ఆరు మందార పువ్వులను ఎండబెట్టి పొడి చేయాలి.
దీనిలో అరటీస్పూను శనగపిండి, అరటీస్పూను బియ్యప్పిండి
అదే విధంగా అరటీస్పూను పెరుగు, అరటీస్పూను తేనె వేసి చక్కగా కలుపుకోవాలి.
ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా పట్టించి అరగంటపాటు ఆరనివ్వాలి.
తరువాత నీటితో కడిగేయాలి.
వారానికి ఒకసారి ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల ముఖం మీద మొటిమలు, మచ్చలు పోతాయి.
పెరుగులోని లాక్టిక్ ఆమ్లం, మందార పువ్వులోని యాంటీ ఆక్సిడెంట్స్ మొటిమలను తగ్గించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి.
ఈ ప్యాక్తో నిగారింపు రెట్టింపు అవుతుంది.