తిరుమల బ్రహ్మోత్సవాల్లో సీఎం జగన్‌

తిరుమలలో ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ రెండు రోజులు పర్యటించారు.

శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఆయన ఆధ్యాత్మిక చింతనలో పరవశించారు.

మంగళవారం రాత్రి తిరుపతి గ్రామదేవత, శ్రీవారి సోదరి శ్రీతాతయ్యగుంట గంగమ్మను దర్శించుకున్నారు.

అనంతరం శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

పెద్దశేష వాహన సేవలో పాల్గొన్నారు. పద్మావతి గెస్ట్‌హౌజ్‌లో ఆ రాత్రికి బస చేశారు.

బుధవారం ఉదయం శ్రీవేంకటేశ్వరస్వామి సేవలో పాల్గొన్నారు.

పరకామణి భవనాన్ని, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి నిర్మించిన అతిథి గృహాన్ని ప్రారంభించారు.