కూరల్లో ఉప్పు ఎక్కువైందా.. ఇలా చేయండి

మినప గారెలు చేసేటప్పుడు ఆ పిండిలో కొంచెం బొంబాయి రవ్వ లేదా బియ్యం పిండి కలిపితే హోటల్‌ లో చేసే విధంగా క్రిస్పీగా వస్తాయి.

చపాతీలు మృదువుగా రావాలంటే చపాతీ పిండి కలిపేటప్పుడు రెండు స్పూన్ల నూనెను కలపాలి. ఇలా నూనె వేసి కలపటం వల్ల చపాతీ కాల్చే సమయంలో నూనె వేయవలసిన అవసరం ఉండదు.

పూరీలు చేసినప్పుడు అరకేజీ గోధుమ పిండిలో ఒక గరిట మైదా పిండిని కలిపితే పూరీలు బాగా పొంగటమే కాకుండా క్రిస్పీగా వస్తాయి.

ధనియాలను వేయించి చల్లార్చి డబ్బాలో నిల్వ చేస్తే పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి.

రసం పిండేసిన నిమ్మ బద్దలను పాడేయకుండా ఫ్రిడ్జ్‌ లో ఒక మూల పెడితే ఫ్రిడ్జ్‌ లో దుర్వాసనలు రావు. అలాగే ఫ్రిడ్జ్‌ ఓపెన్‌ చేసినప్పుడు తాజా వాసన వస్తుంది.

కూరల్లో ఉప్పు ఎక్కువైనప్పుడు కొంచెం నిమ్మరసం వేస్తే ఉప్పు సరిపోయే చాన్స్ ఉంది. ఎందుకంటే నిమ్మరసంలో ఉండే యాసిడ్స్ ఉప్పు రుచిని తగ్గించే అవకాశం ఉంటుంది.

వంట చేసేప్పుడు కొన్ని సార్లు కూర మాడిపోయి.. భరించలేని వాసన వస్తుంది. దీన్ని పోగొట్టడానికి బేకింగ్ సోడా చాలా బాగా పనిచేస్తుంది. బేకింగ్‌ సోడాను ఒక గిన్నెలో వేసి స్టౌ పక్కన లేదా కిచెన్‌ ప్లాట్‌ఫాంపై పెడితే సరిపోతుంది.