టాలీవుడ్‌లో వెనకబడిపోయిన శోభితా ధూళిపాల

టాలీవుడ్‌లో సరైన అవకాశాలు అందుకోలేకపోతున్న తెలుగమ్మాయి శోభితా ధూళిపాల

తెనాలిలో పుట్టిన శోభితా ధూళిపాల అచ్చమైన తెలుగింటి అమ్మాయి

బాలీవుడ్‌ సినిమా రామన్‌ రాఘవ్‌ 2.0తో కెరీర్‌ ఆరంభించింది

అడివి శేష్‌ గూఢచారి చిత్రంతో తెలుగువారికి పరిచయమైంది

మంచి కథ ఎక్కడుంటే అక్కడికే వెళతానంటోంది

అలా బాలీవుడ్‌, కోలీవుడ్‌, మాలీవుడ్‌లో పలు చిత్రాల్లో నటించింది

అయితే ఇతర భాషల్లో వచ్చిన గుర్తింపు తెలుగులో రాలేదని ఫీలవుతోంది శోభిత

తెలుగు సినిమాలు చేస్తే చూడాలని తన పేరెంట్స్‌ ఆశపడుతున్నారంది

మంచి కథలు వస్తే తప్పకుండా ఇక్కడ మూవీస్‌ చేస్తానని చెప్తోంది

ప్రస్తుతం ఆమె చేతిలో పొన్నియన్‌ సెల్వన్‌(తమిళం), మేజర్‌(తెలుగు), సితార(హిందీ), మంకీ మ్యాన్‌(హాలీవుడ్‌) చిత్రాలున్నాయి.