విరమణ ఒప్పునేందుకు రష్యాపై ఒత్తిడి తేవాలని పేర్కొన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ మాట్లాడుతూ.. ట్రంప్ త్రైపాక్షిక సమావేశంపై చర్చించారని, అయితే దీన్ని విస్తృతం చేసి యురోపియన్ నేతను ఆ భేటీకి అనుమతించాలని ప్రతిపాదించారు. ఇది యూరప్ మొత్తానికి సంబంధించిన విస్తృత భద్రతా హామీలను పరిష్కరించడానికి ఉపయోగపడుతుందన్నారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోని మాట్లాడుతూ ఈ వివాదం మళ్లీ తలెత్తకుండా ఎలా నిర్ధారించుకోవాలని ప్రశ్నించారు. శాంతి ఒప్పందానికి ఇది ముందస్తు షరతు అని పేర్కొన్నారు. ఉక్రెయిన్ మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసే దాడులను అడ్డుకోవాలని అందుకు మిత్రపక్షాలు కలిసిరావాలని నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టె పేర్కొన్నారు.ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించే దిశగా చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఇదివరకే రష్యా అధ్యక్షుడు పుతిన్తో ట్రంప్ చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. అయితే ఇరు దేశాల నేతల ప్రకటనలతో.. ఆ చర్చల్లో అంతగా పురోగతి కనిపించలేదన్న విమర్శ వినిపించింది. పైగా అలస్కా భేటీలో పుతిన్ పెట్టిన భూభాగాల మార్పిడి షరతును జెలెన్స్కీ వ్యతిరేకించడంతో.. వైట్హౌజ్ చర్చలూ విఫలం కావొచ్చని అంతా భావించారు. అదే సమయంలో.. ఈ ఏడాదిలోనే వైట్హౌజ్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి చేదు అనుభవం ఎదురైంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్లు జెలెన్స్కీ విరుచుకుపడ్డారు. ఈ తరుణంలో అంచనాలకు భిన్నంగా తాజా భేటీ ప్రశాంత వాతావరణంలో.. అదీ యూరోపియన్ నేతల సమక్షంలో జరగడం గమనార్హం.

బందీల విడుదలకు ఒప్పందం చేసుకోండి
జెరూసలేం: ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ గాజాపై సైనిక చర్యకు ప్రణాళికలు వేస్తుండగా.. ఇజ్రాయేలీలు నిరసన బాట పట్టారు. గాజాపై యుద్ధం ముగించాలని, బం«దీలను విడుదల చేయడానికి హమాస్తో ఒప్పందం కుదుర్చుకోవాలని డిమాండ్ చేస్తూ రోడ్డెక్కారు. ర్యాలీలను నిర్వహించారు. జెరూసలేం, టెల్ అవీవ్లను కలిపే ప్రధాన రహదారిని ప్రదర్శనకారులు దిగ్బంధించారు. ఆదివారం దేశవ్యాప్తంగా జరిగిన ఆందోళనల్లో వేలాది మంది ఇజ్రాయెలీలు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ర్యాలీల్లో ఇజ్రాయెల్ జెండాలను ఊపుతూ, బందీల ఫొటోలను ప్రదర్శిస్తూ పాల్గొన్నారు. కొమ్ము బూరలు ఊది, డ్రమ్స్ మోగించి నిరసన తెలిపారు. ప్రధాన రహదారులను దిగ్బంధించారు. దీంతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. పోలీసులు 38 మంది నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఇజ్రాయెల్ నటి గాల్ గాడోట్ కూడా ప్రదర్శనల్లో పాల్గొన్నారు. బందీల కుటుంబాలను కలిసి సంఘీభావం తెలిపారు. ఈ ర్యాలీకి ప్రతిపక్ష నాయకుడు యైర్ లాపిడ్ హాజరై ప్రదర్శనకారులకు తన సంఘీభావాన్ని తెలిపారు. ‘దేశాన్ని బలోపేతం చేసే ఏకైక విషయం. అద్భుతమైన స్ఫూర్తితో ప్రజలు బయటకు అడుగు పెట్టారు’అని ఆయన ఎక్స్లో పోస్ట్చేశారు. బందీల కుటుంబాలు నిర్వహించిన ఈ సమ్మెకు వ్యాపార సంస్థలు సైతం మద్దతు ఇచ్చాయి. సిబ్బందిని నిరసనల్లో పాల్గొనేందుకు స్వచ్ఛందంగా మూసేశారు. వేసవి సెలవుల కారణంగా పాఠశాలలపై ఎలాంటి ప్రభావం పడలేదు. యెమెన్ క్షిపణి ప్రయోగిస్తుందని వైమానిక దాడి సైరన్లు హెచ్చరించడంతో స్థానిక సమయం ప్రకారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ప్రదర్శనలు తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే.. హమాస్ లొంగిపోకుండా యుద్ధాన్ని ముగించాలనే పిలుపు ఆ గ్రూపును బలోపేతం చేస్తుందని ప్రధాని నెతన్యాహు అన్నారు. ఇది బందీల విడుదల మరింత ఆలస్యం చేస్తుందని హెచ్చరించారు. మంత్రివర్గ సమావేశంలో మాట్లాడిన ఆయన గాజా నగరాన్ని సైన్యం స్వా«దీనం చేసుకునే ప్రణాళికలను పునరుద్ఘాటించారు. ఈ చర్యను ఇజ్రాయెలీలు, ముఖ్యంగా బందీల కుటుంబాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇది బతికి ఉన్న బందీల ప్రాణాలకు ముప్పని భయపడుతున్నారు.

కార్చిచ్చుతో స్పెయిన్ కకావికలం
మాడ్రిడ్: వాతావరణంలో మార్పులు యూరప్ను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే తుర్కియే, పోర్చుగల్ మంటల బారిన పడగా... స్పెయిన్లో కార్చిచ్చు కొనసాగుతోంది. దేశం మొత్తం తీవ్ర కార్చిచ్చు ప్రమాదంలో ఉంది. మంటల్లో ఇప్పటికే 3లక్షల 90 వేల ఎకరాలు దగ్ధమయ్యాయి. శుక్రవారం దేశవ్యాప్తంగా 14 చోట్ల కార్చిచ్చులు చెలరేగగా.. ఇప్పుడు 20 ప్రాంతాలకు మంటలు విస్తరించాయి. మంటలను అదుపు చేసేందుకు మరో 500 మంది సైనికులను ప్రభుత్వం మోహరించింది. వాయువ్య గలిసియా ప్రాంతంలో మంట లను అదుపు చేయడానికి 2వేల మంది అగి్న మాపక సిబ్బంది కష్టపడుతున్నారు. వేడిగాలుల కారణంగా ఎండిపోయిన అడవులన్నీ తగలబడి పోతున్నాయి. రెండు వారాలుగా కొనసాగుతున్న వేడిగాలులతో ఇది రెండు దశాబ్దాల్లో ఇదే అత్యంత దారుణమైన వేసవిగా నమోదైందని అత్యవసర చీఫ్ వర్జీనియా బార్కోన్స్ అన్నారు. ఇళ్ళకు ఇంకా ముప్పు పొంచి ఉండటంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మంటలు అదుపు చేస్తున్న చోట వెలువడిన పొ గ, బూడిదను పీల్చకుండా ఉండటానికి ప్రజలు ఫేస్ మాస్్కలు ధరించాలని, ఇళ్లనుంచి బయటికి రావద్దని అధికారులు సూచించారు. ఆదివారం కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ (113 డిగ్రీల ఫారెన్హీట్) వరకు చేరే అవకాశం ఉందని స్పెయిన్ జాతీయ వాతావర ణ సంస్థ హెచ్చరించింది. మంగళవారం నుంచి ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని తెలిపింది. మంటలను ఎదుర్కోవడానికి స్పెయిన్కు ఫ్రా న్స్, ఇటలీ ఇప్పటికే సహాయం అందిస్తుండగా.. ఇతర యురోపియన్ దేశాలు కూడా సాయమందించనున్నాయి. దక్షిణ యూరప్ రెండు దశాబ్దా లలో ఎన్నడూ లేనంత దారుణమైన కార్చిచ్చు సీజన్ను ఎదుర్కొంటోంది. ఇందులో స్పెయిన్ అత్యంత ఎక్కువగా దెబ్బతిన్నది. కార్చిచ్చుతో గత వారంలో ముగ్గురు మరణించారు. పోర్చుగల్లో.. పొరుగున ఉన్న పోర్చుగల్ కూడా మంటలతో పోరాడుతోంది. ఈ ఏడాది ఇప్పటివరకు దాదాపు 1,550 చదరపు కి.మీ (600 చదరపు మైళ్ళు) విస్తీర్ణంలో కార్చిచ్చులు అటవీ సంపదను దగ్ధం చేశాయి. ఎనిమిది పెద్ద మంటలను వేలాది మంది అగి్నమాపక సిబ్బంది అదుపు చేస్తున్నారు. పర్యాటక ప్రాంతమైన పియోడావో సమీపంలోనూ కార్చిచ్చు చెలరేగింది. ట్రాంకోసోలో కార్చిచ్చు ఎనిమిది రోజులుగా మండుతోంది. మంటలను అదుపు చేయడానికి 4వేలకు పైగా అగి్నమాపక సిబ్బంది, 1,300 వాహనాలు అలాగే 17 విమానాలను మోహరించింది. 1980ల నుంచి యూరప్ ప్రపంచ సగటు కంటే రెండు రెట్లు వేగంగా వేడెక్కుతుండటంతో తరచూ కార్చిచ్చులు చెలరేగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వేడి, పొడి వాతావరణాలు మంటల తీవ్రతను మరింత పెంచుతున్నాయి. ఈ ప్రాంతం మరిన్ని కార్చిచ్చులకు బలయ్యే అవకాశం ఎక్కువగా ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. తుర్కియేలో.. తుర్కియే అడవుల్లోనూ కార్చిచ్చు కొనసాగుతోంది. 30 విమానాలు, 1,300 మంది అగి్నమాపక సిబ్బందితో మంటలను అదుపు చేస్తున్నామని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ఫారెస్ట్రీ తెలిపింది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు, పొడి పరిస్థితులు, బలమైన గాలుల కారణంగా జూన్ చివరి నుంచే తుర్కియే వందలాది మంటలతో అతలాకుతలమైంది. ఇటీవల చెలరేగిన కార్చిచ్చుల్లో 19 మంది మృతి చెందారు. ప్రస్తుతం కొనసాగుతున్న కార్చిచ్చు కారణంగా ముందు జాగ్రత్త చర్యగా ఆరు గ్రామాలను ఖాళీ చేయించినట్లు కనక్కలే ప్రావిన్స్ గవర్నర్ ఒమర్ తోరామన్ తెలిపారు.

ఈవీఎంలు రద్దు చేస్తా..: డొనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్: సంచలనాల తేనెతుట్టెను తరచూ కదుపుతూ వివాదాలను రాజేసే అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ తాజాగా కొత్త అంశంతో తెరమీదకొచ్చారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని ఎలాగైనా ఆపుతానని అంతర్జాతీయ అంశాన్ని ఎత్తుకున్న ట్రంప్ హఠాత్తుగా దేశీయ రాజకీయ అంశంపై ప్రధానంగా దృష్టిసారించారు. పోస్టల్ ఓటింగ్(మెయిల్ ఇన్ బ్యాలెట్) విధానం పూర్తి లోపభూయిష్టంగా తయారైందని, పోస్టల్ ఓటింగ్ కారణంగా భారీ స్థాయిలో మోసం జరుగుతుందని ట్రంప్ వ్యాఖ్యానించారు. ‘‘అత్యంత వివాదాలకు కేంద్రస్థానంగా నిలుస్తున్న ఓటింగ్ మెషీన్లను మూలకు పడేస్తా. 2026లో వచ్చే మధ్యంతర ఎన్నికలలోపే మెయిల్–ఇన్–బ్యాలెట్, ఓటింగ్ మెషీన్లకు చరమగీతం పాడుతూ త్వరలోనే కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేస్తా’’ అని ట్రంప్ కుండబద్దలు కొట్టారు. ‘‘ మెయిల్–ఇన్ బ్యాలెట్ విధానానికి ముగింపు పలికే ఉద్యమానికి సారథ్యంవహిస్తా. కచ్చితత్వం లోపించిన, అత్యంత ఖరీదైన, వివాదాస్పదమైన ఓటింగ్ మెషీన్లను త్యజిద్దాం. అత్యంత అనువైన, భద్రమైన, సులభతరమైన బ్యాలెట్ (వాటర్మార్క్) పేపర్తో పోలిస్తే ఓటింగ్ మెషీన్ అనేది పదిరెట్లు ఎక్కువ వ్యయంతో కూడిన వ్యవహారం. బ్యాలెట్ పేపర్తో చాలా వేగంగా ఎన్నికలు నిర్వహించవచ్చు. ఎలాంటి అనుమానాలకు తావుండదు. ఎవరు గెలిచారో, ఎవరు ఓడారో ఇట్టే తెలిసిపోతుంది. మెయిల్–ఇన్–ఓటింగ్ను అనుసరిస్తున్న ఏకైక దేశం మనదే. భారీస్థాయిలో ఓట్ల అవకతవకలు వెలుగుచూడడంతో దాదాపు అన్ని దేశాలు ఓటింగ్ మెషీన్ (ఈవీఎం)లకు మంగళంపాడాయి. ఇకనైనా తప్పులను సరిదిద్దుకుందాం. తప్పుల సవరణను డెమొక్రాట్లు పూర్తిగా వ్యతిరేకిస్తారు. ఎందుకంటే వాళ్లు ఈ తప్పులను గతంలో ఎన్నడూలేనంతటి స్థాయిలో చేశారు. 2026 మధ్యంతర ఎన్నికలకు మరింత విశ్వసనీయతను ఆపాదించేందుకు సంబంధిత కార్యనిర్వాహక ఉత్తర్వుపై త్వరలో సంతకం చేస్తా’’ అని అన్నారు. ఈ మేరకు ఆయన తన సొంత సామాజికమాధ్యమ ‘ట్రూత్ సోషల్’ ఖాతాలో సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. రాష్ట్రాలది కేవలం ఏజెంట్ పాత్ర ‘‘ ఎన్నికల్లో రాష్ట్రాల పాత్ర నామామాత్రం. ఫెడరల్ ప్రభుత్వం కోసం రాష్ట్ర ప్రభుత్వాలు ఓట్లను టేబుల్పై ఉంచడం, లెక్కించడం వంటివి చేసే ఏజెంట్ పాత్ర మాత్రమే పోషించాలి. అమెరికా అధ్యక్షుడి ఆదేశానుసారం ఫెడరల్ ప్రభుత్వం సూచించే సూచనలను రాష్ట్రాలు తూ.చ. తప్పకుండా పాటిస్తే సరిపోతుంది. అలా ఉంటేనే దేశానికి మంచిది. అంతేగానీ విప్లవ భావజాల విపక్ష పార్టీలు సరిహద్దులు తెరవాలని డిమాండ్లు చేయడం, మహిళా క్రీడల్లో ట్రాన్స్జెండర్ల మాటున పురుషులూ పాల్గొనేలా చేయడం వంటివి ప్రోత్సహించకూడదు. అసలు ఈ లోపభూయిష్ట మెయిల్–ఇన్ కుంభకోణం జరక్కపోతే డెమొక్రాట్లు గతంలో గద్దెనెక్కేవాళ్లే కాదు. మెయిన్–ఇన్ బ్యాలెట్/ఓటింగ్తో ఎన్నికలు ఎప్పటికీ విశ్వసనీయంగా జరగబోవు. ఈ విషయం ప్రతి ఒక్కరికీ, ముఖ్యంగా డెమొక్రాట్లకు బాగా తెలుసు. అమెరికా ఎన్నికల ప్రక్రియకు విశ్వసనీయత, సమగ్రత తెచ్చేందుకు రిపబ్లికన్ పార్టీ నేతలతో కలిసి నేను ఎంతకైనా తెగించి పోరాడతా. మెయిల్–ఇన్ బ్యాలెట్ అనేది పూర్తి మోసపూరిత ప్రక్రియ. ఇక ఓటింగ్ మెషీన్లను ఉపయోగించడం అనేది మొత్తంగా ఎన్నికల ప్రక్రియను వినాశనం చేయడమే. ఇక వీటికి ఖచ్చితంగా ముగింపు పలకాల్సిందే. పారదర్శకంగా, నిజాయతీగా ఎన్నికలు నిర్వహించుకోకుంటే బలమైన, దుర్బేధ్యమైన సరిహద్దులేకుంటే మనకంటూ ఒక దేశం కూడా మిగలదు’’ అని ట్రంప్ అమెరికన్ ఓటర్లనుద్దేశించి అన్నారు.
జాతీయం

Delhi: 50 స్కూళ్లకు బాంబు బెదిరింపులు.. వారంలో రెండో ఘటన
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని 50 కి పైగా పాఠశాలలకు బుధవారం ఉదయం ఈ-మెయిల్స్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయని పోలీసులు మీడియాకు తెలిపారు. అయితే ఏ పాఠశాలలకు ఈ తరహా బెదిరింపులు వచ్చాయో స్పష్టంగా తెలియకపోయినా, వాటిలో మాలవీయ నగర్, నజాఫ్గఢ్లోని పాఠశాలలు ఉన్నట్లు సమాచారం.ఢిల్లీలోని హౌజ్ రాణి ప్రాంతంలోని సర్వోదయ కన్యా విద్యాలయ (ఎస్కేవీ)కి కూడా బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో బాంబు స్క్వాడ్ , భద్రతా సిబ్బంది పాఠశాలకు చేరుకుని, తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇటీవలే నగరంలోని 32 పాఠశాలలకు ఇలాంటి బెదిరింపులు రావడాన్ని మరచిపోకముందే, తాజా పరిణామం చోటు చేసుకుంది. ఈ నేపధ్యంలో వివిధ పాఠశాలల్లో పెద్ద ఎత్తున భద్రతా తనిఖీలు జరుగుతున్నాయి.గడచిన సోమవారం నగరంలో 32 పాఠశాలలకు బాంబు బెదిరింపులు రాగా, సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు పరుగుపరుగున పాఠశాలలకు చేరుకుని, తమ పిల్లలను ఇంటికీ తీసుకెళ్లారు. తాజాగా పాఠశాలలకు తిరిగి బాంబు బెదిరింపులు వచ్చిన నేపధ్యంలో ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు ఆయా పాఠశాలల్లోని విద్యార్థులను, సిబ్బందిని ఖాళీ చేయించారని, ముమ్మరంగా తనిఖీలు జరుగుతున్నాయిని ఢిల్లీ పోలీసు అధికారి ఒకరు మీడియాకు తెలిపారు.

ఈదురు గాలిలో భారీ వాన.. విమానం సురక్షిత ల్యాండింగ్.. ప్రయాణికుల ఆనందం
ముంబై: దేశవ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. ఢిల్లీ, ముంబై సహ పలు నగరాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. వరద నీరు కారణంగా ముంబై నగరం అతలాకుతలమైంది. వర్షాల ప్రభావం విమానాలు, రైళ్ల రాకపోకలపై పడింది. ఈ క్రమంలో భారీ వర్షంలో కూడా ఎయిరిండియా విమానాన్ని ఓ పైలట్ సురక్షితంగా ల్యాండ్ చేశారు. దీంతో, సదరు పైలట్పై ప్రయాణికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది.వివరాల ప్రకారం.. ముంబై ఎయిర్పోర్టులో మంగళవారం ఈదురుగాలులతో వర్షం కురిసింది. ఆ సమయంలో ఓ ఎయిరిండియా విమానం ల్యాండింగ్ అయ్యేందుకు విమనాశ్రయానికి వచ్చింది. ల్యాండింగ్కు సిద్ధమైన సమయంలో ఈదురు గాలులు, వర్షం పడుతున్న క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పటికీ పైలట్ నీరజ్ సేథీ ఎలాంటి అలజడి లేకుండా విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. ప్రతికూల వాతావరణంలో కూడా ఇలా విమానం ల్యాండింగ్ చేయడం పట్ల ప్రయాణికులు నీరజ్పై ప్రశంసలు కురిపించారు. విమానంలోని ఓ ప్రయాణికుడు దీన్ని వీడియో తీసి సోషల్ మీడియా వేదికగా పైలట్కు కృతజ్ఞతలు తెలిaపారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నీరజ్ సేథీ ‘నిజమైన హీరో’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.#MumbaiRain #AirIndia Landing at Mumbai airport midst of heavy rain ,Hats off to captain Neeraj Sethi for landing 🛬 safely with less visibility pic.twitter.com/MBrndAmKrF— 💝🌹💖🇮🇳jaggirmRanbir🇮🇳💖🌹💝 (@jaggirm) August 20, 2025ముంబైకి ఆరెంజ్ అలర్ట్.. ఇదిలా ఉండగా.. రెండు రోజులుగా ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నగరంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలను మూసివేశారు. 345 విమానాలు ఆలస్యంగా నడిచాయి. ఎనిమిది విమానాలను దారి మళ్లించారు. ఇక, బుధవారం ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రముఖ విమానయాన సంస్థలు ఇండిగో, స్పైస్జెట్ తమ ప్రయాణికులకు హెచ్చరికలు జారీ చేశాయి. ప్రతికూల వాతావరణం వల్ల విమానాలు ఆలస్యం కావచ్చని లేదా రద్దయ్యే అవకాశం ఉందని, ప్రయాణికులు ఎయిర్పోర్టుకు బయలుదేరే ముందు తమ విమాన స్థితిని సరిచూసుకోవాలని సూచించాయి.ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ముంబైలోని లోకల్ రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రైల్వే ట్రాక్లు నీట మునగడంతో సెంట్రల్ రైల్వే నేడు ఏకంగా 17 లోకల్ రైలు సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. నగరంలోని పలు ప్రధాన రహదారులు నదులను తలపిస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పరిస్థితి తీవ్రత దృష్ట్యా థానే, నవీ ముంబై, లోనావాలా వంటి ప్రాంతాల్లో అధికారులు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు కూడా పాక్షికంగానే పనిచేస్తున్నాయి. కుండపోత వానల కారణంగా బాంబే హైకోర్టు సైతం మధ్యాహ్నం 12:30 గంటలకే కార్యకలాపాలను నిలిపివేసింది. అయితే, గురువారం నుంచి వర్షాల తీవ్రత తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై దాడి.. గుజరాతీ పనేనా?
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై దాడి జరిగింది. ‘జన్ సున్నాయ్’ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేఖా గుప్తాపై ఓ వ్యక్తి దాడి చేశాడు. ముఖ్యమంత్రి రేఖను దూషిస్తూ.. ఆమె చెంపపై కొట్టాడు. అనంతరం, అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సదరు వ్యక్తిని గుజరాత్కు చెందినట్టుగా పోలీసులు గుర్తించారు. అతడి వివరాలు తెలియ్సాలి ఉంది. ప్రస్తుతం అతడిని విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. వివరాల ప్రకారం.. సివిల్ లైన్స్లోని అధికారిక నివాసంలో ‘జన్ సున్వాయ్’ నిర్వహిస్తున్న సమయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై ఓ వ్యక్తి చేయి చోటుచేసుకున్నట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. 35 ఏళ్ల వయసున్న ఓ వ్యక్తి ఈ దాడికి పాల్పడినట్లు తెలిపాయి. తొలుత అతడు కొన్ని పేపర్లను సీఎంకు అందించిన తర్వాత ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనను ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవ్ స్పందించారు. ముఖ్యమంత్రిపై జరిగిన దాడిని ఖండించారు. దీనిపై విచారణ చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. A mishap happened during Jan Sunvai at CM Residence, Civil Lines. Delhi BJP President Virendraa Sachdeva strongly condemns the attack on CM Rekha Gupta during the weekly Jan Sunvai. Police inquiry to reveal details: Delhi BJP— ANI (@ANI) August 20, 2025ఢిల్లీ ముఖ్యమంత్రిపై జరిగిన దాడిని బీజేపీ నేతలు సహా ప్రతిపక్ష పార్టీల నేతలు సైతం ఖండించారు. సీఎంపైనే దాడి చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, ఇలా ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై దాడి జరగడం భద్రతా వైఫల్యమని చెప్పుకొచ్చారు. ఇక, తాజాగా దాడి చేసిన వ్యక్తి ఫొటో బయటకు వచ్చింది. గుజరాత్కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ ఘటన సమయంలో ఏం జరిగిందే అక్కడే ఉన్న ఓ మహిళ వివరించారు.. తాజాగా అంజలి అనే మహిళ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిపై దాడి జరుగుతున్న సమయంలో నేను ఇక్కడే ఉన్నాను. జన్సున్వాయ్ నిర్వహిస్తుండగా సదరు వ్యక్తితో సీఎం రేఖా మాట్లాడుతున్న సమయంలో అతడు.. చెంప దెబ్బ కొట్టాడు. వెంటనే స్పందించిన పోలీసులు.. అతడిని అక్కడి నుంచి తీసుకెళ్లారు. ఇలా చేయడం తప్పు అని చెప్పారు. #WATCH | Attack on Delhi CM Rekha Gupta during Jan Sunvai | Anjali, who was present at the spot, says, "This is wrong. Everyone has the right to Jan Sunvai. If an imposter can slap her, this is a big deal...I was there...The person was speaking and he suddenly slapped. Police… pic.twitter.com/fsQCY8Jl0P— ANI (@ANI) August 20, 2025#WATCH | Attack on Delhi CM Rekha Gupta during Jan Sunvai | Shailendra Kumar says, "I had come from Uttam Nagar with a complaint over sewer. When I reached the gates, chaos broke out because the CM was slapped. This is wrong..." pic.twitter.com/dVIJhz6ipD— ANI (@ANI) August 20, 2025

‘డ్రమ్ములో కుళ్లిన మృతదేహం’ కేసు: అమ్మ, మామ కలసి.. దడ పుట్టిస్తున్న బాలుని సాక్ష్యం
అల్వార్: రాజస్థాన్లోని అల్వార్లో చోటుచేసుకున్న ‘డ్రమ్ములో కుళ్లిన మృతదేహం’ కేసు మరోమలుపు తిరిగింది. ఈ ఉదంతంలో మృతుని కుమారుడే కీలక సాక్షిగా నిలిచాడు. ఆగస్టు 15న ఈ ఘటన వెలుగు చూసింది. అల్వార్లోని ఒక ఇంటి యజమాని తమ రెండవ అంతస్తులో దుర్వాసన వస్తుండటాన్ని గమనించి, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల దర్యాప్తులో ఒక నీలిరంగు డ్రమ్ములో కుళ్లిన స్థితిలో హన్స్రాజ్ అనే వ్యక్తి మృతదేహం బయటపడింది.ఈ దారుణ హత్య కేసు దర్యాప్తులో మరో మలుపు తిరిగింది. మృతుని ఎనిమిదేళ్ల కుమారుడు హర్షల్ కీలక సాక్షిగా నిలిచాడు. తమ ఇంటిలో నీటిని నిల్వ చేసేందుకు ఉపయోగించే నీలిరంగు డ్రమ్ములో తన తండ్రి మృతదేహాన్ని తన తల్లి, ఆమె ప్రియుడు ఉంచారని ఆ బాలుడు పోలీసులకు తెలిపాడు. మృతుడు హన్స్రాజ్ పెద్ద కుమారుడు హర్షల్ తన తండ్రి హత్యకు ముందు, ఆ తరువాత ఇంట్లో ఏమి జరిగిందో పోలీసులకు వివరంగా తెలియజేశాడు.‘ఆరోజు మా నాన్న, అమ్మ, మామ (వారి ఇంటి యజమాని కొడుకు) కలిసి మద్యం సేవిస్తున్నారు. మా అమ్ము రెండు పెగ్గులు మాత్రమే తాగింది. మామ ఫుల్గా తాగాడు. నాన్న కూడా మద్యం మత్తులోనే ఉండి, అమ్మను కొట్టడం మొదలుపెట్టాడు. ఇంతలో మామ జోక్యం చేసుకున్నాడు. అయితే మా నాన్న.. నువ్వు ఆమెను కాపాడితే, నిన్ను కూడా చంపేస్తాను’ అని అరిచాడు. వెంటనే మామ మా నాన్నపై దాడి చేశాడు. ఇంతలో అమ్మ మమ్మల్ని నిద్రపోమని చెప్పింది.కాసేపటికి నేను మేల్కొని చూడగా, అమ్మ, మామ ..మా నాన్న మృతదేహాన్ని నీళ్ల డ్రమ్ములో పెట్టి, వంటగదిలో ఉంచారు. అప్పుడు నేను వారిని ఇలా ఎందుకు చేస్తున్నారని అడిగాను. వారు తన తండ్రి చనిపోయారని చెప్పారు. మా నాన్న అమ్మను తరచూ కొట్టేవాడు. సిగరెట్లతో కాల్చాడు. నన్ను కూడా కొట్టేవాడు. ఆగస్టు 15న బ్లేడుతో నా మెడపై గాయం చేశాడు’ అని హర్షల్ తెలిపాడు.ఈ దారుణ హత్య ఆగస్టు 15న జరిగిందని, ఇంటి యజమాని తమ రెండవ అంతస్తులో దుర్వాసన రావడాన్ని గమనించి ఫిర్యాదు చేసిన దరిమిలా ఈ ఉదంతం వెలుగు చూసిందని పోలీసులు తెలిపారు. హన్స్రాజ్ భార్య సునీత, ఆమె ప్రియుడు జితేంద్ర శర్మ ఈ ఘాతుకానికి పాల్పడ్డారన్నారు. తరువాత హన్స్ రాజ్ మృతదేహాన్ని డ్రమ్ములో ఉంచి, దానిని ఉప్పుతో నింపారని పోలీసులు పేర్కొన్నారు. సునీత, శర్మ నాలుగు నెలలుగా రిలేషన్ షిప్లో ఉన్నారని పోలీసు అధికారులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉన్నదని వారు పేర్కొన్నారు.
ఎన్ఆర్ఐ

ఆటిజం బాధితులకు అండగా నాట్స్
భాషే రమ్యం.. సేవే గమ్యం అనే నినాదంతో ముందుకు సాగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్.. తెలుగునాట అనేక సేవా కార్యక్రమాలు చేస్తోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ దిల్సుఖ్నగర్లో స్పర్శ్ స్పెషల్ స్కూల్ ఫర్ ఆటిజం చిల్డ్రన్కు నాట్స్ మద్దతు ఇస్తుంది. తాజాగా నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి, నాట్స్ మీడియా కో ఆర్డినేటర్ కిషోర్ నారెలు ఈ ఆటిజం పాఠశాలను సందర్శించారు. ఆటిజం పిల్లలకు తమ వంతు సాయం అందించేందుకు నాట్స్ ఎప్పుడూ ముందుంటుందని నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఆటిజం పిల్లల మానసిక వికాసానికి నాట్స్ చేయూత అందిస్తుందని నాట్స్ మీడియా కో ఆర్డినేటర్ కిషోర్ తెలిపారు. గతంలో ఆటిజం ఆన్ వీల్స్ అనే వాహనాన్ని నాట్స్ ఈ పాఠశాలకు అందించింది.

బ్రూనై తెలుగు సంఘం 79వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
బ్రూనై దారుస్సలాంలో భారత హైకమిషన్ నిర్వహించిన 79వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో బ్రూనై తెలుగు సంఘం, గర్వంగా పాల్గొంది.ఈ వేడుకల్లో సంఘానికి చెందిన పిల్లలు దేశభక్తి గీతాలకు నృత్యాలు, భారత మాత వేషధారణ, ప్రేరణాత్మక ప్రసంగాలు, ఆకర్షణీయమైన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. భారత హైకమిషనర్ శ్రీ రాము అబ్బగాని గారు భారత గౌరవనీయ రాష్ట్రపతి స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగాన్ని వాచించారు మరియు కొత్తగా ప్రారంభించిన భారత హైకమిషన్ భవనంలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా సంఘ అధ్యక్షుడు వెంకట రమణ రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు: ఈ చారిత్రాత్మక వేడుకలో భాగం కావడం మా గర్వకారణం. ఇది మన చిన్నారుల్లో దేశభక్తి భావాన్ని పెంపొందించడమే కాకుండా, భారతదేశం మరియు బ్రూనై దేశాల మధ్య సాంస్కృతిక బంధాలను మరింత బలపరుస్తుందన్నారు. భారతీయ సాంస్కృతిక సంపదను విదేశాల్లో ప్రోత్సహించే సాంస్కృతిక, విద్యా సామాజిక కార్యక్రమాలలో బ్రూనై తెలుగు సంఘం చురుకుగా పాల్గొంటూనే ఉందని తెలిపారు.

TDF: అమెరికాలో ఘనంగా టీడీఎఫ్ సిల్వర్ జూబ్లీ వేడుకలు
మిల్పిటాస్ (కాలిఫోర్నియా): తెలంగాణ అభివృద్ధి, సంక్షేమం కోసం 25 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్న తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ (TDF) USA రజతోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. కాలిఫోర్నియాలోని మిల్పిటాస్ ఇండియా కమ్యూనిటీ సెంటర్లో ‘ ప్రగతి తెలంగాణం’ పేరిట ఈ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి ఇండియా నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు పంపగా, ప్రొఫెసర్ ఎం. కోదండరామ్, విద్యాశాఖ కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, మాజీ ఎంపీ ఆత్మచరణ్ రెడ్డి, సాన్ఫ్రాన్సిస్కో భారత కాన్సుల్ జనరల్ డా. కే. శ్రీకర్ రెడ్డి, ఎంవీ ఫౌండేషన్ నేషనల్ కన్వీనర్ వెంకటరెడ్డి, టెక్నికల్ ఎడ్యుకేషన్ మాజీ డైరెక్టర్ డా. ఎం.వి. రెడ్డి, ‘ఆటా’ అధ్యక్షుడు జయంత్ చల్లా తదితరులు హాజరయ్యారు.కలర్ఫుల్గా మూడు రోజుల వేడుకలుటీడీఎఫ్ అమెరికా చైర్మన్ మురళి చింతలపాణి, అధ్యక్షుడు మణికొండ శ్రీనివాస్, కన్వీనర్ మహేందర్ రెడ్డి గూడూరు, కో-కన్వీనర్ సుజేందర్ ప్రొదుటూరి సమన్వయంతో జరిగిన ఈ వేడుకల్లో తెలంగాణ బిజినెస్ ఫోరం, పొలిటికల్ ఫోరం, స్టార్టప్ ఫోరం, విజన్ తెలంగాణ-2050 వంటి అంశాలపై చర్చలు జరిగాయి. 2050 నాటికి తెలంగాణను ప్రగతిశీల రాష్ట్రంగా తీర్చిదిద్దే వ్యూహాలపై ప్యానెలిస్టులు తమ అభిప్రాయాలు పంచుకున్నారు.పురస్కారాల ప్రదానంఈ సందర్భంగా లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డులు డా. దివేష్ అనిరెడ్డి, డా. గోపాల్ రెడ్డి గాదేలకు, టీడీఎఫ్ లైఫ్టైమ్ ఫిలాంత్రఫీ అవార్డు టీ. రామచంద్రరెడ్డికి ప్రదానం చేశారు. సోషల్ ఇంపాక్ట్ పార్ట్నర్ అవార్డులు గ్లోబల్ ప్రగతి సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ అలోక్ అగర్వాల్, డాక్టర్ సంగీతకు అందజేశారు. టీడీఎఫ్ పూర్వ అధ్యక్షురాలు చల్లా కవితను ఘనంగా సత్కరించారు. వారి సేవలను ప్రతిబింబించే ప్రత్యేక వీడియోలు ప్రదర్శించారు.సాంస్కృతిక వైభవంతెలంగాణ ఫోక్ నైట్, ఆటా పాటలు, బోనాల వేడుకలు ఆహూతులను అలరించాయి. తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించిన ఈ కార్యక్రమాల్లో యాంకర్ వాణి గడ్డం తెలంగాణ యాసతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. శ్రీరామ్ వెదిరె, బిక్ష గుజ్జ నీటి నిర్వహణపై ప్రజెంటేషన్లు ఇచ్చారు. టీడీఎఫ్ సీనియర్ నాయకులు మధు కె. రెడ్డి, సుధీర్ కోదాటి, ఎలక్ట్ ప్రెసిడెంట్ భరత్ నేరవెట్ల, ఉపాధ్యక్షురాలు ప్రీతి జొన్నలగడ్డ, స్వాతి సుదిని, ఉపాధ్యక్షులు శ్రావణ్ పోరెడ్డి, శ్రీని గెల్లిపెల్లి, సెక్రటరీ రాజ్ గడ్డం, జాయింట్ సెక్రటరీ మనోహర్, ట్రెజరర్ శ్రీకళ, ట్రస్టీలు గోపాల్ రెడ్డి గాదే, ఇందిరా, కళ్యాణ్ రెడ్డి, కాసప్ప, రవిరెడ్డి, సదానంద్, విజేందర్, వినయ తదితరుల సమిష్టి కృషితో ఈ వేడుకలు విజయవంతమయ్యాయి. 70 మంది బేఏరియా TDF వాలంటీర్లు వేడుకలను విజయవంతం చేయడంలో కీలక పాత్ర వహించారు. తెలంగాణ నుంచి, అమెరికా నలుమూలల నుంచి ప్రవాసులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్ యువతి మృతి
హైదరాబాద్: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నగరానికి చెందిన విద్యార్థిని దుర్మరణం చెందింది. మృతురాలి కుటుంబ సభ్యులు చెప్పిన వివరాల ప్రకారం.. సిద్దిపేటకు చెందిన శ్రీనివాస వర్మ తన కుటుంబంతో కలిసి 15 ఏళ్ల కిత్రమే నగరానికి వలస వచ్చాడు. మేడ్చల్ జిల్లా దుండిగల్ మున్సిపాలిటీ బాలాజీ కాలనీలో నివాసముంటున్నాడు. ఇతనికి భార్య హేమలత, శ్రీజ వర్మ (23), శ్రీయ వర్మ ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.శ్రీనివాస వర్మ బౌరంపేటలోని ఓ ఇంటర్నేషనల్ స్కూల్లో ట్రాన్స్పోర్ట్ ఇన్చార్జిగా హేమలత ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నారు. శ్రీజ వర్మ మాస్టర్స్ చదివేందుకు మూడేళ్ల క్రితం అమెరికాలో వెళ్లింది. చార్లెస్టన్లోని ఈస్టర్న్ ఇల్లినోయిస్ యూనివర్సిటీలో కంప్యూటర్స్లో మాస్టర్స్ పూర్తి చేసిన శ్రీజ వర్మ ప్రస్తుతం ఉద్యోగ అన్వేషణలో ఉంది. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం తన స్నేహితురాలితో కలిసి భోజనం తెచ్చుకునేందుకు తాము నివసిస్తున్న అపార్ట్మెంట్ పక్కనే ఉన్న రెస్టారెంట్కు వెళ్తున్నారు. వెనుక నుంచి వచి్చన ట్రక్కు శ్రీజను ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. చదవండి: విదేశీ ప్రయాణాల కోసం కోట్లు కుమ్మరిస్తున్నారు!రోడ్డు ప్రమాదంలో కూతురు చనిపోయిందన్న విషాద వార్త విని తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. బాలాజీ కాలనీలోని శ్రీజ ఇంటి వద్ద విషాద ఛాయలు అలముకున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి శ్రీజ మృతదేహాన్ని స్వదేశానికి రప్పించాలని బంధువులు కోరుతున్నారు.
క్రైమ్

కేపీహెచ్బీలో వేశ్యను బుక్ చేసుకోబోయి..
కేపీహెచ్బీకాలనీ(హైదరాబాద్): ఓ యువతి విషయంలో జరిగిన వివాదంలో ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్పై కొందరు యువకులు దాడి చేసి గాయపర్చారు. కేపీహెచ్బీ పోలీసులు తెలిపిన మేరకు..హిమాయత్నగర్కు చెందిన మధుగౌడ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఈ నెల 15న కేపీహెచ్బీకాలనీ రోడ్డునెంబర్–1 వద్ద ఓ యువతితో సన్నిహితంగా ఉండేందుకు సంప్రదించాడు. ఈ క్రమంలో యువతితో వివాదం ఏర్పడడంతో ఆమె తన బంధువైన సోహెల్కు ఫోన్ చేసి తెల్పింది . దీంతో సోహెల్ తన అనుచరులైన సాయికుమార్, బారెడ్డి సిసింధర్ రెడ్డి, బారెడ్డి ప్రతాప్రెడ్డి అలియాస్ పాండు, అశ్వనీ కుమార్సింగ్తో పాటు ఓ మైనర్ బాలుడు, మరికొంతమందితో కలిసి వచ్చి సాఫ్ట్వేర్ ఉద్యోగి మధుగౌడ్పై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. ఈ ఘటనలో గాయపడ్డ అతన్ని ఆస్పత్రిలో చేరి్పంచారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని మంగళవారం నిందితులను అరెస్టు చేశారు.

నువ్వు నాతో ఉండకపోతే.. నీ జీవితాన్ని నాశనం చేస్తా..
సనత్నగర్: ‘నువ్వు నాతో ఉండకపోతే, నీ ఫొటోలను ప్రతిచోటా వైరల్ చేస్తా..నీ జీవితాన్ని నాశనం చేస్తా.. నువ్వు ఎవరికీ నీ ముఖాన్ని చూపించలేవు..’ అంటూ మార్ఫింగ్ చేసిన అశ్లీల ఫోటోలు, వీడియోలతో ఓ యువతిని బెదిరించిన వ్యక్తిపై బేగంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బేగంపేట ఇండియన్ ఎయిర్లైన్స్ కాలనీకి చెందిన యువతి (18) కామన్ లా అడ్మిషన్ టెస్ట్కి ప్రేపర్ అవుతోంది. ఉత్తరప్రదేశ్ హార్దోల్కు చెందిన అర్షద్ఖాన్ ఏఐ పరిజ్ఞానంతో మార్ఫింగ్ చేసిన ఆమె అశ్లీల ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానంటూ గత కొంతకాలంగా బెదిరింపులకు దిగుతున్నాడు. ఈ క్రమంలో ఆమెతో పాటు ఆమె సోదరుడికి కూడా ఆ ఫొటోలు పంపించి బ్లాక్మెయిల్కు పాల్పడ్డాడు. ఆమెకు ఫోన్ చేసి నాతో రావాలని, నేను చెప్పినట్లు వినాలని బెదిరించాడు. దీంతో అర్షద్ వేధింపులు తట్టుకోలేక బాధితురాలు బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సిగరెట్లు లేవన్నందుకు బాలికపై దాడి
హైదరాబాద్: సిగరెట్లు అడిగితే లేవని చెప్పినందుకు ఓ యువతిపై సమీప బంధువు దాడి చేసిన సంఘటన బేగంపేట పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..రసూల్పురా కృష్ణానగర్ నాల్గవ బ్లాక్లో నివాసం ఉండే బాలిక (17) కుటుంబం స్థానికంగా దుకాణం నిర్వహిస్తుంటుంది. ఈ నెల 17న రాత్రి 8.30 గంటల సమయంలో సదరు బాలిక షాపులో ఉండగా ఆమె సమీప బంధువు అహ్మద్ సిగరెట్స్ అడిగాడు. సిగరెట్లు లేవని చెప్పడంతో అహ్మద్ కోపంగా బాలికను బయటకు లాక్కెళ్లి కొట్టడం ప్రారంభించాడు. ఆ తర్వాత మరికొంతమంది అతని స్నేహితులు గుల్లు, ఫౌజియా, గౌసియా, నౌషీన్లు కూడా ఆమెపై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. ఈ ఘటనలో బాలిక కంటికి గాయమైంది. తన కుమార్తెపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ తల్లి బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

బాలిక హత్య కేసు దర్యాప్తు ముమ్మరం
మూసాపేట: కూకట్పల్లి దయార్గూడలో సోమవారం సహస్రిని (11) అనే బాలికను హత్య చేసిన కేసులో దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ఈమేరకు మంగళవారం ఎస్ఓటీ, సీసీఎస్, పోలీస్ బృందాలు సుమారు 6 టీములుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టాయి. సీసీ పుటేజ్, క్లూస్ ఆధారంగా నిందితుడి ఆచూకీ కోసం ప్రయతి్నస్తున్నారు. ఇప్పటికే పలువురు అనుమానితులను విచారించారు. కాలనీలో, భవనంలోని పలువుర్ని ప్రశ్నించారు. బాలిక ఒంటిపై సుమారు 20కి పైగా చిన్న చిన్న గాట్లు ఉన్నాయని, పదునైన చిన్నపాటి ఆయుధంతో పొడిచి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మెడపై 14 గాట్లు, కడుపులో 6 గాట్లు ఉన్నట్లు బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ తెలిపారు. గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం పూర్తి కాగానే మృతదేహాన్ని సంగారెడ్డి జిల్లాలోని వారి సొంత గ్రామానికి తీసుకువెళ్లారు. ఇప్పటి వరకు బాలిక హత్య ఎవరు చేశారో, ఎందుకు చేశారో అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదని పోలీసులు తెలిపారు. కాగా అదే భవనంలో ఉన్న ఒడిశాకు చెందిన ఓ వ్యక్తిపై అనుమానాలున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కుటుంబంపై చేతబడి చేశారన్న అనుమానంతో అతడు అనుమానాస్పదంగా కన్పించడంతో పోలీసులు ఆ కోణంలో విచారిస్తున్నట్లు తెలుస్తోంది.
వీడియోలు


అమరావతి రాజధాని వరద ముంపునకు గురైంది: దొంతిరెడ్డి వేమారెడ్డి


లోక్సభలో కీలక బిల్లులు ప్రవేశపెట్టిన కేంద్రమంత్రి అమిత్ షా


Kakinada: ఇన్ఛార్జ్ పదవి తమ నాయకుడికే ఇవ్వాలంటూ ఇరు వర్గాలు గొడవ


సాక్షి మీడియా హైందవ ధర్మ పరిరక్షణకు కట్టుబడి ఉంది: భూమన


అగ్నిపర్వతం బద్దలు ఇండియాకు భయం పట్టుకుందా


లీగల్ నోటీసులపై బిఆర్ నాయుడుపై యాంకర్ ఈశ్వర్ సూటి ప్రశ్నలు


DCM పవన్ స్థాయిని తగ్గించి మరీ నారా లోకేష్ కు ఎలివేషన్


అమరావతి మునిగింది.. నిజం చెప్పిన మంత్రి నారాయణ.. ఎల్లో మీడియా పరువు పాయే..


AP: ఆ మాత్రం దానికి ఫ్రీ బస్..


సగం సగం పనులు.. ఆ మాత్రం దానికి ఫ్రీ బస్.. మహిళల రియాక్షన్