1973 అక్టోబర్ 8న మచిలీపట్నంలో జననం
కెరియర్ స్టార్టింగ్లో సహ నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్గా, యాడ్స్ డిజైనర్గా పనిచేశాడు
ఆర్జీవీ ‘దొంగలముఠా’ ని ఆదర్శంగా తీసుకొని 5డి క్యామ్తో ‘ఈ రోజుల్లో’ తెరకెక్కించాడు
రూ.50 లక్షలతో తెరకెక్కిన ఈ చిత్రం సూపర్ హిట్ కావడంతో యూత్ ను ఒక్కసారిగా తనవైపు తిప్పుకున్నాడు
ఆ తర్వాత ‘బస్టాప్’, ‘ప్రేమకథా చిత్రం’తో హ్యాట్రిక్ హిట్ కొట్టాడు.
అల్లు శిరీష్తో కొత్తజంట, వెంకటేశ్తో బాబు బంగారం, నానితో భలే భలే మగాడివోయ్, శర్వానంద్తో మహానుభావుడు, నాగచైతన్యతో శైలజారెడ్డి అల్లుడు, సాయిధరమ్ తేజ్తో ప్రతిరోజు పండగే.. ఇలా ఎన్నో సినిమాలను డైరెక్ట్ చేసి కుటుంబ ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యాడు
30 రోజుల్లో ‘మంచిరోజులొచ్చాయి’అనే సినిమా తీసి విడుదల చేశాడు.
ఇటీవల గోపిచంద్తో ‘పక్కా కమర్షియల్’ చిత్రాన్ని తెరకెక్కించాడు. అది ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు
వినోదభరితమైన చిత్రాలకు ప్రాధాన్యతను ఇచ్చే మారుతి ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సినిమాను చేస్తున్నాడు.