రికా జైన్, కిమీ జైన్ ఇద్దరూ తోడికోడళ్లు

విజయవంతంగా వ్యాపారాన్ని నిర్వహిస్తూ అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు.

2012లో ప్రీమియం హోటల్ టాయిలెట్రీ (టాయ్‌లెట్‌లో ఉపయోగించే సబ్బులు, షాంపులు వంటి వస్తువులు) తయారీ వ్యాపారాన్ని ప్రారంభించారు.

తక్కువ వ్యవధిలోనే వారి ‘కిమిరికా’వ్యాపార టర్నోవర్ రూ.600 కోట్లకు పెరిగింది.

ఇండోర్ కు చెందిన కిమీ జైన్, రికా జైన్ లకు సోదరులైన మోహిత్, రజత్‌లతో వివాహమైంది.

కిమీ ఈ-కామర్స్‌లో ఎంబీఏ పూర్తి చేశారు. రికా ఫార్మసీ డిగ్రీ చేశారు.

వీరి కంపెనీలో 600 మంది కార్మికులు పని చేస్తున్నారు. వీరిలో 80 శాతం మంది మహిళలే.