బ్యూటిప్-సోప్ కాని సోప్
కప్పు శనగపిండిలో, పావు కప్పు పచ్చిపాలు, ఐదు టేబుల్ స్పూన్ల కల్లుప్పు-
రెండు టీస్పూన్ల ఆలివ్ ఆయిల్, రెండు టేబుల్ స్పూన్ల అలోవెర జెల్ వేసి బాగా కలపాలి.
స్నానం చేసే ముందు ఈ మిశ్రమాన్ని ముఖానికి, శరీరానికి రాసుకుని ఐదు నిమిషాల పాటు మర్దన చేయాలి.
తర్వాత గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి.
శుభ్రంగా తడి తుడుచుకుని మాయిశ్చరైజర్ రాసుకోవాలి.
ఇలా చేస్తే చర్మంపై పేరుకుపోయిన మురికి, జిడ్డు వదిలి చర్మం కోమలంగా మారుతుంది.
ఈ మిశ్రమాన్ని సబ్బుకు బదులుగా వాడుకుంటే ఎంతో మంచిది.
చర్మం సహజ సిద్ధమైన నిగారింపుని సంతరించుకునేందుకు ఈ మిశ్రమం బాగా పనిచేస్తుంది.