గత 20 ఏళ్ల కాలంలో రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన క్రికెటర్ల వివరాలు..

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ ఆండ్రూ సైమండ్స్ (46) గత శనివారం (మే 14) జరిగిన రోడ్డు ప్రమాదంలో మృత్యవాత పడ్డాడు.

క్వీన్స్‌లాండ్‌లోని టౌన్‌విల్లే సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆండ్రూ సైమండ్స్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

ఆఫ్ఘనిస్థాన్‌ ఓపెనర్‌ నజీబ్‌ తర్కాయ్‌ (29).. 2020లో జరిగిన కారు ప్రమాదంలో అకాల మరణం చెందాడు.

నజీబ్‌ 2014-2020 మధ్యలో అఫ్ఘాన్‌ తరఫున 12 టీ20లు, ఓ వన్డే ఆడాడు.

ఇంగ్లండ్ మాజీ కెప్టెన్‌ బెన్ హోలియోక్ (24) 2002లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు విడిచారు.

ఆస్ట్రేలియాలో పుట్టిన బెన్‌.. 1997-2002 మధ్యలో ఇంగ్లండ్‌ తరఫున 2 టెస్ట్‌లు, 20 వన్డేలు ఆడాడు.

వెస్టిండీస్ ఆల్‌రౌండర్ రునాకో మోర్టన్ (34) 2012లో జరిగిన కారు ప్రమాదంలో మృతి చెందాడు.

మోర్టన్.. వెస్టిండీస్ తరఫున 15 టెస్టులు, 56 వన్డేలు, 7 టీ20లు ఆడాడు.

బంగ్లా స్పిన్నర్‌ మంజురల్ ఇస్లాం రాణా (22) 2007లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు విడిచాడు.

వెస్టిండీస్‌ ఫాస్ట్‌ బౌలర్‌ ఎజ్రా మోస్లీ (63) 2021లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు.

మోస్లీ.. 90వ దశకంలో వెస్టిండీస్ తరఫున 2 టెస్టులు, 9 వన్డేలు ఆడాడు.