గుజరాత్లో కుప్పకూలిన పురాతన కేబుల్ బ్రిడ్జి
ఇంజనీరింగ్ అద్భుతంగా గుజరాత్ మోర్బీ కేబుల్ బ్రిడ్జి
140 ఏళ్ల నాటి ఈ వంతెనను నిర్మించిన అప్పటి ముంబై గవర్నర్ రిచర్డ్
1879 ఫిబ్రవరి 20న నిర్మాణాన్ని ప్రారంభించగా 1880లో పనులు పూర్తి
ఇటీవలే రూ. 2 కోట్లతో 7 నెలల పాటు మమరమత్తులు నిర్వహించిన అధికారులు
గుజరాతీ నూతన సంవత్సరం సందర్భంగా ఈ నెల 26వ తేదీన రీ ఓపెన్
నాలుగు రోజులకే ఘోరం.. ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా కుప్పకూలిన కేబుల్ బ్రిడ్జి
బ్రిడ్జి తెగిపోవడంతో పెద్ద సంఖ్యలో నదిలో పడిన పర్యాటకులు
ప్రమాద సమయంలో వంతెనపై దాదాపు 500 మందికిపైగా ఉన్నట్లు అధికారుల వెల్లడి
సోమవారం ఉదయం నాటికి 132కి చేరిన కేబుల్ బ్రిడ్జి మృతుల సంఖ్య
మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అచనా.. కొనసాగుతున్న ముమ్మర సహాయక చర్యలు
బ్రిడ్జి కూలిన ఘటనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు.. ఐదుగురు సభ్యులతో కూడిన సిట్ ఏర్పాటు
రిపేర్ తర్వాత సేఫ్టి సర్టిఫికెట్ తీసుకోకుండానే వంతెనను తిరిగి తెరిచినట్లు మున్సిపల్ అధికారులు వెల్లడి