ఆరు మందార పువ్వులను ఎండబెట్టి పొడి చేయాలి.

దీనిలో అరటీస్పూను శనగపిండి, అరటీస్పూను బియ్యప్పిండి

అదే విధంగా అరటీస్పూను పెరుగు, అరటీస్పూను తేనె వేసి చక్కగా కలుపుకోవాలి.

ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా పట్టించి అరగంటపాటు ఆరనివ్వాలి.

తరువాత నీటితో కడిగేయాలి.

వారానికి ఒకసారి ఈ ప్యాక్‌ వేసుకోవడం వల్ల ముఖం మీద మొటిమలు, మచ్చలు పోతాయి.

పెరుగులోని లాక్టిక్‌ ఆమ్లం, మందార పువ్వులోని యాంటీ ఆక్సిడెంట్స్‌ మొటిమలను తగ్గించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి.

ఈ ప్యాక్‌తో నిగారింపు రెట్టింపు అవుతుంది.