బంగాళ దుంపలను తొక్కతీసి తురుముకుని రెండు టీస్పూన్ల రసం తీసుకోవాలి.

ఈ రసంలో టీస్పూను రోజ్‌ వాటర్, ఐదు చుక్కలు నిమ్మరసం వేసి చక్కగా కలపాలి.

ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లైచేసి ఆరేంత వరకు మర్దన చేయాలి.

పూర్తిగా ఆరాక చల్లటి నీటితో కడగాలి.

వారంలో రెండు మూడుసార్లు ఈ ప్యాక్‌ను ముఖానికి అప్లై చేయడం వల్ల విటమిన్‌ సి, యాంటీ ఆక్సిడెంట్స్‌ అంది చర్మం ఆరోగ్యంగా ఉంటుంది

దీనిలోని కాపర్, జింక్‌లు చర్మాన్ని త్వరగా ముడతలు పడనివ్వకుండా చేసి యవ్వనంగా ఉండేలా చేస్తాయి

పొటాషియం, మెగ్నీషియంలు చర్మానికి పోషకాలను అందిస్తాయి

క్రమం తప్పకుండా ఈ ప్యాక్‌ వేసుకుంటే చర్మంలో త్వరగా మంచి మార్పు కనిపిస్తుంది.