ఢిల్లీ క్యాపిటల్స్‌ యువ ఓపెన‌ర్ పృథ్వీషా ఆస్పత్రి పాలయ్యాడు.

జ్వ‌రం కార‌ణంగా అతడు హాస్పిటల్‌లో చేరాడు.

ఈ విష‌యాన్ని పృథ్వీ షా సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించాడు.

ప్రస్తుతం తాను కోలుకుంటున్నానని షా తెలిపాడు.

తనపై ప్రేమ చూపిస్తున్న అభిమానులకు అతడు కృతజ్ఞతలు తెలిపాడు.

ఈ టీమిండియా యువ బ్యాటర్‌ ఐపీఎల్-2022లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.

తాజా ఎడిషన్‌లో 9 మ్యాచ్‌ల్లో 2 అర్ధ శతకాల సాయంతో 259 పరుగులు చేశాడు.

2018లో పృథ్వీ షా టీమిండియా తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేశాడు.

న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో 2020లో వన్డేలో అడుగుపెట్టాడు.

శ్రీలంక టూర్‌లో భాగంగా టీ20 ఫార్మాట్‌లో 2021లో అరంగేట్రం చేశాడు.