అక్టోబరు 1 నుంచి కొత్త వేళలు
నడికుడి మార్గంలో రెండో లైను అందుబాటులోకి.. కాజీపేట మీదుగా వెళ్లే కొన్ని రైళ్లను ఈ మార్గం గుండా మళ్లించారు.
కొన్ని ప్యాసింజర్ రైళ్లను ఎక్స్ప్రెస్ రైళ్లుగా, మరికొన్ని ఎక్స్ప్రెస్ రైళ్లను సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లుగా మార్చారు. కొన్ని రైళ్ల వేగాన్ని పెంచారు.
ప్రస్తుతం ఉన్న వేళల్లో ఒక్కో రైలుకు 5 నుంచి 10 నిమిషాల పాటు మారాయి.
దక్షిణ మధ్య రైల్వే వెబ్సైట్లో, అన్ని ప్రధాన స్టేషన్లలో ఆ వివరాలు అందుబాటులో ఉంటాయి.
ఎక్స్ప్రెస్ నుంచి సూపర్ఫాస్ట్ రైళ్లుగా మారినవి ఇవే..
సికింద్రాబాద్–మణుగూరు ఎక్స్ప్రెస్ (కొత్త నెం.02745/02746)
కాచిగూడ–మంగళూరు సెంట్రల్ ఎక్స్ప్రెస్ (02777/02778)
సికింద్రాబాద్–రాజ్కోట్ ఎక్స్ప్రెస్ (02755/02756)
కాకినాడ–భావనగర్ ఎక్స్ప్రెస్ (02699/02700)
సికింద్రాబాద్–హిస్సార్ (02789/02790)
సికింద్రాబాద్–హిస్సార్ (02789/02790)
ప్యాసింజర్ నుంచి ఎక్స్ప్రెస్ రైళ్లుగా మారినవి..
హైదరాబాద్ డెక్కన్–పూర్ణ, హైదరాబాద్ డెక్కన్–ఔరంగాబాద్, తాండూరు–నాందేడ్, కాజీపేట–సిర్పూర్ టౌన్
భద్రాచలం రోడ్డు–సిర్పూర్ టౌన్, తాండూరు–పర్బణి, కాచిగూడ–గుంటూరు, కాచిగూడ–రాయచూర్