ఈ పండ్ల గింజల్లో సైనైడ్‌ను విడుదల చేసే కారకాలు!?

కొన్ని రకాల పండ్ల గింజలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

గుమ్మడి గింజలు, పుచ్చకాయ గింజలు, పొద్దు తిరుగుడు విత్తనాలు, చియా విత్తనాలను తింటే శరీరానికి ఎన్నో రకాల పోషకాలు అందుతాయి.

అయితే కొన్ని పండ్ల విత్తనాలను పొరపాటునో లేదంటే కావాలనో తరచూ తింటే.. అవి ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.

ఆపిల్‌ గింజలు మాత్రం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచివి కావు. ఎందుంటే వీటిలో ఉండే అమిగ్డాలన్.. సైనైడ్‌ను విడుదల చేస్తుంది. ఇది కడుపులోకి వెళ్లి విరేచనాలు, వికారం, కడుపు తిమ్మిరి వంటి సమస్యలు వస్తాయి.

చెర్రీ మన శరీరానికి అవసరమైన ఎన్నో రకాల పోషకాలను అందిస్తాయి చెర్రీ పండ్లు. కానీ చెర్రీ గింజల్లో హానికరమైన సైనైడ్‌ సమ్మేళనం ఉంటుంది.

ఆప్రికాట్‌ ఆప్రికాట్‌ విత్తనాలలో విషపదార్థాలైన అమిగ్డాలన్, సైనోజెనిక్‌ గ్లైకోసైడ్లు ఉంటాయి. ఆప్రికాట్‌ విత్తనాలను తినడం వల్ల శరీరం బలహీనపడటమే కాదు.. ప్రాణాల మీదికి వస్తుంది.

పీచ్‌ పీచ్‌ విత్తనాల్లో అమిగ్డాలిన్, సైనోజెనిక్‌ గ్లైకోసైడ్లు ఉంటాయి. వీటిని తినడం వల్ల ఆప్రికాట్‌ విత్తనాల మాదిరిగానే లక్షణాలు కనిపిస్తాయి.

పియర్‌ విత్తనాల్లో ప్రాణాంతకమైన సైనైడ్‌ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి వికారం, విరేచనాలు, పొత్తికడుపు నొప్పిని కలిగిస్తుంది.