ఊర్వశిలా కవ్విస్తున్న అనూ ఇమ్మాన్యుయేల్
మజ్ను సినిమాతో హీరోయిన్గా పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ అను ఇమ్మాన్యుయేల్. తక్కువ టైమ్ లోనే స్టార్ హీరోలతో జత కట్టింది.
టాలీవుడ్లో అల్లు అర్జున్, నాగ చైతన్య, తమిళ్లో విశాల్, శివకార్తికేయన్ లాంటి హీరోల సరసన నటించినా ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు.
తాజాగా అల్లు శిరీష్తో కలిసి ‘ఊర్వశివో రాక్షసివో’ చిత్రంలో నటించింది.
నవంబర్ 4న విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్తో దూసుకెళ్తుంది.
ఈ చిత్రంలో సింధు పాత్రలో నటించి మెప్పించింది. తన గ్లామర్ ఈ చిత్రానికి చాలా ప్లస్ అయింది
ప్రస్తుతం అను ‘ఊర్వసివో రాక్షసివో’ సక్సెస్ని ఎంజాయ్ చేస్తోంది.