ఓటీటీలోకి ‘కాతువాక్కుల రెండు కాదల్’
విజయ్ సేతుపతి హీరోగా నయనతార, సమంత హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘కాతువాక్కుల రెండు కాదల్’
తెలుగులో కణ్మని రాంబో ఖతీజా పేరుతో ఏప్రిల్ 28న విడుదలైంది
విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అనిరుథ్ సంగీతం అందించాడు
ట్రయాంగిల్ లవ్స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది
ఇప్పుడు ఓటీటీలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వచ్చేస్తుంది
మే27న ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది
ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది