అరకప్పు ఉసిరి పేస్టు, కప్పు పంచదార, టేబుల్ స్పూను రోజ్ వాటర్ను గిన్నెలో తీసుకుని బాగా కలపాలి
ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి మర్దన చేసి కడిగేయాలి.
ఈ ప్యాక్ ముఖం మీద ఉన్న మొటిమలను తొలగిస్తుంది.
అరటిపండు గుజ్జులో టేబుల్ స్పూను శనగపిండి, టీస్పూను నిమ్మరసం వేసి బాగా కలపాలి
ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తరువాత కడిగేయాలి
వారంలో రెండుమూడు సార్లు ఈ ప్యాక్ వేయడం వల్ల ముఖ చర్మం నిగారింపుని సంతరించుకుంటుంది.
కోడి గుడ్లను ఉప్పునీటిలో ఉడకబెట్టి తరువాత చన్నీళ్లలో వేస్తే పెంకు సులభంగా వస్తుంది
చపాతి పిండిలో బాగా మగ్గిన అరటిపళ్లు, కప్పు పెరుగు వేసి కలిపితే మృదువుగా... రుచికరంగా వస్తాయి.
సమోసాలు చేసేటప్పుడు పిండిలో కొన్ని చుక్కలు నిమ్మరసం వేసి కలిపితే సమోసాలు కరకరలాడతాయి.