బ్యూటిప్‌-సోప్‌ కాని సోప్‌

కప్పు శనగపిండిలో, పావు కప్పు పచ్చిపాలు, ఐదు టేబుల్‌ స్పూన్ల కల్లుప్పు-

రెండు టీస్పూన్ల ఆలివ్‌ ఆయిల్, రెండు టేబుల్‌ స్పూన్ల అలోవెర జెల్‌ వేసి బాగా కలపాలి.

స్నానం చేసే ముందు ఈ మిశ్రమాన్ని ముఖానికి, శరీరానికి రాసుకుని ఐదు నిమిషాల పాటు మర్దన చేయాలి.

తర్వాత గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి.

శుభ్రంగా తడి తుడుచుకుని మాయిశ్చరైజర్‌ రాసుకోవాలి.

ఇలా చేస్తే చర్మంపై పేరుకుపోయిన మురికి, జిడ్డు వదిలి చర్మం కోమలంగా మారుతుంది.

ఈ మిశ్రమాన్ని సబ్బుకు బదులుగా వాడుకుంటే ఎంతో మంచిది.

చర్మం సహజ సిద్ధమైన నిగారింపుని సంతరించుకునేందుకు ఈ మిశ్రమం బాగా పనిచేస్తుంది.