ఆన్‌లైన్‌ పేమెంట్స్‌ బాగా పెరిగాయి. అదే క్రమంలో సైబర్‌ మోసాలు జరుగుతున్నాయి.

కొన్ని టిప్స్‌ పాటిస్తే యూపీఐ లావాదేవీలు సురక్షితంగా చేసుకోవచ్చు.

స్క్రీన్‌ లాక్‌ మీ ఫోన్‌కే కాదు.. పేమెంట్స్‌ను సైతం సురక్షితం చేస్తుంది.

పిన్‌ నంబర్‌ను ఎవరితోనూ పంచుకోవద్దు. తరచూ మార్చడం మంచింది.

అవాంఛిత, తెలియని లింక్స్‌ క్లిక్‌ చేయొద్దు

యూపీఐ యాప్‌ను విధిగా అప్‌డేట్‌ చేయాలి.

ఎక్కువ సంఖ్యలో పేమెంట్‌ యాప్స్‌ వద్దు. యాప్‌లను అఫీషియల్‌ ప్లేస్టోర్‌ నుంచే డౌన్‌లోడ్‌ చేయండి.