22వ కామన్‌వెల్త్‌ గేమ్స్‌ బాక్సింగ్‌లో భారత పంచ్‌ అదిరింది.

ఈ క్రీడల్లో భారత్‌ మొత్తం ఏడు పతకాలు సాధించింది.

ఇందులో 3 స్వర్ణాలు, ఓ రజతం, 3 కాంస్య పతకాలు ఉన్నాయి.

మహిళల 60 కేజీల విభాగంలో జైస్మైన్‌ లాంబోరియా భారత్‌కు తొలి పతకం (కాంస్యం) అందించింది.

అనంతరం పురుషుల 57 కేజీల విభాగంలో మహ్మద్‌ హుస్సాముద్దీన్‌కు కాంస్యం.

పురుషుల 67 కేజీల విభాగంలో రోహిత్‌ టోకాస్‌కు కాంస్యం.

మహిళల 48 కేజీల విభాగంలో నీతూ గంగాస్‌ తొలి స్వర్ణం అందించింది.

పురుషుల 51 కేజీల విభాగంలో అమిత్‌ పంగాల్‌కు స్వర్ణం.

మహిళల 50 కేజీల విభాగంలో తెలంగాణకా షాన్‌ నిఖత్‌ జరీన్‌ను స్వర్ణం.

పురుషుల 92 కేజీల విభాగంలో సాగర్‌ అహ్లావత్‌కు రజతం.